cricket ad

Saturday 10 December 2016

16 మంది అమ్మాయిల‌ని ముట్టుకోకుండానే గ‌ర్భ‌వ‌తుల‌ను చేశాడు..!

టైటిల్ చ‌ద‌వ‌గానే షాక్ అవుతున్నారా. అవును టైటిల్ లో మేము చెప్పింది నిజ‌మే. ఓ 17 ఏళ్ల అబ్బాయి అస‌లు అమ్మాయిల‌ను ముట్టుకోకుండానే గ‌ర్బ‌వ‌తులను చేశాడు. అందులోను వారంతా 16 నుండి 18 ఏళ్ల అమ్మాయిలు కావ‌డం మ‌రింత షాక్కి గురి చేసే విష‌యం. అయితే ఈ వింత ఎలా చోటు చేసుకుంది.? ఎక్క‌డ జ‌రిగింది.? అస‌లు ప్ర‌పంచ వైద్య చ‌రిత్ర‌లో ఇలా జ‌రిగే అవ‌కాశాలున్నాయ‌..? తెలుసుకుందా.sasa
అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ వింత చోటు చేసుకుంది. వీకెండ్ పార్టీలో భాగంగా 16 మంది అమ్మాయిలు స్మిమింగ్ చేసేందుకు స్మిమింగ్ పూల్ లో దిగారు. అందులోను అంద‌రూ 20 ఏళ్ల లోపు అమ్మాయిలే అయితే వారంతా ఒక నెల త‌రువాత ప్రెగెన్సీ పొందామ‌ని షాక్ కు గురయ్యారు. దానికి కార‌ణం ఓ అబ్బాయి. అయితే ఆ అబ్బాయి వీళ్ల ఎవ‌రితో కూడా శృంగారంలో పాల్గొన‌లేదు. కానీ వీళ్లంద‌రిని మాత్రం గ‌ర్భ‌వ‌తుల‌ను చేశాడు. అస‌లు ఇదేలా జ‌రిగిందంటే. ఆరోజు అమ్మాయిలంద‌రు స్మిమింగ్ పూల్ లో స్నానానికి వెళ్ల‌క‌ముందు.. టోమి క‌ల్ట‌ర్ అనే 17 ఏళ్ల వ‌య‌సున్న‌ అబ్బాయి స్మిమ్మింగ్ ఫూల్ లో వీర్య స్క‌ల‌నం చేశాడు. అది కాస్త ఆ త‌రువాత స్నానం చేసిన అమ్మాయిలను గ‌ర్భం దాల్చేలా చేసింది. అయితే నీటిలో స్క‌ల‌నం అయిన వీర్యంతో గ‌ర్భం ఎలా వ‌చ్చింద‌నే క‌దా. అక్క‌డికే వ‌స్తున్నాం.. టోమి స్మెర్మాపోర్టిస్ అనే అరుదైన వ్యాధితో భాద‌ప‌డుతున్నాడంట. ఈ వ్యాధి ప్ర‌పంచంలో ల‌క్ష మందిలో ఇద్ద‌రికి మాత్ర‌మే వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు వైద్యులు. ఈ వ్యాది సోకిన వ్య‌క్తి వీర్యం మిగ‌తా పురుషుల వీర్యంతో పోలిస్తే వేల రెట్ల శ‌క్తిని క‌లిగి ఉంటుందంట. అందులోను వీర్య కణాల వేగం కూడా ఎక్కువే అని చెపుతున్నారు. నీటిలో ఈ వీర్య‌క‌ణాలు అంత ఈజీగా చనిపోవ‌ని.. వాట‌ర్ రెసిస్టెన్సీ ప‌వ‌ర్ కూడా ఎక్కువే అని చెపుతున్నారు వైద్యులు. ఈ కార‌ణంగానే ఆ ప‌ద‌హారు మంది అమ్మాయిలు గ‌ర్భం దాల్చార‌ని గుర్తించారు.girls
విష‌యం ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చిందంటే..
గ‌ర్భం దాల్చిన అమ్మాయిలంతా ఒకే కాలేజికి చెందిన వారు కావ‌డం.. ఒకే సారి గ‌ర్భం రావ‌డంతో ఆందోళ‌న చెందారంట‌. వెంట‌నే డాక్ట‌ర్ను సంప్ర‌దించి జ‌రిగిందంతా చెప్పారు. విష‌యం తెలుసుకున్న డాక్టర్ కూడా షాక్ కి గుర‌య్యాడంట‌ అస‌లు సెక్స్ లో పాల్గొన‌కుండా గ‌ర్భం రావ‌డం ఏంట‌ని ఆలోచించి.. టెస్ట్ ల కోసం డా. జాన్ సుజికిమో.. థ‌లాసి మెమోరియ‌ల్ హ‌స్పిట‌ల్ ను సంప్ర‌దించుమ‌ని స‌ల‌హ ఇచ్చాడంట‌. దీంతో ఆ 16 మంది అమ్మాయిల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన డా.జాన్ సుజికిమో అస‌లు విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. దీంతో అస‌లు విషయం తెలుసుకున్న‌ అమ్మాయిలు అబార్ష‌న్ చేసుకునేందుకు సిద్ద‌ప‌డ్డారు. అయితే ఇందులో ఓ ముగ్గురు మాత్రం త‌మకు వ‌చ్చిన ఈ అదృష్ట గ‌ర్బాన్ని ఇలాగే ఉంచుకుంటామ‌ని తెలిపారు.boy
అయితే ఇంత మంది గ‌ర్భానికి కార‌ణ‌మైన ఈ కుర్రాడు మాత్రం ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు. త‌న వ‌ర్జినిటి ఇంకా అలాగే ఉన్నందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా అని చెపుతున్నాడు. ఈ ఘ‌ట‌న గ‌త ఏడాది పిబ్ర‌వ‌రి లో చోటు చేసుకుంది. టోమి ఇప్పుడు న‌లుగురు పిల్ల‌ల తండ్రి కూడా. వింత అంటే ఇదే మ‌రీ.

15 ఏళ్ళుగా మౌనంగా భరిస్తున్న నరకాన్ని ఎడమకాలితో తన్నింది.!! హ్యాట్సాఫ్ పాయల్.

ఉద‌యాన్నే 4 గంట‌ల‌కు లేవ‌డం… రాత్రి ఇంట్లో వంట‌లు వండిన గిన్నెలు, తిన్న ప్లేట్లు క‌డ‌గడం… ఇళ్లంతా శుభ్రం చేయ‌డం, వంట చేయ‌డం… మిగ‌తా ఏవైనా ప‌నులు ఉంటే పూర్తి చేసుకుని… అంద‌రూ ఉద‌యాన్నే తిన్నాక మిగిలింది ఎంత ఉన్నా తిని స్కూల్‌కు వెళ్ల‌డం… సాయంత్రం రాగానే తిరిగి అదే ప‌ని కంటిన్యూ చేయ‌డం… రాత్రి మ‌ళ్లీ అంద‌రూ తిన్నాక మిగిలితే ఇంత తిన‌డం, లేదంటే ప‌స్తుతో ప‌డుకోవ‌డం… తెల్ల‌వార‌గానే తిరిగి య‌థావిధిగా ప‌ని… స్కూల్‌… ఇదీ… ఒక‌ప్పుడు ఆ యువ‌తి దుస్థితి..! 15 ఏళ్లుగా అలా న‌ర‌క యాత‌న అనుభ‌వించింది. ఎవ‌రి ద‌గ్గర ఉన్నా అదే ప‌ని. అందులో మార్పు లేదు. దీనికి తోడు వారు పెట్టే చిత్ర‌హింస‌లు. వీట‌న్నింటినీ మౌనంగానే త‌ట్టుకుంది. క‌ట్ చేస్తే… ఇప్పుడు సొంతంగా జాబ్ చేస్తూ త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డి స్వేచ్ఛ‌గా జీవిస్తోంది ఆ యువ‌తి..!
payal
ఆమె పేరు పాయ‌ల్‌. వ‌య‌స్సు 4 సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు. దీంతో బంధువులే దిక్క‌య్యారు. మొద‌ట ఆమెను త‌న మామ‌య్య తీసుకెళ్లాడు. కొద్ది రోజుల వ‌ర‌కు సొంత పిల్ల‌ల్ని చూసిన‌ట్టుగానే చూశారు. కానీ ఆ త‌రువాతే పాయ‌ల్ జీవితం ప‌ని మ‌నిషి క‌న్నా హీన‌మైంది. పైన చెప్పాం క‌దా..! నిత్యం అదే జీవితం… ఈ క్ర‌మంలో ఆమె మాన‌సికంగా కుంగి పోయింది. కొద్ది రోజులు వ‌రుస‌కు అక్క అయ్యే ఒకావిడ ద‌గ్గ‌ర ఉంది. అక్క‌డ కూడా ఇదే ప‌రిస్థితి. అలా బంధువులంద‌రి ఇళ్లలో పాయ‌ల్ ఉంటూ వ‌చ్చింది. అయినా ఆమె ప‌రిస్థితిలో ఏమీ మార్పు లేదు. నిత్యం ఒళ్లు అలిసేలా ప‌నిచేయ‌డం, వారి చేతుల్లో చిత్ర హింస‌ల‌కు గుర‌వ‌డం. ఈ క్ర‌మంలో పాయల్ ఒక్క‌టే అనుకుంది. ఎలాగైనా చ‌దువుకుని త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డాల‌ని. వెంట‌నే ఆ నిర్ణ‌యాన్ని అమ‌లులో పెట్టింది. ప‌ని చేసుకునేందుకు ఉద‌యం 4 గంట‌ల‌కే లేచి త్వ‌ర‌గా అన్ని ప‌నులు ముగించుకుని స్కూల్‌కు వెళ్లి సాయంత్రం ఇంటికి వ‌చ్చి మ‌ళ్లీ ప‌ని చేసుకుని తీరిక వేళల్లో చ‌దివేది. ఈ క్ర‌మంలో విద్యాభ్యాసం ఎలాగో ఆమె పూర్తి చేసింది.
అలాంటి ప‌రిస్థితిలో ఆమెకు ఈతాషా అనే ఓ స్వ‌చ్ఛంద సంస్థ తార‌స‌ప‌డింది. వారు పాయ‌ల్ లాంటి యువ‌తుల‌కు కంప్యూట‌ర్స్‌, డేటా ఎంట్రీ వంటి కోర్సుల‌ను నేర్పించి ఉద్యోగం చూపిస్తారు. అందులో పాయ‌ల్ కూడా శిక్ష‌ణ తీసుకుంది. ఈ క్ర‌మంలో ఆమెకు శిక్షా కేంద్ర అన‌బ‌డే ఓ ఎన్‌జీవోలో ఉద్యోగం వ‌చ్చింది. అక్క‌డే రిసెప్ష‌నిస్ట్‌గా ఆమె ఇప్పుడు ప‌నిచేస్తోంది. ఇప్పుడామెకు 19 ఏళ్లు. సొంతంగా త‌న కాళ్ల‌పై నిల‌బ‌డింది. ప‌నిచేసుకుంటోంది. నెల తిరిగే స‌రికి జీతం పొందుతోంది. మునుప‌టిలా ప‌నిచేసే బాధ లేదు. మానసిక వేద‌న‌, చిత్ర హింస‌లు అంత‌క‌న్నా లేవు. ఇలాగే మ‌రికొన్ని సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డి, పైసా పైసా కూడ‌బెట్టి పెళ్లి చేసుకుంటానంటోంది పాయ‌ల్‌..! ఆమె క‌ల‌లు సాకారం కావాల‌ని, మ‌రింత ఉన్న‌త స్థానాల‌కు ఆమె ఎద‌గాల‌ని మ‌నం కూడా ఆశిద్దాం..!

శ్రీ‌మ‌హావిష్ణువుకు నారాయ‌ణుడనే పేరు ఎలా వ‌చ్చిందో తెలుసా..?…

లోక క‌ల్యాణం కోసం శ్రీ‌మ‌హావిష్ణువు 10 అవ‌తారాలను ధ‌రించాడు. అందులో కొన్ని అవ‌తారాల‌తో జ‌నావ‌ళికి మేలు చేయ‌గా, మ‌రికొన్ని అవ‌తారాల్లో రాక్ష‌స సంహారం చేసి జ‌నాల‌ను, దేవ‌త‌ల‌ను ర‌క్షించాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ధ‌రించిన ఒక్కో అవ‌తారం గురించి అనేక క‌థ‌లు కూడా ఉన్నాయి. పురాణాల్లో వీటి గురించి వివ‌రంగా తెలియ‌జేశారు కూడా. అయితే శ్రీ‌మ‌హావిష్ణువు ఆయ‌న ధ‌రించిన అవ‌తారాల్లోనే కాదు, అనేక ఇత‌ర వేరే పేర్ల‌తో కూడా భ‌క్తుల‌చే పొగ‌డ్త‌లు, కీర్త‌న‌లు, ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. అందులో ఒక పేరే నారాయ‌ణుడు. ఇంత‌కీ ఆయ‌న‌కు ఆ పేరు ఎలా వ‌చ్చిందంటే…
vishnu
ప్రాణికోటి మ‌నుగ‌డ‌కు నీరు అత్యంత ఆవ‌శ్య‌కం. నీరు లేక‌పోతే మ‌నం లేము. అయితే నారాయ‌ణుడు అన్న పేరులో నారము అంటే నీరు అనే అర్థం వ‌స్తుంది. అదేవిధంగా ఆయ‌ణుడు అంటే దారి చూపే వాడు అని అర్థం వస్తుంది. అంటే స‌మ‌స్త ప్రాణికోటికి నీటిని అందించే వాడు క‌నుక‌నే విష్ణువుకు నారాయ‌ణుడ‌నే పేరు వ‌చ్చింది. అంతేకాదు, విష్ణువు నీటి నుంచి ఉద్భ‌వించిన‌ట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకు కూడా ఆయ‌న్ను నారాయ‌ణుడ‌ని పిలుస్తారు.
అయితే పైన చెప్పినవే కాకుండా విష్ణువును నారాయ‌ణుడ‌ని పిల‌వ‌డానికి ఇంకొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే… నారదుడు ఎల్ల‌ప్పుడూ నారాయ‌ణ‌… నారాయ‌ణ‌… అంటూ స్మ‌ర‌ణ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో విష్ణువును నారాయ‌ణుడని పిల‌వ‌డం మొద‌లుపెట్టార‌ట‌. అదేవిధంగా గంగాన‌ది విష్ణువు పాదాల నుంచి ఉద్భ‌వించ‌డం వ‌ల్ల విష్ణు పాదోదకం అని పేరు వ‌చ్చింద‌ట‌. దీంతోపాటు విష్ణువు ఎల్ల‌ప్పుడూ నీటిలో నివ‌సిస్తాడు కాబ‌ట్టి ఆయ‌న‌కు నారాయ‌ణుడ‌నే పేరు వ‌చ్చింది..!

అపోలో ఆస్ప‌త్రిలో జ‌య చివ‌రి సారిగా మాట్లాడిన మాట‌లివే..!

ఈ ఏడాది గత సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌య‌ల‌లిత తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆస్ప‌త్రిలో చేరిన ద‌గ్గ‌ర్నుంచీ, మొన్నా మ‌ధ్య ఆమె మృతి చెందిన రోజు వ‌ర‌కు జ‌రిగిన అనూహ్య ప‌రిణామాల‌న్నింటినీ మ‌నం గ‌మ‌నిస్తూనే వ‌స్తున్నాం. ఈ క్ర‌మంలోనే అమ్మ మృతి ప‌ట్ల ప‌లు పుకార్లు షికార్లు కూడా చేస్తున్నాయి. వాటిలో వాస్త‌వ‌మెంతో తెలియ‌దు కానీ… ఇప్పుడు అలాంటిదే మ‌రో వార్త నెట్‌లో, ప్ర‌ధానంగా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ సృష్టిస్తోంది. నిజానికి అది వార్త కాదు. ఓ ఆడియో క్లిప్‌. జ‌య‌ల‌లిత హాస్పిట‌ల్‌లో ఉన్న‌ప్పుడు త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడిన చివ‌రి మాట‌లుగా అవి ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అందులో జ‌య‌ల‌లిత త‌మిళంలో మాట్లాడుతున్న‌ట్టుగా కూడా ఉంది. ఈ క్ర‌మంలో ఆ ఆడియో క్లిప్‌లో అమ్మ మాట్లాడిన మాట‌ల‌కు తెలుగు వెర్ష‌న్ ఇదే..! ఆ మాట‌ల‌ను ఇప్పుడు చూద్దాం..!
jayalalitha
‘అంద‌రికీ పాదాభివంద‌నం. న‌మ‌స్కారం. నేను మీ అమ్మ‌ను మాట్లాడుతున్నా. నా ఆరోగ్యం బాగు ప‌డాల‌ని ప్రార్థించే అంద‌రికీ హృద‌య పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. దేవుడు మీ మంచి మ‌న‌స్సుల కోసం న‌న్ను ఆరోగ్యంగానే ఉంచాడు. కొంత విశ్రాంతి త‌రువాత మీ ముందుకొచ్చి మాట్లాడే గుండె ధైర్యాన్ని ఆ భ‌గవంతుడు నాకు ఇచ్చాడు. నా ఆరోగ్యం గురించి వ‌చ్చే వ‌దంతుల‌ను న‌మ్మ‌వ‌ద్దు. నా ఆరోగ్యం గురించి ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా రాద్ధాంతం చేస్తున్నాయి. వాటి గురించి మీరు అధైర్య ప‌డ‌వ‌ద్దు. ఎప్పటికీ మ‌న పార్టీయే అధికారంలో ఉంటుంది. నా ర‌క్తానికి ర‌క్త‌మైన అన్న అభిమానుల‌కు మ‌రియు ప్ర‌జ‌ల గుండెల్లో నా మీద ప్రేమ ఉన్నంత వ‌ర‌కు నేను ఆరోగ్యంగానే ఉంటా. నేను ఇంత‌కు ముందు చెప్పిన‌ట్టు మీ కోస‌మే నేను బ్ర‌తికి ఉంటా. ఏవిధంగా అయితే నన్ను సీఎంగా గెలిపించారో అదేవిధంగా మ‌ళ్లీ న‌న్ను గెలిపిస్తార‌ని న‌మ్ముతున్నాను. ఈ నెల 17, 19 తారీఖుల్లో జ‌రిగే మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో మెజార్టీ సీట్ల‌తో న‌న్ను గెలిపించుకుంటార‌ని ఆశిస్తున్నా.”
ఇవీ జ‌య ఆస్ప‌త్రిలో ఉన్న‌ప్పుడు చివ‌రి సారి జ‌నాల‌ను ఉద్దేశించి మాట్లాడిన‌ట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్ సారాంశం. అయితే వాస్త‌వానికి ఈ ఆడియో క్లిప్‌లో ఉన్నది జ‌య గొంతుకేనా, లేదా ఆమెను ఇమిటేట్ చేస్తూ ఎవ‌రైనా మిమిక్రీ చేశారా అన్న‌ది మాత్రం తెలియ‌దు. కానీ ఇది రాబోయే ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని జ‌య అనుకూల వ‌ర్గాలు బ‌య‌టికి రిలీజ్ చేసిన క్లిప్ అని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఇందులో ఉన్న నిజం ఎంత అనేది ఆ దేవుడికే తెలియాలి..!

ఇలా చేస్తే 2 వారాల్లోనే మీ ముఖం అందంగా మారుతుంది..! పైసా ఖ‌ర్చు ఉండ‌దు..!

ముడ‌తలు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు లేని అంద‌మైన ముఖం కావాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండ‌దు చెప్పండి. నేటి త‌రుణంలో అయితే ఆడ‌, మ‌గ అంద‌రూ త‌మ ముఖార‌విందాలు అందంగా క‌నిపించాల‌ని కోరుకుంటున్నారు. అందుకు తగిన విధంగానే ర‌క ర‌కాల ప‌ద్ధతుల‌లో త‌మ ముఖాన్ని అందంగా క‌నిపించే విధంగా చేసుకుంటున్నారు. ఇందు కోసం వారు బ్యూటీపార్ల‌ర్ల‌ను ఆశ్ర‌యించ‌డం లేదంటే వివిధ ర‌కాల క్రీములు గ‌ట్రా రాయ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అయితే అలాంటి బాధ లేకుండా కేవ‌లం ఒకే ఒక్క సింపుల్ టెక్నిక్‌తో ఎవ‌రైనా త‌మ ముఖాన్ని కేవ‌లం 2 వారాల‌లోనే అందంగా మార్చుకోవ‌చ్చు. అందుకు ఏ క్రీం కొనాల్సిన ప‌నిలేదు. ఎక్క‌డికి వెళ్లాల్సిన అవ‌స‌రం కూడా లేదు. అందుకు ఏం చేయాలంటే…
tanaka-technique
యుకుకో త‌న‌క అనే ఓ జ‌పనీస్ బ్యూటీ ఎక్స్‌ప‌ర్ట్ ‘త‌న‌క’ అనే ఓ కొత్త త‌ర‌హా మ‌సాజ్ టెక్నిక్ ను క‌నిపెట్టింది. ఇందులో కేవ‌లం చేతి వేళ్ల‌ను మాత్ర‌మే ఉప‌యోగిస్తూ నిత్యం 7 నిమిషాల పాటు ముఖాన్ని మ‌సాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా 2 వారాల పాటు రోజూ ముఖాన్ని మ‌ర్ద‌నా చేస్తే చాలు, దాంతో ముఖంపై ఉన్న ముడ‌తలు పోవ‌డ‌మే కాదు, మ‌చ్చ‌లు, మొటిమ‌లు కూడా మాయ‌మ‌వుతాయి. ముఖం మ‌రింత అందంగా, కాంతివంతంగా క‌నిపిస్తుంది. అయితే ఇలా మ‌సాజ్ చేసేందుకు ఎలాంటి క్రీం అవ‌స‌రం లేదు. ఆల్మండ్ ఆయిల్‌, ఆలివ్ ఆయిల్, కొబ్బ‌రి నూనె వంటివి ఉంటే చాలు. ఎంచ‌క్కా వాటిని ముఖానికి రాసుకుని త‌న‌క ప‌ద్ధ‌తిలో ముఖాన్ని మ‌సాజ్ చేస్తే చాలు. దాంతో ముందు చెప్పిన విధంగా అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి.

బంధువులంతా లైన్‌లో నిల‌బ‌డి… పెళ్లికూతురికి న‌గదు విత్ డ్రా చేసి ఇచ్చారు..!

పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి మ‌న దేశంలోని ప్ర‌జ‌లు ఎలాంటి అవ‌స్థ‌లు ప‌డుతున్నారో గత కొద్ది రోజులుగా మ‌నం చూస్తూనే ఉన్నాం. న‌గ‌దు స‌రిగ్గా రాక‌పోతుండ‌డంతో అన్ని వ‌ర్గాలకు చెందిన ప్ర‌జ‌ల ప‌నులు ఆగిపోతున్నాయి. అనేక రంగాల్లో కార్య‌క‌లాపాలు స్తంభించిపోయాయి. ప్ర‌ధానంగా ఇది పెళ్లిళ్ల సీజ‌న్ కావ‌డంతో చాలా మంది త‌మ త‌మ కుటుంబాల్లో జ‌ర‌గ‌నున్న పెళ్లిళ్లు ఎలా చేయాల‌నే ఆందోళ‌న‌తో ఉన్నారు. కొంద‌రు ఏకంగా వాటిని ర‌ద్దు చేసుకున్నారు. కొంద‌రు ఎలాగో అప్పు పెట్టో, బ‌తిమాలో, చెక్కులు ఇచ్చో పెళ్లిళ్లు చేశారు. కొంద‌రి పెళ్లిళ్లు ఆగిపోయాయి. అది వేరే విషయం. అయితే ఇలా పెళ్లి ఎక్క‌డ ర‌ద్దు అవుతుంద‌నుకుందో ఏమో ఆ వ‌ధువు మాత్రం త‌న పెళ్లి గురించి చాలా ఆందోళ‌నే ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు అంద‌రూ స‌హ‌క‌రించ‌డంతో వివాహ తంతు విజ‌య‌వంతంగా ముగిసింది.


 చాలా ఆందోళ‌నే ప‌డింది. అయితే ఎట్ట‌కేల‌కు అంద‌రూ స‌హ‌క‌రించ‌డంతో వివాహ తంతు విజ‌య‌వంతంగా ముగిసింది.
notes-bride
మ‌హారాష్ట్ర కొల్హాపూర్ లోని యాల్గుద్ గ్రామానికి చెందిన స‌యాలీ అనే ఓ యువతిది పేద కుటుంబం. ఆమె తండ్రి వ్య‌వ‌సాయం చేసి చాలా న‌ష్టాల్లోకి కూరుకుపోయాడు. దీంతో అత‌నికి కూతురు స‌యాలీ పెళ్లి చేయ‌డం క‌ష్టంగా మారింది. అయితే స‌యాలీ అందుకు దిగులు చెందలేదు. సొంతంగా ఉద్యోగం చేసింది. పైసా పైసా కూడ‌బెట్టింది. పెళ్లిక‌య్యే డ‌బ్బును ఎప్ప‌టిక‌ప్పుడు బ్యాంక్‌లో సేవ్ చేస్తూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ఓ కిరాణా షాపు న‌డుపుకునే యువ‌కుడితో పెళ్లి నిశ్చ‌య‌మైంది. అయితే అనుకోకుండా పెద్ద నోట్ల ర‌ద్దు బాంబ్ పడింది.
ఈ క్ర‌మంలో వైపు పెళ్లి ద‌గ్గ‌ర ప‌డుతోంది. మ‌రో వైపు చూస్తే చేతిలో ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు లేవు. బ్యాంకుకు వెళ్లినా రూ.2వేల‌కు మించి ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌న పెళ్లిపై స‌యాలీ చాలా ఆందోళ‌న‌కు గురైంది. అయితే ఆమె స్నేహితులు, ఇత‌ర బంధువులు అంద‌రూ క‌లిసి ఆమె స‌హాయం చేశారు. ఆమె అకౌంట్ నుంచి త‌మ త‌మ ఖాతాల‌కు ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా డ‌బ్బును ట్రాన్స్ ఫ‌ర్ చేసుకున్నారు. అనంత‌రం అంద‌రూ బ్యాంకులు, ఏటీఎంల వ‌ద్ద లైనులో నిలుచుని మ‌రీ స‌యాలీకి న‌గ‌దును తీసి ఇచ్చారు. దీంతో ఆమె అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పుకుంది. త‌న ప‌క్క‌నున్న వారి ఇంత‌లా స‌హాయ ప‌డ‌తాన‌ని ఊహించలేద‌ని, ఏది ఏమైనా చివ‌ర‌కు త‌న‌కు మంచే జ‌రిగింద‌ని, ఆనందంలో పెళ్లి చేసుకుంది స‌యాలీ..!

వ‌ల‌స‌ల దేశం.. రెండో ప్ర‌పంచ యుద్దం త‌రువాత ఇదే రికార్డ్..

భూలోక స్వ‌ర్గ‌మంటూ ఈ దేశం ఎగిరొచ్చావా?.. పోలేక ఉండ‌లేక కంటి నీరై నిలిచావ అంటూ ఓ క‌వి రాసిన రాత‌లు అక్ష‌ర సత్యాల‌వుతున్నాయి. కుటుంబ బాధ్య‌త‌ల కోసం.. ఆర్థిక ఇబ్బందులు దాటేందుకు ఉన్న ఊరుని, క‌న్న‌త‌ల్లిని వ‌దులుకుని ప‌రాయి దేశం వెళుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే ఇందులో బ్రతుకు దెరువు కోసం కాక ప్రాణాల‌ను కాపాడుకునేందుకు ఇత‌ర దేశాల‌కు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతుంద‌ని స‌ర్వేలు చెపుతున్నాయి. అయితే ఈ రెండేళ్లల చోటు చేసుకున్న వ‌ల‌స‌ల లెక్క‌తో ఐక్య‌రాజ్య స‌మితే ఆశ్చ‌ర్య పోయింది.
Sikh carrying his wife on his shoulders as he walks with others migrating to their new homeland after the creation of Sikh and Hindu section of Punjab India due to the division of India.
ప్రపంచవ్యాప్తంగా ఆరున్నర కోట్ల మంది ప్రజలు సొంత దేశాల నుండి ప‌రాయి దేశానికి వలస వెళ్లారంటా.. రెండో ప్రపంచ యుద్ధం త‌రువాత ఇంత పెద్ద మొత్తంలో ప్రజలు స్థానభ్రంశం చెందటం ఇదే మొదటిసారని ఐక్యరాజ్యసమితి శ‌ర‌ణార్థుల‌ సంస్థ అయిన‌ యూఎన్ హెచ్ సీఆర్ ఓ నివేదికలో పేర్కొంది. వీరి సంఖ్య ప్ర‌పంచ జనాభాలో 0.8 శాతం గా ఉంద‌ని తెలిపింది. వ‌ల‌స వెళ్లిన మొత్తం జనాభా.. ఫ్రాన్స్ తో స‌మాన‌మంటా. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల జనాభా మొత్తం కలిపితే ఎంత ఉంటుందో అంత మంది జ‌నాభా వివిధ కార‌ణాల రిత్యా వ‌ల‌స వెళ్లార‌ని ఐక్య‌రాజ్య స‌మితి వెళ్ల‌డించింది. ఒక్క 2015 సంవత్సరంలోనే 58 లక్షల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వలస వెళ్లాగ.. ఇందులో పెద్ద‌ల కంటే పిల్ల‌లే ఎక్కువ‌గా ఉన్నార‌ని పేర్కోంది.
1442324724syrianrefugees-1170x740
అయితే ఎక్కువ వ‌ల‌స‌లు వెళుతున్న ప్ర‌జ‌లు సిరియా ప్రాంతానికి చెందిన వార‌ని స‌మాచారం. వీరంతా మ‌ధ్య ప్రాచ్య ప్రాంతానికి వ‌ల‌స వస్తున్నార‌ని తెలిపింది. ఇక్క‌డ‌ ప్రతి 20 మందిలో ఒకరు వలస వచ్చిన వారే ఉంటున్నారు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వలసవెళ్లిన‌ వారిలో ప్రతి 5 పౌరుల్లో ఒకరు సిరియన్ ఉన్నార‌ని తెలిపింది. అయితే శ‌ర‌ణార్థుల‌కు అధికంగా ఆశ్ర‌యం క‌లిపించిన దేశం మాత్రం టర్కీ.. గతేడాది 25 లక్షల మంది శరణార్థులకు ఈ దేశానికి ఆశ్రయం కోసం వ‌చ్చారని స‌మాచారం. శ‌రణార్థుల‌కు ఆశ్ర‌యం కల్పించ‌డంలో భార‌త్ చివ‌రి వ‌రుస‌లో ఉందంటా..?