cricket ad

Wednesday 30 November 2016

అత్యంత దారుణానికి ఒడిగట్టిన 19 ఏళ్ల యువతి.. బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకుని

అమెరికాలోని స్ప్రింగ్ ఫీల్డ్ లో దారుణం చోటు చేసుకుంది. రక్తపిశాచి కావాలనే బలమైన కోరికతో 19 ఏళ్ల యువతి అత్యంత దారుణానికి పూనుకుంది. తన బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి పిలిపించుకున్న విక్టోరియా వనట్టెర్.. అతని చేత మద్యం తాగించింది. ఆ తర్వాత తన రక్తం తాగాలంటూ అతడిని ఒత్తిడి తెచ్చింది. రక్తం తాగడానికి తొలుత ఒప్పుకోకపోయినా.. ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఓకే చెప్పాడు. దీనితో తన చేతిని బాక్స్ కట్టర్ చేత కట్ చేయించి.. తన రక్తాన్ని అతడిచేత తాగించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య చిన్న గొడవ జరగడంతో కత్తితో అతనిపై దాడి చేసి, చంపబోయింది.
ఈ గొడవలో.. అతని భుజంలో కత్తి దింపింది. ఆ తరువాత ఇద్దరూ స్పృహ తప్పిపోయారు. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు ఆ ఇంటికి చేరుకునే సమయానికి వారిద్దరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. వారిద్దరినీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఆమె కోలుకున్నాక కోర్టులో ప్రవేశపెట్టగా.. తనను క్షమించి వదిలేయాలని వేడుకుంది. దీంతో.. ఆమెకి జరిమానాతో పాటు ఆమెకు జైలు శిక్షను విధించింది కోర్టు.

Tuesday 29 November 2016

మన భారతీయ జీవన విధానములో స్నానానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వుంది . ప్రతీ రోజు స్నానం చెయ్యడం మన పద్దతి .కొంతమంది రొండు పూటలా చేస్తారు .పండగ వోచ్చినపుడు ప్రత్యెక స్నానం చెయ్యడం అందరికి తెలిసిందే .వస్తు గుణ దీపిక లో తలంటు స్నానం గురించి వ్రాయబడింది. సంక్రాంతి నాడు తలంటు స్నానం ఒక ప్రత్యెక కార్యక్రమమని అందరికి తెలుసు .తలంటు స్నానాన్ని అబ్యాన్గన స్నానమని అంటారు . కొబ్బరి నూనె,నువ్వులనూనె,ఆవునెయ్యి ,ఆముదం వీటిలో దేనినైన అబ్యాన్గన స్నానానికి వాడవొచ్చు .నూనె చాలా మంచిది .ముందుగా నూనె శరీరానికి బాగా పట్టించి మర్దనా చెయ్యాలి 




.కనీసం పదినిమిషాలు ఆగిన తర్వాత సున్నిపిండితో నలుగు పెట్టాలి ,తర్వాత మరో పది నిమిషాలు ఆగాలి తర్వాత పొడి పిండి తో మొత్తం దేహానికి పట్టిన నలుగును వదిలించుకోవాలి. తర్వాత శరీరమంతా శుబ్ర పడేలా రెండు బకెట్ నీళ్ళతో స్నానం చెయ్యాలి. ఈ విధముగా చేయడం వలన గజ్జి, చిడుము, సర్పి, దద్డురులు మొ .చర్మ రోగములు ,దుస్వప్నములు దరి చేరావు. శరీరం మీద మలినాలను ,దుర్గందాల ను పోగొడుతుంది సుఖ నిద్ర ,శరీరం తేలికగా వుండడం ,దేహానికి పుష్టి,కాంతి , మృదుత్వం కలుగుతుంది. కండ్లకు చాలవ చేస్తుంది, పైత్యాన్ని అనుస్తుంది .








వృదాప్యం తొందరగా రాదు,అలసటనూ, వాతమును పోగొడుతుంది.సుఖ నిద్ర పట్టును, కాంతి, ఆయుష్షు పెరుగుదల ,బుద్ధి బలిమి ,దేహపుష్టి ,వీర్య వృద్ది కలుగుతాయి .జటరాగ్ని బాగుంటుంది .దేహము కాళ్ళు చేతులు ,గోళ్ళు, సిరస్సులందు పుట్టిన తాపమును ,మంటలను పోగొట్టును .మాడపట్టున చమురు ను వుంచి మర్దించడం వలన చెవులకు ,తక్కిన అవయములకు బలము నిచ్చును






 .తలవెంట్రుకలు వృద్ధ్హిపరచును ,మృదుత్వాన్ని ఇచ్చును .అరిపాదాలకు చమురు మర్దించడం వలన మంటలను పోగొట్టును .అరికాళ్ళ నొప్పులు హరించును . అబ్యాన్గన స్నానం వలన ఇన్ని రకముల ప్రయోజనములు వున్నై కాబట్టే మన పూర్వీకులు స్నానానికి అధిక ప్రాధాన్యత నిచ్చారు . ఆధునిక యుగంలో అబ్యాన్గన స్నానానికి ప్రాధాన్యత తగ్గిపోవడము వలన దేహానికి అనారోగ్యం ఎక్కువ అవుతోంది .పూర్వ కాలంలో చర్మ వ్యాధులు చాలా తక్కువుగా ఉండేవి. వారం వారం అబ్యాన్గన స్నానం చాలామంచిది .కనీసం పండగలలోనైనా తలంటు స్నానం చేస్తే మంచిది .
షేర్ చేయండి

శ్రీవారి కరుణ కలగాలంటే తిరుమల యాత్ర ఎలాచేయాలి.

कैसे तिरुमाला क्या करना Yathra प्रभु आशीर्वाद प्राप्त 

తిరుమల మామూలు క్షేత్రము కాదు. పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే అని చెప్పబడుతున్నాయి. ఆ ఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి. కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు. అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసం కోసం తపించి తరించారు. ఇక యాత్ర నెలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము.





కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది. చెప్పులతో కొండ ఎక్కరాదు. మొదటగా స్వామి వారు భక్తునకు స్వయంగా తన పాదరక్షల కొలతలనివ్వగా ఆ భక్తుడు తయారు చెసిన పాదరక్షలు అక్కడ పూజింపబడుతుంటాయి. ఆపాదరక్షలను ముందుగా తలపై వుంచుకుని స్మామివారిని స్మరించుకోవాలి.




 అక్కడ రాజైనా చక్రవర్తియైనా సరే వాళ్ల అహంకారాలు అణగేలా చెప్పులతో కొట్టబడతారు. దానితో నేనింతవానిని అంతవానిననే అహంకారం అణగిపోతుంది. ఆతరువాత బహుకష్ట సాధ్యమైన ఆ కొండనెక్కుతూ వుంటే [అప్పటిలో ఇంత సౌకర్యాలు లేవులెండి] ఆయాసముతో కళ్ళుతిరుగుతుంటాయి. భక్తులు భగవన్నామస్మరణంతో బహుకష్టాలతో చేరుకుంటారు పైకి . దానితో తమ చెడుఖర్మలు నశించటమేకాదు, తమ శారీరిక బలం ఎంతో దాని పరిమితి ఎంతో తెలిసివస్తుంది.



దానితో తమ శరీర బలాన్ని చూసుకుని విర్రవీగే వారికి వాస్తవం అర్ధమవుతుంది.
ఆ తరువాత ముఖ్యమయిన పని శిరోముండనమ్ అంటే గుండు చేయించుకోవటం ఒక ముఖ్యమయిన నియమము అందరికీ. ఇది ఆడమగ అందరూ పాటించేవారు పూర్వము, ఆధునికత పేరుతో బాహ్యసౌందర్య పోషణపట్ల శ్రద్ధపెరిగి ఇప్పుడు కొందరు పాటించటం లేదు. కాని దీనివెనుక చాలా పెద్ద ఆధ్యాత్మిక కారణమున్నది. మనిషిని మభ్యపెట్టి మనో వికారాలను కల్పించేది సౌందర్యం.



 దానికి ఆధారము శిరోజాలు. అవి వున్నప్పుడు ఎక్కడకెళ్ళినా తమ సౌందర్యము పట్ల అతిశయమైన భావన వెన్నంటివస్తూ మనసును కామవికారాలవైపు పరుగుపెట్టిస్తుంది. కనుక ఆ వికారాలను తొలగించకపోతే మనసు మాధవుని వైపు మళ్లదు పక్కదోవలగుండా పారి పోవాలని చూస్తుంది. కనుక ఆ శిరోజాలను తీసి వేస్తే ప్రతి మానవునికి తమ సహజస్వరూపమేమిటో అర్ధమయిపోతుంది.



ఎదుట వున్న జీవులను చూడగానే కామ భావన సమూలంగా నశిస్తుంది. నిర్వికారమైన మనోస్థితి కలుగుతుంది. [గుండు చేయించుకుని మిమ్మల్ని మీరు అద్దములో చూసుకోండి ఒకసారి, ఏవిధమయిన వికారాలు లేక ప్రశాంతమైన స్థితి వస్తుంది.]




అప్పుడు ఆలయ ప్రవేశము చేస్తుంటే మనసంతా ఆ దివ్యస్వరూపాన్ని చూడాలనే తపన తప్ప మరొకటి తలపుకు రాదు. ఆస్థితిలో కోటిసూర్యకాంతుల సమప్రభుడు ఆ కొండలరాయుడు మనకు దర్శనమిస్తాడు. ఆ తన్మయత్వంతో స్వామిని దర్శించి నప్పుడు తిరుమల యాత్ర సఫలమవుతుంది. ఆ తరువాత నిలువుదోపిడీ చేసి మనలను ధనవంతులమనే అహంకారాన్నుంచి రక్షించి ప్రపంచములో ఏజీవైనా నీవొక్కడివే దిక్కు నాకు అనేలా భావన కలగచేస్తాడు స్వామి.




 ఇలా వెళ్ళినప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించి మనకు శుభాలు కలుగుతాయి.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన ఆ స్వామి ముందు తమ తుచ్చమైన పలుకుబడులను, ధనాన్ని ప్రదర్శించి చెసే దర్శనముమేలు చేయదు సరికదా ఆయన ఆగ్రహానికి గురయ్యేలా చేస్తుందని చెప్పవచ్చు. ఆ పవిత్ర క్షేత్రములో అడుగు పెట్టిన ప్రతి భక్తుడు స్వామి వారి పరివారమే.




 కనుక మన అతితెలివి తోటి సాటి భక్తుల కిబ్బందికలిగేలా మనము దర్శనాదులను చేయరాదు. భక్తులకు చెసే అపచారాన్ని ఆయన అసలు క్షమించడు. అందుకే ఎక్కడెక్కడ మనం చేసిన తప్పులన్నిటికీ కొండమీదకు వెళ్లాక అనేకరూపాలుగా దోపిడిగా మనకు అనుభవానికొచ్చి మనసు విలవిల లాడుతుంటుంది. మీకు తెలుసోలేదో నిరుపేదలు రోజులతరబడి ఆ గదులలో స్వామి వారి దర్శనానికి వేచివున్నా వారికి శ్రీవారి పట్ల విసుగు కాని, అక్కడ అసౌకర్యాల పట్ల గమనికే వుండదు. కాస్త స్థితి కలిగాక మనమే గంటసేపన్న ఆగలేక అల్లడిపోయి పక్కదారిలో దర్శనమేమన్నా దొరుకుతుందా అని వెతుకుతుంటాము.

మందారం టీ తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు…!

మందారం పూలు గురించి పాఠశాల పుస్తకాల్లో చదివే ఉంటారు. ఇది కేవలం చూడటానికి అందంగానే కాకుండా మనిషి ఆరోగ్యానికి కూడా ఉపయోగపుడుతుంది. దీనిని హైబిస్కస్ అని కూడా అంటారు. దీనిని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటారు. అలాగే మందులుగా కూడా ఉపయోగించొచ్చు, దీంతో మనిషి ఆరోగ్యంగా వుంటాడంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా యూనాని మందులలో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.


దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధి, గొంతుకు సంబంధించిన వ్యాధులు తదితర జబ్బులకు మంచి ఔషధంలా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. ఇందులో విటమిన్ సి, క్యాల్షియం, పీచుపదార్థం (ఫైబర్), ఐరన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, టెటరిక్, ఆక్సీలిక్ యాసిడ్, ఫ్లేవోనైడ్ గ్లైకోసైడ్స్ తగు మోతాదులో లభిస్తాయి. వీటివలన శరీరం ఆరోగ్యంగా ఉంటుందంటున్నారు వైద్యులు. మందారపువ్వును హెర్బల్ టీ, కాక్టేల్ రూపాలలోను సేవించవచ్చు. పూలను ఎండబెట్టి హెర్బల్ టీగా తీసుకోవచ్చు. దీనిని ఎలా తయారు చేయాలంటే…



నీటిని ఉడకబెట్టిన తర్వాత ఎండిన మందార పువ్వులను అందులో వేయండి. అందులో చక్కెర, కాస్త టీపొడి కలుపుకుని టీలాగా తయారు చేసుకోండి. దీంతో హైబిస్కస్ హెర్బల్ టీ తయారవుతుంది.
ప్రతి రోజు దీనిని సేవిస్తుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. అలాగే కాక్టేల్ టీ కొరకు దీనిని చల్లగా చేసి అందులో కొన్ని ఐసు ముక్కలు వేసుకుని తాగితే అదే కాక్టేల్ టీ. ఇలా ప్రతి రోజు తీసుకుటుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. హైబిస్క్ టీని ఎన్నిరకాలుగా తీసుకున్నా, ఈ టీ అందించే ప్రయోజనాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. రెగ్యులర్ డైట్ లో మందారం టీని ఎందుకు తీసుకోవాలి అని చెప్పడానికి 7 ముఖ్యమైన కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో మందారం టీ ఒక నేచురల్ రెమెడీ. రోజులో 8 ఔన్సుల టీని , కొన్ని వారాల పాటు తీసుకుంటుంటే, బ్లడ్ ప్రెజర్ నార్మల్ కు వచ్చేస్తుందని, వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

జీర్ణ శక్తిని పెంచుతుంది:

చాలా మంది జీర్ణక్రియ మెరుగుపరచడానికి మందార టీని సేవిస్తారు. ఇది మూత్రవిసర్జన మరియు ప్రేగు ఉద్యమాలు రెండింటిని పెంచుతుంది. ఇది మూత్రవిసర్జన లక్షణాలు కలిగి ఉన్నందున, మలబద్ధకం చికిత్సలో ఉపయోగిస్తారు. మీరు బరువు కోల్పోవటానికి మరియు మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపరచడానికి మరియు పురీషనాళ కాన్సర్ నివారించేందుకు సహాయపడుతుంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది:

మందార టీలో యాంటీ కణితి మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిన హైబిస్కస్ ప్రోతోకాతెచుక్ ఆమ్లం ఉంటుంది. టైచుంగ్ లో చుంగ్ షాన్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజ్ లో బయోకెమిస్ట్రీ విభాగం మరియు ఇన్స్టిట్యూట్ నిర్వహించిన ఒక అధ్యయనం,హైబిస్కస్ కణ మరణాన్ని ప్రేరేపించడం ద్వారా క్యాన్సర్ కణాల వృద్ధిని తగ్గిస్తుందని సూచించింది. సాధారణంగా దీనిని ప్రోగ్రామ్ సెల్ మరణం అని పిలుస్తారు. అదేవిధంగా హైబిస్కస్ టీ క్యాన్సర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. అధ్యయనాల ప్రకారం, రోజు హైబిస్కస్ టీ తాగటం వలన క్యాన్సర్ కణాల అభివృద్ధి నెమ్మదిపరచబడి, మెరుగైన చికిత్స మరియు కణాల ఆరోగ్యం తిరిగి పొందటానికి సహాయపడుతుంది.

ఏజింగ్ సమస్యను నివారిస్తుంది:

చాలా దేశాల్లో , చైనా, ఈజిప్ట్ వంటి దేశాల్లో వయస్సును కాపాడుకోవడానికి కొన్ని వేల సంవత్సరాల నుండి మందారం టీని వారి రెగ్యులర్ టీగా తాగుతున్నారు. ఈ అద్భుతమైన డ్రింక్ లో యాంటీఆక్సిడెంట్స్, అధికంగా ఉండటం వల్ల బాడీలోని ఫ్రీరాడికల్స్ ను తొలగించడం వల్ల ఏజింగ్ లక్షణాలను ఆలస్యం చేస్తుంది. దాంతో వ్రుద్యాప్య లక్షణాలు కనబడకుండా చేస్తుంది.

హార్ట్ అటాక్ రిస్క్ ను తగ్గిస్తుంది:

మందార టీలో ఆకట్టుకునే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. తద్వారా ఇది గుండె వ్యాధులకు వ్యతిరేకంగా రక్షించడానికి సహాయం మరియు రక్త నాళాల నష్టం నుండి రక్షించటం మరియు శరీరం నుండి “చెడు” LDL కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటానికి సహాయపడుతుంది.మందార టీలో ఉండే హైపోలిపిదేమిక్ మరియు హైపోగ్లైసీమిక్ లక్షణాలు మధుమేహం వంటి చక్కెర రుగ్మతలతో బాధపడే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. టైప్ II డయాబెటిస్ రోగులలో నిర్వహించిన ఒక పరిశోధనలో మందార పుల్లని టీ వినియోగం వలన కొలెస్ట్రాల్, ట్రైగ్లిజెరైడ్స్ మరియు ఊహించలేని వ్యాధులను నిర్వహించడానికి సహాయపడుట మరియు తక్కువ సాంద్రత లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని తెలిసింది. వారంలో 14 కప్పులు టీ తాగడం వల్ల హార్ట్ అటాక్ వల్ల చనిపోయే వారి మరణాల రేటు తగ్గుతుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:

యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే హబిస్కస్ టీ శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా, రక్తనాళాలను మరియు గుండె సంబంధిత భాగాలు ప్రమాదానికి గురవకుండా ఉంటాయి. నూతన పరిశోధనల ప్రకారం, రోజు హైబిస్కస్ టీ తాగటం వలన శరీర రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడతాయి.మందారం టీలో ఉండే బయోఫ్లెవనాయిడ్స్, ధమనుల్లో ఫ్లాక్స్ ఏర్పడకుండా నివారిస్తుంది, దాంతో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి సహాయపడుతుంది:

మందార టీ బరువు కోల్పోవడం కోసం ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కార్బోహైడ్రేట్ల ఆహారంను సమృద్దిగా తింటే, చక్కెర మరియు పిండి పదార్ధాలు ఎక్కువగా ఉండి మీరు బరువు పెరిగే అవకాశం ఉంది. అయితే, పరిశోధన అధ్యయనాలు మందార జ్యూస్ స్టార్చ్ మరియు గ్లూకోజ్ శోషణను తగ్గించి బరువు నష్టంకు సహాయపడుతుందని సూచించాయి. మందార ఏమేలేస్ యొక్క ఉత్పత్తిని తగ్గించి కార్బోహైడ్రేట్లను మరియు స్టార్చ్ శోషణకు సహాయపడుతుంది. కాబట్టి మందార టీ త్రాగితే శోషణ జరగకుండా నిరోధిస్తుంది. అందువలన, మందార టీ అనేక బరువు నష్టం ఉత్పత్తులలో కనబడుతుంది.

మందారం టీ తాగడం వల్ల పొందే అద్భుతమైన ప్రయోజనాలు

కాబట్టి, ఇప్పటి వరకూ మీరు ఈ టీని ప్రయత్నించి ఉండకపోతే, వెంటనే ప్రయత్నించండి,ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా కాపాడుకోండి. మందార టీ క్రాన్బెర్రీ జ్యూస్ ని పోలి ఒక మంచి రుచిని కలిగి ఉంటుంది. దీనిని ఖచ్చితంగా టార్ట్ గా వర్ణించవచ్చు. కాబట్టి మీరు తీయదనాన్ని పెంచడానికి చక్కెర లేదా తేనెను జోడించవచ్చు. కాబట్టి మీరు మీ రుచి ప్రాధాన్యతలను బట్టి దాల్చిన చెక్క,లవంగాలు,జాజికాయ,అల్లం వంటి సుగంధ ద్రవ్యాలను జోడించటానికి ప్రయత్నించవచ్చు.




అక్షింతలు వాటి శాస్త్రీయత – రకాలు.

అక్షతలు
అక్షతలు లేదా అక్షింతలు నీటితో తడిపిన బియ్యము. క్షతములు కానివి అక్షతలు అని అర్ధము. భగ్నముగాని బియ్యమును అక్షతలు అంటారు. నిండు గింజలైన అక్షతల వలె మీ జీవితము కూడ భగ్నము కాకుండా ఉండాలని నిండు నూరేళ్ళు జీవించాలని చెప్పడానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తాము. పెద్దలు పిన్నలను ఆశీర్వదించేటప్పుడు గాని, పూజాదికములందు గాని, వివాహోపనయనములందు గాని వాడుట హిందూ ఆచారము.
శాస్త్రీయత
బియ్యము చంద్రునికి చెందిన ధాన్యము. మనః కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యంపై ఉంటుంది. మానవుని దేహం ఓ విద్యుత్ వలయం. ఆశీర్వదించేవారు చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలోని విద్యుత్ బియ్యానికి అందుతుంది.
ఆశీర్వాదించే వారికి చర్మవ్యాధులు ఉంటే ఆ ప్రభావం కూడా ఆశీర్వాదం తీసుకునే వారిపై పడుతుంది. అందుకే క్రిమిసంహరకమైన పసునుని కలిపి, కేవలం విద్యుత్ మాత్రమే స్వీకరించేలా చేసి పసుపు కలిపిన బియ్యాన్ని అనగా అక్షింతలనిచ్చి ఆశీర్వదించమంటారు.
పసుపు లేదా కుంకుమ గానీ, కలపని అక్షింతలను పూజాకార్యక్రమాల్లో గానీ, శుభకార్యల్లోగానీ వాడరు.
అక్షింతలు మూడు రకాలు:
1. హరిద్రాక్షతలు: పసుపు కలిపిన బియ్యం: వీటిని పూజకు, ఆశీర్వదించేటప్పుడు ఉపయోగిస్తారు
2. రక్షాక్షతలు: పసుపు సున్నము కలిపిన బియ్యం
3. శ్వేతాక్షతలు: ఏమీ కలపని తెల్లని బియ్యం : అశుభకార్యాలకు ఉపయోగించునవి
* ’’క్షతమ్‘‘ అంటే నాశనం అని అర్థం ‘‘అక్షతం’’ అంటే ‘‘నాశనం లేనిదని అర్థం, మరియు బియ్యము, పసుపు, మంగళప్రదమైనవి కూడా అందుచేత జీవితంలో ఏ ఇబ్బంది, కష్టమూ లేకుండా సుఖ సంతోషాలతో నిండు నూరెళ్లు వర్థిల్లాలనే సదుద్దేశంతో అక్షతలు వేసి దీవిస్తారు.

స్వయం భూ శివలింగం ఆద్భుతమైన శివలింగం ఇది ఓం నమః శివాయ

భూమ్మీద ఎన్నో శివలింగాలు ఉండవచ్చు. కానీ ఇక్కడ చెప్పబోయేది మాత్రం ప్రత్యేకమైనది, బహుశా మీరు ఇదివరకెన్నడూ ఇలాంటిది చూసి కూడా ఉండరు. అంతే కాదు కనీసం వినడం కూడా జరిగి ఉండదనుకోవచ్చు. ఈ శివలింగం ప్రత్యేకతేమిటి అనుకుంటున్నారా? ఐతే తెలుసుకోండి ఇక్కడున్న శివలింగం కదులుతోందండి!


ఏంటీ ? కదిలే శివలింగమా! భలే చెప్పార్లే ఎక్కడైనా ఇలాంటి కదిలే శివలింగం ఉంటుందా అని నమ్మబుద్ధి కావడం లేదా? నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమేనండి. ఈ కదిలే శివలింగంలో ఉండే ప్రత్యేకత ఏమిటో తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్‌‌లోని రుద్రపూర్‌కు వెళ్లాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ లోని దియోరియా జిల్లా రుద్రపురం లో ఉన్న దుగ్దేశ్వరనాథుడు కదులుతాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఇదే.ఈ అలయలోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించి ఉంటుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ అతిపురాతనమైన ఆలయంలో శివలింగం ఒక అద్భుతాన్ని సృష్టిస్తుంది.



 ఈ ఆలయం యొక్క శివలింగం కదులుతుంది. చాలా సార్లు కదులుతూ ఉంటుంది, అలా ఒక గంట కదలవచ్చు, లేదా ఐదు గంటలు కదలోచ్చు, ఒక్కోసారి ఇరవయి నాలుగు గంటలు కదులుతూనే ఉంటుందని చెప్తారు ఇక్కడి ఆలయంలోని అర్చకులు. ఇలాంటి సమయంలో ఈ అద్భుతాన్ని చూడడానికి భక్తులు తండోపతండాలుగా స్వామి వారిని చూడడానికి వస్తారు. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయ్యాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదంట.





అందుకే ఈ వింతను చూడడానికి పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరుతారు ఈ కదిలేశివలింగ ఆలయంలోకి, ఈ లింగం ఇంకా భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉందొ తెలుసుకోవడానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవడంతో విఫలంయ్యరంతా. . .
స్వయం భూ శివలింగం ఆద్భుతమైన శివలింగం ఇది
ఓం నమః శివాయ
ఈలోకంలో ఉన్న దేవుళ్ళలో ఎవరికీ లింగరూపం లేదు…………..
ఒక్క పరమ శివుడికి మాత్రమే లింగరూపం ఉండటంలోని విశిష్టత ఏమిటి……….?
పరమేశ్వరుణ్ణి ఎప్పటి నుండి లింగరూపంలో కొలుస్తున్నారో మీకు తెలుసా…………?
శివ లింగము అనేది శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం.
సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతోంది.
పూర్వం శివుడ్ని విగ్రహ రూపం లోనే పూజించే వారు
(హరప్పా శిధిలాలలో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించవచ్చు).
వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాధ లో భృగు మహర్షి శాప ఘట్టం లో భృగుమహర్షి శివుడ్ని “నేటి నుండి నీ లింగానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు,
నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపిస్తాడు.అంటే అంతకుముందు విగ్రహానికి పూజలుండేవన్నమాట.
శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే.
ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటి దాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు.
శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని.
లింగం అంటే సంకేతం అని అర్థం. అంటే శివలింగం సర్వ శుభప్రథమైన దైవాన్ని సూచిస్తుంది.
శివలింగము(మానుష లింగము) లో మూడు భాగాలు ఉంటాయి.
బ్రహ్మ భాగము భూమిలో , విష్ణు భాగం పీఠం లొ , శివ భాగం మనకు కనిపించే పూజా భాగము గా ఉంటుంది.
శివ లింగములు – రకములు
• స్వయం భూ లింగములు:స్వయముగా వాటి అంతట అవే వెలసినవి.
• దైవిక లింగములు:దేవతా ప్రతిష్టితాలు.
• రుష్య లింగములు:ఋషి ప్రతిష్టితాలు.
• మానుష లింగములు:ఇవి మానవ నిర్మిత లింగములు.
• బాణ లింగములు:ఇవి నర్మదా నదీతీరాన దొరికే(తులా పరిక్షకు నెగ్గిన)బొమ్మరాళ్ళు(pebbles).
పంచభూతలింగాలు
పంచభూతాలు అనగా పృథివి, జలం అగ్ని, వాయువు, ఆకాశం. శివుడు
ఈ పంచభూతాల స్వరూపాలైన లింగరూపాలతో ఐదు క్షేత్రాలలో ప్రతిష్టితుడై ఉన్నాడు.
• 1. తేజో లింగం: అన్నామలైశ్వరుడు – అన్నామలై
• 2. జల లింగం: జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం
• 3. ఆకాశ లింగం: చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం
• 4. పృథ్వీ లింగం: ఏకాంబరేశ్వరుడు – కంచి
• 5. వాయు లింగం: శ్రీకాళహస్తీశ్వరుడు – శ్రీకాళహస్తి
పంచారామాలు
• 1. అమారారామము:
అమరావతి (గుంటూరు జిల్లా) శ్రీ అమరేశ్వర స్వామి, బాలచాముండికా దేవి
• 2. ద్రాక్షారామము:
ద్రాక్షారామ (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ భీమేశ్వర స్వామి, మాణిక్యాంబ
• 3. కుమారారామము:
సామర్లకోట (తూర్పు గోదావరి జిల్లా) శ్రీ కుమార భీమేశ్వర స్వామి, బాలాత్రిపురసుందరి
• 4 భీమారామము:
భీమవరము (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ సోమేశ్వర స్వామి, అన్నపూర్ణ
• 5. క్షీరారామము:
పాలకొల్లు (పశ్చిమ గోదావరి జిల్లా) శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి.
కొన్ని విశేషాలు:


• శ్రీకాళహస్తి లోని శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు.
కేవలం లింగం యొక్క కింద భాగమైన పానువట్టాన్ని మాత్రమే తాకుతారు.
• కంచి లోని శివలింగం మట్టి తో చేసినది(పృధ్వీ లింగం)
కాబట్టి లింగానికి అభిషేకము జరగదు.నూనెను మాత్రం పూస్తారు.