cricket ad
Friday 16 December 2016
13-year-old pregnant after being raped by auto driver for 5 months
HYDERABAD: An auto driver was nabbed for sexually exploiting a 13 year-old girl whom he had been ferrying to school over a period of five months. The abuse came to light after the girl became pregnant and her family members found out about her state. The family lodged a complaint against the erring driver on Wednesday.
During the investigation, the police found out that Rajesh had been using vulgar language and had warned the girl against speaking to anyone about the abuse. The traumatised child would request her parents to skip school at least once a week.
స్నేహితుల వేడుక్కి.. శ్రేయతో పాడించా!
స్నేహితుల వేడుక్కి.. శ్రేయతో పాడించా!
కోట్ల
రాబడి ఉన్న కార్పొరేట్ సంస్థ కార్యక్రమమైనా..కోటీశ్వరుల ఇంటి పిల్లల
పెళ్లైనా..కొండల్ని కరిగించే గాయకుల కచేరియైనా..ఏవీ వాళ్లకు వాళ్లే
చేయలేరు! ప్రజలకు తెలిసేట్టు ప్రకటనలు ఎలా ఇవ్వాలి.. ఆద్యంతం వాళ్లని
కట్టిపడేయాలంటే ఏం చేయాలి.. కార్యక్రమానికి వచ్చే అతిథులని ఎలా
గౌరవించాలి.. ఇవన్నీ వాళ్లు చూసుకోవాల్సిన అవసరంలేదు. ఆ బాధ్యతల్ని ఈవెంట్
మేనేజర్స్కి అప్పగిస్తే చాలు! మధిర హరిణి అలాంటి ఈవెంట్ మేనేజర్.
బాలీవుడ్ తారల నుంచి దేశంలోని అగ్రశ్రేణి ఐటీ సంస్థల నిర్వాహకుల దాకా తమ
కార్యక్రమాల ఏర్పాటుకి ఆమె సేవలకోసం ఎదురుచూస్తున్నారిప్పుడు!ఆ రంగంలో
అంతగా రాణిస్తున్న ఆమె తన విజయ యాత్రనిలా పంచుకున్నారుకార్యక్రమం నిర్వహించడం అంత సులువేం కాదు. మనదైన సృజన ఉండాలి. వినియోగదారుల ఆలోచనలూ, ఆసక్తులను దానికి మేళవించాలి. అందరినీ మెప్పించాలి. అప్పుడే ఆదరణ ఉంటుంది. అందుకే నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా. అదే నాకు గుర్తింపు తెచ్చిపెట్టింది. జీఎమ్మార్, ఒరాకిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇన్ఫోసిస్ వంటి సంస్థలూ, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులెందరినో మా వినియోగదారులుగా మార్చింది. నేను పుట్టింది డెహ్రాడూన్ అయినా కావడానికి తెలుగువాళ్లమే. నాన్న ఓఎన్జీసీ ఉద్యోగి. నా చదువంతా దిల్లీలో సాగింది. నాన్నకు సంగీతం అంటే చాలా ఇష్టం. అందుకే నా చిన్నతనంలో ఇంట్లో తరచూ కచేరీలూ జరిగేవి. ఆ ప్రభావంతో నేనూ సంగీతంలో పీజీ చేశా. తరవాత నాకు ప్రఖ్యాత రికార్డింగ్ కంపెనీ ‘హెచ్ఎమ్వీ’లో పనిచేసే అవకాశం లభించింది. అక్కడ నా పని సంగీత కళాకారులతో ఆల్బమ్లు చేయడం. అక్కడయ్యాక మరో రెండు సంస్థల్లోనూ పనిచేశా. ఈలోగా పెళ్లవడంతో హైదరాబాద్ వచ్చేశా. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యటక శాఖవాళ్లు ఓ కార్యక్రమం కోసం సంగీతకళాకారుల్ని తీసుకొస్తారా అని అడిగారు. నేను అంతకముందు చేసిన పనే కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నా. కానీ అలాంటి సేవల్ని మళ్లీ కొనసాగించలేదు. మా వారి ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిపోవాల్సి వచ్చింది. తిరిగి హైదరాబాద్ వచ్చాక నేనంటూ సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా. సంగీతాన్ని, పాటల్ని సామాన్యులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ‘‘సిస్నే ఫర్ ఆర్ట్స్’’ పేరుతో 2005లో ఈ సంస్థను ప్రారంభించా. నా పని ప్రముఖ గాయకుల్ని ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించడం. అలా ఇప్పటివరకూ జగ్జీత్ సింగ్, గుల్జార్, ఎల్.సుబ్రహ్మణ్యం, సోనూ నిగమ్, జాకిర్ హుసేన్, అంజాద్ అలీఖాన్, శ్రేయాఘోషల్ వంటి ప్రముఖులతో కార్యక్రమాలు చేశా. 2010లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా శ్రేయాఘోషల్తో ‘‘ఫ్రెండ్స్ ఫరెవర్’’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశా. అదే వేడుకను కైలాష్ ఖేర్తోనూ చేశా. జాకీర్ హుసేన్, మరో ఇద్దరు గ్రామీ అవార్డు విజేతలను ఇక్కడకు తీసుకొచ్చి కార్యక్రమాలు చేశా. సింగపూర్, యూకె, న్యూజిలాండ్ వంటి వివిధ దేశాల్లోనూ మా సంస్థ తరఫున ఏర్పాటు చేశా.
ఆడపిల్లవు నువ్వేం చేస్తావన్నారు..
కార్పొరేట్ సంస్థల కోసం ఉత్పత్తి ప్రదర్శనలు, వార్షికోత్సవాలు, థీమ్ వేడుకలను నిర్వహించడం మొదలుపెట్టా. కాకపోతే ఇది పూర్తిగా పురుషాధిక్యత ఉన్న రంగం. మొదట్లో ‘ఆడపిల్లవు నువ్వేం చేయగలవు’’ అన్నారు. అవకాశమిచ్చినా మా వల్ల పొరపాట్లు ఏవయినా జరిగితే వెంటనే గుర్తించి తిడదామని ఎదురు చూసేవారు. మగవాళ్లే ఓ పనిని బాగా చేస్తారని ఎక్కడా లేదు కదా.. అందుకే నేను వాళ్ల మాటల్ని సవాలుగా తీసుకున్నా. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోలేదు. వందశాతం కష్టపడ్డా. మేం నిర్వహించే కార్యక్రమాలకు సమయమంటూ ఉండదు. అటు ఇంటినీ, పనినీ సమన్వయం చేసుకోవడం కూడా పెద్ద విషయమే. ఆ శ్రమే.. నాకు గుర్తింపు తెచ్చింది. మేం అందించే సేవల గురించి పెద్దగా ప్రచారం చేయకపోయినా కేవలం నోటిమాటద్వారానే అవకాశాలు వరుస కట్టాయి. కాగ్నిజెంట్, ఐబీఎమ్, జీఎమ్మాఎర్ వంటి అనేక సంస్థల్లో పలు రకాల కార్యక్రమాలు చేశా. ఇన్ఫోసిస్ సంస్థ మ్యాజిక్ ఇల్యూజన్ పేరుతో ఉద్యోగుల పిల్లలకోసం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసింది. హ్యారీపోటర్, జిమ్మీ వంటి పాత్రలతో దాన్ని ఏర్పాటు చేశాం. అదే కాదు.. కాగ్నిజెంట్ సంస్థకోసం అరేబియన్ నైట్స్ థీమ్తో పాటూ, గోవా, బాలీవుడ్కెమెరా వంటి అనేక అంశాలతో కార్యక్రమాలూ రూపొందిస్తుంటా. ఇలాంటివాటికి తగినట్లుగా దుస్తులూ మేమే అందిస్తాం.
ఆగస్ట్ ఫెస్ట్ నిర్వహించా..
సందర్భం చెబితే చాలు దానికి సంబంధించి ఓ ప్రణాళిక రూపొందిస్తాం. ఎలాంటి కార్యక్రమాలు ఉండాలి, ఎవరిని ఆహ్వానించాలి.. భోజనాలు, అతిథులు.. ఇలా అన్నింటి బాధ్యతా మాదే అవుతుంది. ఇప్పటివరకూ మేం చేసిన వాటిల్లో భారతదేశంలోనే అతిపెద్ద స్టార్టప్ మీట్ ఆగస్ట్ఫెస్ట్ చేయడం ఓ జ్ఞాపకం. బాలీవుడ్లో రాజీవ్గాంధీ సినీ అవార్డు కార్యక్రమాన్నీ మేం నిర్వహించాం. గతేడాది గోవాలో జరిగిన అంతర్జాతీయ చిన్నారుల చలనచిత్రోత్సవం ముగింపు వేడుకల్ని అట్టహాసంగా చేసి చూపించా. హైదరాబాద్లో పర్యాటకశాఖకోసం తారామతి-బారాదరి, చౌమహల్లా వంటిచోట్లా పలువేడుకలు చేశా. 2017 కొత్త సంవత్సర వేడుకలకోసం ఫలక్నూమాలో కార్యక్రమం చేయబోతున్నాం. ఇవన్నీ చేయడం వెనుక మాకెంతో ఒత్తిడి ఉంటుంది. అన్ని విభాగాలనూ ఒక్కతాటిపై తీసుకురావాలి. ఏ మాత్రం తడబాటు పడినా అభాసుపాలవ్వాల్సిందే. ముఖ్యంగా వేలమంది హాజరయ్యే కార్యక్రమాల విషయంలో ఎన్నో అనుమతులూ తీసుకోవడం, ఆ జనాన్ని అదుపు చేయడం పెద్ద పనే. కొన్నిసార్లు కళాకారులు సమయానికి రారు. అలాంటప్పుడు ఆ నష్టాన్నీ నేనే భరించాలి. ఆ సందర్భాలు తరచూ ఎదురవుతూనే ఉంటాయి. అయినా ఎప్పుడూ భయపడింది లేదు. మేం చేసే కార్యక్రమం.. హాజరయ్యేవారి సంఖ్య, సంస్థ ఆలోచనల్ని బట్టి డబ్బు తీసుకుంటాం.
ఇంగ్లాండ్ నిలిచింది తొలిరోజు 284/4 అలీ అజేయ శతకం రాణించిన రూట్ భారత్తో ఐదో టెస్టు
చెపాక్లో తొలి రోజు ఇంగ్లాండ్దే. కనీసం ఒక్క విజయంతోనైనా వూరట పొందాలనుకుంటున్న ఇంగ్లాండ్.. భారత్తో చివరిదైన ఐదో టెస్టును బలంగా ఆరంభించింది. ఆల్రౌండర్ మెయిన్ అలీ చక్కని శతకం సాధించిన వేళ.. కుక్సేన మెరుగైన స్థితిలో నిలిచింది.
ఆదుకున్న అలీ, రూట్: తొలి రోజు ఇంగ్లాండ్ను మెరుగైన స్థితిలో నిలిపిన ఘనత నిస్సందేహంగా మొయిన్ అలీదే. పట్టుదలతో ఆడిన అతడు ఆ జట్టు ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచాడు. లేదంటే 26 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ చిక్కుల్లో పడేదే. సాధికారికంగా ఆడిన అలీ.. రూట్తో మూడో వికెట్కు 146 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను కుదుటపరిచాడు. ఆ తర్వాత బెయిర్స్టోతో నాలుగో వికెట్కు 86 పరుగులు జోడించి ఇంగ్లాండ్ను ఇంకా బలమైన స్థితికి తీసుకెళ్లాడు. ఐతే అలీ కూడా తన ఇన్నింగ్స్ ఆరంభంలో ఇబ్బందిపడ్డాడు. లంచ్కు ముందు అశ్విన్ బౌలింగ్లో తడబడ్డాడు. లంచ్కు ముందు 44 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 7 పరుగులే చేశాడు. ఐతే క్రీజులో నిలదొక్కుకున్నాక ఆత్మవిశ్వాసంతో ఆడాడు. అశ్విన్, జడేజా బౌలింగ్ల్లో స్వీప్లతో బౌండరీలు రాబట్టాడు. మరోవైపు రూట్ కూడా నియంత్రణతో ఆడడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోయింది. లంచ్ తర్వాతి సెషనల్లో ఆ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అలీ మిశ్రా బౌలింగ్లోనూ ధాటిగా ఆడాడు. 51వ ఓవర్లో జడేజా బౌలింగ్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మిశ్రా బౌలింగ్లో అతడు ఆడిన బ్యాక్స్వీప్ (బ్యాటు వెనుక భాగంతో) ఆకట్టుకుంది. రూట్ కూడా మంచి నైపుణ్యంతో స్వీప్ చేశాడు. స్వీప్, స్లాగ్ స్వీప్లతో మొత్తంగా అతడు ఐదు బౌండరీలు సాధించాడు. ఇతర షాట్లతోనూ అలరించాడు. అదే క్రమంలో భారత్పై 11వ అర్ధశతకం (11 మ్యాచ్ల్లో) సాధించాడు. ఐతే టీకి అరగంట ముందు రూట్ను జడేజా ఔట్ చేశాడు. భారత బౌలర్లను సమర్థంగా స్వీప్ చేసిన రూట్ చివరికి స్వీప్కే క్యాచ్ ఔటయ్యాడు. భారత అప్పీలును అంపైర్ తిరస్కరించినా.. అతడు సమీక్షలో ఔట్గా తేలాడు. రూట్ నిష్క్రమణతో భారత్ మళ్లీ పోటీలోకి వస్తుందనిపించింది. కానీ అలీ, బెయిర్స్టోలు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. చివరి సెషన్ను ధాటిగా ఆరంభించారు. బెయిర్స్టో ఏమాత్రం అవకాశం దక్కినా స్పిన్నర్ల బౌలింగ్లో స్లాగ్ స్వీప్లు చేశాడు. వరుసగా జడేజా, అశ్విన్ ఓవర్లలో సిక్సర్లు కొట్టాడు. ఐతే బెయిర్స్టో అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో నిష్క్రమించాడు. 81వ ఓవర్లో జడేజా బౌలింగ్లో అతడు రాహుల్కు తేలికైన క్యాచ్ ఇచ్చాడు. మరోవైపు అలీ చక్కని ఆటను కొనసాగించాడు. మిశ్రా బౌలింగ్లో ముందుకొచ్చి కవర్స్లో బౌండరీతో 99కి చేరుకున్న అతడు.. వెంటనే సింగిల్తో టెస్టుల్లో ఐదో శతకం పూర్తి చేసుకున్నాడు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) కోహ్లి (బి) జడేజా 10; జెన్నింగ్స్ (సి) పార్థివ్ (బి) ఇషాంత్ 1; రూట్ (సి) పార్థివ్ (బి) జడేజా 88; అలీ బ్యాటింగ్ 120; బెయిర్స్టో (సి) రాహుల్ (బి) జడేజా 49; స్టోక్స్ బ్యాటింగ్ 5; ఎక్స్ట్రాలు 11 మొత్తం: (90 ఓవర్లలో 4 వికెట్లకు) 284;
వికెట్ల పతనం: 1-7, 2-21, 3-167, 4-253
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 12-1-44-0; ఇషాంత్ శర్మ 12-5-25-1; జడేజా 28-3-73-3; అశ్విన్ 24-1-76-0; అమిత్ మిశ్రా 13-1-52-0; కరుణ్ నాయర్ 1-0-4-0.
ఇక్కడ కోట్లు కురుస్తాయ్.. దూసుకుపోతున్న బీమా విపణి 2020 నాటికి రూ.26 లక్షల కోట్ల ప్రీమియం వ్యాపార వృద్ధికి అపార అవకాశాలు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి సంస్థలకు నిపుణుల సూచన
అవును మీరు చదివింది నిజమే.. కోట్లు కురుస్తాయ్. కాకపోతే బీమా ప్రీమియం రూపంలో. బీమా సేవలపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, సంస్థల పాలిట వరంగా మారుతోంది. ఇంకా ఎంతో మంది బీమాకు దూరంగా ఉండటం, వ్యాపార వృద్ధికి అపార అవకాశాలు ఉండటంతో 2020 నాటికి రూ.26 లక్షల కోట్ల ప్రీమియాన్ని ఆర్జించనుందని నివేదికలు చెబుతున్నాయి.మన దేశంలో వృద్ధికి అపార అవకాశాలున్న రంగాల్లో బీమా ఒకటి. 130 కోట్లకు పైబడిన జనాభా ఉన్నప్పటికీ బీమా పరిధిలో ఉన్నది కొందరే. అవగాహన లేకపోవడంవల్లనో, అందుబాటులో సేవలు లభించకనో చాలా మంది బీమాకు దూరంగా ఉండి పోతున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. బీమా సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వం వివిధ రకాల చర్యలు చేపడుతోంది. తక్కువ ప్రీమియానికే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకాలను తీసుకొచ్చింది. బీమా విపణి వృద్ధి చెందేందుకు ఇది ఎంతగానో దోహదపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. పెరుగుతున్న విదేశీ పెట్టుబడులు: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) నిబంధనలను ప్రభుత్వం సరళీకరించింది. 49 శాతం వరకు వాటాను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వడంతో విదేశీ నిధులు తరలి వస్తున్నాయి. బీమా రంగం వృద్ధికి, మరిన్ని నాణ్యమైన సేవలు అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పతుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అనేక విదేశీ సంస్థలు దేశీయ బీమా కంపెనీల్లో తమ వాటాలను పెంచుకున్నాయని, మరెన్నో సంస్థలు ఇటువైపు ఆసక్తిగా చూస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
విపణి తీరు ఇలా..: ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద బీమా విపణుల్లో మనదీ ఒకటి. దాదాపు 36 కోట్ల పాలసీలతో జీవిత బీమా ప్రపంచంలోనే పెద్ద విపణిగా ఉంది. ఏప్రిల్ 2015-మార్చి 2016 మధ్య జీవిత బీమా విపణి దాదాపు 22 శాతం వృద్ధితో రూ.1.38 లక్షల కోట్ల కొత్త ప్రీమియాన్ని నమోదు చేసినట్లు అంచనా. ఇదే సమయంలో సాధారణ బీమా విపణి 12 శాతం వృద్ధితో సుమారు రూ.10,500 కోట్ల కొత్త ప్రీమియాన్ని ఆర్జించింది. రానున్న అయిదేళ్లలో జీవిత బీమా ఏడాదికి 12-15% వృద్ధిని నమోదు చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో జీవితా బీమా వాటా 2.6% కాగా, సాధారణ బీమా వాటా 0.7 శాతంగా ఉన్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. ఇందువల్ల 2020 నాటికి మొత్తం బీమా విపణి ప్రీమియం దాదాపు రూ.26 లక్షల కోట్లకు చేరొచ్చని సీఐఐ-కేపీఎంజీ నివేదిక అంచనా వేస్తోంది.
ఇలా చేస్తే మరింత మేలు.. బీమాపై సరైన అవగాహన లేని వారు ఇప్పటికీ ఉన్నారు. వీరందరిని చైతన్య పరిచేందుకు ప్రభుత్వం తనవంతుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు ఈ దిశగా బీమా సంస్థలు కూడా చొరవ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా వినూత్న పథకాలను తీసుకు రావడంతోపాటు, పథకాల పంపిణీ వ్యవస్థను సంస్కరించాలని చెబుతున్నారు. ఆధునిక సాంకేతికత ఆధారంగా మరిన్ని వర్గాలకు బీమా సేవలను చేరువ చేయాలని సలహా ఇస్తున్నారు. తద్వారా భవిష్యత్తులో వ్యాపార వృద్ధికి మంచి అవకాశాలుంటాయని అభిప్రాయపడుతున్నారు.
వర్మ కొత్త చిత్రం ‘శశికళ’
పది
మంది మాట్లాడుకొనే అంశాలపై సినిమా తీయడంలో రామ్గోపాల్ వర్మ ముందుంటారు.
అందుకే ఆయన ఎక్కువగా వార్తల్లో విషయాల్నే లక్ష్యంగా చేసుకొంటుంటారు.
ఆ తరహా సినిమాలు తీస్తున్నప్పుడు ప్రేక్షకుల చూపంతా అటువైపే ఉంటుంది.
తెలిసిన విషయమే అయినా... ఏం చూపించారో, ఎలా చూపించారో అనే ఓ ఆసక్తి,
ఆత్రుత ప్రేక్షకుల్లో కనిపిస్తుంటుంది. రామ్గోపాల్ వర్మకి కావల్సింది
కూడా అదే. అందుకే సమాజంలో ఏం జరిగినా, ఎలాంటి సంచలనం చోటు చేసుకొన్నా
వెంటనే అటువైపు ఓ కన్నేస్తుంటారు. ఇటీవలే ‘నయీమ్’ చిత్రాన్ని సెట్స్పైకి
తీసుకెళ్లిన ఆయన తదుపరి ‘శశికళ’ పేరుతోనూ ఓ సినిమాని తెరకెక్కించనున్నట్టు
ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె
నెచ్చెలి శశికళ పేరు ప్రముఖంగా వినిపించింది. వాళ్లిద్దరి స్నేహబంధం గురించి
జాతీయస్థాయిలో ప్రచారం సాగింది. అదే దర్శకుడు రామ్గోపాల్ వర్మని
ఆకట్టుకుంది. అయితే వర్మ మాత్రం తాను తెరకెక్కించే కథ పూర్తిగా కల్పితమనీ,
ఓ రాజకీయ వేత్తకి ప్రియమైన స్నేహితురాలి కథే అయినా, ఇది రాజకీయ
నేపథ్యంతో కూడుకొన్నది మాత్రం కాదని స్పష్టం చేశారు. జయలలిత అంటే
తనకి ఎంతో ఇష్టమని, అయితే శశికళ అంటే ఆమెకన్నా ఎక్కువ గౌరవమని ఈ
సందర్భంగా ట్వీట్ చేశారు వర్మ. ‘‘జయలలిత అందరికంటే ఎక్కువగా
శశికళని గౌరవించేవారనే విషయమే తన చిత్రానికి ‘శశికళ’ పేరు
పెట్టడానికి కారణం. జయలలిత కళ్లతో జయలలితని చూడటం కంటే...
శశికళ కళ్లతో జయలలితని చూడటం మరింత కవితాత్మకంగా ఉంటుంద’’ని
ట్వీటారు వర్మ.
Subscribe to:
Posts (Atom)