cricket ad

Tuesday 13 December 2016

నోట్ల మార్పిడిలో RBI అధికారి అరెస్ట్

తీగ లాగితే ట్రంక్ పెట్టెలు కదులుతున్నాయి. దాడులు చేసే కొద్దీ కోట్లకు కోట్ల కొత్త నోట్లు బయట పడుతున్నాయి. బెంగళూరులో CBI, ED అధికారుల వరస దాడులు కలకలం రేపుతోంది. బడాబాబులకు నోట్ల మార్పిడికి సహకరిస్తున్న RBI అధికారి మైఖేల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు.. ఎంత కమీషన్ కింద మార్చింది ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటి వరకు కోటిన్నర వరకు మార్చినట్టు గుర్తించారు. మైఖేల్ పై చాలా ఆరోపణలు రావటం.. కోట్లలో పాతనోట్లకు కొత్త 2వేల నోట్లు ఇచ్చినట్లు.. సీబీఐకి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపడుతున్నారు.

మరో కేసులో రూ.92 లక్షలు పట్టివేత

మరో కేసులో.. బెంగళూరులో భారీగా కొత్త నోట్లు పట్టుబడ్డాయి. 92 లక్షల 2 వేల రూపాయల నోట్లు తరలిస్తుండగా ఏడుగురిని పట్టుకున్నారు కర్ణాటక ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. 15 నుంచి 35 శాతం కమీషన్ తీసుకుంటుండగా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మార్పిడి ముఠాలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల బంధువులు ఉన్నారు. బ్యాంక్ సిబ్బందే ఇలా పక్కదారిలో కోట్లకు కోట్లు తరలిస్తుండటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇప్పుడు దొరికిన డబ్బుతోపాటు.. ఈ 30 రోజుల్లో ఇంకెంత డబ్బును అక్రమంగా మార్చారు.. తరలించారు అనే విషయంపైనా ఆరా తీస్తున్నారు ED అధికారులు.

కొత్త నోట్ల తరలింపులో బ్యాంక్ సిబ్బంది బంధువులు

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో భారీగా కొత్త నోట్లు పట్టుబడుతున్నాయి. 92 లక్షల 2 వేల రూపాయల నోట్లు తరలిస్తుండగా ఏడుగురిని పట్టుకున్నారు కర్ణాటక ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు.
పాతనోట్లను మార్చేందుకు  15 నుంచి 35 శాతం కమిషన్ తీసుకుంటుండగా అధికారులకు దొరికారు. ఈ మార్పిడి ముఠాలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల బంధువులు ఉన్నారు. బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై ఇప్పటికే చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగి బంధువులు.. రూ.92లక్షల 2వేల నోట్లతో దొరకటం కలకలం రేపుతోంది. బ్యాంక్ సిబ్బందే ఇలా పక్కదారిలో కోట్లకు కోట్లు తరలిస్తుండటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇప్పుడు దొరికిన డబ్బుతోపాటు.. ఈ 30 రోజుల్లో ఇంకెంత డబ్బును అక్రమంగా మార్చారు.. తరలించారు అనే విషయంపైనా ఆరా తీస్తున్నారు ED అధికారులు.

ఆన్‌లైన్ చెల్లింపులు అదుర్స్‌

పెద్దనోట్ల రద్దు తర్వాత.. బ్యాంకుల్లో నగదు నిల్వలు లేవు.. ఏటీఎంలు తెరుచుకోవడం లేదు.. చేతిలో చిల్లర లేక ప్రజలు కష్టాలు పడుతున్నారు. ఇవన్నీ నాణేనికి ఒకవైపు మాత్రమే.. మరోవైపు ప్రజలు నెమ్మదిగా నగదు రహితం వైపు మళ్లుతున్నారు. ఆన్ లైన్ చెల్లింపులు, కొనుగోళ్లకు అలవాటు పడుతున్నారు.  
పెద్దనోట్ల రద్దు తర్వాత ఆన్ లైన్ చెల్లింపులు అదుర్స్ అనిపిస్తున్నాయి. ఆన్ లైన్ కోనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. ప్రజలు నెమ్మదిగా నగదు రహితం వైపు అడుగులేస్తున్నారు. ఇంటర్నెట్‌, మొబైల్‌, ఎస్‌ఎంఎస్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం కార్డు, చెక్‌ బుక్‌ల కోసం బ్యాంకులకు క్యూ కడుతున్నారు. గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు ఎక్కువగా జరిగాయి. బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్లు, డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు రెట్టింపయ్యాయని ఆర్‌బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెలలో గత నెల కంటే 50-100 శాతం ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగే అవకాశాలున్నాయని.. గడిచిన వారం రోజుల గణాంకాల ద్వారా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన ఈ-చెల్లింపులపై ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల్ని పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతోంది. లావాదేవీల సంఖ్యతో పాటు ఆయా లావాదేవీల విలువ మొత్తమూ భారీగా పెరుగుతోంది. ఆర్‌టీజీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ, సీటీఎస్‌ చెల్లింపులు సెలవు దినాల్లో జరగనందున... ఎనిమిది రోజులకే లెక్కించారు. నవంబరు నెలలో మొత్తం 67.15 కోట్ల ఆన్‌లైన్‌ చెల్లింపులు జరిగితే... డిసెంబరులో 9వ తేదీ నాటికి 29.7 కోట్ల లావాదేవీలు జరిగాయి. మొత్తంగా...  దేశవ్యాప్తంగా ప్రజలందరూ పెద్దనోట్ల రద్దును ప్రశంసిస్తూ నగదు రహితంపై అడుగులేస్తున్నారు.

Monday 12 December 2016

అమ్మ బుగ్గ‌పై ఆ రంధ్రాలు ఏంటి..?

జయలలితకు చికిత్స జరిగిన విధానం అత్యంత రహస్యంగా ఉంది. అపోలో ఆసుపత్రిలో ఎప్పుడేం జరిగిందో స్పష్టంగా వెల్లడికావడం లేదు.  ఆమె పార్థివ దేహాన్ని అత్యంత సమీపం నుంచి చాలా మంది చూశారు. ‘అమ్మ బుగ్గపై ఆ రంధ్రాలేంటీ’? అంటూ ఈ సామాజిక మాధ్యమంలో ఈ దృశ్యం జోరుగా చక్కర్లు కొడుతోంది. జయలలిత మరణించిన తరువాత ఆమె భౌతిక కాయాన్ని ఎంతో మంది తిలకించారు. అయితే ఆమె ఎడమ బుగ్గపై నాలుగు రంధ్రాలు ఆసక్తి రేపాయి. చెంపపైన ఆ రంధ్రాలు ఏంటీ అనే చర్చ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సహజంగా ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహం కొన్ని రోజుల పాటు పాడవకుండా, కుళ్లి పోకుండా ఉండేలా వైద్యులు ‘ఎంబామింగ్‌‌’ చేస్తుంటారు. దేహాన్ని కొన్ని రకాల రసాయనాలు, మందులతో శుద్ధి చేయడంతో పాటు,  దేహం కుళ్లిపోకుండా సూది కూడా వేస్తుంటారు. మృతదేహంలోని రక్తాన్ని బయటకు తీసేసి ఈ రసాయన మందును లోనికి పంపే ప్రక్రియ ఇది. అయితే సహజంగా ఈ సూదిని మెడ వెనుక లేదా.. గజ్జల్లో వేస్తుంటారు. జయలలిత పార్థీవదేహానికి కూడా ఈ తరహా ప్రక్రియ వైద్యులు నిర్వహించి ఉండే అవకాశాలు ఉన్నాయి. జయలలితకు గుండె పోటు వచ్చినప్పటి నుంచి ఆమె మరణించే సమయం వరకూ వైద్యులు ‘ఎక్మో’ చికిత్స చేశారు. ఆ ప్రక్రియలోనే ‘ఎంబామింగ్‌‌’ కూడా నిర్వహించవచ్చు. ప్రత్యేకంగా సూదులు వేయాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. అయితే వీటికి భిన్నంగా జయ బుగ్గలపై ఇలా నాలుగు రంధ్రాలు కనిపిస్తుండటంతో అది ‘ఎంబామింగ్‌‌’ సూదితో ఏర్పడిన రంధ్రాలా.. లేదా ఇతర చికిత్సలు చేయడానికి వీలుగా చేసిన రంధ్రాలా అని చర్చ జోరుగా జరుగుతోంది.  అయితే జయలలిత బుగ్గపై కనిపిస్తున్న నాలుగు రంధ్రాలు ఏవిధంగా ఏర్పడ్డాయో అర్థం కావడం లేదని అనేక మంది అంటున్నారు.

ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి... కొత్త పార్టీకీ ఏర్పాట్లు..!

సూప‌ర్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి రానున్నాడ‌ని కొత్త పార్టీ పెట్ట‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జయలలిత మరణంతో తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. అధికార అన్నాడీఎంకే పార్టీలో అంతర్గతంగా చాలా లుకలుకలు ఉన్నాయి. మరోవైపు కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను లాగి... ప్రతిపక్ష డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే యత్నాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. రజనీ రాజకీయాల్లోకి రావాలని ఎన్నో ఏళ్లుగా ఆయన అభిమానులు కోరుతున్నారని... అభిమానుల కోరిక నెరవేరడానికి ఇదే సరైన తరుణమని తెలిపారు.  చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రజనీ తాజా చిత్రం వచ్చే ఏడాది పూర్తవుతుందని... అప్పటి వరకు తమిళనాట రాజకీయ పరిస్థితులను ఆయన పరిశీలిస్తుంటారని... ఆ తర్వాత ఏదైనా జరగవచ్చని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీ బీజేపీలో చేరుతారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... అలాంటిదేమీ ఉండదని, రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీనే స్థాపిస్తారని చెప్పారు. పార్టీని స్థాపిస్తే రజనీ విజయం ఖాయమని తెలిపారు. ఈ విష‌యాల‌న్నీ ఆయ‌న సోద‌రుడే స్వ‌యంగా చెప్ప‌డంతో ర‌జనీకాంత్ రాజ‌య‌కీయ అరంగేట్రం త్వ‌ర‌లో ఖాయం అని విశ్లేష‌కులు అంటున్నారు.

జ‌న‌ధన్ ఖాతాల్లోకి 74వేల 610కోట్లు..!

పెద్ద నోట్ల ర‌ద్దుతో జ‌న‌ధన్ ఖాతాల్లోకి పెద్ద మొత్తం డ‌బ్బు వ‌చ్చి చేరింది.  ఇప్పటివరకు 74 వేల 610 కోట్లు జ‌నధ‌న్ ఖాతాల్లో జమయ్యాయి. ఈనెలాఖరు వరకు రద్దైన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాటిట్ చేసుకొనే అవకాశం ఉంది. చివరి గడువు నాటికి ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ న‌వంబ‌ర్ 8 రాత్రి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. . అక్కడి నుంచి సామాన్యుల జనధన్ ఖాతాల్లోకి బడాబాబుల నల్లధనం కుప్పులు తెప్పలుగా వచ్చి చేరుతోంది. జన్ ధన్ అకౌంట్ లలో 50 వేల కంటే ఎక్కవ డిపాజిట్ చేయడనికి వీళ్లేదు. లక్షల్లో పోగైన జన్ ధన్ ఖాతాలోని సొమ్మును సీజ్ చేస్తామని ఐటీ శాఖ వెల్లడించింది.

వీటి ధరలు భారీగా తగ్గనున్నాయట

అమృత్ పథకం కింద దాదాపు రెండువేల మెడిసిన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎమ్మార్పీ రేట్ల కంటే 60 నుంచి 90శాతం వరకు మందుల ధరలను తగ్గించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ధరలు తగ్గనుండటంతో రోగులకు మేలవుతుందని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో  ఈ మందులను ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందించేందుకు మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు.వీటి ధరలు భారీగా తగ్గనున్నాయట…