cricket ad

Wednesday 30 November 2016

తినే పదార్థాలపై చక్కెర శాతం ఎంత? తీపి తినాలనే కోరికనూ కొంతవరకు బయట పడేందుకు ప్రయత్నం చేయండి

కొన్నిసార్లు తెలియకుండానే చక్కెర ఎక్కువగా తినేస్తుంటాము. మీది కూడా అలాంటి పరిస్థితే అయితే దాని నుంచి    బయట పడేందుకు ప్రయత్నించండి. సందర్భానుసారంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.
* బయట కొనే పదార్థాలపై చక్కెర శాతం ఎంత ఉందనేదీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అన్నిట్లో చక్కెర అని రాయకపోవచ్చు. బదులుగా ఫ్రక్టోస్, గ్లూకోజ్, మాల్టోస్ లాంటి పేర్లు ఉంటాయి. ఓఎస్ఈ అక్షరాలతో ముగుస్తుంటే అవి  ప్ర చక్కెరకుత్యామ్నాయం అనుకోవాలే తప్ప పోషకాలుగా భావించకూడదు.
* ఏదయినా పదార్థంలో నాలుగు చెంచాల చక్కెర వేసుకోవాలంటే సగం వేయండి. దానివల్ల రుచిలో పెద్దగా మార్పుండదు. మామిడి, అరటి, అనాస వంటి పండ్ల రసాల్లో అసలు వేసుకోకపోయినా ఫరవాలేదు.

* మిఠాయిలూ, ఇతర తీపి పదార్థాలకు ప్రత్యామ్నాయాలు వెతకండి. బిస్కెట్లూ, చాక్లెట్ల కన్నా బాదం, ఆయా కాలాల్లో వచ్చే పండ్లను ఎక్కువగా తినేలా చూసుకోండి. వాటి వల్ల పోషకాలు అందుతాయి. తీపి తినాలనే క్రేవింగ్స్‌నీ తగ్గిస్తాయవి. పైగా పండ్లు తినడం వల్ల శరీరానికి కావల్సిన పీచు సహజసిద్ధంగా అందుతుంది.
* పెరుగు, జావ లాంటి వాటిల్లో చక్కెర వేసుకునే బదులుగా కొద్దిగా దాల్చినచెక్క పొడిని చల్లుకోండి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు, తీపి తినాలనే కోరికనూ కొంతవరకు తగ్గిస్తుంది.

క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా

జీవితం సంతోషంగా సాగాలంటే, ముందు శరీరా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. క్యాన్సర్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో తాజాగా ఉండే పండ్లు మరియు వెజిటేబుల్స్ ను తప్పనిసరిగా తీసుకోవాలని తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేస్తున్నారు.

రెగ్యులర్ గా తాజా పండ్లు మరియు వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన త్వరగా సంతోషపరచడం మాత్రమే కాదు, శరీర ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుందని ’’ లండన్ లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ ప్రొఫసర్ ఆండ్రూఓస్వాల్డ్ తెలిపారు.

ఒక్క రోజులో మనం ఎన్ని పోర్షన్స్ గా తాజా పండ్లను, కాయగూరలు తీసుకుంటామో..అన్ని పోర్షన్లుగా సంతోషం రెట్టింపు అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

మ‌న శ‌రీరంలో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌..! దాని గురించి మీకు తెలుసా..?

ఏ మ‌నిషికైనా ఎన్ని మెద‌ళ్లు ఉంటాయి? ఎన్ని ఉండ‌డ‌మేమిటి? మ‌నిషికి కేవ‌లం ఒక్క‌టే మెద‌డు ఉంటుంది క‌దా! అని అన‌బోతున్నారా? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే కానీ, మ‌న‌లో రెండో మెద‌డు కూడా ఉంటుంద‌ట‌. ఏంటి క‌న్‌ఫ్యూజ్ అవుతున్నారా! ఏం లేదండీ, మెదడు లాగే మ‌న శ‌రీరంలో ఇంకో అవ‌యవంలో కూడా మెద‌డు ఉంటుంద‌ట‌. అయితే అదేమిటో తెలుసా? జీర్ణాశ‌యం… అవును, మీరు విన్న‌ది నిజ‌మే!

జీర్ణాశ‌య‌మంటే మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేద‌ని 1వ త‌ర‌గ‌తి పిల్ల‌వాడిని అడిగినా చెబుతాడు. నిత్యం మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు జీర్ణాశ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే దీంట్లోనే మ‌న రెండో మెద‌డు ఉంటుంద‌ట‌. అది కూడా మ‌న ఎమోష‌న్స్‌కు అనుగుణంగా స్పందిస్తుంద‌ట‌. ఆశ్చ‌ర్యంగా ఉన్నా మేము చెప్పింది నిజ‌మే. దీన్ని సాక్షాత్తూ వైద్యులే ధ్రువీక‌రిస్తున్నారు. అయితే ఆ మెదడు నాడీ క‌ణాల రూపంలో ఉంటుంద‌ట‌. అంతేకానీ త‌ల‌లో ఉన్న మెద‌డులా ప్ర‌త్యేకమైన అవ‌య‌వంలా ఉండ‌ద‌ట‌. కాగా జీర్ణాశ‌యంలో ఉన్న ఈ మెద‌డు దాదాపుగా త‌ల‌లో ఉన్న మెదడులాగే ప‌నిచేస్తుంద‌ట‌.

మ‌న నోట్లోని కొండ నాలుక ఎందు కోసం ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?

మ‌న నోట్లోని కొండ నాలుక ఎందు కోసం ఉప‌యోగ‌ప‌డుతుందో తెలుసా..?
మ‌న శ‌రీరంలో ఎన్నో అవ‌య‌వాలున్నాయి. అవ‌న్నీ ఒక్కో ప‌ని కోసం నిర్దేశించ‌బ‌డ్డాయి. మ‌నం తినే ఆహారం నుంచి అవి శ‌క్తిని గ్రహించి త‌మ విధులను నిర్వ‌హిస్తాయి. అయితే మ‌న దేహంలో ఉన్న ప‌లు అవ‌య‌వాల్లో కొన్నింటి ఉప‌యోగం ఎందుకు ఉంటుందో చాలా మందికి తెలియ‌దు. ఈ క్ర‌మంలో అలాంటి భాగాల‌ను వారు ఉప‌యోగం లేనివిగా భావిస్తుంటారు. కానీ వాటితో కూడా ఏదో ఒక ఉప‌యోగం ఉంటుంది. అలాంటి అవ‌య‌వాల్లో కొండ నాలుక కూడా ఒక‌టి. అవును, అదే. దాని వ‌ల్ల ఉప‌యోగం ఏంటో చాలా మందికి తెలియ‌దు. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మ‌నం నిత్యం ఘ‌న‌, ద్ర‌వ ప‌దార్థాల‌ను ఆహారంగా తీసుకుంటాం క‌దా. వాట‌న్నింటినీ ఆహార‌నాళం ద్వారా జీర్ణాశ‌యంలోకి స‌రిగ్గా వెళ్లేలా కొండ‌నాలుక దారి చూపుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌గినంత ఉమ్మిని స్ర‌వింప‌జేస్తూ నోటిని తేమ‌గా ఉంచుతుంది. ఆ ఉమ్మి జీర్ణాశ‌యంలోకి వెళ్లి ఆహారం జీర్ణం అయ్యేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌నం స్వ‌ర‌పేటిక ద్వారా స‌రిగ్గా మాట్లాడేందుకు కూడా కొండ నాలుక ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరెప్పుడైనా బాగా మాట్లాడేట‌ప్పుడు ఒక్కోసారి ద‌గ్గు వ‌స్తుంది గ‌మ‌నించారా, అవును. ఆ స‌మ‌యంలో కొండ నాలుక పొడిగా మార‌డం వ‌ల్ల ద‌గ్గు వ‌స్తుంది. అందుకే ఎక్కువ‌గా మాట్లాడేవారు మ‌ధ్య మ‌ధ్య‌లో నీటిని తాగుతుంటారు. దీంతో కొండ నాలుక తేమ‌గా మారుతుంది. దీని వ‌ల్ల ఇంకొంచెం ఎక్కువ సేపు మాట్లాడేందుకు అవ‌కాశం ఉంటుంది.
భూమిపై ఉన్న ఇత‌ర క్షీర‌దాల‌ను, మ‌నుషుల‌ను వేరు చేసే అవ‌య‌వం కూడా కొండ నాలుకే. అందుకే మ‌నం మాట్లాడ‌గ‌లుగుతాం. జంతువులు, ప‌క్షులు మాట్లాడ‌లేవు. తెలుసుకున్నారుగా, కొండ నాలుక వ‌ల్ల ఉప‌యోగం ఏమిటో! ఇది చ‌దివాక ఇక ఎవ‌రూ దాంతో ఏమీ ఉప‌యోగం లేద‌ని అన‌రు గాక అన‌రు! అంతేగా!

ఇటువంటివి నమ్మవద్దు విక్స్ రాస్తే…పొట్ట తగ్గుతుందా?

ఇటువంటివి నమ్మవద్దు
విక్స్ రాస్తే…పొట్ట తగ్గుతుందా?
ఎలాంటి ఖర్చు, శ్రమ లేకుండా ఆయాచితంగా ఏదైనా లభిస్తుందంటే చాలు మనలో అధిక శాతం మందికి దానిపై ఆసక్తి కలుగుతుంది. అది వస్తువైనా, మరొకటైనా… ఏదైనా చాలు. దాన్ని సొంతం చేసుకోవాలనో, ఆ విషయంతో లాభం పొందాలనో చూస్తుంటారు. ఈ క్రమంలోనే మనలో ఉండే అలాంటి బలహీనతలను ఇతరులు క్యాష్ చేసుకుంటారు. తీరా చివరికి వచ్చేసరికి అలాంటి వార్తలన్నీ ఉత్త నాటకమే అని మనకు అర్థమవుతుంది. అయినా అవి అంతటితో ఆగవు. ఒకరి నుంచి మరొకరికి పుకార్ల రూపంలో వ్యాప్తి చెందుతూనే ఉంటాయి. ప్రధానంగా నేటి ఆధునిక యుగంలో సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి పుకారు వార్తలు వ్యాపించడానికి ఎక్కువ సమయం కూడా పట్టడం లేదు. ఒకరు అలాంటి న్యూస్‌ను తమ టైం లైన్‌లో ఇతరులకు షేర్ చేస్తే అది కాస్తా వైరల్‌గా మారి కొన్ని క్షణాల్లోనే కొన్ని లక్షల మంది యూజర్లకు చేరుతోంది. అయితే ఇలాంటి వార్తల వల్ల మనకు మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాటిని సృష్టించిన, కావాలని వ్యాప్తి చెందిస్తున్న వారికి మాత్రమే వాటి ద్వారా ప్రయోజనం కలుగుతుంది. విక్స్ కంపెనీ తెలుసుగా. దానికి చెందిన విక్స్ వాపోరబ్ గురించిన పుకారు ప్రచారం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది.
అది ఎవరు సృష్టించారో, ఎవరు వ్యాప్తి చేయిస్తున్నారో తెలియదు కానీ విక్స్ వాపోరబ్‌ను పొట్టపై రాస్తే అక్కడ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుందనే ఓ పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా వ్యాపిస్తోంది. దాదాపు అనేక వెబ్‌సైట్లు ఈ న్యూస్‌ను తమ వార్తలలో ఫీచర్డ్‌గా పబ్లిష్ చేసి దాని ద్వారా అంతో ఇంతో పేజ్‌వ్యూస్, క్లిక్స్‌తో లాభం పొందుతున్నాయి. దీనికి తోడు విక్స్ కంపెనీకి కూడా రెండు విధాలుగా లాభం కలుగుతోంది. ఒకటి ప్రచారం రూపంలో. మరొకటి ఆ ఉత్పత్తి అమ్మకాల ద్వారా. పుకారు మాట ఏమో గానీ ఇప్పుడు అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే విక్స్ వాపోరబ్ రాస్తే నిజంగానే పొట్ట తగ్గుతుందా? తెలుసుకుందాం.
విక్స్ వాపోరబ్‌లో ఉన్న పదార్థాలను ఒక సారి పరిశీలిస్తే అందులో లెవో మెంథాల్, కాంఫర్ (కర్పూరం), యూకలిప్టస్ ఆయిల్, టర్పంటైన్ ఆయిల్‌లు ప్రధానంగా ఉన్నాయి. లెవో మెంథాల్ డీకంజెస్టెంట్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అంటే శ్వాస నాళంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుంది. అదేవిధంగా కర్పూరం దగ్గును తగ్గించేందుకు, యూకలిప్టస్ ఆయిల్, టర్పంటైర్ ఆయిల్‌లు శ్వాసకోశ సమస్యలైన జలుబు, ముక్కు దిబ్బడలను తొలగించేందుకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో అవి స్వతహాగా ఘాటైన వాసనలను, వేడి ధర్మాలను కలిగి ఉండడం చేత ఆయా అనారోగ్య సమస్యలు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంది. అంతేకానీ పైన తెలిపిన పదార్థాలు ఏవిధంగానూ కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడవు.
ఇంకో విషయం ఏమిటంటే విక్స్ వాపోరబ్‌ను రాసిన తరువాత ఆ ప్రదేశాన్ని గాలికి అలాగే వదిలేయాలి. దానిపై ఎలాంటి క్లాత్‌ను గానీ, ఇతర ఏ బ్యాండేజ్‌ను గానీ కట్టకూడదు. దీని వల్ల చర్మం ఇర్రిటేషన్‌కు గురవుతుంది. కానీ పుకారు వార్తల్లో చెబుతున్నది ఏమిటంటే పొట్టపై విక్స్‌ను రాసి దానిపై బిగుతుగా ఏదైనా క్లాత్‌ను గానీ, ప్లాస్టిక్ కవర్‌ను గానీ కట్టమని చెబుతున్నారు. అందులో ఇసుమంతైనా సత్యం ఉందా? ఇది అంతకు ముందు చెప్పిన దానికి ఎంత విరుద్ధంగా ఉందో మీరే అర్థం చేసుకోండి. సో, ఇకనైనా పుకారు వార్తలని నమ్మకండి. కష్టపడందే ఏదీ మన దగ్గరికి రాదనే విషయాన్ని మరోమారు గుర్తుంచుకోండి. అయినా పొట్ట తగ్గాలంటే సహజ సిద్ధమైన పద్ధతిలో వ్యాయామం చేయడం, కచ్చితమైన ఆహార నియమాలను పాటిస్తే చాలు. ఇలాంటి వదంతులను నమ్మి లేని, పోని అనారోగ్య సమస్యలను తెచ్చుకోకండి.

ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే...'' మీ ఇంట్లో మీరే పరాయి వారు అవుతారని జీవితం నేర్పుతున్న సత్యం దానికి ఉదాహరణనే ఈ చిన్న కథ.

ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే...'' మీ ఇంట్లో మీరే పరాయి వారు అవుతారని జీవితం నేర్పుతున్న సత్యం దానికి ఉదాహరణనే ఈ చిన్న కథ.
.
నేను క్రమం తప్పకుండా ఇందిరా పార్కుకి వాకింగ్కి వెళుతుంటాను. రోజూ నడిచే రోడ్డే కాని, ఈ రోజు కొత్తగా ఉంది. ఎందుకంటే హృదయానందకరమైన దృశ్యాన్ని చూశాను. రోజులాగే ఈరోజు వాకింగ్ని పూర్తి చేసుకొని బయటికి వచ్చి పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గర ఆగి టీ తాగుతున్నాను.
.
అప్పుడే ముసలి దంపతులు డబ్బులు అడుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఆకలితో ఉన్నట్లు వారి ముఖాలే చెబుతున్నాయి. ఎందుకంటే వారు చాలా బలహీనంగా ఉన్నారు.
.
నడవలేక నడుచుకుంటూ అందరిని డబ్బులు అడుక్కుంటున్నారు. అలాగే నా దగ్గరకు వచ్చి అడిగారు. వారు డబ్బులు అడగ్గానే దానికి బదులుగా వారికి ఛారు, బిస్కెట్లు ఆఫర్ చేశాను.
.
వారు తిన్న తర్వాత అసలు వారిది ఏ ఊరు? ఎక్కడి నుంచి వచ్చారు? అని నాకున్న అనుమానాలను ప్రశ్నల వర్షం కురిపించాను.
.
అప్పుడు వారు చెప్పిన కథ విని చలించిపోయాను.
మీరు చదవండి. కథ వారి మాటల్లోనే...
.
''మాది మార్కాపురం బాబు. ఒక్కడే కొడుకు. వాడి కోసం ఉన్న రెండు ఎకరాలు అమ్మి చదివించాం. రోజూ కూలీ కెళ్లి వచ్చిన దానితోనే కడుపు నింపుకుంటూ వాడిని పెద్ద చదువులు చదివించినం. బాగా చదువుకున్నాడు కద మంచి ఉద్యోగం వచ్చిందని ఆరు నెలల క్రితం హైదరాబాదుకు వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంటికి రాలేదు, ఫోను చేస్తున్న ఎత్తడం లేదు. ఫోను నెంబరు మార్చినాడట. ఇక్కడే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటున్నాడని తెలిసింది. మా ఊరబ్బాయి చూసి ఫోను చేశాడు. మేము హైదరాబాదు వచ్చి రెండు రోజులైంది. మాకు ఫోను చేసిన అబ్బాయి కలవలేదు, ఫోను ఎత్తడం లేదు. ఈ రెండు రోజుల్లో మేము తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. మా ఊరికి పోవడానికి కూడా డబ్బులు లేవు బాబు. అందుకే ఇలా అడుక్కుంటున్నాం బాబు'' అని తన బాధను వివరించాడు.
వారి కొడుకు కనిపించడం లేదని వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. అది వారి కళ్ళల్లో కన్నీటి రూపంలో వ్యక్తమవుతుంది. అందుకే వారి నిష్కళంకమైన మాతృ హృదయానికి చలించి, వారి బస్సు ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించాను. అప్పుడు వారు ఏమన్నారో తెలుసా ''మీ అమ్మ, నాన్న చల్లంగుండాలి బాబు'' అని. అప్పుడు నాకు ఎంతో సంతోషం వేసింది. కాని అంతలోనే బాధ కూడా వేసింది.
.
ఒక్కసారి మీ గుండెలపై చెయ్యి వేసుకొని ఆలోచించండి. మనం ఎదుగుతున్న కొద్ది మారుతున్న ఆధునిక పోకడలలో పడి లోకజ్ఞానాన్ని కూడా మరిచిపోతున్నాం. నేను ఏ ఒక్క వ్యక్తి గురించో మాట్లాడటం లేదు. అందరి గురించి అంటున్నాను. నేటి సమాజంలో తల్లిదండ్రులను ఏవిధంగా వదిలించుకుంటున్నారో రోజు పేపర్లలో చూస్తూనే ఉన్నాం. కాని తల్లిదండ్రులు మన సుఖం కోసం, మన ఎదుగుదల కోసం ఏవిధంగా కష్టపడుతున్నారో కూడా ఆలోచించడం లేదు. మన స్వార్ధం మనం చూసుకొని వారిని రోడ్డుపాలు చేస్తున్నాం.
.
తల్లిదండ్రులేమో మనం అడగ్గానే అస్తులు కూడా అమ్మి అన్ని సమకూరుస్తున్నారు. వారికంటూ ఏమి మిగిలించుకోవడం లేదు. ఏమన్నా అంటే నాకు చెట్టంత కొడుకుండగా ఇక ఏం కావాలి, వాడే నన్ను చూసుకుంటాడని అంటున్నారు. అందుకే వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక్కసారి ఆలోచించండి.
.
రేపటిరోజు మీరు ఒక తల్లి, తండ్రి అన్న సంగతి మరవకండి. మనం తల్లిదండ్రులను గౌరవించినప్పుడే సమాజం మనల్ని గౌరవిస్తుంది. (నెట్ నుండి మీకోసం)

సిగిరెట్ - ఆల్కాహాలు -కాఫీ -టీ ఒకేసారి మానడం చాలా మంది శరీరాలు తట్టుకోలేవు .

ఒకేసారే తిండి తగ్గించడం
పెంచడం
నిద్ర తగ్గించుకోవాలనుకోవడం
పెంచడం కూడా
వ్యాయామం లేదా పని పెంచాలనుకోవడం 
ఆహార వేళలు మార్పు
వాతావరణం మార్పు
కొత్త తిండి , నీరు మార్పు
సిగిరెట్ - ఆల్కాహాలు -కాఫీ -టీ ఒకేసారి మానడం
చాలా మంది శరీరాలు తట్టుకోలేవు
నిజానికి ఎవరికీ మంచిది కాదు
హార్మోన్స్ పై వత్తిడి - జీవక్రియలపై ప్రభావం పడుతుంది.
కనుక రోజూ ఒక పది నిమిషాలు వ్యాయామం పెంచుకోండి.
మరలా ఒక వారం స్టాండింగ్ చేయండి. ఆపవద్దు
వీలుంటే శరీర మార్పులు చూసుకుంటూ పెంచండి.
నిద్ర కూడా ఇంతే,
కొత్త తిండి కూడా (మంచివైనా_ మీకు పడకపోతే)
కొద్ది కొద్దిగా అలవాటు చేయండి.
ఈ సమయంలో సమతుల ఆహారం , సరైన నిద్ర-
వ్యాయామం - విసర్జన క్రియలు- మంచి ఆలోచనలు
కలిగి యుండటం -ఒకే వాతావరణం ముఖ్యం
దీనికి తోడు కానిస్ట్యూషన్ పద్దతిలో హామియో మందులు వాడటం ఇంకా మంచిది.
ఒకే వేళకు -ఒకే పరిమాణంలో తినడం సెట్ చేసుకోండి
ఏదైనా క్రమ పద్దతిలో మార్పు చేసుకోండి
తేలికగా అరిగే సమతుల ఆహారం తీసుకోండి
ఒకేసారి ఏ మార్పు వద్దు
అతివృష్టి -అనావృష్టిలా చేయకండి.
నిదానంగా మంచీ వైపు అడుగేయండి
స్టాండింగ్ వస్తుంది
రెండు నెలలు టైము పెట్టుకోండి.