cricket ad

Tuesday 13 December 2016

మీకు కోటి రూపాయలు కావాలా? అయితే ఇలా చేయండి..

ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ చేసేవారికి నీతి ఆయోగ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వైపింగ్ ద్వారా లావాదేవీలు జరుపుతున్న వినియోగదారులకు భారీ పారితోషికాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి పది ప్రమోటర్ బ్యాంకులను ఎంపిక చేసింది.
దేశాన్ని డిజిటల్ వైపు నడిపించడానికి నీతి ఆయోగ్ సరికొత్త పథకంతో ప్రజల ముందుకు వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ చేసేవాళ్లను ప్రోత్సహించడానికి కోటి రూపాయల స్కీమ్ ను తెరపైకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు కొనసాగించే వాళ్లలో ఒకరిని సెలెక్ట్ చేసి మూడు నెలలకోసారి కోటి రూపాయలు అందించనుంది. ప్రతి వారానికోసారి లక్కీ డ్రా లో గెలుపొందిన వినియోగదారులు, వ్యాపారస్థులకు పదిలక్షల రూపాయల పథకం ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ ను నిర్వహించే బాధ్యతను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అప్పజెప్పింది ప్రభుత్వం.
ఈ స్కీమ్ ను సమర్ధవంతంగా అమలుచేయడానికి 10 ప్రమోటర్ బ్యాంకులు ఉన్నాయి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, సిటీబ్యాంక్, హెచ్ ఎస్ బీసీ లు ఈ లిస్ట్ లో ఉన్నాయి.
నీతి ఆయోగ్ స్కీంను ప్రధానంగా గ్రామాలు, పట్టణ నిరుపేద, మధ్య తరగతి వర్గాలే లక్ష్యంగా కొనసాగించనున్నట్టు తెలిపింది ఎన్పీసీఐ. డిజిటల్ పేమెంట్స్ చేసిన వారి ట్రాన్సాక్షన్ ఐడీలలో మూడు నెలలకోసారి ఓ లక్కీ విజేతను ఎంపిక చేసి కోటి రూపాయల బహుమతి అందించనున్నారు. డిజిటల్ పేమెంట్స్వైపు ఆకర్షించేలా ఈ స్కీం రూపొందించారు. ప్రతివారం పది మంది కస్టమర్లు, పది మంది వ్యాపారస్తులను విజేతలుగా ప్రకటిస్తారు. యూఎస్ ఎస్ డీ, ఏఈపీఎస్, యూపీఐ, రూపే కార్డులు ఉపయోగించే వాళ్లంతా ఈ పథకానికి అర్హులు. పీవోఎస్ మెషిన్లు వాడుతున్నవాళ్లనూ పరిగణలోకి తీసుకోవాలా వద్దా అని పరిశీలిస్తున్నారు.

పూజారులకు దక్షిణగా.. రద్దైన పెద్ద నోట్లు

ఓ యాగంలో పాల్గొన్న పూజారులకు దక్షిణగా రద్దైన రూ.1000, రూ.500 నోట్లను సమర్పించారు. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానాలో బీజేపీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు లక్ష చండీ మహా యాగం నిర్వహించారు. పలు ప్రాంతాలకు చెందిన సుమారు రెండు వేల మంది పూజారులు ఇందులో పాల్గొన్నారు. బీజేపీ నేత, హర్యానా లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ రిషి ప్రకాష్ శర్మ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
 
యాగంలో పాల్గొన్న 2000 మంది పూజారులకు ఒక్కొక్కరికి రూ.5000లు చొప్పున రద్దైన పెద్ద నోట్లను దక్షిణగా సమర్పించారు. అయితే చెలామణిలో లేని నోట్లు ఇవ్వడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దారి ఖర్చులు ఎలా అని వాపోయారు. దీంతో నిర్వాహకులు కొందరికి బస్ టికెట్లు ఏర్పాటు చేశారు. పూజారులకు దక్షిణగా సుమారు రూ.80 లక్షల రద్దైన పాత నోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే నిర్వాహకులు దీన్ని ఖండిస్తున్నారు. దక్షిణగా పాత నోట్లు ఇస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు.

తగ్గిన డిమాండ్.. పడిపోయిన బంగారం ధర

దేశీయంగా బంగారానికి డిమాండ్ తగ్గడంతో పసిడి ధర మరోమారు ఢామ్మంది. పది గ్రాములకు వంద రూపాయలు తగ్గి రూ.28,450 వద్ద ఆగింది. వెండి ధర మాత్రం వంద రూపాయలు పెరిగి కేజీకి రూ.41,500 పలుకుతోంది. నోట్ల రద్దు తర్వాత నగల దుకాణాలు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గిపోవడమే ధర తగ్గుదలకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ రాజధానిలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.28,450 పలుకుతుండగా 99.5 స్వచ్ఛత ఉన్న బంగారం ధర 28,300 పలుకుతోంది.

నో క్యాష్‌.. ఓన్లీ గోల్డ్‌

హైదరాబాద్‌ సిటీ: అంతర్జాతీయ మాయగాళ్లు.. అంతర్రాష్ట్ర ముఠాలు.. అంతర్‌జిల్లా కేటుగాళ్లు.. అందరి చూపు హైదరాబాద్‌ వైపే. ఏటా ఏదో రూపంలో నగరవాసుల నుంచి 100-120 కోట్ల రూపాయలు కొట్టేస్తారు. రాష్ట్రంలో నమోదయ్యే పోలీసు కేసుల్లో మూడొంతులు ఇక్కడివే. ముందుగా స్కెచ్‌ గీయటం..రెక్కీ నిర్వహించటం.. తరువాత దోచుకోవటం..ఇదీ గృహదొంగతనాల్లో వ్యూహం. పోలీసులకు చిక్కితే గ్యాంగ్‌ సభ్యులంతా జైలు పాలవ్వాల్సిందే. అయినా ఇవేమీ లెక్కచేయకుండా అంతర్రాష్ట్ర ముఠాలు నగరాన్ని టార్గెట్‌ చేస్తూనే ఉంటాయి. ఇంతగా చెలరేగే చోరులకు పెద్దనోటు షాక్‌ ఇచ్చింది.దోపిడీలు.. దొంగతనాలతో దోచుకున్నా.. వాటిని మార్చటం ఇబ్బందిగానే మారింది. కరెన్సీ కట్టల జోలికి వెళ్లకుండా బంగారు, వెండి ఆభరణాలతో సరిపెడుతున్నారు. వాటిని రిసీవర్స్‌కు ఇచ్చి అమ్మించటం కంటే.. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకుంటున్నారు. ఈ ఏడాది సాధారణ దొంగతనాల సంఖ్య పెరిగింది.. గృహ చోరీలు అధికమయ్యాయి.
ఎంతమార్పు 
మూడు స్నాచింగ్‌లు.. ఆరు దొంగత నాలతో హల్‌చల్‌ చేసే దొంగల హడావిడి తగ్గుతోంది. అక్కడక్కడా చోరీలకు పాల్పడినా బీరువాల్లో కనిపించే నోట్ల కట్టల జోలికి వెళ్లకుండా బంగారు ఆభరణాలు కొట్టేసి ఉడాయిస్తున్నారు. అంబర్‌పేటలో ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ దొంగ ప్రవేశించాడు. రూ.2లక్షల విలువైన పాతనోట్లు ఉన్నా వాటిని వదిలేసి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయాడు. ముషీరాబాద్‌ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీదర్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించింది. వరుస ఇళ్లల్లో చోరీచేసి పారిపోవాలని పథకం వేసింది. కరెన్సీ కష్టాలతో ఆ ముఠా ప్రత్యా మ్నాయమార్గాలను ఎంచుకుంది. నకిలీ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ము తామంటూ రంగంలోకి దిగింది. సికిందరాబాద్‌ వద్ద ఓ వ్యాపారికి టోకరా వేసి రూ.50వేలు మస్కా కొట్టింది. మరో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు బ్యాంకుల వద్ద కాపుకాసి ఒంటరిగా వెళ్లే వారి వద్ద బ్యాగులు, నగలు కాజేసి పారిపోతున్నారు. 
లోకల్‌ గ్యాంగ్స్‌.. నయాస్టైల్‌ 
దొంగతనాలు.. చైన్‌ స్నాచింగ్‌లతో అలజడి సృష్టించిన ఘరానా దొంగల్లో 500 మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. వీరంతా జైల్లోనే ఉన్నారు. వీరిలో కరడుగట్టిన నేరస్థులపై రెండోసారి పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో 420 సాధారణ దొంగతనాలు జరిగితే.. ఈ ఏడాది అదే రెండు నెలల్లో 445 జరిగాయి. 
గృహ దొంగతనాలు గతేడాదితో పోల్చితే 40 శాతం తగ్గాయి. ఘరానా దొంగలు.. జెళ్లలో ఉండటంతో అనుచరగణం.. చోటా నేరస్థులు.. జేబు దొంగతనాలు, మొబైల్‌ స్నాచింగ్‌లకు దిగు తున్నారు. ఆటోలు, ట్యాక్సీలు, ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణికుల ముసుగులో చోరీలు చేస్తున్నారు. పెద్దనోట్ల మార్పిడి, కరెన్సీ మాఫియా ముఠాల్లో ఏజెంట్లుగా మారుతున్నారు. 
టెక్నాలజీతో అడ్డుకట్ట 
పెరుగుతున్న నేరాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసు యంత్రాంగం టెక్నాలజీ వినియోగం పెంచింది. సీసీఎస్‌, సైబర్‌క్రైమ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకే పరిమితం కాకుండా శాంతి భద్రతల విభాగంలోనూ పోలీసులు సాంకేతికతను ఉపయోగించాలంటూ నగర సీపీ మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అన్ని ఠాణాల స్థాయిలో ఇన్‌స్పెక్టర్‌ నుంచి హోంగార్డు వరకూ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. బ్యాచ్‌ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

నో క్యాష్‌.. ఓన్లీ గోల్డ్‌

దరాబాద్‌ సిటీ: అంతర్జాతీయ మాయగాళ్లు.. అంతర్రాష్ట్ర ముఠాలు.. అంతర్‌జిల్లా కేటుగాళ్లు.. అందరి చూపు హైదరాబాద్‌ వైపే. ఏటా ఏదో రూపంలో నగరవాసుల నుంచి 100-120 కోట్ల రూపాయలు కొట్టేస్తారు. రాష్ట్రంలో నమోదయ్యే పోలీసు కేసుల్లో మూడొంతులు ఇక్కడివే. ముందుగా స్కెచ్‌ గీయటం..రెక్కీ నిర్వహించటం.. తరువాత దోచుకోవటం..ఇదీ గృహదొంగతనాల్లో వ్యూహం. పోలీసులకు చిక్కితే గ్యాంగ్‌ సభ్యులంతా జైలు పాలవ్వాల్సిందే. అయినా ఇవేమీ లెక్కచేయకుండా అంతర్రాష్ట్ర ముఠాలు నగరాన్ని టార్గెట్‌ చేస్తూనే ఉంటాయి. ఇంతగా చెలరేగే చోరులకు పెద్దనోటు షాక్‌ ఇచ్చింది.దోపిడీలు.. దొంగతనాలతో దోచుకున్నా.. వాటిని మార్చటం ఇబ్బందిగానే మారింది. కరెన్సీ కట్టల జోలికి వెళ్లకుండా బంగారు, వెండి ఆభరణాలతో సరిపెడుతున్నారు. వాటిని రిసీవర్స్‌కు ఇచ్చి అమ్మించటం కంటే.. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థల్లో తనఖా పెట్టి డబ్బు తీసుకుంటున్నారు. ఈ ఏడాది సాధారణ దొంగతనాల సంఖ్య పెరిగింది.. గృహ చోరీలు అధికమయ్యాయి.
ఎంతమార్పు 
మూడు స్నాచింగ్‌లు.. ఆరు దొంగత నాలతో హల్‌చల్‌ చేసే దొంగల హడావిడి తగ్గుతోంది. అక్కడక్కడా చోరీలకు పాల్పడినా బీరువాల్లో కనిపించే నోట్ల కట్టల జోలికి వెళ్లకుండా బంగారు ఆభరణాలు కొట్టేసి ఉడాయిస్తున్నారు. అంబర్‌పేటలో ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ దొంగ ప్రవేశించాడు. రూ.2లక్షల విలువైన పాతనోట్లు ఉన్నా వాటిని వదిలేసి నాలుగు తులాల బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయాడు. ముషీరాబాద్‌ పరిధిలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీదర్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించింది. వరుస ఇళ్లల్లో చోరీచేసి పారిపోవాలని పథకం వేసింది. కరెన్సీ కష్టాలతో ఆ ముఠా ప్రత్యా మ్నాయమార్గాలను ఎంచుకుంది. నకిలీ బంగారాన్ని తక్కువ ధరకు అమ్ము తామంటూ రంగంలోకి దిగింది. సికిందరాబాద్‌ వద్ద ఓ వ్యాపారికి టోకరా వేసి రూ.50వేలు మస్కా కొట్టింది. మరో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు బ్యాంకుల వద్ద కాపుకాసి ఒంటరిగా వెళ్లే వారి వద్ద బ్యాగులు, నగలు కాజేసి పారిపోతున్నారు. 
లోకల్‌ గ్యాంగ్స్‌.. నయాస్టైల్‌ 
దొంగతనాలు.. చైన్‌ స్నాచింగ్‌లతో అలజడి సృష్టించిన ఘరానా దొంగల్లో 500 మందిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. వీరంతా జైల్లోనే ఉన్నారు. వీరిలో కరడుగట్టిన నేరస్థులపై రెండోసారి పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో 420 సాధారణ దొంగతనాలు జరిగితే.. ఈ ఏడాది అదే రెండు నెలల్లో 445 జరిగాయి. 
గృహ దొంగతనాలు గతేడాదితో పోల్చితే 40 శాతం తగ్గాయి. ఘరానా దొంగలు.. జెళ్లలో ఉండటంతో అనుచరగణం.. చోటా నేరస్థులు.. జేబు దొంగతనాలు, మొబైల్‌ స్నాచింగ్‌లకు దిగు తున్నారు. ఆటోలు, ట్యాక్సీలు, ఆర్టీసీ సిటీ బస్సుల్లో ప్రయాణికుల ముసుగులో చోరీలు చేస్తున్నారు. పెద్దనోట్ల మార్పిడి, కరెన్సీ మాఫియా ముఠాల్లో ఏజెంట్లుగా మారుతున్నారు. 
టెక్నాలజీతో అడ్డుకట్ట 
పెరుగుతున్న నేరాలు, దొంగతనాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీసు యంత్రాంగం టెక్నాలజీ వినియోగం పెంచింది. సీసీఎస్‌, సైబర్‌క్రైమ్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకే పరిమితం కాకుండా శాంతి భద్రతల విభాగంలోనూ పోలీసులు సాంకేతికతను ఉపయోగించాలంటూ నగర సీపీ మహేందర్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. అన్ని ఠాణాల స్థాయిలో ఇన్‌స్పెక్టర్‌ నుంచి హోంగార్డు వరకూ టెక్నాలజీపై అవగాహన కల్పిస్తున్నారు. బ్యాచ్‌ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఆదర్శ పెళ్లికూతురు... పెళ్లి కానుకగా ఏమిచ్చిందంటే...

ముంబై: అత్తారింట్లో అడుగుపెడుతూనే వందలమంది జీవితాల్లో వెలుగులు నింపిందో పెద్దింటి పెళ్లి కూతురు. పెళ్లికయ్యే ఖర్చుతో పేదలకు ఇళ్లు నిర్మించి ఆదర్శంగా నిలిచింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకి చెందిన ఓ కోటీశ్వరుడి కూతురు శ్రేయ మునోద్‌కు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఆమె అత్తింటివారు కూడా శ్రీమంతులే. దగ్గరి బంధువు ఒకరు ఇచ్చిన సలహా మేరకు తన వివాహం సందర్భంగా పేదలకు ఏదైనా చేస్తే బాగుంటుందని శ్రేయ భావించారు. పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చుతో అందరూ గుర్తుంచుకునేలా పేదలకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవు 108 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీనికి ఇరువైపుల కుటుంబాలు పూర్తి సహకారం అందించడంతో ఇప్పటికే 90 ఇళ్లు పూర్తయ్యాయి. నిరాడంబంరంగా మూడు ముళ్లు వేయించుకుని... ఎవరికైతే ఇళ్లు కట్టించిందో వారిని పెళ్లికి పిలిపించుకుని మరీ తాళాలు బహూకరించి శభాష్ అనిపించుకున్నారు శ్రేయ.

హ్యాపీ బ‌ర్త్‌డే గురూ..!

ఈ రోజు ఫ్యామిలీ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన రోజు. ‘విక్టరీ’ని ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు వెంకటేష్‌. తెలుగు చిత్ర సీమకు నాలుగు మూలస్తంభాలుగా అభివర్ణించే అగ్ర నటుల్లో ఒకరైనా ఆ అహమే ఉండదు. స్టార్‌ ప్రొడ్యూసర్‌ తనయుడైనా ఆ అతిశయమన్నదే కనిపించదు. సినిమా హిట్టయినా, ఫ్లాపయినా ముఖంలో చిరునవ్వు చెరగదు. అవార్డులెన్ని అందుకున్నా అణకువ మారదు. అందుకే ఆయన సమ్‌థింగ్‌ స్పెషల్‌. నటనలోనే కాదు. నిజ జీవితంలోనూ అంతే. మంగళవారం వెంకటేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.