cricket ad

Tuesday 6 December 2016

బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఈ హీరో క్రేజ్ ఆధారంగా పలువురు నిర్మాతలు భారీ సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. బాహుబలితో సంబంధం లేకుండానే వర్షం, డార్లింగ్, మిర్చి, మిస్టర్ ఫర్‌పెక్ట్ వంటి సినిమాలతో అమ్మాయిల కలల హీరోగా మారిపోయాడు. బాహుబలి తర్వాత ఆ క్రేజ్ ఆరాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పెళ్లి అనే మాట రాగానే.. ఈ యువరాజును పెళ్లాడబోయే అదృష్టవంతురాలు ఎవరా అని అటు అమ్మాయిలు, ఇటు సగటు సినీ అభిమాని ఎదురు చూస్తున్నారు. ఈ విషయం గురించి చిన్న వార్త బయటకు వచ్చినా.. స్పందన మాత్రం విపరీతంగా ఉంటుంది. దీని గురించి ఇప్పటికే కృష్ణంరాజు మీడియాతో మాట్లాడినట్లు వార్తలు రావడం, ఆయన వాటిని ఖండించడం కూడా జరిగింది. అయితే, తాజా వస్తున్న వార్తలను బట్టి తన పెళ్లి గురించి, ఆ అమ్మాయి గురించి ప్రభాస్ స్వయంగా తన సన్నిహితుల వద్ద వెల్లడించినట్లు ఫిలింనగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు. తనకు కాబోయే భార్య.. వైజాగ్‌లో స్థిరపడిన ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయని, తను బాగా చదువుకుందని, తన వ్యక్తిత్వం తనకు బాగా నచ్చిందని ప్రభాస్ తన సన్నిహితులతో అన్నాడట. అంతేకాదు, ఆ అమ్మాయి తనకోసం మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తోందని, నిశ్చితార్థం తరువాత అన్ని వివరాలు చెప్తానని కూడా అన్నాడట. ఇప్పుడే ఆమె పేరు, ఫొటోలు బయటపెడితే, ఆమె కుటుంబానికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతోనే రహస్యంగా ఉంచుతున్నానని అన్నాడట ప్రభాస్. ఈ వార్తలు కాస్త బయటకు రావడంతో ఫిలింనగర్‌లో ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రభాస్ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు.
  • ఆమె పుట్టింది కర్నాటకలో…. పాత మైసూరు సంస్థానంలోని మాండ్యాలో… అసలు పేరు కోమలవల్లి… 
  • ఆమె జీవితమంతా తమిళనాడులో… నాయకురాలిగా, నటిగా…. అంతా అక్కడే… 
  • ఆమె విశ్రాంతి అంతా హైదరాబాదులో… కొంపెల్లి ప్రాంతంలో ఉండే ఫామ్ హౌజులో…. 
  • ఆమె అయిదో ఏట నుంచే భరతనాట్యం నేర్చుకున్నది…. 
  • తల్లి బలవంతం మీద 15 వ ఏటనే సినిమాల్లోకి అడుగుపెట్టింది…. 
  • ఆమె మొదటి సినిమాలో యంగ్ విడో పాత్ర… మెట్రిక్ స్టేట్ ర్యాంకర్ ఓ యంగ్ విడో పాత్ర పోషించడం అందరికీ ఆశ్చర్యం … 
  • ఆ తొలి సినిమాకు సెన్సార్ ఇచ్చిన రేటింగ్ ‘పెద్దలకు మాత్రమే’… 
  • తనకు అప్పటికి 15 ఏళ్ల వయసే కాబట్టి తన తొలి సినిమాను తనే థియేటర్ లో చూడలేకపోయిందట…. 
  • స్లీవ్ లెస్ బ్లౌజు వేసుకుని, జలపాతం కింద తడుస్తూ పాటలో నటించిన తొలి తమిళ నటి… 
  • ఆమె సినిమా కెరీర్ మొదట్లోనే శోభన్ బాబును ప్రేమించింది… అదలాగే కొనసాగింది… పెళ్లి చేసుకోలేదు…
  • శోభన్ బాబుతో ఆమెకు శోభన (ప్రియ మహాలక్ష్మి) అనే కూతురు పుట్టిందనీ ప్రచారం ఉంది… కానీ ఆమె గురించి తెలియదు… 
  • ఆమెకు ఇంగ్లిషు పుస్తకాలు చదవడమంటే మహా ఇష్టం… ఎప్పటికీ ఆమెతో ఆ పుస్తకాలు ఉంటాయి…
  • ఆమె మంచి రచయిత్రి కూడా… ఎస్టరియర్ తమిళ వీక్లీలో థాయ్ పేరుతో రాస్తూ ఉండేది…
  • తమిళంలో ఆమె సిల్వర్ జుబ్లీ సినిమాలే అధికం.. 85 సినిమాల్లో 80 హిట్టే…
  • ఇజ్జత్ అనే హిందీ సినిమాలోనూ నటించింది అదీ హిట్టే… తెలుగులో ఆమె నటించినవి 28 సినిమాలు…
  • ఆమెకు ఒక సోదరుడు… పేరు జయకుమార్… 1995లో చనిపోయాడు…
  • 1991లో…. 43 ఏళ్ల వయసులోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అత్యంత పిన్నవయస్కురాలు…
  • పటౌడీని చూడటం కోసమే ఆమె క్రికెట్ మ్యాచులకు వెళ్లేది…
  • దత్తపుత్రుడి పెళ్లి జరిపినప్పుడు లక్షన్నర మందికి ఆతిథ్యం ఇచ్చింది… ఇది గిన్నీస్ రికార్డు…
  • తన దత్తపుత్రుడి పెళ్లి ఖర్చు అప్పట్లోనే 100 కోట్లు అని విమర్శ కాగా, 10 కోట్లేనని ఐటీ శాఖ అంచనా వేసింది… 
  • తన ప్రియసఖి శశికళతో ఆమె బంధం గురించి రకరకాల దుష్ప్రచారాలున్నాయి… 
  • శశికళను కాస్త దూరం ఉంచడం మొదలెట్టగానే ఇదే శశికళ జయలలితకు స్లోపాయిజన్ కుట్ర చేసిందని తెహెల్కా కథనం… 
  • అప్పటి నుంచే జయ ఆరోగ్యం క్షీణించి, చివరకు రోజల తరబడీ చికిత్స చేసినా చక్కబడలేదనేది విమర్శ… 
  • కుంభకోణంలో మహామకం ఉత్సవాల్లో 1992లో ఆమె సంప్రదాయ స్నానం… జనం తొక్కిసలాటలో 50 మంది మృతి…
  • 1992 లోనే అప్పటి గవర్నర్ చెన్నారెడ్డి తన పట్ల అమర్యాదగా వ్యవహరించాడని ఆమె ఆరోపించింది… 
  • సుబ్రహ్మణ్యస్వామి 1996లో కేసు పెట్టినప్పుడు బయటపడ్డ ఆస్తులు 66 కోట్లు…
  • అందరినీ ఆకర్షించినవి 12,000 చీరెలు, 30 కిలోల బంగారం, 2,000 ఎకరాల భూమి, 750 జతల చెప్పులు, 8 క్వింటాళ్ల వెండి… 
  • 1997లో ఆస్తుల జప్తు జరిగినప్పుడు, ఇక ఆభరణాలు ధరించనని ఒట్టు పెట్టుకుని, తిరిగి అధికారంలోకి వచ్చాకే 2011లో ధరించింది… 
  • పాలనలో ఆమె నియంతలాగే వ్యవహరిస్తుంది… విమర్శలు చేసినా, వార్తలు రాసినా ఎడాపెడా పరువునష్టం కేసులు పెట్టించేది… 
  • విధేయత విషయంలో పాతకాలం చక్రవర్తులు కూడా పనికిరారు… మంత్రులు, ఎమ్మెల్యేల పాదాభివందనాలు చాలా కామన్… 
  • ఆమె కళ్లల్లోకి నేరుగా చూడొద్దనీ, బొకే ఇచ్చేసి, వెనక్కి తిరిగి వీపు చూపకుండా, వెనక్కి వెనక్కి నడిచిరావాలని గన్ మెన్ చెప్పేవారట…
  • స్కూళ్లో ఓ క్లాస్ మేట్ లవ్ కు పోస్ట్ మ్యాన్ గా వ్యవహరించిందట… ఆమె తల్లికి తెలియగానే తనపై నిందలు వేసి తప్పుకుందట…
  • మొదట్లో ఎంజీఆర్ ఆమెను సందేహించేవాడట… ఆమె ప్రతి కదలికపై నిఘా వేసి ఉంచేవాడట…
  • వీడియో పార్లర్ నడుపుకునే శశికళను కూడా గూఢచర్యం కోసమే ఎంజీఆర్ జయలలిత వద్ద ఉంచాడట… 
  • 1981లో రాజకీయాల్లోకి రాగానే, 1983లో రాజ్యసభ సభ్యురాలైంది…. తరువాత ఎంజీఆర్ కోపానికీ గురైంది…
  • 1984లో ఎంజీఆర్ కు స్ట్రోక్ వచ్చి, అనారోగ్య సమస్యల్లో ఉంటే, ఈమె రాజీవ్ ను, గవర్నర్ ఖురాను కలిసి సీఎంను చేయమని అడిగిందట…
  • 1986లో ఎంజీఆర్ తో పడలేదు… పోటీగా జయలలిత పెరవై అనే సమాంతర ఆర్గనైజేషన్ ను కూడా స్టార్ట్ చేసింది

కొత్త వెయ్యి నోటు ఎప్పుడొస్తుందో తెలిసిపోయింది!

ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఒకవైపు హర్షిస్తూనే, మరోవైపు అమలులో విఫలమైందని మండిపడుతున్నారు. పాత వెయ్యి, 5వందల నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్త 2వేల నోటును ప్రవేశపెట్టింది. 2వేల నోటుతో పాటు 5వందలు, వెయ్యి రూపాయల నోటు కూడా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త 5వందల నోటు అక్కడక్కడా కనిపిస్తోంది కానీ వెయ్యి నోటు జాడే లేదు. ఈ వెయ్యి రూపాయల నోటు బ్యాంకుల్లోకి, అక్కడి నుంచి జనం జేబుల్లోకి రావాలంటే కొత్త సంవత్సరం వచ్చే దాకా ఆగక తప్పదని సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త వెయ్యి రూపాయల నోటును ప్రవేశపెడుతున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది. అంతేకాదు, కొత్తగా 20రూపాయలు, 50 రూపాయల నోటును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐయే తెలిపింది. పాత 20, 50 నోట్లు యథాతథంగా ఉంటాయని, వాటికి తోడు కొత్త నోట్లు చలామణీలోకి తేవాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

Sunday 4 December 2016

వెల్లుల్లి ప్రయోజనాలెన్నో.

వెల్లుల్లి ప్రయోజనాలెన్నో...!
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు ఎలాంటివో తెలుసుకుందాం...
బరువు తగ్గిస్తుంది:
రోజుకు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతాము. అంతేకాదు జీర్ణమైన ఆహారంలోని కొవ్వును వెల్లుల్లి ప్రొసెస్‌ చేయడమే కాదు అనవసరమైన ఫ్యాట్‌ను శరీరం నుంచి బయటకు పంపించేస్తుంది. వెల్లుల్లిని తినడం వల్ల ఆకలి వేయదు. జిహ్వచాపల్యం బాగా తగ్గుతుంది. అంతేకాదు వెల్లుల్లి అడ్రినలైన్‌ని అధిక ప్రమాణంలో విడుదల చేయడం ద్వారా నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి శరీర జీవక్రియ బాగా జరిగేట్టు చేస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది.
శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాసు రక్తపోటును నియంత్రిస్తుంది. చర్మాన్ని కాపాడుతుంది: మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి రెబ్బలు రెండింటిని తీసుకుని వాటిని బాగా నూరి గోరువెచ్చటి నీళ్లల్లో ఆ గుజ్జును కలుపుకుని పొద్దున్నే తాగితే మంచిది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. అంతేకాదు శరీరం లోపలి భాగాల్ని కూడా శుద్ధిచేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విషపదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది.
గుండెను కాపాడతాయి:
రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గుండె సంబంధిత బబ్బులు రావు. వెల్లుల్లిలో ఉన్న యాంటి క్లాటింగ్‌ ప్రాపర్టీస్‌ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకోవడంలాంటివి (బ్లడ్‌ క్లాట్స్‌) సంభవించవు. పచ్చి వెల్లుల్లిని తినలేకపోతే ఆహారపదార్థాలలోనైనా వేసుకొని తప్పనిసరిగా వెల్లుల్లి తినడం మంచిది.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని లైక్ చేయండి,షేర్ చేయండి....!!!

Image may contain: food

Saturday 3 December 2016

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ నోట్ల రద్దు, నగదు రహిత వ్యవస్థపై వస్తున్న విమర్శలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా నోట్ల రద్దును సమర్థిస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయని అన్నారు. ఇక నుంచి ప్రజలకు నోట్లతో పనిలేదని, డబ్బుల కోసం ఏటీఎంల ఎదుట క్యూకట్టాల్సిన పనిలేదన్నారు. జేబులోని మొబైల్ ఫోనే ఇక నుంచి బ్యాంకు బ్రాంచి అని అన్నారు. దేశంలోని చాలామందికి మొబైల్ బ్యాంకింగ్‌ గురించి తెలియదన్న విమర్శలపై మోదీ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలకు ప్రజలు హర్షధ్వానాలు తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లోనూ ఎన్నికల్లో ఇంకా బ్యాలెట్‌నే ఉపయోగిస్తున్నారని, అభ్యర్థి పేరు చదివి ఓట్లు వేస్తున్నారని గుర్తు చేశారు. కానీ భారత్‌లో మాత్రం ఏవీఎంల మీట నొక్కి ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఏమీ తెలియదనుకోవడం పొరపాటే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ బ్యాంకింగ్‌ను కూడా వారు సమర్థంగా చేయగలరని అన్నారు.
టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ప్రేమికులనే విషయం తెలిసిందే. ఇద్దరూ ఇంకా పెళ్లి చేసుకోనప్పటికీ, భార్యాభర్తల్లాగానే ఉంటారు. ఏ ఈవెంట్‌కైనా కలిసే హాజరవుతుంటారు. కాగా, ఇటీవల జరిగిన టీమిండియా డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌ వివాహ సమయంలో ఈ జంట బాగా ఎంజాయ్‌ చేసిందట.
 
చంఢీగడ్‌లో జరిగిన సంగీత్‌లో యువీ దంపతులతో కలిసి ఈ ఇద్దరూ డ్యాన్స్‌ కూడా చేశారు. అక్కణ్నుంచి అనుష్క, కోహ్లీ గోవా పయనమయ్యారు. గోవాలో యువీ పెళ్లికి కూడా హాజరై అభినందనలు తెలిపారు. పనిలో పనిగా తమకు ఎయిర్‌పోర్ట్‌లో కలిసిన బాలీవుడ్‌ గీత రచయిత జావెద్‌ అఖ్తర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కణ్నుంచి తమ ప్రేమ కబర్లు చెప్పుకుంటూ పయనమయ్యారు.

Wednesday 30 November 2016

గ్రేప్స్ జ్యూస్ యొక్క 15 ఆరోగ్య ప్రయోజనాలు .. !!!

సమయం 4 శిక్షణ
గ్రేప్స్ జ్యూస్ యొక్క 15 ఆరోగ్య ప్రయోజనాలు .. !!!
1) ద్రాక్షలో రసం దొరకలేదు తినండి HDL (మంచి) యొక్క స్థాయిని పెంచేందుకు 
కొలెస్ట్రాల్. ఈ ధమనులు ప్రతిష్టంభన నిరోధించే గుండె ఆరోగ్యంగా ఉంది.
2) సేకరించే రెస్వెట్రాల్ ద్రాక్షలో రసం దొరకలేదు కణితులు ఏర్పడటానికి నిరోధిస్తుంది
శరీరంలో. కాబట్టి ఈ క్యాన్సర్ నిరోధిస్తుంది. పర్పుల్ రంగు ద్రాక్ష రసం 
రొమ్ము క్యాన్సర్ నిరోధిస్తుంది. 
ఈ రసం తాగడం ద్వారా 3), నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలో పెరిగింది 
రక్త నాళాల్లో గడ్డకట్టడం ఏర్పడటానికి తగ్గించే శరీరం. ఈ గుండె జబ్బులు అవకాశాలను తగ్గిస్తుంది.
4) మద్యపానం ద్రాక్ష రసం రోజూ రక్తపోటు తగ్గించడం సహాయపడుతుంది.
5) ద్రాక్ష రసం వ్యతిరేక వృద్ధాప్య లక్షణాలను కలిగి ఉంది మరియు అది కూడా సహాయపడుతుంది
బరువు తగ్గించేందుకు.
ద్రాక్ష juicerepair దెబ్బతిన్న కణాలు 6) ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు మరియు
కూడా అడ్డుకునేందుకు మరింత నష్టం.
7) దగ్గు మరియు ఆమ్లత త్రాగే వ్యక్తి నుండి దూరంగా ఉండటానికి
క్రమం తప్పకుండా ద్రాక్ష రసం.
చక్కెర helpsin క్యూరింగ్ మైగ్రేన్ లేకుండా ఉదయం ద్రాక్షలో రసం తీసుకొని. ఇది పార్శ్వపు నొప్పి కోసం ఒక మంచి హోం రెమడీ ఉంది.
9) గ్రేప్ జ్యూస్ రక్తం లోపాలు నివారిణులు మరియు రక్త చాలా మంచి పరిశుద్ధుడు. ఇది శరీరం నుంచి హానికరమైన విషాన్ని బయటకు పంపే.
ఇది మంచి విరేచనకారిగా పనిచేసి 10) గ్రేప్ రసం కూడా మలబద్ధకం సమస్యను నివారిణులు.
11) ఎరుపు రంగు ద్రాక్ష రసం బలమైన యాంటివైరల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది.కనుక ఇది వివిధ అంటువ్యాధులు నుండి రక్షిస్తాడు.
12) గ్రేప్ జ్యూస్ వల్ల దాని ప్రముఖ చికిత్సా విలువ foundto ఆస్త్మా చికిత్స చాలా సమర్థవంతంగా ఉంది.
13) ద్రాక్షలో రసం ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు వృద్ధాప్యం నివారించడంలో సహాయపడుతుంది
అల్జీమర్స్ వ్యాధి వంటి సంబంధిత సమస్యలు.
14) ఊదా ద్రాక్ష రసం అథెరోస్క్లెరోసిస్ పోరాట లో సహాయపడుతుంది.
15) ద్రాక్షలో రసం ప్రస్తుతం యాంటీఆక్సిడాంట్లు రోగనిరోధక వ్యవస్థ పెంచడానికి.
SHARE IT
శ్రీ దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం విష్ణు దత్తాయ నమః
ఓం శివ దత్తాయ నమః
ఓం అత్రి దత్తాయ నమః
ఓం అత్రేయాయ నమః
ఓం అత్రి వరదాయ నమ
ఓం అనసూయాయై నమః
ఓం అనసూయాసూనవే నమః
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్దాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్దిపతయే నమః
ఓం సిద్ది సేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్టాయ నమః
ఓం వరిష్టాయ నమః
ఓం మహిష్టాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగాగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగాపతయే నమః
ఓం యోగీశాయ నమః
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగాపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్పమోహనాయ నమః
ఓం అర్ధాంగలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం విరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షినే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహాయ నమః
ఓం స్థావిరాయ నమః
ఓం స్థావీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూడాయ నమః
ఓం ఉర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలుధారిణే నమః
ఓం శూలిణే నమః
ఓం డమరుధారిణే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం మునయే నమః
ఓం మౌలిణే నమః
ఓం విరూపాయ నమః
ఓం స్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపాద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగార్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్తాయ నమః
ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః
ఓం ధూలిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మొధ్ధూలిత దేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం విశ్వరూపినే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం దత్తాత్రేయాయ నమో నమః