అమృత్ పథకం కింద దాదాపు రెండువేల మెడిసిన్ల ధరలు భారీగా తగ్గనున్నాయి. ఎమ్మార్పీ రేట్ల కంటే 60 నుంచి 90శాతం వరకు మందుల ధరలను తగ్గించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ధరలు తగ్గనుండటంతో రోగులకు మేలవుతుందని ఆయన పేర్కొన్నారు. సామాన్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ మందులను ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో రోగులకు సరైన వైద్య సేవలు అందించేందుకు మరిన్ని పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు.![వీటి ధరలు భారీగా తగ్గనున్నాయట…](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_vcs_j5x1BwNXzC4liQHweR6YVw7xeqWTYRs7U4UnTNa9a_PWrt4pzZuVX6zCCv58R7qr8DJrtW4-R8Sz9p4lcMuhrcZMY7CoRwbPa992kH4iP_fQbJBF4phMMol3TMvFSml-mpfVwyCJVpt-kVozIAhOGyQIbIIeo2Qk_URviaelA=s0-d)
No comments:
Post a Comment