cricket ad

Wednesday 30 November 2016

ఆత్మ కథ ,జీవిత చరిత్ర భేదం రమణ మహర్షికి ఎలా నమస్కారము పెడతామో..

ఆత్మ కథ ,జీవిత చరిత్ర భేదం :
ఆత్మకథ అంటే తనకు తానుగా రాసుకున్నది ,అది ఎందుకు రాసుకుంటారు అంటే తనని తాను పొగుడుకోడానికి రాసుకోరు ,తన జీవితములో ఉద్దాన పతనాలని ,జీవితములో వచ్చిన తప్పులని ,తన కష్టాలని ,తన యొక్క బలాన్ని ,తన బలహీనతని ,తను సాదించినదానిని ,తాను విపలమైనదానిని అన్ని చెప్తారు ,నిష్పాక్షికముగా చెప్తారు . గాంధీ గారి జీవిత చరిత్ర ఉంటుంది ,గాంధీ గారి జీవిత చరిత్రలో వారు చిన్న తనములో చేసినటువంటి దొంగతనం చెప్తారు ,ఆయన చేతి దస్తూరి బావుండదు ,నా దస్తూరి బాగుండదు అని చెప్తారు ,ఆయనికి చిన్నపుడు ఆటలు ఆడలేదు ,ఆయన ఆటలు ఆడకపోవడము వలన శరీరం దారుడ్యం ఎందుకు కలగలేదో చెప్తారు ,ఆయన ఒకప్పుడు పెద్ద ఉద్యమము చేస్తే , 1920 లో సహాయ నిరాకరనోద్యమము జరుగుతుండగా భారత దేశానికి స్వాతంత్ర్యం రావాల్సింది ,చౌరీ చౌర అన్న చోట ఒక ఆంగ్లేయ సిఫాయి ని పట్టుకుని సజీవదహనం చేసారు ,ఉద్యమం లోకి హింస ప్రవేశించింది కాబట్టి ,అహింస నా ఉద్యమానికి ప్రాణం కాబట్టి ఈ ఉద్యమం జరగడానికి వీలులేదని ఆపేసారు ,దానివలన సిద్దాంతం పట్ల గాంధీ గారికి ఎంత విశ్వాసం ఉంటుందో అర్ధమవుతుంది ,అది చివరికి చనిపోయేముందు కూడా తుపాకీ గుండు తగులుతున్నా కూడా "హే రామ్" అంటూ పడిపోయారు అంటే ఆయన ఎంతటి మహితాత్ముడో అర్ధమవుతుంది .ఆయన జీవితములో ఉద్దానపతనాలని చూసినపుడు ఆయన ఏ విషయాలు నేను చిన్నతనము లో చేసానని బాధపడానని చెప్పారో అవి మనము చెయ్యకూడదు అని అర్ధం . ఏ బలం ఆయన్ను నిలబెట్టిందో అది చదివిననాడు ఆ బలం సంతరించుకోవాలన్న ఆలోచన కలుగుతుంది . తాన జీవితాన్ని పుస్తకముగా తెరచిపెట్టి పదిమంది దాంట్లోంచి వచ్చే ఉత్స్తహాన్ని పుంజుకుని ఉన్నతమైన పధం లో నడవాలన్న కోర్కెతో మహాత్ములైన వారు జీవిత చరిత్రలు వ్రాస్తారు . అందుకే అటువంటి జీవిత చరిత్రలు తప్పకుండా చదవాలి . ఇక రెండవ విషయం మహత్ములయొక్క జీవితాలను చరిత్రలుగా రాయడం ,ఇది వారు ఉన్నపుడు రాసేటటువంటి విదానం ఒకటి . వారు శరీరం విడిచిపెట్టిన తర్వాత రాసే విధానం ఒకటి . ఈ మధ్య కాలములో pvrk ప్రసాద్ గారు గొప్ప సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ,ఒకప్పుడు ప్రధానమంత్రి కార్యాలయములో పనిచేసారు ,ఆయనో పుస్తకం రాసారు ,అప్పుడు ఏమైంది అని అది ఆ పుస్తకం పేరు . భారతదేశం అంతటిని కుదిపేసినటువంటి ఒక సందర్బములో అప్పుడు ప్రధానమంత్రి గా ఉన్నటువంటి pv నరసింహారావు గారు ఏమ్చేసారు అన్నది ఆయన దగ్గర కార్యదర్శిగా ఉన్న pvrk ప్రసాద్ గారికి తెలుసు ,అందుకే ఒక మహాద్భుతమైన పుస్తకాన్ని రాసారు "అప్పుడు ఏమైందంటే" అని ,అది చరిత్ర . జరిగిపోయిన దానిని రాసారు . ఒక్కొక్కచో వారు ఉండగానే రాస్తారు . వారు ఉండగానే ఎందుకు రాస్తారు అంటే ఆయన అంతటి మహితాత్ముడు దానికిక ఎప్పుడో అయన జీవితం పరిసమాత్మము అయిన తర్వాత బయటకి రావడం కాదు ,వెంటనే వచ్చేయాలి అంతే ,ఒక్కొక్కసారి ఏదో ఒక వయసులో చేయవలసిన ఉపనయనాన్ని చాలా ముందే చేసేస్తారు ,ఎందుకు చేసేస్తారు అంటే ఆ పుట్టిన పిల్లవాడు ఏక సంతాగ్రహి అనుకోండి అన్నేళ్ళు వచ్చే వరకు ఆపకూడదు , శాస్త్రం చదువకోవడానికి ,వేదం చదువుకోవడానికి తొందరగా ఉపనయనం చేసేస్తారు . అలా అటువంటి మహానుభావుడు అయితే ఆయన జీవించి ఉండగానే , ఆయన జీవితానికి సంబదించిన విశేషాలు ,ఆయన చెప్పినవి రెండు కలిపి పుస్తకముగా ఇస్తారు ,ఇది ఏ మహాత్ముడు గురుంచి చెప్పారో ఆయనతో పాటుగా అలా చెప్పిన వారికీ కూడా మనదరం ఋణపడి ఉంటాం ఏ కారణం చేత అంటారేమో ఆ మహాత్ముడు ఎవరు ఉంటారో ఆయనకి అసలు అది గ్రంధస్తం అవ్వాలని కోరిక ఉంటుందా ,ఉండదా అంటే చెప్పలేం ,కష్టం . ఒక ఉదాహరణ చెప్పాలంటే కామకోటి కంచి మఠానికి ఎందరో జగద్గురువులు వచ్చారు ,సామాన్యులు కారు ,ఒక్కొక్క జగద్గురు ఎటువంటి స్థానాలకి వెల్లిపోయారంటే ,చంద్రషేకరేంద్ర సరస్వతి అన్న పేరుతొ ఇంకో ఆయన కూడా ఉండేవారు ,ఒకసారి ఆయన దగ్గరికి ప్రతివాదులు వచ్చి వాదించడానికి కూర్చున్నారు , మొదలు పెట్టండి అన్నారు ఆయన , వాళ్ళు ఏదో మొదలు పెట్టబోయి , వారికి స్పురణ తట్టలేదు . వాళ్ళన్నారు మీ వల్లో ఒక పసిపిల్ల ఆడుకుంటుంది , ఆ పిల్ల ఆడుతుంటే ,నవ్వుతుంటే మాకు జ్ఞాపకం రావట్లే ,ఆ పిల్లను దింపెయండి మాట్లాడతాం అన్నారు , ఆయన అన్నారు నేను సన్యాసిని నా వల్లో పిల్ల ఎందుకు ఆడుకుంటుంది ,నా వల్లో పిల్ల లేదు ,మీరు ఉంది అనుకుంటున్నారు ,చెప్పండి అన్నారు ,వాళ్ళకి ఆ పిల్ల కనపడుతుంది నవ్వుతూ ,ఆ పిల్ల నవ్వుతూ కనపడుతుంటే వాళ్ళకేం గుర్తురావడం లేదు ,చెప్పలేకపోయారు ఆకరికి వారికి జ్ఞాపకానికి వచ్చింది , ఆయన ఎవరో తెలుసా ,పురుష రూపములో ఉన్న కామాక్షి ఆయనతో వాదిస్తావ అని కామాక్షి పరదేవతయే ఆయన వల్లో పసిపిల్లయై పడుకుంది . ఇపుడు ఎదురుకుండా ఉన్నవాళ్లు వాదిన్చలేకపోయారు ,ఈ విషయం ఎలా వస్తుంది వెలుగులోకి , శృంగేరి పీటాధిపత్యమ్ వహించిన ఉగ్ర నరసింహ భారతి స్వామి వారు ఒకప్పుడు దక్షిణ దేశములో ఉన్న మదురై వెళితే గుళ్ళోకి రావద్దన్నారు ,ఆయనికి నేనే గుళ్ళోకి వచ్చి పూజ చేయకూడద అని అచర్యం కలిగి ,శిష్యుణ్ణి కొబ్బరి బొండం తెమ్మని మంత్రం చదివి కొబ్బరి బొండం పట్టుకున్నారు ,ఎదురుకుండా ఉన్న మీనాక్షి దేవతలో ఉన్న శక్తి అంతా కొబ్బరి బొండం లోకి వెళ్ళిపోయింది ,ఆయన ఆ కొబ్బరి కాయ పట్టికిల్లి ,వీదిలోకి వెళ్ళిపోయి ,సింహాసనం మీద పెట్టి పూజ చేసారు ,అమ్మవారి విగ్రహం వెల వెల వెల పోయింది ,ఏదో తెల్లగా పాలిపోయినట్టు అయిపొయింది ,అంత తేజస్సు పోయింది ,పయిగా రోజు రోజుకు వివర్ణం అయిపోతుంది ,అప్పుడు పసిగట్టారు ,ఉగ్ర నరసింహ భారతి స్వామి వారు ,శక్తి అంతటిని లాగేసారు కొబ్బరి బొండం లోకి ,వెళ్లి ఆయన కాళ్ళ మీద పడ్డారు ,అయ్యా పొరపాటు మీ లాంటి మహితాత్ములు వస్తే గుళ్ళోకి రావద్దనడము ఏంటి ,అలాంటి వారు వస్తారనే స్వామి సంతోషముగా నిలబడతాడు ,ఆయన్ని రావద్దని అంటే ఇంకేమిటి అపచారము కాదు కాబట్టి వెంటనే ఆయన దగ్గరకి వెళ్లి కాళ్ళమీద పడి ప్రార్ధన చేస్తే ,ఆయన మళ్ళి గుళ్ళోకి వెళ్లి నిలబడి ,కొబ్బరి బొండము లో ఉన్నటువంటి అమ్మవారి శక్తులన్నీ ,అమ్మవారిలోకి ప్రవేషపెట్టేసారు ,అంతే మీనాక్షి పరమ కాంతితో నిలబడింది ,ఎలా తెలుస్తుంది ఈ విషయం ,ఎవరో ఆయన కాలములో ఉన్నవాళ్ళు రాయాలా వద్దా ,వాళ్ళు రాస్తే కదు మనకు అందింది ,ఇపుడు ఉగ్ర నరసింహ భారతి వారి ఒకరికే కాదు నమస్కారం ,ఆ రాసినవాడికి కూడా నమస్కారం ,లేకపోతే ఎలా అందుతుంది ,కంచి కామకోటి చరిత్ర శ్లోకము ల రూపములో ఇచ్చారు సదాశివ బ్రహ్మేంద్ర ,అలా ఇచ్చారు కాబట్టి అందింది జగద్గురువుల చరిత్ర అలాగే రమణ మహర్షి ఎప్పుడు మాట్టడేవారు కాదు ,ఎప్పుడైనా నోరు తెరచి మాట్టడేవారు ,ఆయన ఏదైనా మాట్లాడారంటే ,పరమాద్భుతమైనటువంటి విషయం , అది ఇక మాములుగా ఉండదు ఇక ,ఒక మాట మాట్లాడుతారు అంటే నోరు తెరచి ,ఎపుడు మాట్లాడతారో ఎవరికీ తెలిదు ,పది రోజులకి ఒకసారి మాట్లాడొచ్చు ,ఆయన ఒకసారి అన్నారు ,అరణ్యములో అనేక జంతువులు ఉంటాయి ,అవి ఎప్పుడూ అరుస్తూ ఉంటాయి ,సింహం ఒక్కసారి అరుస్తుంది ,సింహా గర్జన ,అది అరిస్తే మిగిలిన జంతువులు అరవడం మానేస్తాయి ,గురువు సింహం లాంటివాడు ,గురువు నోరు తెరిస్తే ,మిగిలిన పశువులు అన్ని నోళ్ళు మూసేస్తాయి ,ఎందుకని అంటే ,గురువుది సింహా గర్జన ,దాని ముందు ఇవి నిలబడవు కనుక ,ఆయన ఒక్క మాట అన్నారు ,గురువు యొక్క వైభవం ఏంటో అర్దమైయిందా లేదా ,అది వెంటనే సూర్య నాగమ్మ గారు రాసుకున్నారు ,సూరి నాగమ్మ లేఖలు అని ,దాదాపుగా ,రెండు దశాబ్దాల పై చిలుకు ,భగవాన్ రమణులు పాదాల దగ్గర కూర్చుని ,ఆయన ఎప్పుడు నోరు విప్పితే అప్పుడు రాసుకుని ,ఆయన చెప్పిన మాట ఆ కాగితాన్ని వాళ్ళ అన్నయికి పోస్ట్ చేసేవారు ,ఆ లేఖలు పుస్తకాలుగా వచ్చాయి ,కాబట్టి రమణ మహర్షి ఎప్పుడు ఏం మాట్లాడారో అన్న విషయం లోకానికి అందింది ,లేకపోతె అసలు అందవు ,ఇప్పుడు రమణ మహర్షికి నమస్కారముతో పాటు ,సూరి నాగమ్మ గారికి నమస్కారం ,లేకపోతే రమణ మహర్షి చెప్పిన విషయం ఎలా అందుతుంది ,రమణ మహర్షి జీవితములో జరిగిన సంగటలని వర్ణించారు ,ఆయన ఎలా నడిచోస్తారో ,ఎలా సోఫాలో పడుకుంటారో ,ఆకరికి ఓ రోజున పెద్ద పాము తిరుగుతుంది చెట్టు మీద ,ఆయన అలా చూస్తున్నారు ,ఇంతలోకే ఎవరో వచ్చారు ,బాబోయి పామ్ ,బాబోయి పామ్ అన్నారు ,ఆయన అన్నారు వారు రోజు వస్తారు ,ఇక్కడ ఇది పడుకుంటుంది ,వారు తిరుగుతుంటారు ,ఇది వారిని చూస్తుంది ,నేను అనేవారు కాదు ,ఇది అనేవారు ,అంటే వారు అన్నారు ,ఇది చూడడం ,వారు వెళ్ళడం బాగుంది ,మాకు భయం ,మేము ఆస్తాయి కాదు ,ఎలా వారు రోజు తిరుగుతుంటే మాకు భయము కాదు అన్నారు , ఆయన అన్నారు పైకి చూసి ,వారు భయపడుతున్నారు అంట మనలని చూసి ,ఎందుకొస్తారు ,వేరొక చోట తిరగకూడదు ,ఎందుకు వారిని ఇబ్బంది పెడతారు అన్నారు , అంతే ఆ పాము జర జర జర వెళ్ళిపోయింది ,అంటే ఒక జ్ఞాని మాటలు ఉపాది సంబదము లేకుండా అన్దేస్తాయి జీవుడికి ,ఎలా అందింది ,సూరి నాగమ్మ గారు ఉండబట్టేనా అందింది ,జరిగిన సంగటనలు అందుతాయి ,సంగటనలుతో పాటు వారు చెప్పినటువంటి ఉపదేశాలు అందుతాయి ,రెండు సద్గురువు యొక్క చరిత్ర గ అందుతాయి ,సాయిబాబా గారు ఉన్నారు ,సాయిబాబా గారి జీవిత కాలములో జరిగినటువంటి సంగటలని ,హేమాద్రి పంత్ అనే ఆయన రాసారు అని అంటారు ,అలాగే ఆయన చెప్పిన మాటలని రాసారు ,ఇప్పుడు హేమాద్రి పంత్ రాయబట్టేన మనం చదువుతున్నాం ,కాబట్టి ఇప్పుడు సాయిబాబా గారికి ఎంత నమస్కారము పెడుతున్నామో ,అలాగే అది చదువుకునే ముందు హేమాద్రి పంత్ కూడా నమస్కారము పెట్టాలి ,రమణ మహర్షి గురించి చదువుకుంటే రమణ మహర్షికి ఎలా నమస్కారము పెడతామో ,సూరి నాగమ్మ గారికి అలా నమస్కారము పెడతాం ,కామకోటి పీట గురువులకు నమస్కారము చేస్తూ ,అది రాసిన మహాత్ముడు సదాశివ బ్రహ్మెంద్రులు వారికీ నమస్కారము పెడతాము ,రామకృష్ణ పరమహంసతో తన అనుభవాలు వివేకానందుడు వ్రాశాడు కాబట్టి రామకృష్ణ పరమహంస యొక్క గొప్పతనము అర్ధమవుతుంది ,రామకృష పరమహంసకు నమస్కారము పెట్టి అది చెప్పిన వివేకానందుడికి నమస్కారము పెడతాము ,అందుకే గురు చరిత్రలో రెండు భాగాలుగా ఉంటుంది అని మనవి చేసారు ,వారు చెప్పినవి ,వారి చేష్టితముగా కనపడేటటువంటి లీలలు ,ఇప్పుడు ఒక పాము విషయము చుడండి ,రమణులు చెప్తే పాముకి ఎలా అర్ధమవుతుంది అంటే అందులోను ఆత్మ ఉంది ,ఇక్కడా ఆత్మ ఉంది ,ఆత్మ సర్వగతం ,సర్వగతం అయిన ఆత్మ ప్రకంపనలు ఒకదాని నుంచి ఒకటి అందుకుంటాయి ,అదే మౌన వాఖ్యానం ,ఆ మాట అందేసుకుంటుంది ,మనం చెప్తే అందదు ,ఆయన చెప్తే అందుతుంది అందుకే ఆయన వచ్చి కూర్చుంటే అరునాచలములొ ప్లేగు వ్యాది వచ్చి శవాలు పట్టుకొచ్చి పీక్కు తింటున్నటువంటి పులులు ,రమణ మహర్షిని చూసేటప్పటికి రెండు కాళ్ళు చాపి ,నమస్కారము చేసి కూర్చుని ఆయన్ని అలా చూస్తూ వేల్లిపోయేవి ,బ్రహ్మ తేజస్సు అంటే అటువంటిది ,ఒక కుచేలుడు బ్రహ్మ వేత్త ,రమణులు బ్రహ్మవేత్త ,సాయి బాబా గారు బ్రహ్మవేత్త అలాంటి మహా పురుషులు గురుంచి తెలియాలి అంటే ,వారితో సమకాలినుడిగా ఉంటూ ,అంటే ఆ కాలమునందు ఉండడం వాళ్ళ అదృష్టం ,వాళ్ళది రాసి ఉండడం ,మనకి చేసిన మహోపకారం ,అటువంటి మహోపకారం చేసినటువంటి వాళ్ళకు మనం ఏమి ఇవ్వలేం ,మనమేలాగు కృతజ్ఞత చెప్పలేము ,కనిసములొ కనీసం మనం చేయగలిగినది ఏమిటంటే అంత గొప్ప గ్రంధాలు ఇచ్చినందుకు వారికొక నమస్కారము చెయ్యాలి .
share it ..
నివేదన , నైవేద్యము భేదం :
నివేదన అన్న మాట పర్యాయ పదమే నైవేద్యము ,సాధారణముగా మనము నైవేద్యము అనేటువంటిది చెయ్యకుండా ఉండం ,ఎందుకంటే పంచ ఉపచారములు తప్పకుండా ఇంట్లో జరగాలి ,గంధ ,పుష్ప ,ధూప ,దీప ,నైవేద్యములు ఈ ఐదు జరగకపోతే అది క్రుతగ్నతతో లేని గృహముగా గుర్తిస్తారు ,ఈ ఐదు జరగాలి . ఇంట్లో గంధము ఈశ్వరుడికి అలంకరించాలి ,పుష్ప పువ్వు వెయ్యాలి ,పువ్వు లేకపోతే అక్షిత అన్నా వెయ్యాలి ,ధూప ఈశ్వరుడికి ధూపము వెయ్యాలి ,దీప ,దీపము పెట్టాలి ,నైవేద్య ,నైవేద్యము పెట్టాలి . ఇవి ఎందుకు చేస్తున్నావు ఆయనే మనలని నిలబెడుతున్నాడన్న సాత్వికమైన బుద్దితో పూజ చేసావు ,ఆయనే మనలని కాపాడుతున్నాడు ,మన ఇంద్రియాలికి శక్తిని ఇస్తున్నాడు ,సత్వ గుణముతో చేస్తున్నాడు కాబట్టి సాత్విక పదార్దముతో నైవేద్యం చేస్తారు ,మధుర పదార్దాలు ,పళ్ళు ఇటువంటివి నైవేద్యం పెడతారు . నైవేద్యము అన్న మాట ,నివేదన అన్న మాట కేవలం పూజలో ఒక భాగముగ మాత్రమే కాదు ,అది ఎక్కడికి వెళ్ళాలి అంటే జీవితమే నివేదనగా మారిపోవాలి ,ఎలా నివేదన అంటే మీకు గురువుగారు ఒక మాట చెప్తారు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఒక విగ్రహం దగ్గర కూర్చున్నామన్న భావన కాదు ,భగవంతుడు విగ్రహముగా ఉన్నాడు అని గుర్తించాలి . వాడు పిల్లవాడు కాదు ,నా మనమడు పిల్లవాడిగా ఉన్నాడు ,అప్పుడు కదా ప్రేమ ,విగ్రహము కాదు పరమేశ్వరుడు అలా ఉన్నాడు ,ఆ రూపములో అక్కడ కూర్చున్నాడు ,ఇప్పుడు నివేదన అంటే నా కష్టం ,నా సుఖం ,నా భావాలు అన్ని కూడా ఆయనతో చెప్పుకోవాలి అందుకే నివేదన రెండు కింద వెళిపోతుంది జీవితములో ,ఒకటి నాకు తోడ్పడమని అడుగుతూ ఉంటాడు ,ఈశ్వర నేను సాత్వికముగా ప్రవర్తిన్చాలనుకుంటున్నాను ,భక్తితో ఉండాలని ఉంది ,ఎప్పుడు ఎవరి జోలికి వెళ్ళకూడదు ,గురువుగారు చెప్పిన మంచి మాటలు ,గురువుగారు మంచి మాటలే చెబుతారు ,గురువు గారు చెప్పిన మాటలు జీవితములో అనుష్టాన పర్యన్తములోకి తెచ్చుకోవాలి కోరికుంది కాని మనసు అటూ ,ఇటూ లాగేస్తుంది ,స్వార్ధం వైపుకి లాగేస్తుంది కాబట్టి మీరు నా మనసు నిలకడగా నిలబడేటట్టు నేను ధార్మికముగా బ్రతికేటట్టు నన్ను అనుగ్రహించండి ,ఇప్పుడు తినమని ఆపిల్ పండు ఒకటే పెట్టాడ తన కష్ట సుఖాలు ఈశ్వరునితో చెప్పుకున్నాడ , చెప్పుకున్నాడు అది నివేదన ,అలా చెప్పుకోవడము ఒకటి ఒచ్చింది అనుకోండి అనుబంధం ఒకటి ఏర్పడుతుంది మీకు ,కాకినాడ పట్టనములోనే చలపతి రావు గారు అని ఒక ఆయన ఉన్నారు ,కాకినాడ సస్తంగం లో ,ఆయన ఎప్పుడైనా పండగ వచ్చిందనుకోండి బట్టలు కొనడానికి వెళ్తాడు ,బట్టలు కొనడానికి వెళ్తే ఆయన , ఆయన ,ఆయన భార్య ,ఆయన కూతుళ్ళు ,ఆయన అల్లుళ్ళు ,ఆయన మనవలు తో బాటు ఒక పంచ ,ఒక చీర కొంటాడు ,ఒక సారి మనవి చేసారు , అవి స్వామికి మన ఇంట్లో సింహసనములో ఉన్నారు కదండీ ,పండగ ఆయనికి కూడా కదా ,ముందు ఆయనికి కొన్నానండి ,పెద్దాయన కదా ,తల్లి ,తండ్రి కదండీ ,ఆయనికి పెట్టి ,అయన కట్టుకుంటాడు ,మేము కట్టుకుంటాము అన్నాడు .
భావన మాత్ర సంతుష్టాయే నమోనమః !!
ఆయన నమ్మాడు ఉన్నాడు మా ఇంట్లో అని ,లక్ష్మీ నారాయణులు అనండి ,పార్వతీ పరమేశ్వరులు అనండి మా ఇంట్లో ఉన్నారు సింహసనములో వాళ్ళు కూర్చుంటారు ఎప్పుడు నా యోగ క్షేమాలు చూస్తారు ఎప్పుడును ,వాళ్ళకు కొనద్దు బట్టలు అందుకని ముందు కొన్నాడు ,వాళ్ళ ఇద్దరికీ బట్టలు కొని ,అందరికి వాళ్ళ కుటుంబ సభ్యుల బట్టల చూపిస్తూ ,ఇవీ చూపిస్తుంటాడు . పండగొస్తే స్నానం చేసి ముందు వాళ్ళ ఇద్దరి దగ్గర పెడతాడు ,ఇద్దరు కట్టుకోండి అంటాడు . వాళ్ళు ఇద్దరు కట్టుకుంటే ఎలా ఉందో మనసుతో భావన చేసి ,చూసి పొంగిపోతాడు ,హా అమ్మా బలే ఉందమ్మా ఈ ఆకుపచ్చ పట్టుచీర నీకు ,స్వామి తెల్ల పంచ చాలా బాగుంది ,ఆ పాదాలకి నమస్కారములు చేస్తారు . ఇప్పుడు అక్కడ పెట్టిన బట్టలు ఈశ్వరుడి గా కట్టుకోమని ఒక బ్రాహ్మణునికి ఇచ్చేస్తాడు . ఆయనికి ఒక కష్టం వచ్చిందనుకోండి పూజ గదిలోకి వెళ్లి స్వామి ఏమిటో ఇలా ఇబ్బంది వచ్చింది ,చాల మనక్లేశ్యం పడుతున్నానండి అని చెప్తాడు . ఆయనకో సుఖం వచ్చిందనుకోండి కొడుకు ఎంసెట్ పరీక్షకి వెళ్తుంటే కాపాడమని దండం పెట్టి ,కొడుక్కి మంచి రాంక్ వస్తే మాత్రం భావమరిది కి ఫోన్ చేయడు ,మల్లీ మంచి రాంక్ వచ్చిందని ముందు వెళ్లి పరమేశ్వరునికే చెప్తాడు ,స్వామి వెళ్ళే ముందు మిమ్మల్ని అడిగాను కదా ఎంత అనుఘ్రహించారు ,మంచి రాంక్ వచ్చింది స్వామి కృతజ్నుడుని ,నా బిడ్డని అలాగే కాపాడండి అని నమస్కారము పెడతాడు తప్ప ,వెళ్ళే ముందు ఈశ్వరుడు ,ర్యాంకు వచ్చినపుడు భావుమరిది ఏమి భక్తి అది . నివేదన అంటే వాడు ముందు గుర్తుకు వచ్చుట ,కష్టం నందు, సుఖము నందు కూడా ,అన్ని ఆయనతో పంచుకోవడము అలవాటు అయిపొయింది , అప్పుడు ఏమవుతుంది . భక్తీ పూజ గదికి పరిమితం కాదు ,విశ్వవ్యాప్తమైంది ,నీకు అంతటా భగవంతుడే ఉన్నాడు ,ఒక వేల అది జరుగలేదు ,నువ్వు అనుకున్న పని అవలేదు ,ఇప్పుడు బెంగ పెట్టుకోడు ,ఈశ్వర ఎందుకలాచేసావో ,అది జరిగితే ఏదో ప్రమాదం ఉండేదన్నమాట ,జరగకుండా చేసావు ధన్యుడిని , ఒక ఉదాహరణ ,ఒకప్పుడు తెలిసిన వాళ్ళు అందరు ఒక పెళ్ళికి వెళ్లారు ,ఒక ఆయన మాత్రం ఏవండి ఆయన చాల తెలుసున్నాయన అండి కానీ పెళ్ళికి భోజనానికి వెల్లలేకపోతున్ననండి ,పొద్దునే వెళ్ళి ఏదో ఒకసారి అభినందిచేసి కానుకిచ్చేసాను ,చాల తెలుసున్నాయన కానీ ఏమ్చేస్తానండి చాలా అకస్మాత్తు ప్రయాణము వచ్చింది ,సాయంకాలము వెళ్ళాలి ,పెళ్ళికి వెళ్ళలేక పోతున్నాను అని బెంగ పెట్టుకుని వెళ్ళిపోయాడు . ఈ పెళ్ళికి వెళ్ళిన వాళ్ళు అందరూ భోజనము చేసారు ,అందులో ఎలా కలిసిపాయినదో ,ఆహారములో విషము కలిసి పోయింది ,వీళ్ళందరినీ hospitalize చేసేసారు ,కన్యాదాతలుతో కలిపి ,మగ పెళ్లి వారితో కలిపి , ఈయన ఒక్కడు రైలేక్కిపోయాడు కాబట్టి బ్రతికిపోయాడు . ఆ అన్నం తినకముందు అన్నాడు ,తినలేక పోతున్నానండి ,పెళ్లి భోజనానికి వెళ్ళటము లేదు ,పెళ్ళికి ఉండడం లేదు అన్నాడు ,ఇది ఫోన్ లో విని అన్నాడు ఈశ్వరుడు నాకు ఎంతటి అదృష్టం ఇచ్చావు , రైలు ఏ పదింటికో అయితే అక్కడే పడిపోతే ఎంత ముఖ్యమైన పనిమీద వెల్లాల్లండి , ఏమైపోవును నా జీవితం అన్నాడు . అది జరగనప్పుడు నీకు తెలియలేదు ,ఎందుకు జరగలేదో కానీ ఆ జరగకుండా ఉన్నది ,ఎందుకు జరగలేదో తెలిసినప్పుడు మాత్రం నమస్కారము చేస్తావు . అన్ని వేళలా తెలియాలని ఏమి నియమము లేదు . అన్ని వేళలా తెలియక్కరలేదు . ఈశ్వరుడు వైద్యుడు లాంటి వాడు మనము జబ్బు ఒకటే చెప్తాం . డాక్టర్ గారు ఇంత మందిస్తాడు ,మూడు పూటలా వేసుకోండి అంటాడు . నా లోపల ఏ సూక్ష్మజీవులు ఉన్నవి ,ఏవి చేయుచున్నవి ,ఎందువలన జబ్బు వచ్చినది ,ఇందులో ఏమున్నది ,అవి లోపలికి వెళ్లి ఎట్లు పోరాడును ,ఎట్లు చంపును ,చెప్తే వేసుకుంటాను అంటే ఛి అవతలపో అంటాడు . ఆయన చెప్పాడు నువ్వు వేసుకో ,ఎందుకంటే ఈశ్వరుడు .
వైద్యో నారాయణో హరిహి !!
భగవంతుడు కూడా అంతే ఆయనని నమ్ము ,నువ్వు ఉపద్రవాలలో పడిపోకుండా ఆయన చూసుకుంటాడు . ఒక వేల నీకేదో కష్టం వచ్చింది వెనక ఏదో ఉంది ,ఈశ్వరుడి యొక్క ఆలోచన ,ఏదో కారణం లేకుండా ఆయన ఏది చెయ్యడు . కాబట్టి అందులో కూడా నీపట్ల ఏదో అనుగ్రహం ఉందని ఎప్పుడో చూపిస్తాడు ,అప్పుడు నువ్వు సంతోషిస్తావ్ ,తొందరపడి ఈశ్వరుని నింద చేయకూడదు . నివేదన ,పట్టికెళ్ళి అరటిపండి ,ఆపిల్ పండు పెట్టడముతో సరిపోదు ,ఎప్పుడు వాడు నా ప్రక్కన ఉన్నాడు అనుకుని ,వాడితో చెప్తుండడం అందుకే ,సఖ్య భక్తి అని నవవిధ భక్త్తుల్లో ఒకటి ఉంది ,సఖ్య భక్తి అంటే ఏమ్చేస్తం పక్కనే నాతో ఉంటాడు ఎప్పుడు ఒక ఆయన ,గోపాలకృష్ణ గారు ఉన్నారు ఎప్పుడు గురువు గారితో ఉంటారు . గురువు గారు విమానం ఎక్కుతున్నారు ,ఆయన ఎక్కుతారు ,రండి గోపాలకృష్ణ ,స్నేహితుడు పట్ల ప్రవర్తించినట్టు ప్రవర్తించడం , ఇరువరి అనుభందం వేరు కానీ ,స్నేహితుడికి ఉదాహరణగా చెప్తున్నారు ,అలా భగవంతుడితో స్వామి ఆఫీసు కి వెళ్దాం బయలుదేల్తారా ,ఆయన వస్తాడు ,కూర్చోండి ,ఆయన కూర్చుంటాడు ,అయ్యా మీ అనుగ్రహం పని మొదలు పెడుతున్నాను ,భోజనానికి వెళ్దాం బయలుదేల్తారా ,మహా నైవేద్యం స్వామి మీ అనుగ్రహం లేకపోతె ఇది ఎక్కడ నుంచి వస్తుంది నాకు తినడానికి , ఆయనికి ఏదైనా ఆయనికి చెప్తున్నావు ,మనసులో అది ,పైకి అంటే కానీ ఏదో అస్తమాను పైకి మాట్లాడుకుంటే బాగుండదు . లోపల ప్రతిదానికి ఈశ్వరుడు తో సమన్వయము అవుతావు ,ఆకరున ఊపిరి అందదు ,అయిపొయింది ఎనబై యెల్లో ,తొంబై ఎల్లో అయిపోయాయి ,ఊపిరి అందట్లే ఎవరికీ చెప్పుకోవాలి ,అలవాటు అయిపోయింది ,స్వామి ఏమిటో చాల బాధగా ఉంది ఊపిరి అందడం లేదు ,చమటలు పట్టేస్తున్నాయి ,బెంగ పెట్టుకోకురా నేనున్నానురా అని కనపడుతాడు ఆయన ,అనుగ్రహిస్తాడు ,తేలికగా వదిలేస్తాడు . అస్తమానం ఆయన్నే పట్టుకోవడం అలవాటు అయిన వాడికి చిట్ట చివర ఎవరిని పట్టుకుంటాడు ఆయన్నే పట్టుకుంటాడు . పట్టుకుంటే ఏమవుతుంది ఆయనలోనే కలిసిపోతాడు . కాబట్టి నివేదన కేవలం ఒక పదార్దం పెట్టడం కాదు ,నివేదన జీవితములో అన్ని విషయములందు విస్తరించాలి . చిట్టచివరికి జీవితమే నివేదన ,వాడి జీవితం అంతా ఈశ్వరుని తో సమన్వయము ,ఇది ఎందుకు చేయవయ ,ఆయన ఉన్నాడండి ,ఆయన చూస్తాడు ,ఎందుకండి నాకా తప్పు నేను చేయను ,ఇది ఎందుకు చేస్తావయ అలాగా ,చేదస్తం కాదండి ఆయన చేయమన్నాడు ,ఆయన చేయమన్నది నేను చేస్తా ,ఇప్పుడు నీకు ఈశ్వర ప్రోక్తము ,విహితం ఈశ్వరుడు చెప్పనిది నిషిద్దము ,ఇదే ధర్మము . కాబట్టి ఇప్పుడు నివేదన కేవలము ఒక పదార్ధము పెట్టడము కాదు . నివేదన జీవితము నందు విస్తరించవలసినటువంటి విషయము.
share it ur fb friends

పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలి :

పుట్టిన రోజును ఎలా జరుపుకోవాలి :
తప్పకుండా గుర్తుపెట్టుకిని తాను జరుపుకోవల్సినవి కొన్ని ఉంటాయి అందులో పుట్టినరోజు ఒకటి . నేను నా పుట్టినరోజు చేసుకోనండి అనకూడదు . తన పుట్టిన రోజు తాను చక్కగా జరుపుకోవాలి ,అలా జరుపుకోడానికి శాస్త్రం ఒక విదిని నిర్ణయించింది . పుట్టినరోజును ఎలా పడితే అలా జరుపుకోకూడదు . పుట్టినరోజు జరుపుకునేటతువంటి వ్యక్తి ఆరోజు తెల్లవారుజామున లేచి అభ్యంగన స్నానం చేయాలి , అంటే ఒంటికి నూనె రాసుకుంటే అలక్ష్మి పోతుంది ఆ నూనె అలదుకుని తల స్నానం చేస్తారు . చేసే ముందు పెద్దవాళ్ళు తల మీద చేయి పెట్టి ఆశీర్వాదం చేసి వెన్నుపాము నిమరడం ఆచారముగా వస్తుంది . ఆ స్నానం చేసిన తర్వాత ఇష్ట దేవతని ఆరాధన చేయాలి ,ఇంట్లో కుల దైవం ,ఇష్ట దైవం ఉంటారు . ఆ కుల దైవాన్ని ,ఇష్ట దైవాన్ని ఆరాదన చేయాలి . చేసిన తర్వాత ఆవు పాలలో బెల్లం ముక్క ,నల్ల నువ్వులు ఈ మూడు కలిపినటువంటి పదార్ధాన్ని మౌనముగ తూర్పు దిక్కుకు తిరిగి కూర్చుని మూడు మార్లు చేతిలో ఆచమనం చేస్తే ఎలా తింటామో అలా మూడు మార్లు తీసుకుని లోపలికి పుచ్చుకోవాలి , ఎందుచేత అంటే నల్ల నువ్వులు ,బెల్లం ,ఆవు పాలు కలిసినటువంటి పదార్దాన్ని మూడు మార్లు పుచ్చుకుంటే వచ్చే పుట్టినరోజు కు ఏదైనా గండ కాలం ఉంటె తొలగిపోతుంది . కాబట్టి ఈ మూడు పదార్దములు కలిసినటువంటి దానిని చేతిలో వేసుకుని మూడు మార్లు పుచ్చుకోవాలి . పుచ్చుకున్న తర్వాత ఏడుగురు చిరంజీవులు ఉంటారు అంటే వారు పుట్టుక చేతనే చిరంజీవత్వాన్ని పొందారు . ఇంక కొంత మంది చిరంజీవత్వాన్ని సాదించుకున్నవాళ్ళు ఉన్నారు . సాదించుకున్నవాళ్ళు కాదు పుట్టకతో చిరంజీవులు అయిన వారు అశ్వర్దమా ,బలి ,వ్యాసుడు ,హనుమంతుడు ,విభీషణుడు ,కృపాచార్యుడు ,పరశురాముడు వీరు ఏడుగురు కూడా పుట్టుకతో చిరంజీవులు ,ఈ ఏడుగురు పేర్లు మనసులోనన్న స్మరించాలి ,పైకన్న చెప్పాలి ,ఆ రోజున తల్లిదండ్రులకి ,గురువు గారికి తప్పకుండ నమస్కారం చేసి ,వాళ్ళ ఆశీర్వచనం అందుకోవాలి . మీ ఇంటికి దగ్గరలో ఏ దేవాలయం ఉందో ఆ దేవాలయాన్ని దర్శనం చేయాలి ,చక్కగా ముష్నన్న భోజనము చేయొచ్చు ,రాత్రి మాత్రం బ్రహ్మచర్యాన్ని పాటించాలి పుట్టినరోజుని . పుట్టినరోజున బ్రహ్మచర్య దీక్షకి విరుద్దమైన సంసారికమైన కార్యక్రమాలని నిర్వహించకూడదు అలా ఉంటె ఆ రోజుని పుట్టినరోజుని సక్రమముగా చేసుకున్నాడు అని చెప్తారు . తన శక్తి కొలది దాన ధర్మాలు నిర్వహించాలి . తనకి ఐశ్వర్యం ఉందా దానం చేస్తాడు . తనకి ఐశ్వర్యం లేదు గో గ్రాసం అంటారు , చేతి నిండా కసన్ని పచ్చగడ్డి పట్టుకుని ఒక ఆవుకి తినిపించి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తే చాలు ,ఇవి పుట్టిన రోజు నాడు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుని చేయవల్సినవంటి పనులు ,వీటికి విరుద్ధముగా పుట్టిన రోజులు మాత్రం చేసుకోవద్దు . అది కేవలం ఏదో సరదా కోసం ,వినోదం కోసం చేసుకునేది కాదు ,అది ఆయుర్దాయ సంబందమైనటువంటిది . ఆ రోజు దీపం చాల ప్రదానం పొరపాటున కూడా అక్కరలేని విషయాలు పిల్లలకి నేర్పితే అవే విశుమ్కత్వాన్ని పొందుతాయి రేపోద్దిన ,ఎన్నో ఏడు పుట్టిన రోజు చేసుకుంటున్నాడో అన్ని కొవ్వుత్తులు ,దీపాలు వెలిగించడం ఉఉప్ అని ఉదుతు దీపాలు అర్పేయడం పరమ అమంగాలమైనటువంటి విషయం ,దీపాలు ఆర్పి చేతితో కత్తి పట్టుకుని ఏదో నిన్న రాత్రో ,మొన్న రాత్రో తయారు చేసిన ఒక పదార్దం , ఎవరు చేసిన ఆశీర్వాదం అర్ధం కాదు రంగురంగులుగా రాసిన హ్యాపీ birthday ,అర్ధం లేకుండా అందరు చేస్తున్న తప్పట్లు ,వీటి మద్యలో కత్తితో కోసి నిర్లజ్జగా భార్య నోటిలో సబాముఖంగా పెట్టడం ,ఇలాంటి పిచ్చ పనులు చేయమని శాస్త్రములో లేదు . దీపాన్ని గౌరవించు ,దీపాన్ని వెలిగించు ,దీపం దగ్గర మట్టు మీద ఒక అక్షితో ,పువ్వో వేసి నమస్కారం చేయి . అది నీ ఇంట కాంతి నింపుతుంది . నీ జీవితాన్ని నిలబెడుతుంది .. గురువు గారికి నమస్కారం చేయి ,తల్లిదండ్రులకి నమస్కారం చేయి ,పెద్దలికి నమస్కారం చెయి వాళ్ళ నోటితో వాళ్ళు ఆశీర్వదించాలి "శతమానం భవతి శతాయు; పురుషహ శతెన్ద్రియహ అయూశెవెన్ద్రియె ప్రతితిష్టతి . "చక్కగా అలా దేవాలయానికి వెళ్లి నీ పేరు మీద పూజ చేయించు ,ఈశ్వరుడి అర్చన చేయి ,అపముత్య దోషం కబలించకుండా ఉండడానికి ఆవు పాలు ,నువ్వులు ,బెల్లం కలిపిన పదార్దాన్ని మూరు మాట్లు స్వీకరించు ,సప్త చిరంజీవుల పేర్లు మనసులో స్మరించడం లేదా పైకి చెప్పడం ,ఒక వేల నీకు చేతకాకపోతే కనీసం అది గుర్తున్న వాళ్లతో సంప్రదించి ,లేదా కనీసం వ్రాసుకో అక్కర్లేని విషయాలు ఎన్నో వ్రాసుకున్నావు , వ్రాసుకుని జ్ఞాపకం పెట్టుకుని నీ పుట్టిన రోజు నాడు ,ఇంట్లో వాళ్ళ పుట్టిన రోజు నాడు ఆ ఏడుగురు పేర్లు చెప్పు . అది పుట్టిన రోజు చేసుకునేటటువంటి విదానం .
   share ur fb friends..
విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || ౧ ||
కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౨ ||
భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || ౩ ||
భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || ౪ ||
సుకృతేzధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౫ ||
జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || ౬ ||
గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోzపి సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || ౭ ||
విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || ౮


పలికెడది బాగవతమట, పలికెంచెడు వాడు రామబద్రుండట ,నే పలికిన బవహరమగునట, పలికెద వేరొండు గద పలుకగనేల ..

meaning:
పలుకునది భాగవతం అట,పలికేంచేడి వాడు రాముడు అట, నేను పలికినట్లయిన సంసార భందనములు తొలగుట అవుతుందట, అందుకే పలుకుదును ఇంకొక కద పలకడం ఎందులకు ?

పోతన గారిచే రచించబడిన బాగవతము లోని ఈ మొట్ట మొదటి పద్యము అందరి తెలుగు వారికి చాలా ఇష్టమైన పద్యం .

 share fb friends


భోజనం చేసిన తర్వాత ఇవి చేయకండి

1) DON’T SMOKE:
ధూమపానము చేయరాదు.
********************
భోజనము చేసినతరువాత ఒక cigarette
కాల్చితే పది cigarettesకు సమానము అని
చెబుతున్నారు. కాన్సెర్ వచ్చే అవకాశాలు కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయట.
2) DON’T EAT FRUITS:
పళ్ళు తినకూడదు.
**************
భోజనము చేసిన వెను వెంటనే
పళ్ళు తినడం వలన కడుపు మొత్తం గాలితో
నిండిపోతుంది. అందుకే పళ్ళు తినాలనుకునేవారు రెండు గంటలు ముందు కానీ
తరువాతగాని తింటే మంచిది.
3) DON’T DRINK TEA:
టీ తాగకూడదు.
*******************
టీవలన పెద్దమొత్తంలో ఆసిడ్ విడుదల చేసి ఆహరం జీర్ణం అవ్వడం కష్టంఅవుతుంది.
4) DON’T LOOSEN YOUR BELT:
బెల్టు లూస్ చేయకూడదు(పెట్టుకునే వారు)
*******************************
దీనివల లోపల ఎక్కడన్నా ఇరుక్కున్న
ఆహరం సరిగ్గా జీర్ణం కాదు.
5) DON’T BATH:
స్నానం చేయకూడదు.
*****************
భోజనం చేసినవెంటనే స్నానం చేస్తే రక్తం అంతా చేతులకి కళ్ళకి మొత్తం ఒంటికి
పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల
జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది.
6) DON’T SLEEP:
నిద్ర పోకూడదు.
*************
భోజనం చేసిన వెంటనే పడుకుంటే
ఆహరం సరిగ్గా జీర్ణం అవ్వక gastric & infection వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా సరే నిద్ర వస్తుంది. తప్పకుండా పడుకోవాలి అంటే ఒక పదిహేను నుండి ఇరవైనిముషాలు కంటే ఎక్కువగా
పడుకోకుండా ఉంటె మీ ఆరోగ్యానికి మంచిది
అంటున్నారు డాక్టర్లు.

బ్రహ్మ తలల వెనక ఉన్న ఆసక్తికర కథ ఏంటి ?

బ్రహ్మ హిందువుల దేవుడు. త్రిమూర్తులలో ఒకరు. విష్ణు, శివుడు, బ్రహ్మ.. ఈ ముగ్గురిని త్రిమూర్తులు అని పిలుస్తారు. బ్రహ్మ సృష్టికర్త కూడా. బ్రహ్మ పురాణం ప్రకారం మను తండ్రి బ్రహ్మ. మను అంటే.. మనుల వారసులుగా మనుషులు పుట్టారని తెలుస్తోంది. బ్రహ్మదేవుడికి ముగ్గురు భార్యలు ఉన్నట్టు చెబుతారు. సరస్వతి, సావిత్రి, గాయత్రి. ఈ ముగ్గురు భార్యలనూ.. వేదమాతలుగా గౌరవిస్తారు. వేదమాత అంటే.. వేదాలకు తల్లి అని అర్థం. బ్రహ్మదేవుడిని ప్రజాపతి, వేద దేవుడు అని పిలుస్తారు.
ఈ విశ్వ సృష్టికర్తగా బ్రహ్మను పేర్కొంటారు. నాలుగు తలలు కలిగి దేవుడిగా బ్రహ్మను చెబుతారు. కానీ.. వాస్తవానికి బ్రహ్మకు ఐదు తలలు ఉండేవని బ్రహ్మ పురాణం చెబుతోంది. ఈ కథ ప్రకారం.. విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో బ్రహ్మ ఒక తలని కోల్పోయాడని తెలుస్తంది. అసలు బ్రహ్మకు ఎన్ని తలలు ? బ్రహ్మ తలల వెనక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐదు తలలు
నాలుగు తలలతో కనిపించే బ్రహ్మకు వాస్తవానికి ఉండేది ఐదు తలలట.
శతరూప
బ్రహ్మ పురాణం ప్రకారం విశ్వాన్ని సృష్టిస్తున్న సమయంలో.. శతరూప అనే దేవతను సృష్టించి.. ఆమెపై తీవ్ర మోహాన్ని పెంచుకున్నారు బ్రహ్మ.
ఒక్కోవైపు ఒక్కో తల
బ్రహ్మను వ్యతిరేకిస్తూ.. శతరూప అన్ని వైపులకూ పరుగుపెట్టింది. అలా ఆమె వెనక పరుగెత్తే సమయంలో బ్రహ్మ ఒక్కో వైపు ఒక్కో తల ఏర్పరచుకున్నాడు.
తల నరకడం
అదే సమయంలో బ్రహ్మను కంట్రోల్ చేసే యత్నంలో శిశుడు బ్రహ్మకు చెందిన పై తలను నరికేశాడు.
బ్రహ్మ కూతురుగా
అంతేకాదు శివుడు శతరూపను బ్రహ్మ కూతురిగా భావించాడు. తన ద్వారా రూపొందిన ఆమె బ్రహ్మకు కూతురవుతుందని భావించాడు. అందుకే ఆమెతో అలా ప్రవర్తించడం సరికాదని… నిర్ణయించుకుని.. తల నరికేశాడు.
బ్రహ్మకు పూజలు లేవు
బ్రహ్మ తలను నరికేసిన తర్వాత బ్రహ్మను ఏ దేవాలయాల్లోనూ పూజించకూడదని.. శివుడు సూచించాడు.
శివ, వైష్ణవాలయాలు
అందుకే కేవలం శివుడు, విష్ణువులను మాత్రమే పూజిస్తున్నాం. దాదాపు బ్రహ్మను పూజించడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అలాగే శివాలయాలు, వైష్ణవాలయాలు ఉన్నాయి కానీ.. బ్రహ్మకు ఆలయం లేదు.
ఎవరు గొప్ప మరో కథనం ప్రకారం బ్రహ్మ, విష్ణువు తమలో ఎవరు గొప్పవాళ్లని ఒకరికొకరు వాదించుకుంటున్న సమయంలో.. శివుడు బ్రహ్మ తల నరికేసినట్టు తెలుస్తోంది.
శివుడి చేతిలో బ్రహ్మ పుర్రె
సాధారణంగా శివుడి ఫోటోలలో ఆయన చేతిలో పట్టుకుని వెళ్లే పుర్రె బ్రహ్మ ఐదో తల అని చెబుతారు.
నీళ్లు తాగడానికి
అంతేకాదు కొన్ని సందర్భాల్లో శివుడు పుర్రెను నీళ్లు తాగడానికి ఉపయోగిస్తాడట. అలాగే పుర్రెలతో తయారు చేసిన మాల ధరిస్తాడట. ఆ పుర్రెనే శివుడు నరికిన బ్రహ్మ తలగా వివరిస్తారు.

శ్రీ శివ రక్షా స్తోత్రం

శ్రీ శివ రక్షా స్తోత్రం
అస్య శ్రీ శివరక్షాస్తోత్రమంత్రస్య యాజ్ఞవల్క్య ఋషిః | శ్రీ సదాశివో దేవతా | అనుష్టుప్ ఛందః | శ్రీ సదాశివప్రీత్యర్థం శివరక్షాస్తోత్రజపే వినియోగః ||
చరితం దేవదేవస్య మహాదేవస్య పావనమ్ |
అపారం పరమోదారం చతుర్వర్గస్య సాధనమ్ || ౧ ||
గౌరీవినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్ |
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః || ౨ ||
గంగాధరః శిరః పాతు భాలం అర్ధేన్దుశేఖరః |
నయనే మదనధ్వంసీ కర్ణో సర్పవిభూషణః || ౩ ||
ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః |
జిహ్వాం వాగీశ్వరః పాతు కంధరం శితికంధరః || ౪ ||
శ్రీకంఠః పాతు మే కంఠం స్కంధౌ విశ్వధురన్ధరః |
భుజౌ భూభారసంహర్తా కరౌ పాతు పినాకధృక్ || ౫ ||
హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః |
నాభిం మృత్యుంజయః పాతు కటీ వ్యాఘ్రాజినాంబరః || ౬ ||
సక్థినీ పాతు దీనార్తశరణాగతవత్సలః |
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః || ౭ ||
జంఘే పాతు జగత్కర్తా గుల్ఫౌ పాతు గణాధిపః |
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః || ౮ ||
ఏతాం శివబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స భుక్త్వా సకలాన్కామాన్ శివసాయుజ్యమాప్నుయాత్ || ౯ ||
గ్రహభూతపిశాచాద్యాః త్రైలోక్యే విచరంతి యే |
దూరాదాశు పలాయంతే శివనామాభిరక్షణాత్ || ౧౦ ||
అభయంకరనామేదం కవచం పార్వతీపతేః |
భక్త్యా బిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్ || ౧౧ ||
ఇమాం నారాయణః స్వప్నే శివరక్షాం యథాఽదిశత్ |
ప్రాతరుత్థాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాలిఖత్ || ౧౨ ||
ఇతి శ్రీయాజ్ఞవల్క్యప్రోక్తం శివరక్షాస్తోత్రం సంపూర్ణం