cricket ad

Saturday 10 December 2016

ట్రైన్, బస్ లలో కూడా 500నోట్లు చెల్లవు.! 5 రోజులు కుదిస్తూ కేంద్రం నిర్ణయం.

కేంద్ర స‌ర్కార్ మ‌రో బాంబు పేల్చింది. శ‌నివారం అర్థ‌రాత్రి నుంచి ప్ర‌యాణాల్లో పాత‌ నోట్లు చెల్ల‌వంటు ప్ర‌క‌టించింది. ముందుగా ప్ర‌క‌టించిన ప్ర‌క‌ట‌న ప్ర‌కారం పాత నోట్ల చెల్లుబాటు డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు ఉండేది. అయితే ఆ తేదిని కుదిస్తూ మ‌రో తాజా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది కేంద్ర స‌ర్కార్. రైలు, బస్సు, సబర్బన్‌, మెట్రో టికెట్ల కొనుగోలుకు డిసెంబ‌ర్ 10 అంటే శనివారం అర్ధరాత్రి నుంచి పాత రూ.500 నోట్లు చెల్లవు అని దీని సారాంశం.
hy27news0_gdhad_hy_2388154f
దీంతో ప్ర‌యాణాల్లో ఉన్న సామాన్యులు షాక్ కు గుర‌వుతున్నారు. స‌డ‌న్ గా ఇలా నిర్ణయం తీసుకుంటే మా ప‌రిస్థితి ఏంటంటూ ప్ర‌శ్నిస్తున్నారు. నోట్ల ర‌ద్దు జ‌రిగి ఇప్ప‌టికే నెల గ‌డిచిపోయిన కొత్త నోట్లు పూర్తి స్థాయిల్లో చేతిలోకి రాలేద‌ని.. చిల్ల‌ర క‌ష్టాలు తీవ్రంగా ఉన్నాయ‌ని వాపోతున్నారు. 5 రోజులు పొడ‌గించాల్సింది పోయి.. గ‌డువును కుదిస్తారంటూ మండిప‌డుతున్నారు. ఇక తాజా ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ప్ర‌యాణానికి కొత్త నోట్లను వాడాల్సిందే. లేదా చలామణీలో ఉన్న పాత రూ.100, 50, 20, 10, 5 నోట్లను, నాణేలను వినియోగించుక త‌ప్ప‌ని ప‌రిస్థితి.
02/10/2014 - Hyderabad: Secunderabad railway station saw a huge rush of passengers waiting to take trains to return to their native places during the festival season - Deccan Chronicle Photo. [Telangna, Crowd]
పాత నోట్లు ఇంకా ఎక్క‌డ చెల్లుబాట‌వుతాయంటే..
  • డిసెంబ‌ర్ 15 న వ‌ర‌కు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యచికిత్సలకు
  • వైద్యుల అనుమ‌తితో ప్రభుత్వ ఆస్పత్రుల్లోని మందుల షాపుల్లో మందులు కొనుగోలు చేసేందుకు..
  • గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపునకు, గ్యాస్‌ సిలిండర్ల కొనుగోలుకు
  •  స్మశానాల్లో దహనసంస్కారాల‌కు
  • ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఫీజుల చెల్లింపునకు
  • పురావస్తు శాఖ ఆధ్వర్యంలోని కట్టడాల సందర్శన టికెట్లకు డిసెంబరు 15 దాకా పాత రూ.500 నోట్లను అనుమతిస్తారు.
  • ఇక పాత 1000 నోటు కేవ‌లం బ్యాంకులో డిపాజిట్ కు త‌ప్ప ఎక్క‌డ ప‌ని చేయ‌డం లేద‌న్న‌ది తెలిసిందే.

ఎయిర్ టెల్ క‌స్ట‌మ‌ర్ల‌కు శుభ‌వార్త.. జియో త‌ర‌హ‌లోనే ఫ్రీ వాయిస్ కాల్స్ కు రెడీ.!

జియో దెబ్బ‌కు టెలికాం సంస్థ‌లు దిగి వ‌స్తున్నాయి. నిన్న‌ామొన్న‌టి వ‌ర‌కు టారిప్ రేట్ల‌తో వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపించిన టెలికాం సంస్థ‌లు జియో ఎంట్రీతో ఒక్క సారిగా ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. తాజాగా వెల్ల‌డించిన జియో న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్ తో భార‌త్ లో భారీగా క‌స్ట‌మ‌ర్ల‌ను కలిగిన ఎయిర్ టెల్ కు మ‌రిన్ని క‌ష్టాలు వ‌చ్చిప‌డ్డ‌ట్టైంది. దీంతో  దిద్దు బాటు చ‌ర్య‌గా క‌స్ట‌మ‌ర్ల ను కాపాడుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది ఎయిర్ టెల్ . జియో త‌ర‌హ‌లోనే దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ పెయిడ్ పథకాలను ప్రకటించింది.


జియో దెబ్బ‌కు టెలికాం సంస్థ‌లు దిగి వ‌స్తున్నాయి. నిన్న‌ామొన్న‌టి వ‌ర‌కు టారిప్ రేట్ల‌తో వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపించిన టెలికాం సంస్థ‌లు జియో ఎంట్రీతో ఒక్క సారిగా ఆలోచ‌న‌లో ప‌డ్డాయి. తాజాగా వెల్ల‌డించిన జియో న్యూ ఇయ‌ర్ ఆఫ‌ర్ తో భార‌త్ లో భారీగా క‌స్ట‌మ‌ర్ల‌ను కలిగిన ఎయిర్ టెల్ కు మ‌రిన్ని క‌ష్టాలు వ‌చ్చిప‌డ్డ‌ట్టైంది. దీంతో  దిద్దు బాటు చ‌ర్య‌గా క‌స్ట‌మ‌ర్ల ను కాపాడుకునేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది ఎయిర్ టెల్ . జియో త‌ర‌హ‌లోనే దేశవ్యాప్తంగా ప్రీ కాల్స్, ఫ్రీ డాటా అంటూ రెండు కొత్త ప్రీ పెయిడ్ పథకాలను ప్రకటించింది.
reliance-jio-vs-airtel-4g-volte
ఆఫ‌ర్ల వివ‌రాలుః 
  • రూ.345 తో రిచార్జ్ చేసుకంటే భారతదేశం లో ఏ నెట్వర్క్ కైనా…అన్ లిమిటెడ్ ఫ్రీ   వాయిస్ కాల్స్ (లోకల్ అండ్ ఎస్టీడీ) చేసుకోవచ్చు. దీంతో అద‌నంగా 1 GB 4G డేటాను కూడా ఉచితంగా పొందవ‌చ్చు.
  • రూ. 145 తో రిచార్జ్ చేసుకుంటే దేశవ్యాప్తంగా ఎయిర్ టెల్ టు ఎయిర్ టెల్ కాలింగ్ ఫ్రీ.. అద‌నంగా స్మార్ట్ పోన్ల‌కు
  • 300MB  4G డాటా.. 50MB  డాటా బేసిక్ ఫోన్లకు ఉచితం.
  • రూ. 145 తో చేసుకునే రిచార్జ్ కు వాలిడిటీ 28 రోజులు ఉంటుద‌ని తెలిపింది.

శృంగారంలో స్త్రీలకు 237 ర‌కాల కోరిక‌లుంటాయంట. అందులో టాప్-5 ఇదిగో.!

శృంగారం.. ఈ ప‌దం విన‌గానే చాలు కుర్రాళ్ల కోరిక‌లు గుర్రాళ్ల ప‌రిగెడితాయ్.శృంగార విష‌యంలో మ‌గాళ్ల కంటే మ‌గువ‌ల‌కే ఎక్కువ కోరిక‌లుంటాయ‌ని చెపుతున్నారు ప‌రిశోద‌కులు. మ‌గ‌వారిలో సెక్స్ కోరిక‌లు క‌ల‌గ‌డానికి ప్రేరేపించే కార‌ణాలు ఒక‌టి రెండ‌యితే.. మ‌గువ‌ల్లో మాత్రం ఆ సంఖ్య 237 అని చెపుతున్నారు. స్త్రీల మీద శృంగార విష‌యంలో చేసిన ప‌రిశోధ‌న‌లే ఇందుకు సాక్ష్యం అని కూడా చెబుతున్నారు.
పురుషుడు బెడ్ మీదకి రావ‌డానికి స్త్రీ శ‌రీరాకృతి.. స‌మ‌యం.. త‌న మూడ్ కార‌కాలైతే స్త్రీ బెడ్ మీద కు రావ‌డానికి 237 కార‌ణాలుంటాయి. స్త్రీలో శృంగార కోరికను రేకెత్తించే కార‌ణాల గురించి జ‌రిగిన అధ్య‌య‌నం లో ఈ విషయం వెల్ల‌డైంది. ఎలాంటి ఆలోచ‌న క‌లిగిన‌ప్పుడు మీకు శృంగారంలో ఉండాల‌నిపిస్తుంది అని ప‌రిశోద‌కులు అడిగినప్పుడు విచిత్ర‌మైన స‌మాధానాలు వ‌చ్చాయంట. కొంద‌రైతే ప‌రిశోద‌కులే బిత్త‌ర‌పోయే స‌మాధానాల‌ను చెప్పారంట. అందులో టాప్ 5 స‌మాధానాలు ఇదిగో….
timthumb_by_leccia-d7umlng
1. శారీర‌క ఆక‌ర్ష‌ణ‌
రెండు విభిన్న ధృవాల మ‌ధ్య ఆకార్ష‌ణ ఎక్కువ‌. ఈ విష‌యం కొత్త‌గా చెప్పేది కాక‌పోయినా.. స్త్రీకి పురుషుడి మీద ఆశ, కోరిక పెర‌గ‌డానికి కార‌ణం ఈ శారీర‌క ఆక‌ర్షణే అని మ‌రో సారి తేలింది. పార్ట్ న‌ర్ ఆక‌ర్షించినపుడు త‌మ లో శృంగార కోరిక‌లు తార స్థాయికి చేరుతాయ‌ని ఎక్కువ మంది స్త్రీలో పేర్కోన్నారు. సెక్స్ కోరిక‌ల‌కి ప్ర‌ధాన కార‌ణం ఆక‌ర్ష‌ణ అని వారి చెపుతున్నారు.
2. ప్రేమ‌
పురుషుడి మీద‌ ప్రేమను శృంగారం ద్వారా వ్యక్తీకరించడం రెండ‌వ కార‌ణం. ప్రేమను ప్రదర్శించడానికి కూడా శృంగారం ఒక గొప్ప మార్గమని మగువలు నమ్ముతున్నారట.
o-first-year-of-marriage-facebook
3.లైంగిక తృప్తి
స్త్రీలు శృంగారంలో కలిగే మధురానుభూతి రతికి ప్రేరేపిస్తుందని చెప్పారట. లైంగిక తృప్తి శృంగారంలో అల్టిమేట్ అని మ‌గువ‌లు కితాబిచ్చారు.
4. ఆనందం
ఈ కార‌ణాన్ని ఎక్కువ మంది స్త్రీలు ఒప్పుకున్నారంట‌. సెక్స్ లో శ‌రీరం ఆనందాన్ని పొందుతుంద‌ని త‌మ శారీర‌క ప్ర‌గ‌తి ఎక్కువ‌గా ఉన్న‌ట్టు అనిపిస్తుందని మ‌హిళ‌లు చెపుతున్నారు.
married
5. సెక్స్ ను ఆట‌గా భావించడం
పురుషుల కంటే స్త్రీలు ఇది ఒక మాంచి కిక్కిచ్చే ఆట‌గా ప‌రిగ‌ణిస్తారంటా. సెక్స్ లో ఉన్న‌ప్పుడు ప్రేమ‌లో ఉన్నామనే భావన ఎక్కువ ఉంటుంద‌ని స్త్రీలు చెప్పుకొచ్చారు.
ఇక శృంగారం ద్వార పిల్ల‌లు క‌నే ఆలోచ‌న విష‌యానికి వ‌స్తే 72 శాతం మంది మాత్ర‌మే ఇందుకు టాప్ టెన్ లో చోటు ఇచ్చిన‌ట్టు చెప్పారు. పిల్ల‌ల కావాల‌ని శృంగారంలోకి వెళితే ఆనందం దొర‌క‌ద‌ని 12 శాతం తెలిపిన‌ట్టు ప‌రిశోధకులు చెబుతున్నారు.

108 సంఖ్య పవర్ అంతా ఇంతా కాదు!! ప్రపంచానికే సైన్స్ ను పరిచయం చేసిన హిస్టరీ ఆ సంఖ్యది.

108 ఈ సంఖ్య చెప్ప‌గానే ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది ప్ర‌భుత్వ‌ అంబులెన్స్. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిలో ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే అంబులెన్స్ వాహ‌నానికి ఆ నెంబ‌ర్ నే ఎందుకు పెట్టారు?. ప్రాణాలు నిలిపేంత శ‌క్తి ఈ సంఖ్య‌కు ఉందా.. గుడిలో 108 ప్ర‌ద‌క్షిణాలు చేస్తే కోరిన కోరిక‌లు తీరుతాయ‌ని న‌మ్మ‌డం వెనుకున్న ర‌హ‌స్యం ఏంటి..? దేవుని నామ‌స్మ‌ర‌ణ‌లో ఉండే పూస‌ల సంఖ్య 108 ఎందుకు ఉంటాయి.? అస‌లు ఈ సంఖ్య వెనుకున్న మ‌ర్మం ఏంటి.. హిందు ధ‌ర్మం చెపుతున్న ర‌హ‌స్యం ఏంటి..?
హింధు ధ‌ర్మం ప్ర‌కారం..
క‌ష్టాల క‌డ‌లిలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి దీక్ష‌తో న‌మ్మ‌కంతో అష్టోత్తరశతనామావళి పఠిస్తే దేవుడు క‌రుణిస్తాడ‌ని న‌మ్మ‌కం. అందుకు జ‌ప‌మాల‌తో నామ‌స్మ‌ర‌ణ చేయవ‌ల‌సి ఉంటుంది. అయితే ఆ జ‌ప‌మాల‌లో స‌రిగ్గా 108 పూస‌లు ఉంటాయి. అనాథిగా ఈ ఆచారం కొన‌సాగుతూ వ‌స్తుంది. 108 సార్లు దేవుడి నామ‌స్మ‌ర‌ణ చేయ‌డం ద్వారా మ‌న‌సుకు.. మ‌నిషికి ప్ర‌శాంత‌త ల‌భిస్తుంద‌నేది నిజం. మ‌రి కొన్ని మ‌తాల్లో కూడా ఈ జ‌ప‌మాల సంప్ర‌దాయం ఉంది.
the-benefits-of-chanting-japam-1
అమృతం పుట్టుక‌కు కార‌ణం 108..
క్షీరసాగరమథనంలో 54 మంది రాక్షసులు, 54 దేవగణాలు ఇరువైపుల ఉండి సాగ‌రాన్ని చిలికితే అమృతం వెలికి వచ్చింది. అయితే ఇందులో ముందుగా విషం వ‌చ్చింద‌న్న‌ది తెలిసిన స‌త్య‌మే. అయినా విశ్రమించ‌కుండా సాగ‌ర‌మ‌థ‌నాన్ని కొన‌సాగించారు. చివ‌ర‌న పుట్టిందే అమృతం. ఈ 108 సంఖ్య మనిషిలోని మంచీ, చెడు లక్షణాల‌ను రెండుగా వేరు చేస్తుంద‌ని శాస్త్రం చెపుతోంది. ఈ సంఖ్య బ‌లంతో మంచిది పైచేయి అయి మ‌నిషి అమృతమయమైన మోక్షాన్ని సాధించగలుగుతాడ‌ని చెపుతోంది.
kurma
108 లోనే ప్ర‌పంచం..
కేవ‌లం హింధు ధ‌ర్మం.. హిందు దేశంలోనే కాదు ఈ సంఖ్య‌ను పాశ్చ‌త్య దేశాలు కూడా పాటిస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక‌త అస‌లు పుట్ట‌నే పుట్ట‌ని స‌మ‌యంలో వందల ఏళ్ల క్రితమే భార‌త్ ఖగోళశాస్త్రం పై ప‌ట్టు సాధించింది. ఇందుకు సాక్ష్యం ఇప్పుడు మ‌నం ఫాలో అవుతున్న సైన్స్. భార‌తీయ ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు పదిహేను వందల సంవత్సరాల క్రితమే సూర్యసిద్ధాంతం ద్వారా విశ్వంలో చిట్ట‌చివ‌రన ఉన్న శ‌ని గ్ర‌హం చుట్టు కొల‌త క‌నుగొన్నారు. సూర్యుడికి భూమి కి మ‌ధ్య కొల‌త‌ల‌ను ఖ‌చ్చితంగా లెక్క‌క‌ట్ట‌గ‌లిగారు. ఆ లెక్క‌ల్లోని సంఖ్యే 108. సూర్యుని చుట్టుకొలతను 108 గుణిస్తే భూమికీ, సూర్యునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. చంద్రుని చుట్టుకొలతను 108తో గుణిస్తే భూమికీ, చంద్రునికీ మధ్య ఉన్న దూరం వస్తుంది. అంతే కాదు సూర్యుడు దాదాపు భూమికి 108 రెట్లు పెద్దగా ఉంటాడ‌ని కూడా 15 వంద‌ల సంత్స‌రాల క్రిత‌మే మ‌న భార‌తీయులు తెల్చేశారు. దీంతో 108 పై శాస్త్ర‌వేత్త‌లకు సైతం పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని స‌మాచారం.
108-1
పుట్టుక నుంచి చావు వ‌ర‌కు 108..
హిందు సంప్ర‌దాయం ప్ర‌కారం వ్య‌క్తి పుట్టుక‌ను 108 సంఖ్య తెలియజేస్తుంది. 27 నక్షత్రాల‌ను నాలుగేసి పాదాలతో భాగిస్తే 108 పాదాలు వస్తాయి. దీంతో పుట్టిన ప్ర‌తి ప్రాణి 108 వర్గాలలో ఏదో ఓ వ‌ర్గానికి ప్ర‌తిబింబ‌మే అని చెపుతోంది శాస్త్రం. ఇక చావు కూడా కాని ఈ సంఖ్య వెనుకున్న పూర్తి ర‌హ‌స్యాల‌ను మాత్రం ఇప్ప‌టికి ఎవ‌రు బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌లేక‌పోయారు. ఈ సంఖ్య కి మ‌నిషి కి జీవితంలో ఎక్క‌డో ఓ సంబందం ఉంద‌ని మాత్రం అర్థం అవుతుంది. న‌మ్మిన వారికి బ‌లాన్నిచ్చే సంఖ్య న‌మ్మ‌కం లేని వారికి కూడా స‌హ‌యం చేసే ప్రాణ దాత 108. చివ‌ర‌గా చెప్పేది 108 గురించి తెలిసింది గోరంత తెలియాల్సింది కొండంత.

మరో బాలీవుడ్‌ నటి ప్రేమలో జహీర్‌?



భారత్‌లో బాలీవుడ్‌కు, క్రికెటర్లకు మధ్య అనుబంధం ఇప్పటిది కాదు. వారి మధ్య ప్రేమలు, పెళ్లిల్లు సాధారణమే. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ ఆలీఖాన్‌ తల్లిదండ్రులైన మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి, షర్మిలా ఠాగూర్‌ల ప్రేమాయణం నుంచి నేటి విరాట్‌ కోహ్లీ, అనుష్కా శర్మల లవ్‌స్టోరీ వరకు మనకు పరిచయమే. ఇటీవలె డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌, నటి హాజెల్‌ కీచ్‌లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
తాజాగా ఈ జాబితాలో టీమిండియా మాజీ ఫాస్ట్‌బౌలర్‌ జహీర్‌ఖాన్‌ చేరినట్టు సమాచారం. జహీర్‌ ఇంతకుముందే ఇషా శర్వాణీ (కిస్నా ఫేమ్‌) అనే బాలీవుడ్‌ హీరోయిన్‌తో ప్రేమాయణం సాగించాడు. అయితే ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇప్పుడు జహీర్‌ మరో బాలీవుడ్‌ హీరోయిన్‌కు దగ్గరైనట్టు సమాచారం. ఆమె ఎవరో కాదు షారూక్‌ నటించిన ‘చక్‌ దే ఇండియా’లో నటించిన బెంగాలీ నటి సాగరికా ఘట్గే. జహీర్‌, సాగిరకలు ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. వీరిద్దరూ జంటగా యువరాజ్‌ పెళ్లి వేడుకకు కూడా హాజరై కనువిందు చేశారు. 
యువీకి వివాహ శుభాకాంక్షలు చెప్పిన క్రికెటర్‌ రోహిత్‌ శర్మ.. నెక్ట్స్‌ జహీరే అని ట్వీట్‌ చేశాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్‌ త్వరలోనే సాగిరకతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు కోడై కూస్తోంది బాలీవుడ్‌ మీడియా.

పార్టీలో రచ్చరచ్చ చేసిన సైఫ్ అలీఖాన్ కూతురు!

బాలీవుడ్‌లో స్టార్ హీరోహీరోయిన్ల కొడుకులు, కూతుళ్లకు స్వేచ్ఛ మరీ ఎక్కువైపోయినట్టుంది. రోజూ పార్టీలు చేసుకుంటూ డబ్బుంది కదా అని పబ్బుల్లో గడిపేస్తున్నారు. కొందరైతే శ్రుతిమించిపోయి బాయ్‌ఫ్రెండ్స్‌ను తల్లిదండ్రుల కళ్ల ముందే వెంటేసుకుని తిరుగుతున్నారు. డబ్బున్న వారికి ఇలాంటివన్నీ సహజం అని సమర్థించినా, కొందరు స్టార్ హీరోలు, హీరోయిన్లు మాత్రం బిడ్డల ప్రవర్తనతో బాధపడుతున్నారు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీఖాన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అమితాబ్‌బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా 19వ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ పార్టీలో బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్ల పిల్లలదే హవా. జావిద్ జాఫ్రీ కూతురు అలవియా జాఫ్రీ, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ ఈ పార్టీలో హంగామా చేశారు. ఫుల్లుగా తాగుతూ, ఒకరికొకరు ముద్దులు పెట్టుకుంటూ మత్తులో నానా హంగామా చేశారు. ఇప్పుడీ ఫోటోలు వీరి కుటుంబాలకు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయి

ప్రభువు ఎవరు?

ఏసు ఎవరు? లోక రక్షకుడా? కేవలం ఒక కార్యాన్ని నిర్వర్తించటానికి వచ్చిన దైవదూతా? లేక ఎప్పుడూ మనని కనిపెట్టి ఉండే దేవుడా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం బైబిల్‌లో దొరుకుతుంది..

‘నేనే ద్వారమును.. నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును’ (యోహాను 10:9) ఈ వాక్యాన్ని విడివిడిగా విశ్లేషిస్తే క్రీస్తుతత్వం అర్థమవుతుంది.

నేనే ద్వారమును: యొహోవాను చేరటానికి ఏసు తప్ప వేరే మార్గము లేదు. ఆయన సూచించిన మార్గంలో ప్రయాణిస్తే ఎలాంటి అలసట ఉండదు. మెరుగైన జీవితం పొందగలుగుతారు. దైనందిక జీవితంలో శాంతి, సంతోషాలు లభిస్తాయి. ఇవన్నీ కావాలంటే ఏసు అనే ద్వారం నుంచే అందరూ ప్రవేశించాలి.

‘ఎవడైనను’- అనే పదాన్ని ఉపయోగించటం ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అవసరాలను తానే తీరుస్తాననే భరోసాను క్రీస్తు ఇస్తున్నాడు.

‘రక్షింపబడినవాడై’- ఈ ప్రపంచంలో అడుగడుగునా అనేక ప్రమాదాలుంటాయి. వీటిన్నింటినీ సురక్షితంగా దాటాలంటే అపరిమితమైన ప్రేమ, కరుణలతో పాటుగా అభేధ్యమైన శక్తి కూడా అవసరం. వీటన్నింటినీ మనకు క్రీస్తు ప్రసాదిస్తాడు. ఆయన సహవాసంలో జీవించేవారు తప్పకుండా రక్షణ పొందుతారు. ఆయన సున్నిత హస్తాలు, మృదువైన మనసు, తేజోవంతమైన వర్ఛస్సును అనుభూతి చెందగలుగుతారు. కాబట్టే ‘ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడును’ అని ప్రభువు సెలవిచ్చాడు. నిజాయితీగా మనను మనం క్రీస్తుకు అర్పించుకుంటే- ఆయన మన తరపున పోరాడతాడు.

‘లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచుండును’-
అనే వాక్యం లోపల నిగూఢమైన అర్థం ఉంది. ఈ వాక్యంలో మనిషి ఆనందంగా జీవించటానికి అవసరమైన భద్రత, వనరులు, పని- ఈ మూడింటినీ తానే అందిస్తానని క్రీస్తు చెబుతున్నాడు. అంతే కాకుండా గొర్రెలమైన మనల్ని దారి తప్పకుండా ఒక క్రమపద్ధతిలో ముందుకు తీసుకుపోయే బాధ్యతను కూడా ప్రభువు తనపై వేసుకున్నాడు.

ఈ వాక్యం ఆధారంగా చూస్తే నిజాయితీగా ప్రభువును స్తుతించటం ద్వారానే నిజమైన సుఖసంతోషాలు లభిస్తాయనే విషయం అర్థమవుతుంది.
 
ఆయన సున్నిత హస్తాలు, మృదువైన మనసు, తేజోవంతమైన వర్ఛస్సును అనుభూతి చెందగలుగుతారు. నిజాయితీగా మనను మనం క్రీస్తుకు అర్పించుకుంటే- ఆయన మన తరపున పోరాడతాడు.