cricket ad

Friday 9 December 2016

ఫేస్‌బుక్‌లో తొలి స్థానం ఈ పండగదేనట!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫేస్‌బుక్‌.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ ఉన్న వారందరికీ అందుబాటులో ఉన్న సామాజిక మాధ్యమం. ఆనందంగా గడిపిన క్షణాలనైనా, ఒక భావాన్నైనా దీని ద్వారానే నలుగురితో పంచుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల వివిధ అంశాలపై చర్చలకూ ఫేస్‌బుక్‌ వేదికవుతోంది. అయితే, ఈ ఏడాది మన దేశంలో ఎక్కువమంది దేని గురించి మాట్లాడారో తెలుసా? దీపావళి. అవును.. దేశవ్యాప్తంగా జరుపుకొనే ఈ పండగ గురించే ఈ ఏడాది ఎక్కువమంది చర్చించినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. మన దేశంతో పాటు అంతర్జాతీయంగా చర్చకు వచ్చిన తొలి పది అంశాల జాబితాను ‘ఫేస్‌బుక్‌ 2016 రివ్యూ’ పేరిట గురువారం విడుదల చేసింది.
మన దేశానికి సంబంధించి చర్చించిన అంశాల్లో దీపావళి తొలిస్థానంలో నిలవగా.. క్రికెట్‌ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మూడోస్థానంలో.. ఉరీ ఉగ్రదాడి, దానికి కొనసాగింపుగా పాక్‌పై మన సైన్యం జరిపిన మెరుపుదాడులపై ఎక్కువగా చర్చించారట. దీంతో పాటు ధోనీ చిత్రం, ప్రముఖ డీజే హార్డ్‌వెల్‌ ఇండియా పర్యటన, ప్రియాంక చోప్రా, రియో ఒలింపిక్స్‌, పోకెమాన్‌గో, పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి, ఐఫోన్‌ 7 లాంచ్‌ గురించి చర్చించారని ఫేస్‌బుక్‌ తెలిపింది.
ఇక అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి ఎక్కువమంది చర్చించారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్‌ రాజకీయాలు, పోకెమాన్‌గో రియాలిటీ గేమ్‌ చర్చకు వచ్చాయి. వీటితోపాటు ఒలింపిక్స్‌, బ్రెగ్జిట్‌ అంశాలు టాప్‌ 10లో చోటు సాధించాయి.
మొబైల్‌ వినియోగమే అధికం
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ఫేస్‌బుక్‌కు దేశవ్యాప్తంగా నెలవారీ 16.6కోట్ల(166 మిలియన్ల) మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. దీనిలో 15.9కోట్ల (159 మిలియన్ల) మంది మొబైల్‌ ద్వారానే ఫేస్‌బుక్‌ వాడుతున్నారు. ఇక రోజువారీ యాక్టివ్‌ యూజర్ల సంఖ్య 8.5కోట్లు (85మిలియన్లు)కాగా.. మొబైల్‌లో 8.1కోట్ల(81మిలియన్ల) మంది ఫేస్‌బుక్‌ను వినియోగిస్తున్నారు.

Tuesday 6 December 2016

మోదీ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారు…
నీతులు ఉన్నది బహిరంగసభల్లో ధీర్ఘాలు తీసి వెర్రిజనాలకు చెప్పేందుకేనని బీజేపీ నేతలు మరోసారి నిరూపించారు. దేశంలో జనం రెండు వేల రూపాయల కోసం పడరాని పాట్లు పడుతుంటే బీజేపీ నేతలు మాత్రం ఆడంబరాల్లో మునిగితేలుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌, బీజేపీ నేత గాలి జనార్దన్‌ రెడ్డి, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలు నోట్ల రద్దు తర్వాతే కోట్లు తగలేసి ఘనంగా వారింట వివాహాలు చేసుకున్నారు. దీనిపై దేశం మొత్తం నిరసన తెలిపినా బీజేపీ నేతలకు బుద్ధి రాలేదు. తాజాగా కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తన కూతురి వివాహం ఆదివారం రాత్రి చేశారు.
ఆ పెళ్లిని చూసిన వారు షాక్ అవుతున్నారు. దేశం కరెన్సీ కరువుతో అల్లాడుతున్న వేళ గడ్కరీ ఏకంగా 50 ప్రత్యేక చార్టర్డ్ విమానాలను వివాహానికి వచ్చే అథితుల కోసం వాడారు. పది వేల మంది అతిథులు వచ్చిన ఈ వివాహానికి దాదాపు 120 కోట్లు ఖర్చు చేసినట్టు చెబుతున్నారు. ఈ వివాహానికి కేంద్రమంత్రులు కూడా హాజరవడం విశేషం. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, నీతులు చెబుతున్న అమిత్‌షా, వెంకయ్యనాయుడు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ వివాహం నాగపూర్‌లో జరిగింది. ఈ వివాహం గురించి తెలుసుకున్న నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. నోట్ల రద్దు చేసి సామాన్యులపై పడి ఏడుస్తున్న మోదీ ప్రభుత్వం ఇలా కోట్లు తగలేసి కేంద్రమంత్రులే చేస్తున్న వివాహలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఏం కష్టం చేసి సంపాదించి తన కేబినెట్ మంత్రి గడ్కరీ వంద కోట్లు పెట్టి కూతురు వివాహం చేశారో దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. చూస్తుంటే మోదీ తీరు ఇంట గెలవలేక రచ్చ గెలిచి రచ్చ చేసేందుకు బయలుదేరినట్టుగా ఉందంటున్నారు
బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఈ హీరో క్రేజ్ ఆధారంగా పలువురు నిర్మాతలు భారీ సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. బాహుబలితో సంబంధం లేకుండానే వర్షం, డార్లింగ్, మిర్చి, మిస్టర్ ఫర్‌పెక్ట్ వంటి సినిమాలతో అమ్మాయిల కలల హీరోగా మారిపోయాడు. బాహుబలి తర్వాత ఆ క్రేజ్ ఆరాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి అనే మాట రాగానే.. ఈ యువరాజును పెళ్లాడబోయే అదృష్టవంతురాలు ఎవరా అని అటు అమ్మాయిలు, ఇటు సగటు సినీ అభిమాని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం గురించి చిన్న వార్త బయటకు వచ్చినా.. స్పందన మాత్రం విపరీతంగా ఉంటుంది. దీని గురించి ఇప్పటికే కృష్ణంరాజు మీడియాతో మాట్లాడినట్లు వార్తలు రావడం, ఆయన వాటిని ఖండించడం కూడా జరిగింది. అయితే, తాజా వస్తున్న వార్తలను బట్టి తన పెళ్లి గురించి, ఆ అమ్మాయి గురించి ప్రభాస్ స్వయంగా తన సన్నిహితుల వద్ద వెల్లడించినట్లు ఫిలింనగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు. తనకు కాబోయే భార్య.. వైజాగ్‌లో స్థిరపడిన ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయని, తను బాగా చదువుకుందని, తన వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని ప్రభాస్ తన సన్నిహితులతో అన్నాడట. అంతేకాదు, ఆ అమ్మాయి తనకోసం మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తోందని, నిశ్చితార్థం తరువాత అన్ని వివరాలు చెప్తానని కూడా అన్నాడట. ఇప్పుడే ఆమె పేరు, ఫొటోలు బయటపెడితే, ఆమె కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతోనే రహస్యంగా ఉంచుతున్నానని అన్నాడట ప్రభాస్. ఈ వార్తలు కాస్త బయటకు రావడంతో ఫిలింనగర్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రభాస్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.
  • ఆమె పుట్టింది కర్నాటకలో…. పాత మైసూరు సంస్థానంలోని మాండ్యాలో… అసలు పేరు కోమలవల్లి… 
  • ఆమె జీవితమంతా తమిళనాడులో… నాయకురాలిగా, నటిగా…. అంతా అక్కడే… 
  • ఆమె విశ్రాంతి అంతా హైదరాబాదులో… కొంపెల్లి ప్రాంతంలో ఉండే ఫామ్ హౌజులో…. 
  • ఆమె అయిదో ఏట నుంచే భరతనాట్యం నేర్చుకున్నది…. 
  • తల్లి బలవంతం మీద 15 వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది…. 
  • ఆమె మొదటి సినిమాలో యంగ్ విడో పాత్ర… మెట్రిక్ స్టేట్ ర్యాంకర్ ఓ యంగ్ విడో పాత్ర పోషించడం అందరికీ ఆశ్చర్యం … 
  • ఆ తొలి సినిమాకు సెన్సార్ ఇచ్చిన రేటింగ్ ‘పెద్దలకు మాత్రమే’… 
  • తనకు అప్పటికి 15 ఏళ్ల వయసే కాబట్టి తన తొలి సినిమాను తనే థియేటర్ లో చూడలేకపోయిందట…. 
  • స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని, జలపాతం కింద తడుస్తూ పాటలో నటించిన తొలి తమిళ నటి… 
  • ఆమె సినిమా కెరీర్ మొదట్లోనే శోభన్ బాబును ప్రేమించింది… అదలాగే కొనసాగింది… పెళ్లి చేసుకోలేదు…
  • శోభన్ బాబుతో ఆమెకు శోభన (ప్రియ మహాలక్ష్మి) అనే కూతురు పుట్టిందనీ ప్రచారం ఉంది… కానీ ఆమె గురించి తెలియదు… 
  • ఆమెకు ఇంగ్లిషు పుస్తకాలు చదవడమంటే మహా ఇష్టం… ఎప్పటికీ ఆమెతో ఆ పుస్తకాలు ఉంటాయి…
  • ఆమె మంచి రచయిత్రి కూడా… ఎస్టరియర్ తమిళ వీక్లీలో థాయ్ పేరుతో రాస్తూ ఉండేది…
  • తమిళంలో ఆమె సిల్వర్ జుబ్లీ సినిమాలే అధికం.. 85 సినిమాల్లో 80 హిట్టే…
  • ఇజ్జత్ అనే హిందీ సినిమాలోనూ నటించింది అదీ హిట్టే… తెలుగులో ఆమె నటించినవి 28 సినిమాలు…
  • ఆమెకు ఒక సోదరుడు… పేరు జయకుమార్… 1995లో చనిపోయాడు…
  • 1991లో…. 43 ఏళ్ల వయసులోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కురాలు…
  • పటౌడీని చూడటం కోసమే ఆమె క్రికెట్ మ్యాచులకు వెళ్లేది…
  • దత్తపుత్రుడి పెళ్లి జరిపినప్పుడు లక్షన్నర మందికి ఆతిథ్యం ఇచ్చింది… ఇది గిన్నీస్ రికార్డు…
  • తన దత్తపుత్రుడి పెళ్లి ఖర్చు అప్పట్లోనే 100 కోట్లు అని విమర్శ కాగా, 10 కోట్లేనని ఐటీ శాఖ అంచనా వేసింది… 
  • తన ప్రియసఖి శశికళతో ఆమె బంధం గురించి రకరకాల దుష్ప్రచారాలున్నాయి… 
  • శశికళను కాస్త దూరం ఉంచడం మొదలెట్టగానే ఇదే శశికళ జయలలితకు స్లోపాయిజన్ కుట్ర చేసిందని తెహెల్కా కథనం… 
  • అప్పటి నుంచే జయ ఆరోగ్యం క్షీణించి, చివరకు రోజల తరబడీ చికిత్స చేసినా చక్కబడలేదనేది విమర్శ… 
  • కుంభకోణంలో మహామకం ఉత్సవాల్లో 1992లో ఆమె సంప్రదాయ స్నానం… జనం తొక్కిసలాటలో 50 మంది మృతి…
  • 1992 లోనే అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని ఆమె ఆరోపించింది… 
  • సుబ్రహ్మణ్యస్వామి 1996లో కేసు పెట్టినప్పుడు బయటపడ్డ ఆస్తులు 66 కోట్లు…
  • అందరినీ ఆకర్షించినవి 12,000 చీరెలు, 30 కిలోల బంగారం, 2,000 ఎకరాల భూమి, 750 జతల చెప్పులు, 8 క్వింటాళ్ల వెండి… 
  • 1997లో ఆస్తుల జప్తు జరిగినప్పుడు, ఇక ఆభరణాలు ధరించనని ఒట్టు పెట్టుకుని, తిరిగి అధికారంలోకి వచ్చాకే 2011లో ధరించింది… 
  • పాలనలో ఆమె నియంతలాగే వ్యవహరిస్తుంది… విమర్శలు చేసినా, వార్తలు రాసినా ఎడాపెడా పరువునష్టం కేసులు పెట్టించేది… 
  • విధేయత విషయంలో పాతకాలం చక్రవర్తులు కూడా పనికిరారు… మంత్రులు, ఎమ్మెల్యేల పాదాభివందనాలు చాలా కామన్… 
  • ఆమె కళ్లల్లోకి నేరుగా చూడొద్దనీ, బొకే ఇచ్చేసి, వెనక్కి తిరిగి వీపు చూపకుండా, వెనక్కి వెనక్కి నడిచిరావాలని గన్ మెన్ చెప్పేవారట…
  • స్కూళ్లో ఓ క్లాస్ మేట్ లవ్ కు పోస్ట్ మ్యాన్ గా వ్యవహరించిందట… ఆమె తల్లికి తెలియగానే తనపై నిందలు వేసి తప్పుకుందట…
  • మొదట్లో ఎంజీఆర్ ఆమెను సందేహించేవాడట… ఆమె ప్రతి కదలికపై నిఘా వేసి ఉంచేవాడట…
  • వీడియో పార్లర్ నడుపుకునే శశికళను కూడా గూఢచర్యం కోసమే ఎంజీఆర్ జయలలిత వద్ద ఉంచాడట… 
  • 1981లో రాజకీయాల్లోకి రాగానే, 1983లో రాజ్యసభ సభ్యురాలైంది…. తరువాత ఎంజీఆర్ కోపానికీ గురైంది…
  • 1984లో ఎంజీఆర్ కు స్ట్రోక్ వచ్చి, అనారోగ్య సమస్యల్లో ఉంటే, ఈమె రాజీవ్ ను, గవర్నర్ ఖురాను కలిసి సీఎంను చేయమని అడిగిందట…
  • 1986లో ఎంజీఆర్ తో పడలేదు… పోటీగా జయలలిత పెరవై అనే సమాంతర ఆర్గనైజేషన్ ను కూడా స్టార్ట్ చేసింది

కొత్త వెయ్యి నోటు ఎప్పుడొస్తుందో తెలిసిపోయింది!

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఒకవైపు హర్షిస్తూనే, మరోవైపు అమలులో విఫలమైందని మండిపడుతున్నారు. పాత వెయ్యి, 5వందల నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త 2వేల నోటును ప్రవేశపెట్టింది. 2వేల నోటుతో పాటు 5వందలు, వెయ్యి రూపాయల నోటు కూడా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త 5వందల నోటు అక్కడక్కడా కనిపిస్తోంది కానీ వెయ్యి నోటు జాడే లేదు. ఈ వెయ్యి రూపాయల నోటు బ్యాంకుల్లోకి, అక్కడి నుంచి జనం జేబుల్లోకి రావాలంటే కొత్త సంవత్సరం వచ్చే దాకా ఆగక తప్పదని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వెయ్యి రూపాయల నోటును ప్రవేశపెడుతున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. అంతేకాదు, కొత్తగా 20రూపాయలు, 50 రూపాయల నోటును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐయే తెలిపింది. పాత 20, 50 నోట్లు యథాతథంగా ఉంటాయని, వాటికి తోడు కొత్త నోట్లు చలామణీలోకి తేవాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

Sunday 4 December 2016

వెల్లుల్లి ప్రయోజనాలెన్నో.

వెల్లుల్లి ప్రయోజనాలెన్నో...!
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం...
బరువు తగ్గిస్తుంది:
రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.
శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.
గుండెను కాపాడతాయి:
రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

Image may contain: food

Saturday 3 December 2016

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు, నగదు రహిత వ్యవస్థపై వస్తున్న విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా నోట్ల రద్దును సమర్థిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఇక నుంచి ప్రజలకు నోట్లతో పనిలేదని, డబ్బుల కోసం ఏటీఎంల ఎదుట క్యూకట్టాల్సిన పనిలేదన్నారు. జేబులోని మొబైల్ ఫోనే ఇక నుంచి బ్యాంకు బ్రాంచి అని అన్నారు. దేశంలోని చాలామందికి మొబైల్ బ్యాంకింగ్‌ గురించి తెలియదన్న విమర్శలపై మోదీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ప్రజలు హర్షధ్వానాలు తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనూ ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్‌నే ఉపయోగిస్తున్నారని, అభ్యర్థి పేరు చదివి ఓట్లు వేస్తున్నారని గుర్తు చేశారు. కానీ భారత్‌లో మాత్రం ఏవీఎంల మీట నొక్కి ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఏమీ తెలియదనుకోవడం పొరపాటే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌ను కూడా వారు సమర్థంగా చేయగలరని అన్నారు.
టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ప్రేమికులనే విషయం తెలిసిందే. ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోనప్పటికీ, భార్యాభర్తల్లాగానే ఉంటారు. ఏ ఈవెంట్‌కైనా కలిసే హాజరవుతుంటారు. కాగా, ఇటీవల జరిగిన టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ వివాహ సమయంలో ఈ జంట బాగా ఎంజాయ్‌ చేసిందట.
 
చంఢీగడ్‌లో జరిగిన సంగీత్‌లో యువీ దంపతులతో కలిసి ఈ ఇద్దరూ డ్యాన్స్‌ కూడా చేశారు. అక్కణ్నుంచి అనుష్క, కోహ్లీ గోవా పయనమయ్యారు. గోవాలో యువీ పెళ్లికి కూడా హాజరై అభినందనలు తెలిపారు. పనిలో పనిగా తమకు ఎయిర్‌పోర్ట్‌లో కలిసిన బాలీవుడ్‌ గీత రచయిత జావెద్‌ అఖ్తర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కణ్నుంచి తమ ప్రేమ కబర్లు చెప్పుకుంటూ పయనమయ్యారు.