cricket ad

Wednesday 30 November 2016

మహానంది శైవ క్షేత్రము ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మరియు ఒక మండలము. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.
ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.
కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.
Share it

అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత

అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. దాని ఉపాసనచేత యోగస్థితిని పొందిన ఈమె మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది.
కౌశిక పత్ని సుమతి తన పతి శాపాన్ని పునస్కరించుకొని సూర్యోదయాన్ని అపేసింది. అనసూయ పదిరోజులను ఒకరోజుగా చేసి సూర్యుడుదయించేటట్లు చేసింది. మరణించిన సుమతి భర్తను మరల బ్రతికించింది. నారదుని కోరికపై గులకరాళ్ళను గుగ్గిళ్ళుగా మార్చి ఆయన ఆకలిని తీర్చింది. లోకమాతలైన లక్ష్మీపార్వతీసరస్వతులను గెలిచింది. శ్రీరాముడు అరణ్యవాసకాలంలో సీతతో ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈమె సీతకు పతివ్రతాధర్మాలను ఉపదేశించింది. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.
ఇంకా లలిత పరా భట్టారిక స్తాయికి అనసూయమ్మ ఎలా అయ్యిందో..
అందరికీ ధ్యానయోగ్యమైన మూర్తులు :
అత్యంత శ్రేయదాయకమైనది దక్షిణామూర్తి స్వరూపం . కృష్ణ బగవానుడు గొప్పగా ధ్యానానికి యోగ్యమైన మూర్తి, కానీ గృహస్తు దానిని ధ్యానం చేస్తే కాళ్ళ దగ్గర ఆవు దూడ ఉన్నటువంటి మూర్తినే ధ్యానం చెయ్యాలి అనే ఒక నియమాన్ని పెద్దలు చెప్తారు . దక్షిణామూర్తి అనుకోండి విధ్యార్ది ధ్యానం చేస్తే అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ,తేజస్సు ,ఆరోగ్యం కలుగుతాయి . గృహస్తు ధ్యానం చేస్తే సమస్తమైన ఐశ్వర్యం కలుగుతుంది ,ధర్మము నందు అనురక్తి కలుగుతుంది వానప్రస్తుకి వైరాగ్యం బాగా పెరుగుతుంది . సన్యాసి కి ధ్యానం నిలబడుతుంది . ఎవరికి ఏది కావాలో దానిని అది అనుగ్రహిస్తుంది . అందరికి ఒకలా కాదు . ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వగలదు పైగా పరమ మంగళ మూర్తి , దక్షిణామూర్తి ని చూడడమే ఎంతో ఆనందముగా ఉంటుంది అసలు ఆ వీరాసనములో కూర్చుని ఒక కాలు క్రింద పెట్టి ఆ కాలు కింద ఉన్నటువంటి మాయ రాక్షసులు కూడా తలెత్తి నవ్వుతుంటాడు ఆ రెండవ కాలు తీసుకువచ్చి కింద పెట్టినటువంటి కాలు యొక్క తొడ మీద వేసుకుని నాలుగు చేతులతో ఉంటాడు చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ పెద్దా వట వృక్షం కింద కూర్చుని ఉంటాడు ఆ ధ్యానం చేసేటప్పుడు చాలా తేలికగా మీరు ఆయన దగ్గరికి వెళ్లినట్టు మీరు మోకాళ్ళ మీద వంగినట్టు మీ తల తీసుకునివెళ్ళి కింద పెట్టినటువంటి పాదం మీద మోపినట్టు ఆయన బొటన వ్రేలు దాని ప్రక్కన పాదము యొక్క తలము మెత్తగా మీ తలకి తగిలినట్టు మీరు లేచి ఆయన పాదం పట్టుకున్నట్టు ,ఆయన పాదాన్ని నిమిరినట్టు ,ఆయన కాలు వొత్తుతున్నట్టు ,మీరు నీరాజనం ఇచ్చినపుడు ఆ చేతులు ,ఆ చేతులో ఉండేటటువంటి ఆయుధములు ,కిరీటము, ఆయన తొడ మీద వేసుకున్నటువంటి ఎర్రటి పాదం దాని యొక్క వేళ్ళు ,గోళ్ళు అన్ని కనపడుతుండగా మీరు ఆయనికి నీరాజనం ఇస్తూ ఒకసారి దర్శనం చేయొచ్చు ,మీరు ధ్యానములో ఆయన్ని చూస్తూ దగ్గరగా కూర్చుని చూస్తుంటే మనసు రంజిల్లిపోయి చాలా తేలికగా ఆయన అందు లయమై ఉంటుంది . ప్రత్యేకించి అది జ్ఞానకారకము ,మంగళ కరము శివ స్వరూపము . అన్నిటిని మించి దక్షిణామూర్తి దగ్గర ఉన్న గొప్పతనము ఏమిటి అంటే అసలు దక్షిణామూర్తి దగ్గర్నుంచి ఇది మాత్రమే వస్తుంది అని చెప్పడానికి అవది లేదు . ఏదైనా ఇవ్వగలరు . అన్ని ఇవ్వగలిగినటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకుని పిల్లలు దగ్గర నుంచి పెద్దలు వరకు అందరు కొంత సేపు ఆయన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అసలు గురుమండలములో ప్రదానమైనటువంటి గురువుకి కూడా నమస్కారం చేసినటువంటి అనుగ్రహం లబిస్తుంది ఎందుకంటే ఆయన గురుస్వరూపం .
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
ముదితవదనం చిరునవ్వుతో వుంటాడు , మనసుకు ఒక లక్షణము ఉంటుంది అది విసుగు చెందుతుంది . మీరు రోజు ఒక లాగే చూపించరనుకొడి , రోజు కింద పెట్టిన పాదం చూపిస్తే నిన్న ఇదే చేశా కదా మల్లి ఎటో వెళ్తుంది, కాదు మీరు ఈరోజు పాదం జ్ఞానం చేస్తే రేపు చిన్ముద్ర ధ్యానం చేయొచ్
అందరికి గురుపౌర్ణమి శుభాకాంక్షలు !!
ఈరోజు గురుపౌర్ణమి వ్యాసుల వారి జన్మదినం , మన గురువు గారు ఏ ప్రవచనం మొదలు పెట్టిన వ్యాసుల వారిని ఈ విధముగా సృతిస్తారు .
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే !
నమో వై బ్రహ్మనిథయే వాసిష్టాయ నమో నమః !
వ్యాస మహర్షి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .
వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలొ పెక్కు మార్పు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయా ఆశ్వాసము నండి గ్రహించబడింది.
పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు, ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవి లో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దైవత్వము ప్రసాదిస్తున్నాని చెప్పి ఒక విమానాన్ని ఇచ్చి, భూలోకములో రాజ్యం చేస్తూ, అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెబుతాడు. ఇంద్రుడు వేణుదుస్టి అనే అతి పరాక్రమ వంతమైన ఆయుధాన్ని కుడా ప్రసాదిస్తాడు. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా శుక్తిమతి అనే నది ఉన్నది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడతాడు. అప్పుడు ఆ నది మార్గములో వెళ్తున్న వసువు తన ఆయుధంతో కోలహలుడిని ప్రక్కన పాడేస్తాడు. శుక్తిమతికి మరియు కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువు కి కానుక గా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడు ని సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడం తో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి , ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడూ ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సు అని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండం గా మారుతుంది. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాశరాజు వద్దకు తీసుకొని పోతారు.
దాశరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలొ ఒక మగ శిశువు మరియు మరో ఆడ శిశువు ఉంటారు. బ్రహ్మ శాపం వల్ల ఒక అద్రిక అనే అప్సరస చేప క్రింద మారి యమునా నదిలో ఉంది. చేపని చీల్చిన వేంటనే అ చేప అక్కడ నుండి అంతర్థానమై పోయింది. ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడాయిన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడ కు వస్తాడు.
అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినది అనిజన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి గరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధి తో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే , అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.
వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళతాడు. ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది. వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుకారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగధుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు. భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మాత్రంచే తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని మరియు దాశీకు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు. ఆతరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో ప్రవేశించి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆతరువాత దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు. ఆ తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరనానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివశించిన ఆశ్రమప్రాంతంలో పాడవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు. ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రథమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలరచి సూచించి తనదారిని తాను వెళతాడు. ఆ తరువాత కాలంలో ద్రౌపతీ స్వయంవరానికి ముందుగా పాందవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపతీ వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.
Share it

నెమలి : నెమలి గురుంచి కొంచం తెలుసుకుందాము...

నెమలి : నెమలి గురుంచి కొంచం తెలుసుకుందాము
పురి విప్పి నాట్యం చేసేది మగ నెమలి ,ఆడ నెమలి మగ నెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ ,అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగము వలన లేదు. అది చాలా సంతోషము కలుగుతుంది ఎప్పుడు అంటే వర్షాకాలం వచ్చేముందు చీకటి ఐపోతుంది ,అకస్మాత్తుగా మబ్బేసేస్తుంది ,ఇక వర్షం పడుతుంది అనగా గాలి మొదలైనపుడు పర్వత ప్రాంతాల్లోను ,అరణ్యల్లోను ఆ మగ నెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది . ఆ మగ నెమలి నాట్యం చేసి మొట్ట మొదట వడగళ్ళు అని పెద్ద చినుకు టప్ టప్ మని పడటం మొదలవుతుంది . అది నాట్యం చేసి చేసి చేసి సంతోషం తో ఒక ఆనందభాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్క అది నేల పడకుండా ఆడ నెమలి పట్టుకుంటుంది . పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది . అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు . అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఈక కిరీటం మీద పెట్టుకుంటారు . పదహారు వేల మంది ఉన్నారు అని నాకదే పని అనుకుంటున్నారేమో ఇంక భార్యలతో తిరగడం అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకసలు భార్య సంపర్కమే లేదు అని చెప్పడానికి ఒక నెమలి ఈక ఒకటి పెట్టుకుంటారు ఆయన . నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి మనకి భారతదేశం లో జాతీయ పక్షి . తనంత తాను స్వేచ్ఛగా ఆడే నెమలి ఆటను చూడాలి ,మనము ఎలా చూస్తాము అంటే నెమలి కనపడితే ఏ పుల్లలతోనో ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రయం . అసలు నెమల్ల అందాలు చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి వాళ్ళు అలా పట్టుకోరు . కాకులు ఎలా ఉంటాయో ,నెమల్లు అలా ఉంటాయి ఆ ప్రాంతములో అన్ని నెమల్లు తెల్లవారి లేచేటప్పటికి మేడల మీద నెమల్ల క్రేన్కనాలు వినబడుతూ ఉంటాయి , సాయంకాల వేల దానికేదో సంతోషం వస్తుంది . మీరు ఎప్పుడైనా నెమల్లు పురి విప్పి తిరగడం చూసారా , పురి విప్పడం అంటే కేవలం ఏదో అలా విప్పుతుంది అనుకోకండి ,అది అడుగులు వేసి నాట్యం చేసేటప్పుడు మీరు చూడాలి దాన్ని వెనక్కి నొక్కి మద్యలో చుట్టూ వృత్తం లాగా ఏర్పాటు చేస్తుంది ,ఒకోసారి ఒంచి పెద్దా విసినికర్రలా పెట్టి నాట్యం చేస్తుంది . అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాల ఉండేటటువంటి పించాన్ని ఆదారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతముగా ఉంటుంది . నెమలికి ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం పాము వలన దానికి భయం ఉండదు ,పాము ని నువ్వు చంపేస్తావ్ అని వరం ఇచ్చాడు ఇంద్రుడు.

కుచేలోపాక్యనం: భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని.

కుచేలోపాక్యనం:
భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని అపెక్షించనటువంటి వారు ఎవరు ఉండరు . పరిపూర్నావతారం కృష్ణావతారం ,అటువంటి కృష్ణుని యొక్క పాదములు పట్టుకొన్నవాళ్ళు కృష్ణనుగ్రహాన్ని కోరుకున్నవాల్లే తప్ప కృష్ణుడే వచ్చి ఒక పేద బ్రాహ్మణుడి యొక్క పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగి ఆయనికి నమస్కరించి ఆ పాదాలు కడిగిన నీళ్ళు తాను తలమీద చల్లుకుని తన పట్టమహిషి రుక్మిణి దేవి యొక్క తల మీద చల్లడం అసాదరమైనటువంటి ఘట్టం ,ప్రమాణ వాక్కు అని లోకములో ఒకటి ఉంటుంది అంటే ఏది పట్టుకుంటే తరిస్తామో అటువంటి ప్రమాణాన్ని నిర్ణయం చేస్తారు . వేదాన్ని విభాగము చేసి 18 పురాణములను ,మహాభారతాన్ని ,బ్రహ్మాసూత్రాలని ఇచ్చిన మహాపురుషుడు వేద వ్యాసుడు . అందుకే వేద వ్యాసుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్పడానికి ఇష్టపడతారు గురువులందరు ఎందుకంటే అవి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగా నది వంటివి తప్ప ,అసలు వ్యాసుడు చెప్పిన మాటలు ఎవరికీ చెప్పవలిసిన అవసరము ఎవరికీ ఉండదు . వ్యాసుడు చెప్పినదే చెప్తుంటారు కారణం ఏమిటంటే వ్యాసుడు అంత గొప్పగా మహాసముద్రాలంత వాంగ్మయం ఇచ్చేసాడు . అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు కుచేలుడు ఎంత గొప్పవాడో చెప్పారు ,కుచేలుడు గొప్ప బ్రాహ్మణుడు, సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్లి చెయ్యిచాపి నాకు సహాయం చెయ్యండి అని అయన జీవితములో లేదు ,ఆయనకి రాగ ద్వేషాలు లేవు ధర్మమే ఆయన ,ఆయనే ధర్మం ,ధర్మవస్తలుడు ,చాలా గొప్పవాడు ,ఇంద్రియములును గెలిచాడు ,సామాన్యమైన విషయము కాదు ,బ్రహ్మవేత్త ,దారిద్రియం ఆయన్ని బాధించింది కానీ ఆయనికి దారిద్రియం యొక్క స్పృహ లేదు అంటే మనకనిపిస్తుంది కుచేలుడు దరిద్రుడని కానీ ఆయనికి మాత్రం దరిద్రము ఉన్నదన్న విషయం అసలు జ్ఞాపకములో ఉండదు ,ఎందుకుండదు ,ఎప్పుడు పరబ్రహ్మ్మములో రమిస్తూ ఆనందపడిపోతాడు . అటువంటి బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని కుచేలుడు . అంతటి బ్రహ్మ్మజ్ఞాని అయినటువంటి కుచేలుడికి ఒక రూపాయి దొరికితే అదే పదివేల రూపాయిలు అనుకుంటాడు ,నాకిది లేదన్న భావన లేదు ,ఈశ్వరుడు ఏమివ్వలేదు అంటాడు , అంత సంతోషముతో ఉంటాడు ,ఒక బ్రాహ్మణుని కి ఉండవలిసిన మొట్ట మొదటి లక్షణం ,పరమ సంతోషముతో ఉండాలి నాకేమ్లేదు ,ఈశ్వరుడు నాకేమివ్వలేదన్న ఆనందుముగా ఉండాలి అది ఉన్నటువంటి వాడు కుచేలుడు . అసలు అయన పేరేమిటి షుబాముడు అని ప్రతీతి . కుచేలుడు అనే పేరెందుకు వచ్చింది అంటే చేలము అంటే బట్ట కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట ,చిరిగిపోయిన బట్ట కట్టకూడదు ,వేదములో నియమము ఉంది ,కాలిన బట్ట గాని ,చిరిగిపోయిన బట్ట గాని కట్టుకుని ఉండకూడదు అలక్షణం ,మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న విషయము ఆయనకి జ్ఞాపకము ఉండదు అసలు ఆయన బట్ట చూస్తాడు అబ్బా పీతాంబరము అని కట్టుకుంటాడు ,ఇది చిరిగిపోయింది రా అన్న భావన ఆయనికి ఉండదు . బ్రహ్మ వేత్తలని అర్దము చేసుకోవడం అంత తేలిక కాదు . రమణ మహర్షి గోచి అంతా కన్నాలు పడిపోయాయి ,అప్పుడప్పుడు ఆ గోచి తడిపి ఆరేసేవారు ,తువాలు అలానే ఉండేది ఆయనికి అన్ని కన్నాలే ఒకసారి కొంతమంది అయిశ్వర్యవంతులు ,అంతేవాసులు చూసి అన్నారు అయ్యో అయ్యో అయ్యో ఇన్ని కన్నాల అందులో దారపుపోగులు కన్నా కన్నాలే ఉన్నాయి చెప్తే రెండు తువాళ్ళు తేమండి అన్నారు . అయన అన్నారు కన్నాల ఇంద్రుడు నా గోచి సహస్రాక్షుడు ,తృప్తి ఉన్నవాడికి దరిద్రము ఏమిటి ,అయన గోచి చిరిగిపొతే గిరి ప్రదక్షిణం చేస్తూ ఆయనకేమి శరీర బ్రాంతి లేదు , చుట్టూ ఉండేవాళ్ళు అనేవారు భగవాన్ మీకు శరీర స్పృహ లేదు కానీ లోకము ఉందిగా ఒక గోచి పెట్టుకోండి అన్నారు అంటే పెట్టుకునేవారయిన ,అది చిరిగిపోతే నా గోచి చిరిగి పోయింది ఒక తువాలు పట్రండి అని అనలేదు ,ఆ రక్కసి పొదల్లోకి వెళ్లి ఒక రక్కసి ముళ్ళు తెంపి ఆ ముళ్ళు తోటే ఇంకొక ముల్లుకి కన్నం పెట్టి గోచి ఊడదీసి అందులో దారాలు తీసి దారము రక్కస ముళ్ళు సూదిలోకి ఎక్కించి చిరిగి పోయిన చోట కుట్టేసుకుని గోచి పెట్టుకుని ప్రదక్షిణ చేసేవారు ,ఇది లేదన్న మాట బ్రహ్మ వేత్తకు ఉండదు అందుకే అటువంటి వారి పేరు స్మరిస్తే పుణ్యం ,అటువంటి వారు పేరు తలవడం అంటే మాటలండీ ,అటువంటి వారిని తలుచుకుంటే చాలు పుణ్యం వచ్చేస్తుంది ,కుచేలుడు అంటే శరీర బ్రాంతి లేనివాడు . కుచేలుడి భార్య ఆవిడ అంతకన్నా గొప్ప ఇల్లాలు ,ఆవిడ చెప్పిన మాట భాగవతం లో అమృత బాండం . భగవంతుడు అంటే ఎంత కారుణ్య మూర్తి అండి ,అసలు ఎప్పుడు తలచుకోనివాడు కూడా కష్టం వచ్చినపుడు తలచుకుంటే రక్షిస్తాడే ,పిల్లలికి అన్నం లేదు ఒక సారి మీ స్నేహితున్ని అడగండి , వెళతాను గాని స్నేహితుని దగ్గరకు వెళ్ళేటపుడు ఎమన్నా పట్టికేల్లాలి ఎమన్నా ఉందా అన్నాడు ,అప్పుడు అడిగాడు ఎమన్నా ఉందా ఇంట్లో అని ,అప్పటి వరకు నే తినాలి ఎమన్నా ఉందా అని ఆయన జీవితములో అడగలేదు ,అటుకులు మూట కట్టింది ఆ ఉత్తరీయానికి ,పిచ్చి బ్రాహ్మణుడు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళాడు ద్వారకా నగరానికి ఎందుకు కృష్ణ దర్శనం అవుతుంది అది ఆయన సంతోషం ,తీరా ద్వారకా నగరానికి వెళ్ళాక గుర్తు వచ్చింది ,నేను ఇలా ఉన్నాను కదా ,నన్ను పంపిస్తార కృష్ణునికి స్నేహితున్ని అంటే నమ్ముతార అని ,ఎలాగోలా వెళ్తున్నాడు , ఉత్తరీయం లేదు ఆయనికి ఓ ముక్క వేసుకున్నాడు ఎందుకని ,ఉత్తరీయం లేకుండా ఉండకూడదు కాబట్టి ,పెద్దలు దగ్గరికి వెళ్ళేటపుడు ఎడం బుజం మీద ఉత్తరీయం లేకుండా ఉండకూడదు ,అందుకేసుకున్నాడు ఓ గుడ్డముక్క దానికి అటుకుల మూట కట్టుకున్నాడు ,ఏమి తిన్నాడు ,ఎప్పుడు తిన్నాడు ,ఏమి తాగాడు ,శరీరానికి బడలిక ఉండదా ?సంతోషంలో మరిచిపోయడాయన ,ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు ,మిగిలిన వాళ్ళందరూ ,అందరూ నవ్వుతున్నారు ,పీనుగు నడిచి వెళితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడురా , ఉరఃపంజరం అంత కనపడుతుంది ,ఎముకలన్నీ కనపడుతున్నాయి ,దవడలన్ని పోడుచుకోచ్చేసాయి ,పైన శరీరం కుచేలము ,లోపల ఉన్నవాడు బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని ఉన్నాడు లోపల ,మహానుభావుడు ఉన్నాడు ,పరమేశ్వరుడు పాదాక్రాన్తుడు అవుతాడు ఆయనికి ,ఆయన వస్తుంటే కృష్ణుడు కూర్చున్నాడు ,రుక్మిణి దేవితో కలిసి ఉన్నాడు తల్పం మీద ,కూర్చిలో కూర్చోలేదు ,హంస తూలికా తల్పం మీద నుంచి దూకేసాడు ,పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు ,ఒరేయ్ ఎపుదోచావ్ రా ,ఎన్నాలైన్దోయ్ ,ఎక్కడ కూర్చోపెత్తారో అని రాసారో తెలుసా పోతన గారు ,కూర్చీలో కూర్చో పెట్టలే ,తాను రుక్మిణి దేవితో కలిసి శయనించేటటువంటి ,కూర్చునేటటువంటి హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టారు ,చూసి చెలికత్తెలు అన్నారు ,ఉన్నవాళ్లు , మేము ఋషులు దర్శనం చేస్తే చూసాం కృష్ణున్ని ,మహర్షులు ,మునులు ఈయనతో సరిపోతారా ,అరెరె కృష్ణుడు ఎదురు వచ్చి తీసుకెళ్లాడయ ,రుక్మిణి దేవితో కలిసి కూర్చునే తల్పం మీద కూర్చోబెట్టాడు ,రుక్మిణి చూస్తావే వెళ్లి పట్రా బంగారు చెంబు పళ్ళెం అన్నాడు ,పళ్ళెం కాళ్ళ కింద పెట్టి పొయ్ నీళ్ళు అన్నాడు ,ఎవరికి చేసాడు భాగవతం లో ఇలా ,కూర్చోపెట్టి సాక్షాత్తు ఆది లక్ష్మీ ,ఆవిడ తీగంటి చూపు పడితే చాలు మహాదైస్వర్యం అందుతుంది ,ఆవిడ విష్ణు పాదములు కడగడం కాదు ,కుచేలుడు పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్ళు పోసింది ,ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు ,ఏదో అలవోకగా కదగలె స్నేహితుడు అని ,పరమ భక్తితో కడిగాడు ,ఎందుకో తెలుసా నీవంటి బ్రహ్మవేత్త లేడు ,ఆయన కాళ్ళు కడిగి తలమీద జల్లుకున్నాడు ,రా రుక్మిణి దేవికి జల్లాడు ,అంతఃపుర పరివారానికి జల్లాడు ,చందనం తీసి పట్టుకొచ్చి ,అయన వొళ్ళంతా చందనం రాసాడు ,ఎంత అలసిపోయవో ,నీకు తెలియదు ,నీకు భార్య ,బిడ్డలు ,భూములు ,ధనం ఏమి అవసరం లేదు,ఎప్పడు సంతోషం లో ఉంటావు ,కుచేల ఎక్కడుంటాడు నీలాంటి వాడు అని ,ఆయన శ్రమ పోయేటట్టు తనే విసిరి కర్ర పట్టుకుని ,తాటాకు విసినికర్రతో విసిరాడు ,ఆయనికి దూపం తీసుకుని వచ్చి చూపించాడు ,సువాసన పీల్చవోయి ,దీపాలతో హారతులు ఇచ్చాడు ,ఎవరు ఎవరికీ పరిపూర్నావతారం అయిన కృష్ణ భగవానుడు ,అంతటి బ్రహ్మ వేత్త అయినటువంటి కుచేలుడికి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశం అయిపోతాడో ,కుచేల ,మీ స్నేహితుడు కుచేలుడికి ఒక నమస్కారం అన్నారు అనుకోండి పొంగిపోతాడు ,అంతటి బ్రహ్మవేత్త . కుచేలుడి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన తీసుకువచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు ,ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ ,ఏవోయ్ నీకు మన గురువు గారు గుర్తు ఉన్నారా శందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు ,స్నేహితుడివి నాకేదో తేకుండా ఉండవు ,ఏదో తెచ్చావ్ అని వొళ్ళంతా తడిమేసి ఆ ఉత్తరీయానికి కట్టుకున్న అటుకులు ,గట్టిగా లాగితే చిరిగి పోతుంది బట్ట అవి తీసుకుని గుటుక్కున నోటిలో పోసుకుని పర పర పర నమిలి మింగుతున్నాడు ,ఎవరు లక్ష్మీనాధుడు ,ఇంకొక పిడికిడి తీసాడు ,భాగవతం మొత్తం మీద ఇలా లేదు ,రుక్మిణి దేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుని చేయి పట్టుకుంది ఎందుకని ,,లక్ష్మీ దేవి పట్టేసుకుంది చేయి ఇంక తినొద్దు అని ,ఇలా అన్నాడు కృష్ణుడు ఏ ,ఒక్క పిడికిడి తింటే మీరేమిచ్చేసారో నాకు తెలుసు ,ఇంకొక్క పిడికిడి తింటే ఆ భక్తుడికి నన్ను ,నిన్ను కలిపిచ్చేస్తారు ,ఆయన అడిగాడ ఐశ్వర్యం కావాలని ,అడగలే ,చాలా విచిత్రం తెలుసా కుచేలోపాక్యనము లో అంతా అయిపొయింది భోజనం పెట్టేసాడు ,మర్నాడు సాగనంపెసాడు ,వెళ్ళిపోతున్నాడు కుచేలుడు ,అయ్యా దరిద్రం లో ఉన్నాను ఒక్క రూపాయి ఇప్పించండి అని అనలేదు కుచేలుడు ,వెళ్ళిపోతున్నాడు ,ఆ కృష్ణుడు ఎందుకివ్వలేదో నాకర్ధమైంది ,ఈ దరిద్రం లో ఉంటె హాయిగా సంతోషముగా నేను భగవంతుడిని స్మరించొచ్చు ,రేపోద్దిట బోలెడంత డబ్బు వచ్చి పడిపోతే అదంతా రాసుకుంటూ కూర్చుంటే ఈశ్వరుడు ని మరిచిపోతానని ఇవ్వకుండా నన్ను రక్షించాడు ,కృష్ణా నీకో నమస్కారమయ ,పెద్ద భవనం కనపడింది ఎవరో ఒకావిడ ఆబరనాలన్నీ పెట్టుకుని వచ్చి దాన్నం పెట్టింది అమ్మా అమ్మా ఎవరమ్మ నీవు అన్నాడు ,మీ అవిడనండి అంది ,అయ్యో ఎక్కడిదే ఈ ఐశ్వర్యం అన్నాడు ,ఇదిగో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి పాక అంతఃపురం అయిపొయింది అంది ,అప్పుడే అటుకులు తిన్నాడు ,కుచేలోపాక్యనం మీరు చదవండి ,కుచేలోపాక్యనానికి చిట్ట చివర ఒక మాట చెప్తారు ,అన్ని అంతఃపురాలలో ఉన్న కుచేలుడికి ఐశ్వర్య భావం లేదు ,ఎప్పడు బ్రహ్మ్మముతో రమించి ,బ్రహ్మ్మము నందు ఐక్యం అయిపోయాడు ,కుచేలోపాక్యనం ఒక్క దానికే పల శృతి కూడా చెప్తారు ,గజేంద్ర మోక్షానం వాటికి చెప్పినట్టు ,కుచేలోపాక్యనానికి పల శృతి ఉంది ,అది చదివితే ,అది వింటే భగవంతుని యొక్క విశేషనమైనటువంటి అనుగ్రహం చేత దీర్గాయువు ,కీర్తి ,సంపద కలుగుతాయి ,అంత గొప్పది కుచేలోపాక్యనం ,ఒక బ్రాహ్మణుడు ఇంత దరిద్రములో ఉండి కూడా ,దరిద్రంతో సంబంధం లేకుండా ,ఆయన్ని భాదిన్చిది ,శరీరాన్ని భాదిన్చకపోలేదు కానసలు ఆయనికి ఆ భాద యొక్క స్పృహ తెలీదు ,మత్తు ఇచ్చి శరీరాన్ని కోస్తారు ,శరీరాన్ని కోయడం తెలుస్తుందా ,తెలీదు ,అలా ఆయనికి భగవంతుని యొక్క అనుబవానన్దమునన్దు భాహ్యము నందు ఉన్న దారిద్ర్యం తెలియనేలేదు అంతటి బ్రహ్మవేత్త ,అంతటి మహానుభావుడు కుచేలుడు అంటే అందుకే అంతటి పరమ భాగవతోత్తముడు వచ్చినపుడు మీకేంకావాలి అని అడగలేదు ,అంతటి పరిపూర్నవతారమే మహర్షులకి కూడా చెయ్యనటువంటి పూజ కుచేలుడికి చేసాడు అంటే అయన అంతటి బ్రహ్మ్మవేత్త ,అంతటి జితేంద్రియుడు ,అంతటి భక్తి తత్పరుడు ,ఎంతటి జ్ఞాని మనకర్దమవుతున్ది అటువంటి కుచేలోపాక్యనాన్ని ఇంట్లో పెద్దవాళ్లందరూ కూడా పిల్లలకి చెప్పాలి ,అందరు పోతనగారి భాగవతము లోనుంచి చదువుకోవాలి ,కుచేలోపాక్యనం భాగవతం దశమ స్కందం ఉత్తర భాగం లో ఉంది ,ఉత్తర భాగములో ఉన్నటువంటి కుచేలోపాక్యనాన్ని యదతదముగా చదువుకోవాలి ,ప్రతిరోజూ కుచేలోపాక్యనాన్ని చదువుకుని కుచేలుడి యొక్క గొప్పతనానికి పరవసించిపోతే అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది ,కుచేలుడు ఏవేవో కారణానికి దరిద్రుడు భాగవతములో లేదు ,కుచేలుడు బ్రహ్మవేత్త ,లేనితనమే తెలీకుండా పోలేదు ,ఉన్నతనం కూడా ఆయనకు తెలిదు . ఇది బ్రహ్మవేత్త అంటే ,ఐశ్వర్యం వచ్చిన తర్వాత స్పృహ ఉందేమిటి ,అదీలేదు .లెకపొతె స్పృహ ఉందేమిటి అది లేదు . రెండిటి లోను స్పృహ లేదు ,ఉన్న స్పృహ ఈశ్వర స్పృహ ఒక్కటే అటువంటి బ్రహ్మజ్ఞాని ,అంతటి మహానుబావుడు ,అటువంటి కుచేలుడికి ప్రతిరోజూ ఒక నమస్కారం చెయ్యాలి ,కృష్ణ భగవానుడు అంతటివాడు చేత పూజలందుకున్నాడు ,అటువంటి కుచేలోపాక్యనాన్ని స్మరించడం ,ఆయనికి నమస్కారం చెయ్యడం ,కృష్ణ భగవానుడి దగ్గర ,గురువుల దగ్గర కుచేలోపక్యనాన్ని ఒక్కసారి చెప్పుకుంటే చాలు పరవసించిపోతారు అందుకని కుచేలుడు పూజలందుకుంటున్నాడు
విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ. శ్లో నభూమి నజలం చైవ నతేజో నచ వాయవః నచబ్రహ్మ నచవిష్ణు నచనక్షత్ర తారకః సర్వశూన్య నిరాంబం స్వయంభూ విశ్వకర్మణః

తా భూమి – జలము – అగ్ని – వాయువు – ఆకాశము, బ్రహ్మ – విష్ణు – మహేశ్వర – ఇంద్ర –సూర్య – నక్షత్రంబులు లేని వేళ విశ్వకర్మ స్వయంభు రూపమైయుండెను.భూమి నీరు అగ్ని గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రా లేమియు లేనపుడు విశ్వకర్మ భగవానుడు తనంత తాను సంకల్ప ప్రభావంచేత నవతరించాడు. ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునకే విశ్వాత్ముడు, విశ్వేశ్వరుజు, సహస్ర శిర్షుడు! సగుణ బ్రహ్మం, అంగుష్ట మాతృడు, జగద్రక్షకుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మొదలైన అనంతనామనులు – అనంతరూపములు కలిగినై. “ప్రజాపతి విశ్వకర్మ మనః “అని కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మయే ప్రజాపతియైన బ్రహ్మయనియు చెప్పబడినది. ఆయనకు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానము లనెడి నైదు ముఖలు. శ్లో పూర్వావనా త్సానగః దక్షణా త్సనాతనః అపరా దహభూవః ఉద్వీచ్యాం ఉర్ధవాత్సుపర్ణః తా తూర్పు ముఖమునందు సానగ ఋషి, దక్షిణ ముఖము నందు సనాతన ఋషి, పశ్చిమ ముఖము నందు అహభూన ఋషి, ఉత్తర ముఖము నందు బ్రత్న ఋషి, ఊర్ధ్వముఖము నందు సుపర్ణ ఋషులుద్బవించిరి.విశ్వకర్మ పరాత్పరుని యొక్క తూర్పు ముఖమైన సద్యోజాతము నందు సానగబ్రహ్మర్షి మకుబ్రహ్మయు, దక్షిణముఖమైన వసుదేవము నందు సనాతన మహర్షి యను మయబ్రహ్మయు, పశ్చిమముఖమైన అఘేరియునందు అహభూవ మహర్షి యను త్వష్టబ్రహ్మయు, ఉత్తరముఖమైన తత్పురుషము నందు ప్రత్న మహర్షి యను శిల్పి బ్రహ్మయు, ఊర్ధ్వముఖమైన ఈశానము నందు సువర్ణ మహర్షియను విశ్వజ్ఞబ్రహ్మయు ప్రభవించినట్లు చెప్పబడినై. ఋక్ వేదం లోని పదవ మండలం 81,82 సూక్తాలు విశ్వకర్మ యొక్క సృష్టి నిర్మాణ క్రమాన్నివివరిస్తాయి. అందరికీ సుపరిచితమైన పురుష సూక్తం కూడా విశ్వకర్మను విరాట్ పురుషునిగా వర్ణించింది. విశ్వకర్మకు పర్యాయ పదంగా త్వష్ట ను గుర్తిస్తారు.

విశ్వకర్మ పూజ:

విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.

విశ్వకర్మ నిర్మాణాలు:

విశ్వకర్మ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.