cricket ad

Tuesday 13 December 2016

నెయ్యి పాజిటివ్ ఫుడ్….దీని వల్ల 11 అధ్భుత లాభాలున్నాయి. అవేంటో తెలుసా?

చూడ‌గానే నోరూరించే నెయ్యిని చూస్తే ఎవ‌రికి మాత్రం ఇష్టం ఉండ‌దు చెప్పండి. దాదాపుగా ఎవ‌రైనా నెయ్యిని ఇష్టంగానే తింటారు. ప‌చ్చ‌డి, ప‌ప్పు, కారం పొడి వంటి కూర‌ల్లో నెయ్యిని క‌లుపుకుని తింటే… ఆహా… అప్పుడు వ‌చ్చే రుచే వేరు క‌దా..! అలాంటి రుచిని దాదాపుగా ఏ నాన్ వెజ్ వంట‌క‌మూ ఇవ్వ‌లేదేమో. అంత‌టి టేస్ట్‌ను నెయ్యి మాత్ర‌మే అందిస్తుంది. అయితే నెయ్యి ఎంత రుచిగా ఉన్నా కొంద‌రు మాత్రం దాన్ని తినేందుకు అయిష్ట‌త‌ను ప్ర‌దర్శిస్తారు. ఎందుకంటే బ‌రువు పెరుగుతామ‌నో, లేదంటే ఇత‌ర అనారోగ్యాలు క‌లుగుతాయ‌నో చాలా మంది నెయ్యిని తినేందుకు ఆస‌క్తి చూపరు. కానీ నెయ్యి తిన‌డం వ‌ల్ల అలాంటి న‌ష్ట‌మేమీ క‌ల‌గ‌దు. అన్నీ లాభాలే ఉంటాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ghee
1. నెయ్యి ఇత‌ర నూనెల‌లా కాదు. దీన్ని తింటే జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.
2. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న వారు నేడు మ‌న దేశంలో చాలా మందే ఉన్నారు. అలాంటి వారు నెయ్యిని త‌మ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. దీంతో విట‌మిన్ ఎ పుష్క‌లంగా ల‌భించి తద్వారా నేత్ర స‌మ‌స్య‌లు పోతాయి.
3. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంద‌నే భావ‌న చాలా మందిలో ఉంది. అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచ‌దు. మంచి కొలెస్ట్రాల్‌నే పెంచుతుంది. దీంతో గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి.
4. గ‌ర్భిణీ మ‌హిళ‌లైతే నిత్యం నెయ్యిని క‌చ్చితంగా తీసుకోవాల్సిందేన‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే నెయ్యిని రోజూ తింటే దాంతో ఎన్నో కీల‌క పోష‌కాలు గ‌ర్భిణీ స్త్రీలకు ల‌భిస్తాయి. దాంతోపాటు పిండం చ‌క్క‌గా ఎదుగుతుంది కూడా.
5. నెయ్యిని రోజూ తింటుంటే ముఖం కూడా కాంతివంతంగా మారుతుంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, మొటిమ‌లు కూడా పోతాయి.
6. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు కూడా నిర్భ‌యంగా నెయ్యిని తిన‌వ‌చ్చు. అయితే మోతాదుకు మించ‌కుండా చూసుకోవాలి.
7. స్వీట్ల‌లో నెయ్యిని కాకుండా, ర‌సం, సాంబార్‌, ప‌ప్పు, కూర వంటి వాటిలో నెయ్యిని వేసి వండి ఆ వంట‌కాల‌ను తింటే దాంతో స‌హ‌జంగానే మ‌నం నెయ్యిని తిన్న‌ట్టు అవుతుంది. దాంతో పైన చెప్పిన లాభాలు కూడా క‌లుగుతాయి.



8. యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు నెయ్యిలో అధికంగా ఉన్నాయి. అందువ‌ల్ల నెయ్యిని తింటుంటే శ‌రీరంపై అయిన గాయాలు, పుండ్లు ఇట్టే త‌గ్గిపోతాయి. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ కూడా ల‌భిస్తుంది.
9. నెయ్యిని నిత్యం తింటుంటే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
10. ఆయుర్వేద ప్ర‌కారం నెయ్యి పాజిటివ్ ఫుడ్‌. ఇది మిగ‌తా కొవ్వులు, నూనెల్లా కాదు. శ‌రీరానికి ఎంతో మంచిది.
11. శ‌రీరంపై కాలిన గాయాలు ఉంటే కొద్దిగా నెయ్యిని ఆ ప్రాంతంలో రాసి చూడండి. దీంతో ఆ గాయం ఇట్టే త‌గ్గిపోతుంది.

ప్ర‌పంచంలో అత్యంత శ‌క్తి వంత‌మైన భాష‌లు ఇవే…9 వ స్థానంలో హిందీ.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నభాష‌ల మీద స‌ర్వే జ‌రిగింది. దీనిలో ప్ర‌జ‌లు అత్య‌ధికంగా ఏ భాషలు  మాట్లాడుతున్నారు. ఆర్థిక‌, సాంస్క‌తిక‌, సామాజిక, స్థానికత ఆధారంగా ప్ర‌పంచంలో ఎక్కువ ఏ భాష వాడుతున్నారు అనే అంశాల మీద స‌ర్వే నిర్వ‌హించారు. ఇంగ్లీష్ అత్యంత శక్తివంతమైన భాషల లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకోగా, చైనీస్ ( మాండరిన్) సెకెండ్ ప్లేస్ ను ఆక్రమించుకుంది. ఇక టాప్ టెన్ లో భార‌తదేశ రాష్ట్ర భాష హిందికి స్థానం ల‌భించింది. ఇండియాలో అత్య‌దికంగా మాట్లాడే ఈ హింది  అత్యంత శ‌క్తి వంత‌మైన భాష‌ల్లో 9 వ స్థానాన్ని ద‌క్కించుకుంది.
ins01
81481276654_unknown
టాప్ టెన్ లో స్థానం ద‌క్కించుకున్న భాష‌లు వ‌రుస‌గా..
1. ఇంగ్లీష్ 2. మాండరిన్ 3. స్పానిష్ 4.ఫ్రెంచ్ 5.అరబిక్ 6.రష్యన్ 7.జర్మన్ 8.పోర్చుగీస్ 9. హింది 10.జ‌పానిస్  ప్ర‌పంచ వ్య‌ాప్తంగా శ‌క్తివంతంగా  ఉన్ననాలుగు దేశాల్లో ఇంగ్లీష్ అధికార భాష‌గా ఉండ‌గా.. రానున్న రోజుల్లో ఈ సంఖ్య పెరిగే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.2050 నాటికి ఈ లిస్ట్ లో భారీ మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం లేక‌పోలేద‌ని చెపుతున్నారు. భార‌త‌దేశ భాష అయిన హింది మ‌రో రెండు స్థానాలు ఎగ‌బాకే అవ‌కాశం ఉంద‌ని.. టాప్ 1 లో మాత్రం ఇంగ్లీష్ కొన‌సాగుతుంద‌ని చెపుతున్నారు.

జంట అరటి పండ్లు తింటే…… కవలలు పుడతారా? దీని వెనకున్న సైన్స్ ఏంటి?

కడుపుతో ఉన్నవాళ్లు… జంట అరటిపండ్లను తింటే కవలలు పుడతారనే నమ్మకాన్ని కేవలం ఇండియన్సే కాదు….ఫిలిప్పైన్స్ దేశీయులు కూడా బలంగా నమ్ముతారు. ప్రెగ్నెంట్ లేడి…. తన గర్భకాలంలో తొలి మూడు నెలల్లో ఈ జంట అరటి పండ్లను తింటే వారికి ఖచ్చితంగా కవలలే పుడతారనే నమ్మకం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే సైంటిఫిక్ గా ఇది నిరూపితం కానప్పటికీ…దీనిని బలపరిచేందుకు మాత్రం ఓ సైన్స్ లాజిక్ మాత్రం పనికొస్తుంది.
సాధారణంగా అరటి పండును పోటాషియమ్ గని అంటారు. ఒక్క అరటి పండు తింటే….ఒక రోజులో మన శరీరానికి కావాల్సిన 20% పొటాషియమ్ లభిస్తుంది. ఇక గర్భిణీలకు పొటాషియమ్ అవసరమే కానీ పోటాషియమ్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తప్పవు. ఒక్క అరటిపండు తింటేనే 450 మి.గ్రాముల పొటాషియమ్ లభిస్తుంది. అదే జంట అరటి పండైతే…..900MG పొటాషియమ్….అంటే ఒక రోజులో మనకు కావాల్సిన పొటాషియమ్ లో కేవలం అరటిపండు నుండే 40% తీసుకున్నట్టు లెక్క…ఇతర ఆహార పదార్థాల ద్వారా కూడా పెద్ద మొత్తంలోనే పొటాషియం అందుతుంది. ఇది గర్భిణీ మహిళల మీద అధిక ప్రభావాన్ని చూపుతుంది. వాళ్లకు పుట్టబోయే పిల్లలపై కూడా… అందుకే గర్భిణిలు ఎక్కువగా అరటి పండ్లను తినకూడదని, జంట అరటి పండ్లను తీసుకుంటే కవలలు పుడతారనే ఓ రకమైన భయాన్ని సృష్టించారని చెప్పవొచ్చు. కొంతమంది కవలలు కావాలనే జంట అరటి పండ్లును వెతికివెతికి మరీ తింటారు.! అది వేరే విషయం.

 యాంకర్ ఉదయభాను కవల పిల్లలు: ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంకర్ ఉదయభాను….”జంట అరటి పండ్లు, వంకాయలు తింటే కవలలు పుడతారని విన్నప్పటి నుండి కావాలనే జంట అరటి పండ్లను, జంట వంకాయలను వెతికి మరీ తినేదాన్ని అందుకేనేమో నాకు కవలలు పుట్టారు” అని చెప్పారు.

శివుడు భయంతో…తలదాచుకున్న పర్వతం ఎక్కుడుందో తెలుసా? అక్కడ ప్రతిదీ అద్భుతమే.!!

భ‌స్మాసురుడు.. శివుడిని త‌న‌లో క‌లుపుకోవాల‌న్న అత్యాశ‌తో ఆయ‌న కోసం వేట మొద‌లుపెడుతాడు. లోక‌క‌ళ్యాణార్థం శివుడు రాక్ష‌స రాజైన భ‌స్మాసురుడి నుంచి త‌ప్పించుకొని ఓ గుహ‌లో దాక్కుంటాడు. మ‌రీ ఇంత‌కీ ఆ గుహ‌లు ఎక్క‌డున్నాయి.. ఈ భువిపైన శివుడు ర‌హ‌స్యంగా దాక్కున్న ప్రాంతం ఎక్క‌డో తెలుసుకోవాల‌నుందా. అయితే స‌హ్యాద్రి ప‌ర్వాతాల‌కు వెళ్లాల్సిందే.
28-1446021435-13-yanacave
క‌ర్నాట‌క లోని పడమటి కనుమలలో విస్తరించి ఉన్న సహ్యాద్రి పర్వత శ్రేణుల మ‌ధ్య చుట్టు రాతి నిర్మాణాలు క‌లిగిన అత్యంత సుంద‌ర ప్రాంతం యానా. అక్క‌డికి చేరుకోవాలంటే మాత్రం చాలా క‌ష్టంతో కూడుకున్న‌ప‌నే. చుట్టు ద‌ట్ట‌మైన అట‌వి ప్రాంతం.. ఎత్తైన కొండ‌లు.. వాటిపై నుంచి ముగ్థ‌మ‌నోహ‌రంగా జాలు వారే జ‌ల‌పాతాలు. వాటిని దాటుకుంటే వెళితే త‌ప్ప యానా చేరుకోలేము. అక్క‌డే ఉంది శివుడు దాక్కున్న కొండ భైర‌వేశ్వ‌ర శిఖ‌రం. ఈ గుహ‌లోనే శంక‌రుడు రాక్ష‌స‌రాజు భ‌స్మాసురుడికి దొర‌క‌కుండా ర‌హ‌స్యంగా దాక్కున్నాడ‌ని పురాణ ఇతిహాస‌లు చెపుతున్నాయి. చ‌రిత్ర చెపుతున్న‌ట్టుగానే ఇది అత్యంత ర‌హ‌స్య‌మైన ప్రాంతంగానే క‌నిపిస్తుంది. ఇక్క‌డ చిత్ర‌విచిత్రాలు చాలానే క‌నిపిస్తాయి. చుట్టు చిమ్మ చీక‌ట్లు ఉన్న ఆ గుహ‌లోని శివ‌లింగం పై మాత్రం ఎప్పుడు వెలుతురు ప‌డుతూనే ఉంటుంది దానికి కార‌ణం.. ఆకాశం నుంచి నేరుగా ఆ ప్రాంతానికి మార్గం ఉన్న‌ట్టుగా తోచే కొండ ఆకార‌మే.
28-1446021165-6-bhiravacave
ఇక శివుడిని జ‌గ‌త్తుకు కనిపించ‌కుండా భ‌స్మాసురుడికి అస‌లే క‌నిపించ‌కుండా అడ్డుగా నిలిచిన కొండగా పేరు గాంచింది మోహినీ ప‌ర్వ‌తం. యానా గుహాలలో జగన్మోహిని అనే ఒక రాతి నిర్మాణం ఉంది. పురాణాల ప్ర‌కారం శివుడిని కాపాడేందుకు మోహినీ అవతారమెత్తిన శ్రీ మహావిష్ణువు గా భక్తులు ఈ రాతిని పూజిస్తారు.
28-1446021046-3-caveinnerpart
ఇంత ద‌ట్ట‌మైన కొండ‌ల మ‌ధ్య ఓ జ‌ల‌ధార‌ ప‌ర్యాట‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. కొండ‌ల ప‌క్క నుంచి వెళుతున్న ప‌ర్వ‌త రోహికుల‌కు జ‌ల‌ధార శ‌బ్థాలు వినిపిస్తాయి కానీ ఎక్క‌డ ఆ ఆన‌వాళ్లు క‌నిపించ‌వంట‌. అయితే యానా గుహ‌ల‌లో రాళ్ళ గుండా ప్రవహించే నీరు ఏకంగా ఓ న‌దిగా మారుతాయ‌ని చెపుతున్నారు. చండీహోల్ అనే నదిగా ఏర్పడి ఆది అఘనాశిని అనే మ‌రో నదిలో ఉప్పిన పట్టణం వ‌ద్ద ఈ నీళ్లు క‌లుస్తాయంట‌. గుహ‌ల‌లో ప్ర‌వ‌హించే ఈ నీరు శివుడి జ‌ఠాజూటం నుంచి ఉద్భ‌విస్తుంద‌ని అక్క‌డి ప్ర‌జ‌ల న‌మ్మ‌కం.
sas
భైర‌వేశ్వ‌ర శిఖ‌రం మ‌హాఅద్బుతంగా క‌నిపిస్తుంది. స్వయంభూ గా వెలిసిన శివలింగం ఇక్క‌డ ప్ర‌త్యేక‌త‌. అంతే కాకుండా దుర్గా మాత అవతారమైన చంద్రిక కాంస్య విగ్రహం కూడా ఈ భైర‌వేశ్వ‌ర కోన‌లో ఉన్నాయి. యానా ప్రాంతంలో విభూతి జలపాతాలు ప్రసిద్ధి గాంచినవి. 30 అడుగుల ఎత్తు నుంచి కిందపడే ఈ జలపాతం పర్యాట‌కుల‌కు, ప‌ర్వ‌త రోహ‌కుల‌కు ఆనందాన్ని క‌లిగిస్తుంది.

జయలలిత డెత్ మిస్టరీ గురించిన డీటైల్స్ మా దగ్గరున్నాయ్ :లీజియన్‌ క్రూ

జయలలిత డెత్ మిస్టరీ గురించిన డీటైల్స్ మా దగ్గరున్నాయ్…మేం నోరు విప్పితే భారతదేశంలో రాజకీయ అలజడే అంటూ బాంబు పేల్చింది హ్యాకింగ్ సంస్థ లీజియ‌న్ క్రూ. గతంలో రాహుల్ గాంధీ, విజయ్ మాల్యాలా ట్విట్టర్ అకౌంట్లను హ్యాక్ చేసిన సదరు సంస్థ…..తాజాగా అపోలో ఆసుపత్రికి సంబంధించిన స‌ర్వ‌ర్లు అన్ని త‌మ ఆధీనంలోకి తీసుకున్నామ‌ని చెపుతోంది. దేశంలోని రాజ‌కీయ ప్రముఖులు, కీల‌క జ‌ర్న‌లిస్ట్ ల స‌మాచారం సైతం త‌మ గుప్పిట్లో ఉంద‌ని సంచ‌ల‌నం వార్త‌ను బ‌హిర్గతం చేసింది. వాషింగ్ట‌న్ పోస్ట్ కు అందిన ఛాటింగ్ ద్వారా…లీజియన్ క్రూ అనే హ్యాకింగ్ సంస్థ ఈ విషయాలను తెల్పింది.



లీజియన్‌ క్రూ (ఎల్‌సీ) చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. 
  • అపోలో ఆసుపత్రి సర్వర్లకు సంబంధించిన వివరాలు అన్ని త‌మ ద‌గ్గ‌ర ఉన్నాయి.
  • అందులో భారత దేశ‌ రాజకీయ ప్రముఖులు, బ‌డా వ్యాపారులు, సినీ హీరోల‌ డేటా ఉంది.
  • జ‌య‌ల‌లిత మ‌ర‌ణానికి సంబంధించిన పూర్తి స‌మాచారం మేము హ్యాక్ చేశాం.
  • ఈ స‌మాచారాన్ని బ‌య‌ట‌కి చెపితే.. భారత్‌లోఅల‌జ‌డి రేగ‌డం ఖాయం.
  • క‌ల్లోల వాతావ‌ర‌ణాన్ని సృష్టించే స‌మాచారం త‌మ గుప్పిట్లో ఉంద‌ని షాక్ కు గురి చేసింది లీజియ‌న్ గ్రూప్.
  • లీజియ‌న్ గ్రూప్ చెప్పిన‌ట్టుగానే జ‌రిగితే చెన్నై అపోలో గుట్టు ర‌ట్ట‌య్యే అవ‌కాశాలు లేక‌పోలేదు. త‌మిళ‌నాడుతో పాటుగా దేశ వ్యాప్తంగా రాజ‌కీయ అల‌జ‌డి రేగ‌డం ఖాయంలా క‌నిపిస్తోంది.
  • అయితే ఈ సమాచారం విడుదలపై మాత్రం ఎల్‌సీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి వివరాలివ్వలేదు. కానీ, పలు భారత సర్వర్ల నుంచి సేకరించి, క్రోడీకరించిన సమాచారంలో భారత ప్రముఖులకు సంబంధించిన డేటా ఉందని మాత్రం చెప్పింది. ఈ సంస్థ చాలాకాలంగా ప్రపంచవ్యాప్తంగా సర్వర్లను హ్యాక్‌ చేస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, వివాదాస్పద పారిశ్రామిక వేత్త విజయ్‌ మాల్యా, జర్నలిస్టులు బర్ఖాదత్, రవిష్‌ కుమార్‌ వంటి ప్రముఖుల ట్విటర్‌ ఖాతాలను హ్యాక్‌ చేసింది కూడా ఈ సంస్థ‌నే కావ‌డం గ‌మ‌నార్హం.




జ్యూస్, టీ, కాఫీలతో కలిపి …..ట్యాబ్లెట్లను వేసుకోవొద్దు.! ఎందుకో తెలుసా?

చాలా మందికి టాబ్లెట్ లు ఏ ఏ ప‌దార్థాల‌తో వేసుకోవాలో తెలియ‌దు. టీ తాగుతూనో లేదా జ్యూస్ లు తాగుతూనో మందు బిల్ల‌లు వేసుకుంటారు. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌రం అంటుంది భార‌త వైద్య మండ‌లి ( IMA ). ముఖ్యంగా పండ్ల ర‌సాల‌తో టాబ్లెట్స్ వేసుకుంటే ప్ర‌మాదం అంటున్నారు. అస‌లు టాబ్లెట్ వేసుకునే ముందు ఏం నియ‌మాలు పాటించాలి..? వేటితో పాటుగా మందుల‌ను వేసుకోకూడ‌దు..? ఒక వేళ వేసుకుంటే ఏం జ‌రుగుతుంది..? తెలుసుకుందాం.



టాబ్లెట్స్ వీటితో పాటు వేసుకోకూడ‌దు..
  • నీళ్ళతో మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవాలి
  • ద్ర‌వ‌ప‌దార్థ‌మే క‌దా అని టీ, జ్యూస్ ల‌తో ట్యాబ్లెట్స్ వేసుకుంటే ప్ర‌మాదం
  • ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫీన్‌ దెబ్బతీస్తుంది
  • కెఫీన్‌ కడుపులో మంటను పెంచుతుంది. సో కాఫీతో అస‌లు టాబ్లెట్స్  వేసుకోవ‌ద్దు
  • టీతో మందుల‌ను తీసుకోవద్దు.. కార‌ణం పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది.
  • మామిడిపండు పీచుతో కూడిన పళ్ళరసాలు, కూర‌గాయ‌ల‌తో కూడిన ప‌ళ్ల‌ రసాలతో మాత్రలు తీసుకుంటే షుగ‌ర్, బీపీ వంటి మందుల ప్రభావం తగ్గిపోతుంది.
  • ద్రాక్షరసం తో మందులు వేసుకుంటే అందులోని ఎంజైములు మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి.
  • గుండె జబ్బులకు ఉపయోగించే మందులు, యాంటీ ఫంగల్‌ మందులు పనిచేయ‌వు.. అంతేకాక‌ సైడ్‌ ఎఫెక్టులు వ‌చ్చే అవ‌కాశం కూడా ఎక్కువే.

టాబ్లెట్లు ఇలా వేసుకొండి
  • చేతులు శుభ్రంగా క‌డుక్కున త‌రువాత‌నే టాబ్లెట్లు వేసుకొండి
  • చ‌ల్ల‌ని నీటితో మందులు వేసుకోకూడ‌దు.. గోరు వెచ్చ‌ని నీటిని వాడాలి
  • టాబ్లెటును ముక్క‌లు చేసి వేసుకోకూడ‌దు. అత్యంత ప్ర‌మాదం
  • క్యాప్సుల్స్ లాంటి వాటిని న‌మ‌ల‌కూడ‌దు.. నేరుగా మింగేయాలి.

అక్రమంగా దాచిన కోట్లకు కోట్ల కొత్త 2000 నోట్లను పట్టిస్తున్నవి ఐసోటోప్ లేనా!?

రూ.2వేల నోట్లలో పి32 (పాస్ఫ‌ర‌స్ 32) అనే ఓ రేడియోధార్మిక ఐసోటోప్ పెట్టిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి క‌దా. అయితే నిజానికి ఈ ఐసోటోప్ అనేది ఓ రేడియో యాక్టివ్ స‌మ్మేళ‌నం. ఇది భూమిపై ప‌లు నిర్దిష్ట‌మైన ప్రాంతాల్లో ఉంటుంది. దీని జీవిత కాలం 14 రోజులు మాత్ర‌మే. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ క‌ణాల‌ను గుర్తించ‌డంలో ఈ ఐసోటోప్‌ను క్యాన్స‌ర్ ప‌రిశోధ‌క యంత్రాల‌లో వాడుతున్నారు. అయితే ఈ ఐసోటోప్‌లో ఉన్న రేడియో ధార్మిక ప‌దార్థం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి హానీ ఉండ‌దు. ఈ క్రమంలో ఈ ఐసోటోప్ ఉన్న ప్రాంతాల‌ను ప‌లు మెషిన్ల ద్వారా ఆటోమేటిక్‌గా గుర్తించ‌డం వీలువుతుంద‌ట‌. అదెలాగంటే… భూమి లోప‌లి పొర‌ల్లో ఎక్క‌డెక్క‌డ ఖ‌నిజాలు ఉన్నాయో శాస్త్రవేత్త‌లు గుర్తిస్తారు క‌దా. అందుకు వారు అధునాత‌న యంత్రాల‌ను వాడుతారు. అలాగే ఈ ఐసోటోప్ ఎక్క‌డెక్క‌డ ఉందో గుర్తించేందుకు కూడా వారి వ‌ద్ద యంత్రాలు ఉంటాయి.
ఈ క్ర‌మంలో ఆర్‌బీఐ ప్రింట్ చేసిన రూ.2వేల నోటులో కూడా పీ32 ఐసోటోప్‌కు చెందిన ప‌దార్థం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అలా ఉంటే గ‌న‌క రూ.2వేల నోట్లు ఎక్క‌డ ఎన్ని ఉన్నాయో ఇట్టే గుర్తించ‌వ‌చ్చు. ఈ మ‌ధ్య కాలంలో ఢిల్లీ, బెంగూళురు, హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో రూ.2వేల నోట్లు పెద్ద ఎత్తున దొరుకుతున్నాయి క‌దా. ఐటీ అధికారులు ఇట్టే దాడి చేసి మరీ ఆ నోట్ల‌ను బ‌య‌ట‌కు తీస్తున్నారు. అయితే ఇదంతా పీ32 ఐసోటోప్ వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంద‌ని, అందుకే వారు ఎక్క‌డ పెద్ద ఎత్తున న‌గ‌దు ఉందీ ఇట్టే గుర్తించ‌గ‌లుగుతున్నార‌ని వార్తలు వ‌స్తున్నాయి. అయితే దీనిపై ఆర్‌బీఐ కూడా స్పందించింది. అలాంటి ఐసోటోప్‌ను రూ.2వేల నోటులో పెట్ట‌లేద‌ని చెప్పారు. అయినా… ఏమో… ఇది కాక‌పోతే… ఇంకో టోప్… ఏదో ఒక‌టి ఉండే ఉంటుంది..! అని జ‌నాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం జ‌నాలు ప‌డుతున్న క‌ష్టాలేమోగానీ, ఆర్‌బీఐ విడుద‌ల చేసిన కొత్త రూ.2వేల నోటు గురించి రోజుకో కొత్త విష‌యం మ‌న‌కు తెలుస్తోంది. గ‌తంలో ఈ నోట్ల‌లో జీపీఎస్ చిప్ అమ‌ర్చార‌ని వార్త‌లు రాగా, ఆర్‌బీఐ వాటికి క్లారిటీ ఇచ్చింది. అలాంటి చిప్‌లేవీ రూ.2వేల నోట్ల‌లో పెట్ట‌లేద‌ని చెప్పింది. అయితే ఇప్పుడు రూ.2వేల నోటు గురించిన మ‌రో కొత్త విష‌యం జ‌నాల్లో బాగా వ్యాప్తి చెందుతోంది. అదేమిటంటే… ఈ నోట్ల‌లో రేడియోధార్మిక పాస్ఫ‌ర‌స్ ఐసోటోప్ పెట్టార‌ని తెలిసింది. ఇదే వార్త ఇప్పుడు ఎక్క‌డ చూసినా పెద్ద ఎత్తున విన‌బ‌డుతోంది. అయితే ఇంత‌కీ ఈ ఐసోటోప్ సంగ‌తేమిటి..? ఒక‌సారి చూద్దాం…