cricket ad

Wednesday 30 November 2016

హిందూ పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము

1. గంటలు :
దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.
2.దీప హారతి:
దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.
3. ధూపం
భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.
4. కర్పూర హారతి
వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.
5. గంధపు సేవ
ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.
6. పూజ
దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.
7 పత్రం(శరీరము)
ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.
8 పుష్పం (హృదయము)
ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.
9 ఫలం (మనస్సు)
మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.
10. తోయం(నీరు)
భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.
11 కొబ్బరికాయలు
హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
12. నమస్కారము
చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.
13. ప్రదక్షిణము
ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?

సూర్యుడ్ని ఏఏ సమయాల్లో చూడరాదు?
ప్రభాతవేళ, సూర్యాస్తమయవేళ, మిట్టమధ్యాహ్న సమయమున రవిని సూటిగా చూడరాదు. అలాగే సూర్య మరియు చంద్రగ్రహణ సమయాల్లోనూ చూడరాదు. అట్టి సమయాల్లో సూర్యుని నుంచి వెలువడే కిరణాలు మానవశరీర నిర్మాణానికి కీడును కలిగిస్తాయి

ఏ లింగాలను పూజిస్తే ఏమి ఫలితం?

త్రిమూర్తులలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది లింగార్చన, లింగ అభిషేకం. శివలింగాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటికి అర్చిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది.
* వజ్రలింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.


త్రిమూర్తులలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది లింగార్చన, లింగ అభిషేకం. శివలింగాలలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటికి అర్చిస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది.
* వజ్రలింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.
* ముత్యం లింగానికి అర్చన చేస్తే రోగాలు నశిస్తాయి.
* పుష్యరాగం లింగానికి ఆర్చన చేస్తే యశస్సు ప్రాప్తిస్తుంది.

* పద్మరాగ లింగానికి అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం
* మరకత లింగానికి అర్చన చేస్తే జీవితంలో సుఖం ప్రాప్తిస్తుంది.
* నీలంరంగు లింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.

* స్ఫటిక లింగానికి అర్చన చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి.
* ఇత్తడి లింగానికి అర్చన చేస్తే తేజస్సు సిద్ధిస్తుంది.

* లోహంతో చేసిన శివలింగానికి అర్చన చేస్తే శతృనాశనం అవుతుంది.
* గంధలింగానికి అర్చన చేస్తే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది.
* వెన్న లింగానికి అర్చన చేస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది.

* ధాన్యపు పిండితో చేసిన అర్చన చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు.

* రసలింగం అంటే పాదరస లింగం అని అర్థం, పాదరసం బరువుగా ఉంటుంది. మన దేశంలో పాదరస లింగం ఉజ్జయినిలోని సిద్దాశ్రమంలో ఉంది. పాదరస లింగానికి అర్చన చేస్తే నెరవేరని కోరికలు అంటూ ఉండవు. లింగానికి అభిషేకం చేసి తీర్థంగా సేవిస్తే సర్వవ్యాధులూ నయం అవుతాయి.



* ముత్యం లింగానికి అర్చన చేస్తే రోగాలు నశిస్తాయి.
* పుష్యరాగం లింగానికి ఆర్చన చేస్తే యశస్సు ప్రాప్తిస్తుంది.
* పద్మరాగ లింగానికి అర్చన చేస్తే లక్ష్మీ కటాక్షం




* మరకత లింగానికి అర్చన చేస్తే జీవితంలో సుఖం ప్రాప్తిస్తుంది.
* నీలంరంగు లింగానికి అర్చన చేస్తే ఆయుష్షు వృద్ధి.



* స్ఫటిక లింగానికి అర్చన చేస్తే మనోవాంఛలు నెరవేరుతాయి.
* ఇత్తడి లింగానికి అర్చన చేస్తే తేజస్సు సిద్ధిస్తుంది.

* లోహంతో చేసిన శివలింగానికి అర్చన చేస్తే శతృనాశనం అవుతుంది.
* గంధలింగానికి అర్చన చేస్తే స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇస్తుంది.

* వెన్న లింగానికి అర్చన చేస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది.
* ధాన్యపు పిండితో చేసిన అర్చన చేస్తే ఆరోగ్యవంతులుగా ఉంటారు.



* రసలింగం అంటే పాదరస లింగం అని అర్థం, పాదరసం బరువుగా ఉంటుంది. మన దేశంలో పాదరస లింగం ఉజ్జయినిలోని సిద్దాశ్రమంలో ఉంది. పాదరస లింగానికి అర్చన చేస్తే నెరవేరని కోరికలు అంటూ ఉండవు. లింగానికి అభిషేకం చేసి తీర్థంగా సేవిస్తే సర్వవ్యాధులూ నయం అవుతాయి.



నమస్కారం వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్

అహంకారాన్ని విడిచి అవతలి వ్యక్తి పై సహృదయతను వివరిస్తుంది.
పది వేళ్ళు ఒక దానికి ఒకటి తాకడం వల్ల శరీరంలోని అన్నీ అవయవాళ్ళో చైతన్యం కల్గి ఎదుటి వ్యక్తి ఎక్కువ కాలం గుర్తుండిపోతాడు.
ఒకరి మనసు, ఒకరు తెలుసుకునే సంభందం ఏర్పడుతుంది.
రెండు చేతులు జోడించి పెట్టే సమస్కారం ఎదుటి వ్యక్తి పట్ల గౌరవాన్ని సూచిస్తుంది.
షేక్ హ్యండ్ తో పోలిస్తే ఇది చాలా ఆరోగ్యమైన అలవాటు.

బొట్టు ఎందుకు పెట్టుకోవాలి.

“భావోఘ్రాణస్వయస్పంధి” అంటే నాసిక పై భాగం భ్రుకటి మధ్య భాగం కలుసుకొనే చోట బొట్టు పెట్టుకోవాలని అర్ధం. ఇక్కడ ఇడ, పింగళ, సుఘమ్న అనే మూడు నాడులు కలుస్తాయి.





 దీనినే ‘త్రివేణి సంగమం’ అంటారు. ఇది షియూషా గ్రంధికి అనుభంద స్ధానము. ఇదే జ్ఞాన గ్రంధి ఎవరైతే నమఘ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులు అవుతారు. మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యుటరీ గ్లాండు పై ఉంటుంది. “కేనన్” అనే పాశ్చాత్య శాస్ర్తవేత్త భ్రకటి స్థానాన్ని మానవుని యొక్క ‘ధన’ (+) మెడ వెనుక భాగాన్ని ‘ఋణ’ (-) విధ్యుత్ కేంద్రాలు అని అన్నాడు. 



ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతలను క్రమబద్దీకరం చేస్తుంది. భ్రుకటి వద్ద ఉన్న నాడులు సున్నితంగా ఉంటాయి. అందుకే జ్వరం వస్తే వైధ్యులు నుదుటి పై చల్లని గుడ్డ వేయమంటారు. పైన పేర్కోన్న కీలక, సున్నిత నాడులను తీవ్రమైన సూర్యకిరణాలనుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి.




సాయంత్రం రాత్రి సమయాల్లో విభూది ధరిస్తే చల్లగా ఉంటుంది. విభూది వల్ల రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది. ఓజస్సు వృద్ది చెందుకు. చర్మ రోగాలు దరి చేరవు. బొట్టు శరీరంలో ఉన్న ఉష్ణమునంతటిని పీల్చి వేస్తుంది.జఠర, శ్వాస కోశముకు తగినంత ఉష్ణాన్ని అందజేస్తుంది. మనం.సూర్యుడిని నేరుగా చూడలేం.అదే రంగుల అద్దాలు లేదా ఒక వైపు రంగు ఉన్న గాజు ద్వారా, స్పష్టంగా సూర్యుడిని చూడగలం. ఎందుకంటే సూర్య కిరణాలు అద్దం పై పడి పరావర్తనం చెందడం వలన కళ్ళకు హని కలుగదు.



 అంటే ఇక్కడ సూర్య కిరణాలు కళ్ళకు పడకుండా అద్దం ఏ విధంగా పని చేస్తుందో, అదే విధంగా బొట్టు కూడా జ్ఞాన నాడికి హని కలగకుండా పని చేస్తుంది. నేడు స్ర్తీలు రసాయనాలతో తయారు చేసిన బొట్టు ( స్టిక్కర్స్ ) వాడడం వల్ల భ్రుకుటి వద్ద చర్మ రోగాలు వస్తున్నాయి. 





దీని వల్ల కొందరు స్ర్తీలు బొట్టు పెట్టుకోవడం వదిలేయాల్సి  వచ్చింది.
మన పూర్వీకులు అందించిన సంస్కృతి శాస్ర్తీయమైనది. స్వదేశీ సంస్కృతిని నిర్లక్ష్యం చెయ్యడం అంటే మాతృమార్తిని అమ్ముకున్నట్టే.


सरस्वती पेड़ के छात्रों के लिए इस अद्भुत उपहार। पावर काम स्मृति द्वारा दूध के अलावा के साथ वृद्धि हुई है, भस्म हो जाता है मस्तिष्क सक्रिय

 సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :సరస్వతి చెట్టు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఎన్నో అద్భుతమైన గుణాలు కలిగిన ఈ చెట్టుని ఆయుర్వేద వైద్యంలో విరివిరిగా ఉపయోగిస్తారు. సరస్వతి చెట్టు ఆకులు తీపి, చేదు, వగరు రుచులు కలిగి ఉంటాయి.సరస్వతి చెట్టు ఉపయోగాలు :


ఈ ఆకులను నీడలో ఎండ పెట్టి పొడి చేసి ఆ పొడిని విద్యార్థులకి పాలలో కలిపి ఇస్తే వారు జ్ఞానాన్ని సంపాదిస్తారు. వారి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది.
విద్యార్థుల్లో కొంత మంది ఆహారం సరిగా తీసుకోరు అలా తక్కువ తినేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
చిన్న పిల్లలకు నత్తి రాకుండా ఉండటానికి ఈ చెట్టు ఆకుల పొడిని ఉపయోగిస్తారు.
ఈ ఆకుల రసం ఆయుష్షు పెరగటంలో మరియు కామెర్ల వ్యాధి నివారణలో తోడ్పడుతుంది.
మెదడుకి సంబంధిత వ్యాధులను నివారిస్తుంది .
మనిషిలో మేధా శక్తి పెంచుతుంది. రకాన్ని శుభ్ర పరుస్తుంది.
మిరియాల పొడి+ఉప్పు+నిమ్మరసం=మైండ్ బ్లోయింగ్ ప్రయోజనాలు
ఏదైనా చిన్న అనారోగ్యం వ‌చ్చిందంటే చాలు. మెడిక‌ల్ షాపుకు ప‌రిగెత్త‌డం మనకు అలవాటు అయ్యిపోయింది. మందులు కొని తెచ్చి వేసుకోవ‌డం ఈ రోజుల్లో సాధారణం అయ్యిపోయింది.
చిన్న స‌మ‌స్య‌కు కూడా మందుల‌ను వాడుతుండ‌డంతో అవి దీర్ఘ‌కాలికంగా మ‌న‌కు వివిధ ర‌కాల సైడ్ ఎఫెక్ట్స్‌ను తెచ్చి పెడుతున్నాయి.
ఈ క్ర‌మంలో మ‌న ఇంట్లో ఉండే న‌ల్ల మిరియాల పొడి, ఉప్పు, నిమ్మ‌ర‌సంలను ఉప‌యోగించి చిన్న‌పాటి అనారోగ్యాల‌ను ఎలా దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
గొంతు నొప్పి, మంట‌, ద‌గ్గు…
ఒక టేబుల్ తాజా నిమ్మ‌ర‌సం, అర టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, ఒక టీస్పూన్ ఉప్పుల‌ను ఒక గ్లాస్ వేడి నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేసుకోవాలి. దీన్ని రోజులో ఎప్ప‌టిక‌ప్పుడు గొంతులో పోసుకుని పుక్కిలిస్తుంటే గొంతు నొప్పి, మంట, ద‌గ్గు త‌గ్గిపోతాయి.
జ‌లుబుకు…
న‌ల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క‌, జీరా పొడి, యాల‌కుల పొడిల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని అన్నింటినీ క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు వాస‌న పీలుస్తుంటే జ‌లుబు, ముక్కు దిబ్బడ త‌గ్గిపోతుంది.
గాల్‌స్టోన్స్‌…
మూడు భాగాల ఆలివ్ ఆయిల్‌, 1 భాగం నిమ్మ‌ర‌సం, కొంత న‌ల్ల మిరియాల పొడిల‌ను తీసుకుని మిశ్ర‌మంగా క‌ల‌పాలి. దీన్ని రోజూ సేవిస్తుంటే గాల్ స్టోన్స్ పోతాయి.
బ‌రువు త‌గ్గేందుకు…
ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల నిమ్మ‌ర‌సం, 1/4 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడిల‌ను వేసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రోజూ తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గుతారు.
వికారంగా ఉంటే…
ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం, 1 టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడిల‌ను ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి మిశ్ర‌మంగా త‌యారు చేయాలి. దీన్ని రోజులో వీలైన‌న్ని సార్లు సేవిస్తుంటే క‌డుపులో పుట్టే వికారం త‌గ్గిపోతుంది.
ఆస్త‌మాకు…
ప‌ది న‌ల్ల మిరియాలు, 2 ల‌వంగాలు, 15 తుల‌సి ఆకుల‌ను ఒక క‌ప్పు మ‌రుగుతున్న నీటిలో వేయాలి. అనంత‌రం స్ట‌వ్‌ను 15 నిమిషాల పాటు సిమ్మ‌ర్‌లో ఉంచి నీటిని మ‌ళ్లీ మ‌రిగించాలి. నీరు మ‌ర‌గ‌గా వ‌చ్చిన ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి ఒక జార్‌లోకి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల తేనెను వేయాలి. ద్ర‌వం చ‌ల్లారే దాకా ఉండి దాన్ని ఫ్రిజ్‌లో పెట్టి 2 వారాల పాటు పాల‌తో సేవించాలి. దీంతో ఆస్త‌మా అదుపులోకి వ‌స్తుంది.
దంతాల నొప్పుల‌కు…
అర టీస్పూన్ న‌ల్ల మిరియాల పొడి, కొద్దిగా ల‌వంగం నూనెల‌ను తీసుకుని మిశ్ర‌మంగా త‌యారు చేయాలి. దాన్ని నొప్పి పుడుతున్న ప‌న్నుపై అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే దంతాల నొప్పి త‌గ్గ‌డ‌మే కాకుండా దంతాలు దృఢంగా మారుతాయి.
జ‌లుబు, ఫ్లూ జ్వ‌రానికి…
ఒక క‌ప్పు గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సాన్ని, కొంత తేనెను క‌లిపి తాగుతుంటే జ‌లుబు, సాధారణ ఫ్లూ జ్వ‌రం త‌గ్గిపోతాయి.
ముక్కు నుంచి రక్తం కారుతుంటే…
నిమ్మ‌ర‌సంలో కాట‌న్ బాల్‌ను ముంచి దాన్ని ర‌క్తం కారుతున్న ముక్కు రంధ్రంపై ఉంచితే బ్లీడింగ్ ఆగిపోతుంది.