cricket ad

Wednesday 30 November 2016

హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి చరిత్ర:

హనుమాన్ తల్లి అయిన అంజనా దేవి చరిత్ర:
హనుమంతుని తల్లి అంజనా . తండ్రి కేసరి , శంకరుడు ,వాయువు .ముగ్గురు తండ్రులు ఎలా అయ్యారు అని మీరు అడగవచ్చు. కాని విభిన్న పురాణాలలో విభిన్నగాధలు ఉన్నాయి . కొన్నిటిని ఇక్కడ ముచ్చటిస్తాము.
స్వర్గలోకములో ఇంద్రుని దగ్గర ఎందరో అందమైన అప్సరసలు ఉన్నారు . వారందరిలో మిక్కిలి అందముగా "పుంజికాస్థలా " అనే ఒక అప్సరస ఉంది . ఆమె ఎంతటి అందకత్తో అంతటి సంచల స్వభావము గలది . నవ్వు ఆమె పెదవులపై ఎల్లవేళలా ఉట్టిపడుతుంటుంది . ఒకరోజున తన చంచల స్వభావంచేత ఒకానొక మహర్షిని వేలాకోలం చేసింది . అందుకు కోపపడి మహర్షి "నీవు కోతిమాదిరి చంచలముగా వ్యవహరిస్తావు గనుక భూలోకంలోకి వెళ్లి కోతిగా ఉండు , అని శపించాడు .
మహర్షినోట శాపం వినగానే ఆమెకు మతిపోయి ఆయన పాదాలపై బడి మిక్కిలి వినయముగా అపరాదాన్ని మన్నించమని వేడుకున్నది . మహర్షులు సహజముగా దయకల్గి ఉంటారు . వారి క్రోధం నీటిపైన గీతలాగా కనుపించి మాయమైపోతుంది . ఆయన ప్రసన్నుడై - నేను ఎప్పుడూ అసత్యము పలుకలేదు . నీవు కోతి రూపాన్ని ధరించ వలసిందే , కాని అభీష్టరూపాన్ని ధరిస్తావు . కోరినప్పుడు మానవ రూపాన్ని ధరించగలవు . వానర రూపాన్ని గూడా ధరించగలవు అని అన్నాడు .
మహర్షి శాపం నిజమైంది . పుంజకాస్థల సుమేరుపర్వతగుహలో ఒకవానరిగా జన్మించింది . భూలోకములో వుండే వానరజాతి మాదిరి జాతి కాదు . ఇది ఉపదేవతలలోని కింపురుష జాతికి చెందినది . వీరు అభీష్ట రూపధారులు ,వీరి ఆకృతి మానవాకృతి మాదిరిగానే ఉంటుంది . తోక కూడా ఉంటుంది . కేసరి ఒక వానర రాజు ,అంజనా మిక్కిలి రూపవతి ,కేసరికి ఆమెకు వివాహమైంది . వీరికి సంతానము లేదు . స్త్రీలకూ సహజముగా తల్లికావాలని ,పుత్రుడు కలగాలని కోరిక ఉంటుంది . అంజనా పుత్రప్రాప్తికి భగవాన్ శులపాణిని ఆరాధించింది .
శ్రీరాముడు అవతరించనున్నాడు . తానుగూడ అవనిపై అవతరించి శ్రీరామునికి సేవచేద్దామని శంకరునకు కోరికగలిగినది . శంకరుడు ఏకాదశరుద్రరూపుడు. పదకొండవ అవతారమే హనుమాన్ . శంకరుని వర ప్రసాదము చేత అంజనా గర్భంనుంచి స్వత: శంకరుడు అవతరించినందున హనుమాన్ ని శంకరసూనుడు అని కూడా అంటారు . శంకర వరప్రసాదాన్ని అనురక్తితో పవనదేవుడు అంజనగర్భములొ ఉంచుట చేత పవన కుమారుడైనాడు . కేసరీపత్నికి జన్మించుతచేత కేసరీ నందుడైనాడు .
Share it

జయమంత్రం :స్వామి హనుమకు సీతమ్మ దర్శనం అయిన తర్వాత లంకను ఒక ఆట ఆడించారు

జయమంత్రం :
స్వామి హనుమకు సీతమ్మ దర్శనం అయిన తర్వాత లంకను ఒక ఆట ఆడించారు . ఒక తోరణము ఎక్కి కూర్చుని జయమంత్రం చెప్తు వేలమంది రాక్షసుల్ని సునాయాసముగా సంహరించారు . ఎంతో మంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితములో ధన్యత పొందారు .
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
అర్ధం :రామచంద్రమూర్తి పరక్రమముతో జయముతో షోబిల్లుతున్నారు . ఆయన సోదరడు అయినటువంటి లక్ష్మణుడు కూడా పరాక్రమముతో ప్రకాశిస్తున్నాడు . రామలక్ష్మణుల యొక్క అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయముతో శోబిస్తున్నాడు . నేను ఎటువంటి కార్యాన్ని అయినా అవలీలగా చేయగలిగినటువంటి సమర్ధత ప్రకాశించినటువంటి రామచంద్ర మూర్తి యొక్క కింకరుడిని . నేను ఆయన దాసానుదాసుడిని . నా పేరు హనుమ . నేను వాయుపుత్రుడిని . శత్రుసైన్యములని సంహరించడములో నాకు నేనే సాటి . వేయి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను . ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను . రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను ,మోచేతులతో కుమ్మి చంపేస్తాను ,పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను ,అరిచేతులతో మర్దించి చంపేస్తాను ,గోళ్ళతో చీల్చి చంపేస్తాను ,నా కోరలతో కొరికి చంపేస్తాను ,నాకు ఆయుధం అక్కరలేదు . నేను వచ్చింది ఈ లంకా పట్టణమును పీడీస్తాను . నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను అయిపోఇంది దర్శనమ్ . మిమ్మల్ని అందరిని పీడించి ఎలా వచ్చానో అలా నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను . నన్ను పట్టగలిగిన మొనగాడు లంకా పట్టణములో లేడు . వంద మంది రాక్షసులైన వేయి మంది రావణులైన నే చంపేస్తాను అని స్వామి హనుమ తోరణము మీద కూర్చుని ఈ జయమంత్రాన్ని చెప్తున్నారు .

సుదర కాండము చదివితే వచ్చే ప్రయోజనాలు

సుదర కాండము చదివితే వచ్చే ప్రయోజనాలు :
నిరాశా, నిస్ప్రుహలకు లోనైనా మనిషిని పునరుజీవితుణి చేస్తుంది`సుదర కాండము
మానసికముగా బలహీనమైన వాడిని మానసికముగా బలోపెతున్ని చేస్తుంది సుందర కాండము
కేవలం పురుష ప్రయత్నం చాలదు . దైవయత్నం కుడా ఉండాలి . అలాగని దైవప్రార్దన చాలదు . మానవ ప్రయత్నం కూడా ఉండాలి . పురుష ప్రయత్నం , దైవయత్నం కలిస్తేనే కార్యసిద్ధి కలుగుతుంది అని చాటి చెప్పినది సుందర కాండము
మనము చేసే కార్యము లో చిత్తశుద్ధి ఉంటే ,మన ప్రమేయము లేకుండానే మనకు బయట నుండి సాయం అందుతుంది అని మనకు తెలియజేసేదే సుందర కాండము .
మన సమస్యకు పరిష్కారము ఎదురుగా ఉన్నా ,మన మనస్సు కల్లోలముగా ఉన్నపుడు ఆ పరిష్కారము మనకు కనపడదు . నిర్మలమైన మనస్సుతో ఆలోచిస్తే ,ఇంతేనా అని అనిపిస్తుంది , పరిష్కారము కళ్ళెదుట కనపడుతుంది అని బోదించింది సుందర కాండము .
జీవితములో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యముగా ఎదుర్కొంటే , మనకు సాయము చేసేవాళ్ళు మనకు కనపడకుండా మన పక్కనే ఉండి సాయము చేస్తుంటారు అని తెలియజేసేది సుందర కాండము .
కోపము అన్ని అనర్దాలకు మూలము ,కోపములో ఏమి చేస్తున్నామో తెలియకుండా చేసేస్తాము తుదకు దు:ఖాలపాలవుతము అని భోదించేది సుందర కాండము .
మనిషికి ఎంత శారీరక బలము ఉన్నా , దానికి బుద్ధిబలం తోడైతేనే గాని రాణించదు అన్న విషయాన్ని తెలియచెప్పేది సుందర కాండము .
ఎన్ని శివపూజలు చేసినా ,ఎంతటి నిష్టాగరిష్టుడైన ,గుణగనాలు మంచివి కాకపోతే ఆ శివపూజలు అతనిని రక్షించలేవు ,అతనికి పతనము తప్పదు అని నిరూపించినది సుందర కాండము .
ఎవరి శక్తి వారికి తెలియదు . ప్రతి మనిషిలోను అంతర్గతముగా అపారమైన శక్తి ఉంటంది . ఆ శక్తి ఒక్కోసారి తనంతట తానే బహిర్గతమవుతుంది . మరి కొన్ని సందర్భాల్లో ఇతరులు చెబితేనే గాని బయట పడదు . కాబట్టి పెద్దవారి మాటలు ,మన శ్రేయోభిలాషుల మాటలు శ్రద్దగా విని , ఆచరించి ,మన శక్తి యుక్తులను సమర్ధవంతముగా వినియోగించుకోవాలి అని చాటి చెప్పినది సుందర కాండము .
share it

శ్రీశైలం ఎంతో ప్రాముక్యత కలిగినది . శ్రీశైలం గురించి కొన్ని విశేషాలు ...see full

మన ఆంధ్రదేశం లో ఉన్న శ్రీశైలం ఎంతో ప్రాముక్యత కలిగినది . శ్రీశైలం గురించి కొన్ని విశేషాలు ...
సాక్షి గణపతి ఆలయము:ఇది ముఖ్యాలయానికి కొద్ది దూరంలో ఉంటుంది. ఈ గణపతి ఆలయము ప్రత్యేకత ఏమిటంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని.ఇతనిని సాక్షి గణపతి అంటారు.
శిఖరేశ్వరం:రీశైలం మొత్తం లో ప్రత్యేకమైనది, ఈ శిఖరేశ్వరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారు.
ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం:దేశం రాజకీయంగా అల్లకల్లోల పరిస్థితులలో ఉన్నప్పుడు, వివిద దార్శనికులు,మతప్రచారకులు అశాంతికి దోహదంచేస్తున్న సమయంలో,భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారుగాని, వాఖ్యానించగలిగేవారుగాని చాలా అరుదుగా ఉన్న సమయంలొ జన్మించిన శ్రీశంకరులు పరిస్థితులను చక్కదిద్ది ప్రజలలో వైదికధర్మస్ఫూర్తిని వ్యాప్తి చేస్తూ దేశంనలుమూలలా నాలుగు ప్రప్రసిద్ధ పీఠాలను స్థాపించి విసృతంగా పర్యటిస్తూ ఉండేవారు. అలా పర్యటించే సమయంలోచాలా కాలం శ్రీశైల పరిసరములందు తపమాచరించారు. ఈయన తపమాచరించిన ఈ ప్రదేశమునకు ఒక మంచి కథనము కలదు.
శంకరులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఈపరిసరాలలో అద్వైతమత వ్యాప్తి చేయుచున్నకాలమందు, శంకరులు చేయు కార్యములు నచ్చని కొందరు ఆయనను అంతమొందించు యత్నముతో ఆపరిసరాలయందు భీభత్సము సృష్టించుచున్న ఒకపెద్ద దొంగలముఠానాయకుని రెచ్చగొట్టి, కొంత సొమ్మిచ్చి పంపించారు.అతడు ఇదే ప్రదేశమున పెద్ద కత్తితో మాటువేసి తపమాచరించుకొనుచున్న శంకరుని వెనుకగా ఒకేవేటున తలఎగరగొట్టు ప్రయత్నమున ముందుకురికెను.ఇక్కడ ఇది జరుగుచున్న సమయమున శంకరుని ప్రధాన శిష్యుడైన పద్మపాదుడు మల్లికార్జునుని దేవాలయమున ఈశ్వరుని ధ్యానించుచూ కూర్చొని ఉండెను. ఈశ్వరునే మనసున ఉంచి ధ్యానిస్తున్న అతనికి హటాత్తుగా ఈ దృశ్యము కనిపించెను.వెంటనే అతడు మహోగ్రుడైన శ్రీలక్షీనరసింహుని వేడనారంభించెను. ఇక్కడ శంకరుని వధించుటకు ఉరికిన ఆ దొంగలనాయకునిపై ఎటునుండో హటాత్తుగా ఒక సింహము దాడి చేసి, అతడి శరీరాన్ని ముక్కలుముక్కలుగా చీల్చివేసి ఎట్లు వచ్చినదో అట్లే మాయమయినది.ఈ విషయము శంకరులకు ధ్యానమునుండి బయటకు వచ్చిన తరువాత తెలియజేసారు. అంతవరకూ ఆయనకు జరిగినది తెలియదు.అధిక కాలము ఈప్రాంతమందు తపమాచరించిన గుర్తుగా ఇక్కడ ఉన్న పెద్ద బండపై శంకరుని యొక్క పాదముద్రలు కలవు.
శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో వీరఖడ్గం అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, శివాజీ కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడు రూపాయల నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు.
పాలధార, పంచధారలు:శిఖరేశ్వరమునకు, సాక్షిగణపతి గుడికి మధ్యగా హటికేశ్వరము నకు సమీపాన అందమయిన లోయలో ప్రశాంత ప్రదేశంలో జగద్గురు శంకరాచార్య తపమాచరించిన ప్రదేశము ఉన్నది. ఇక్కడి శిలపై శంకరుని పాదముద్రలు ఉన్నాయి. కొండపగులులనుండి పంచధార(ఐదుధార) లతో ఉరికివచ్చే జలాలు చల్లగా ఏ కాలంలోనైనా ఒకే మాదిరిగా ప్రవహిస్తూ ఒక్కొక్కధార ఒక్కొక్క రుచితో నుండుట ఇక్కడి ప్రత్యేకత. ఒకధార నుండి జలము సేవించి ప్రక్కమరొక దాని నుండి సేవిస్తే మార్పు తెలుస్తుంది
శ్రీమల్లికార్జునుని దేవాలయము: అభేద్యమైన ప్రాకారము లోపల నాలుగు మండపములతో అపూర్వమైన శిల్ప సంపదతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణ నిర్మాణముగా ముష్కరుల నుండి రక్షణ కొరకు కట్టినట్టుగా ఉంటుంది.
భ్రమరాంబిక అమ్మవారి గుడి.: భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళతో అందమైన శిల్పతోరణాలతో కూడిన స్థంబాలతోనూ అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రదేశములోనే అత్యంత విశిష్టమైన శిల్ప కళ కలిగిన దేవాలయముగా వినుతికెక్కినది. ఈ దేవాలయము నందు గర్భాలయ వెనుక భాగమున గోడకు చెవి ఆన్చి వింటే ఝమ్మనే బ్రమరనాధం వినవస్తుంది.
మనోహర గుండము: శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో ఇది ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే చాలా స్వచ్ఛమైన నీరు ఈ గుండములో ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉన్నది. అంత ఎత్తులో కూడా ఆ రాళ్ళలో ఇంత చక్కని నీరు ఉండటం నిజంగా చూడవలసినదే. ఈ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయ వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.
పంచ పాండవులు దేవాలయాలు: పాండవులు మల్లికార్జునుని దర్శించుకొని వారి పేరున అయిదు దేవాలయాలను ప్రధాన దేవాలయ వెనుక భాగమున నిర్మించి శివలింగములను ప్రతిష్టించిరి.
---share it
No automatic alt text available.

మహానంది శైవ క్షేత్రము ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు

మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మరియు ఒక మండలము. నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది. ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం (680-696) నాటిదని అంచనా. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది ప్రత్యేకత.ఈ పుష్కరిణిలు విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క పనితనాన్ని తెలియచేస్తుంది.
ప్రధాన ఆలయానికి ఆలయ ముఖ ద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల న్నుండి ధారావాహకంగా వస్తుంటుంది. ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి. లింగము క్రింద నుండి నీరు ఊరుతూ వుంటుంది. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది. ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో (1.7 మీటర్లు) నిర్మలంగా, పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదు. ఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది. ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి. అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది. ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు. ఈ మహనంది క్షేత్రంలో ఊరే నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తుంది.
ఇచ్చట బ్రహ్మ, విష్ణు, రుద్ర గుండాలు (పుష్కరుణులు) కలవు. మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము, కళ్యాణోత్సవము, రధోత్సవములు జరుగుతాయి. కోదండరామాలయం, కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు. మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి నవ నందులని పేరు.
కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.
Share it

అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత

అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. దాని ఉపాసనచేత యోగస్థితిని పొందిన ఈమె మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది.
కౌశిక పత్ని సుమతి తన పతి శాపాన్ని పునస్కరించుకొని సూర్యోదయాన్ని అపేసింది. అనసూయ పదిరోజులను ఒకరోజుగా చేసి సూర్యుడుదయించేటట్లు చేసింది. మరణించిన సుమతి భర్తను మరల బ్రతికించింది. నారదుని కోరికపై గులకరాళ్ళను గుగ్గిళ్ళుగా మార్చి ఆయన ఆకలిని తీర్చింది. లోకమాతలైన లక్ష్మీపార్వతీసరస్వతులను గెలిచింది. శ్రీరాముడు అరణ్యవాసకాలంలో సీతతో ఆశ్రమానికి వచ్చినప్పుడు ఈమె సీతకు పతివ్రతాధర్మాలను ఉపదేశించింది. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.
ఇంకా లలిత పరా భట్టారిక స్తాయికి అనసూయమ్మ ఎలా అయ్యిందో..
అందరికీ ధ్యానయోగ్యమైన మూర్తులు :
అత్యంత శ్రేయదాయకమైనది దక్షిణామూర్తి స్వరూపం . కృష్ణ బగవానుడు గొప్పగా ధ్యానానికి యోగ్యమైన మూర్తి, కానీ గృహస్తు దానిని ధ్యానం చేస్తే కాళ్ళ దగ్గర ఆవు దూడ ఉన్నటువంటి మూర్తినే ధ్యానం చెయ్యాలి అనే ఒక నియమాన్ని పెద్దలు చెప్తారు . దక్షిణామూర్తి అనుకోండి విధ్యార్ది ధ్యానం చేస్తే అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ,తేజస్సు ,ఆరోగ్యం కలుగుతాయి . గృహస్తు ధ్యానం చేస్తే సమస్తమైన ఐశ్వర్యం కలుగుతుంది ,ధర్మము నందు అనురక్తి కలుగుతుంది వానప్రస్తుకి వైరాగ్యం బాగా పెరుగుతుంది . సన్యాసి కి ధ్యానం నిలబడుతుంది . ఎవరికి ఏది కావాలో దానిని అది అనుగ్రహిస్తుంది . అందరికి ఒకలా కాదు . ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వగలదు పైగా పరమ మంగళ మూర్తి , దక్షిణామూర్తి ని చూడడమే ఎంతో ఆనందముగా ఉంటుంది అసలు ఆ వీరాసనములో కూర్చుని ఒక కాలు క్రింద పెట్టి ఆ కాలు కింద ఉన్నటువంటి మాయ రాక్షసులు కూడా తలెత్తి నవ్వుతుంటాడు ఆ రెండవ కాలు తీసుకువచ్చి కింద పెట్టినటువంటి కాలు యొక్క తొడ మీద వేసుకుని నాలుగు చేతులతో ఉంటాడు చక్కగా చిన్న చిరునవ్వు నవ్వుతూ పెద్దా వట వృక్షం కింద కూర్చుని ఉంటాడు ఆ ధ్యానం చేసేటప్పుడు చాలా తేలికగా మీరు ఆయన దగ్గరికి వెళ్లినట్టు మీరు మోకాళ్ళ మీద వంగినట్టు మీ తల తీసుకునివెళ్ళి కింద పెట్టినటువంటి పాదం మీద మోపినట్టు ఆయన బొటన వ్రేలు దాని ప్రక్కన పాదము యొక్క తలము మెత్తగా మీ తలకి తగిలినట్టు మీరు లేచి ఆయన పాదం పట్టుకున్నట్టు ,ఆయన పాదాన్ని నిమిరినట్టు ,ఆయన కాలు వొత్తుతున్నట్టు ,మీరు నీరాజనం ఇచ్చినపుడు ఆ చేతులు ,ఆ చేతులో ఉండేటటువంటి ఆయుధములు ,కిరీటము, ఆయన తొడ మీద వేసుకున్నటువంటి ఎర్రటి పాదం దాని యొక్క వేళ్ళు ,గోళ్ళు అన్ని కనపడుతుండగా మీరు ఆయనికి నీరాజనం ఇస్తూ ఒకసారి దర్శనం చేయొచ్చు ,మీరు ధ్యానములో ఆయన్ని చూస్తూ దగ్గరగా కూర్చుని చూస్తుంటే మనసు రంజిల్లిపోయి చాలా తేలికగా ఆయన అందు లయమై ఉంటుంది . ప్రత్యేకించి అది జ్ఞానకారకము ,మంగళ కరము శివ స్వరూపము . అన్నిటిని మించి దక్షిణామూర్తి దగ్గర ఉన్న గొప్పతనము ఏమిటి అంటే అసలు దక్షిణామూర్తి దగ్గర్నుంచి ఇది మాత్రమే వస్తుంది అని చెప్పడానికి అవది లేదు . ఏదైనా ఇవ్వగలరు . అన్ని ఇవ్వగలిగినటువంటి దక్షిణామూర్తి స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకుని పిల్లలు దగ్గర నుంచి పెద్దలు వరకు అందరు కొంత సేపు ఆయన్ని ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే అసలు గురుమండలములో ప్రదానమైనటువంటి గురువుకి కూడా నమస్కారం చేసినటువంటి అనుగ్రహం లబిస్తుంది ఎందుకంటే ఆయన గురుస్వరూపం .
ఓం మౌనవ్యాఖ్యా ప్రకటితపరబ్రహ్మతత్వంయువానం
వర్శిష్ఠాంతేవసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మరామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే ||
ముదితవదనం చిరునవ్వుతో వుంటాడు , మనసుకు ఒక లక్షణము ఉంటుంది అది విసుగు చెందుతుంది . మీరు రోజు ఒక లాగే చూపించరనుకొడి , రోజు కింద పెట్టిన పాదం చూపిస్తే నిన్న ఇదే చేశా కదా మల్లి ఎటో వెళ్తుంది, కాదు మీరు ఈరోజు పాదం జ్ఞానం చేస్తే రేపు చిన్ముద్ర ధ్యానం చేయొచ్