cricket ad

Thursday 15 December 2016

అఖిల్ పెళ్లి వెనక ఉన్న సీక్రెట్ బయట పడింది!

అక్కినేని నాగార్జున.. ఈ హీరోకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అయితే నాగర్జున తమ పిల్లల ప్రేమను అంగీకరించి గొప్ప తండ్రిగా గౌరవాన్ని నిలుపుకున్నారు. తన చిన్న కుమారుడు అఖిల్ ప్రేమించిన శ్రీయా భూపాల్ తో వైభవంగా నిశ్చితార్ధం నిర్వహించారు.
వచ్చే ఏడాది గ్రాండ్ గా పెళ్లి చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పెద్ద కొడుకు నాగ చైతన్య పెళ్లి చేయకుండా, చిన్న కుమారుడు పెళ్లి ఎందుకు చేస్తున్నారనే విమర్శలకు ఆయన ముందుగానే వివరణ ఇచ్చారు. చైతూ కళ్యాణం చేసుకోవడానికి కొంతకాలం గడువు కోరారని, అందుకే అఖిల్ పెళ్లి చేస్తున్నామని మీడియాకు నాగ్ చెప్పారు. అసలు కారణం అది కాదని సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. అఖిల్ కంటే నాలుగేళ్లు పెద్దది అనే విషయం బయట ప్రజలకు తెలియక ముందే పెళ్లి చేసేయాలని నాగార్జున తొందర పడుతున్నట్లు సమాచారం.
వివాహం అయిపోతే ఆ ప్రస్తావన ఎవరూ తీసుకు రారని, అందుకే సాధ్యమైనంత వరకు తొందరగా కళ్యాణం జరిపిస్తున్నట్లు టాక్. అక్కినేని అభిమానులు మాత్రం ఈ వార్తలను కొట్టిపడేస్తున్నారు. నాగార్జున ఎవరికీ బయపడి పెళ్లి చేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. లోకంలో భర్త కంటే భార్య వయసు ఎక్కువగా ఉన్నవారు సంతోషంగా సంసారం సాగిస్తున్నారని చెబుతున్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ తమకంటే వయసులో పెద్దవారినే పెళ్లి చేసుకొని పర్ఫెక్ట్ కపుల్ గా జీవిస్తున్నారని, వారి స్పూర్తితో అఖిల్ తన కంటే ఒక ఏడాది పెద్దదైన శ్రీయను వివాహం ఆడడంలో ఎటువంటి తప్పులేదని వివరిస్తున్నారు.

ఎఫైర్స్ పై నిజాలు బయట పెట్టిన సునీత!

జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ‘గులాబీ’ చిత్రంలో మొదటి సారిగా ‘ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో..’ అనే పాటతో సింగర్‌గా మారింది సునీత‌. ఆ సినిమా త‌ర్వాత ఆమె ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు పాడి టాప్ సింగ‌ర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
టాప్ సింగ‌ర్‌గా ఉన్న సునీత లైఫ్‌లో చాలా చేదు విష‌యాలు కూడా ఉన్నాయి. ఆమె తాజా ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆసక్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించింది. భర్త కిరణ్ నుంచి విడిపోవడానికి కారణాలతో పాటు.. తన తో లిక్ పెట్టిన రాజకీయ నాయకుల వరకు క్లారిటీ ఇచ్చింది సునీత‌.
ఈ సింగర్ కు నిజమాబాద్ ఎంపీ మధు యాష్కీ తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన సునీత తాను అందంగా పుట్టడం వల్లే ఇలాంటి రూమార్స్ తనపై వచ్చాయని వెల్లడించింది. ఓ వేడుకలో మధు యాష్కీ తనను పోగడటం వల్ల ఈ రూమర్స్ రాసుకొచ్చారని ఆమె తెలిపింది. అలాగే టాలీవుడ్ కి చెందిన మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా తనకు లీక్ ఉందని వార్తలు రాస్తున్నారని.. అసలు ఈ వార్తలు అన్ని ఎలా పుట్టుకొస్తున్నాయో తనకు అర్ధం కావడం లేదని.. ఆవేదన వ్యక్తం చేసింది ఈ అందమైన సింగర్. మరి ఇవడపై ఇంకెన్ని రూమార్స్ బయటకు వస్తాయో చూడాలి.

ఎంపీగా నారా బ్రాహ్మ‌ణి

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు, పార్టీ యువ‌నేత నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మ‌ణి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప్ర‌త్యక్ష రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణి భ‌ర్త నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో లోకేష్‌కు మంత్రి ప‌ద‌వి రాయ‌డం క‌న్‌ఫార్మ్ అన్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలోనే ఉన్న‌త విద్యావంతురాలు, మేనేజ్‌మెంట్ రంగంలో విశేషంగా ప‌ట్టున్న బ్రాహ్మ‌ణిని సైతం టీడీపీ త‌ర‌పున పాలిటిక్స్‌లోకి దింపాల‌ని బాబు ప్లాన్ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ఫ్యామిలీ నుంచి న‌లుగురు కీల‌క ప‌ద‌వుల్లో ఉన్నారు. వీరిలో కేసీఆర్‌తో పాటు హ‌రీష్‌రావు, కేటీఆర్ తెలంగాణ పాలిటిక్స్ శాసిస్తుంటే, ఎంపీ క‌విత కేంద్రంలో తెలంగాణ‌కు రావాల్సిన నిధుల కోసం పోరాడేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే బ్రాహ్మ‌ణిని సైతం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి గెలిపించి ఆమెను ఢిల్లీకి పంపాల‌ని బాబు ప్లాన్లు వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. సమ‌ర్థ‌వంత‌మైన నాయ‌కత్వ ల‌క్ష‌ణాలు, ఆంగ్ల భాష‌పై ప‌ట్టు ఉన్న బ్రాహ్మ‌ణిని ఢిల్లీకి పంపితే ఏపీకి వ‌చ్చే నిధులు, ఇత‌ర‌త్రా ప‌నుల విష‌యంలో ఢిల్లీలో ప‌నులు చ‌క్క‌బెట్టే సామ‌ర్థ్యం వ‌స్తుంద‌ని బాబు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ్రాహ్మ‌ణిని గుంటూరు లేదా అనంత‌పురం జిల్లాలోని హిందూపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఓ చోట నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దింపుతార‌ని తెలుస్తోంది. జ‌య‌దేవ్ ప్ర‌స్తుతం గుంటూరు ఎంపీగా ఉన్నారు. బ్రాహ్మ‌ణి అక్క‌డి నుంచి పోటీచేసే క్ర‌మంలో జ‌య‌దేవ్‌ను చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయిస్తార‌ని టాక్‌.

ఒక వేళ టీడీపీకి ప‌ట్టున్న అనంత‌పురం జిల్లాలోని హిందూపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమెను పోటీ చేయిస్తే అక్క‌డ సిట్టింగ్ ఎంపీ నిమ్మ‌ల కిష్ట‌ప్ప‌కు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల‌ని బాబు యోచ‌న‌గా తెలుస్తోంది. ఏదేమైనా ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ్రాహ్మ‌ణిని ఎంపీగా బ‌రిలోకి దింపాల‌న్న బ‌ల‌మైన కోరిక బాబు వ్య‌క్తం చేస్తున్నార‌న్న టాక్ టీడీపీలో వినిపిస్తోంది.

నాకు సుఖం నాకివ్వు నేకేం కావాలో నేనిస్తా " మంత్రిగారి రాసలీలలు .. వీడియో దొరికింది :

దేశం లో అన్ని రాష్ట్రాల్లో జరిగే సెక్స్ స్కాండల్స్ ఒక ఎత్తు కర్ణాటక లో మరొక ఎత్తూ. అసంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్న తరుణం లో వాటిని మినిమం కూడా కేర్ చెయ్యకుండా మొబైల్ లో బూతు వీడియో లు చూసి దొరికిపోయిన మంత్రులు ఇదే రాష్ట్రం లో ఉన్నారు.
ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర మంత్రి హెచ్ వై మేటి రాసలీలలు కెమెరా కి దొరికాయి. దాంతో ఆయన పదవి కూడా పోయింది. సాయం కోరి వచ్చిన ఒక మహిళను.. తాను చేసే సాయానికి ప్రతిఫలం ఇవ్వాలని కోరటమే కాదు.. ఆమెతో చేసిన కామకేళి అయ్యగారికి నెత్తికి చుట్టుకుంది. చేసిన పాపం ఊరకే పోనట్లు.. మంత్రి రాసలీలల్ని.. గుట్టుగా కెమేరాతో షూట్ చేసేసి.. వాటిని ఒక మీడియా ఛానల్ కు అప్పగించటం.. వారు వాటిని ప్రసారం చేయటంతో ఉన్న పదవి పోయింది. కర్ణాటకతో పాటు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..
కర్ణాటక ఎక్సైజ్ శాఖామంత్రి హెచ్ వై మేటి కక్కుర్తి పడ్డారు. తన శాఖకు చెందిన ఒక మహిళా ఉద్యోగి.. తనకు అనుకూలమైన ప్రాంతంలో బదిలీ చేయాలంటూ ఆయన వద్దకు వచ్చారు. మంత్రికి బంధువైన సదరు మహిళను.. ఆయన వదిలిపెట్టలేదు. నీకు కావాల్సింది నీకిస్తా.. నాకు కావాల్సింది నాకివ్వవా? బేరం పెట్టటమే కాదు.. ఆమెను ఒత్తిడికి గురి చేసి తన కోరికను తీర్చుకున్నారు. మహిళపై మంత్రిగారి లైంగిక దాడికి సంబంధించిన వీడియో ఫుటేజ్.. టీవీ ఛానళ్లలో ప్రసారం కావటంతో.. అయ్యగారి భాగోతం లోకం మొత్తానికి తెలిసిపోయింది.

ప‌విత్ర‌మైన దేవాదాయ శాఖ‌లో ఉద్యోగిగా

ప‌విత్ర‌మైన దేవాదాయ శాఖ‌లో ఉద్యోగిగా ఆ అధికారి ఉన్నాడు. బుద్దిగా ఉండాల్సిన అతడు పెద్ద కామాంధుడిగా మారిపోయాడు. తను చేసే రాస‌ల‌లీల‌కు గుడి ఆవ‌ర‌ణ‌నే అడ్డాగా మార్చుకున్నాడు. తినడానికి తిండిలేక పాకులాడుతున్న కొంతమందికి మాయ మాటలు చెప్పి వారిని త‌న రాస‌లీల‌ల‌కు వాడుకుంటున్నాడు.
తనతో రాస‌ల‌లీల‌కు ఒప్పుకుంటే వారి..బంధువులు, కుటుంబ సభ్యులకు గుడిలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. అంజ‌య్య‌ ఆలయ గెస్ట్‌హౌజ్‌లలో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని పేర్కొన్నారు. అంజయ్య చేసే రాసలీలల ఫొటోలు మీడియాకు సైతం చిక్కాయి. వాటిలో కొన్ని ఆలయ బుకింగ్‌ కార్యాలయం, గెస్ట్‌హౌజ్‌ వెనక భాగంలో దిగినవి కాగా, మరికొన్ని వాహనం, గదుల్లో సాగించిన లీలలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
అంజయ్య గతంలో వేద పండితుడిపై చేయి చేసుకున్న సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఎన్నో ఆరోపణలతో చాలా సార్లు మల్లన్న ఆలయం నుంచి బదిలీ అయ్యాడు. అయినా, కొద్ది సమయంలోనే తిరిగి కొమురెల్లికి వచ్చేస్తూ ఇక్క‌డ రాస‌లీల‌లు కొన‌సాగిస్తున్నాడు. గుడిలో పని చేసే వారు.. మద్యం, జూదం, కామం వంటి వ్యసనాలకు లోనుకాకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ.. వాటిని మరిచిపోయి  ఏఈవో వైరాగ్యం అంజయ్య పలు సందర్భాల్లో గెస్ట్‌హౌజ్‌లలోనే మద్యం సేవిస్తూ లీలలు సాగిస్తున్నాడు. మరి అంజ‌య్య‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Related

పీలే బయోపిక్ తో మరోసారి ఆస్కార్ రేస్ లో ఏఆర్ రహమాన్

డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ మరోసారి అకాడమీ అవార్డుల బరిలో నిలిచాడు. బ్రెజిల్‌  ఫేమస్ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు పీలే బయోపిక్‌ తో మరోసారి ఆస్కార్ అందుకునే ఛాన్స్ కొట్టేశాడు. సంపాదించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఫేమస్ సంగీత దర్శకులతో పోటీపడుతున్నాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి 2009లో రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నాడు ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రహమాన్. అభిమానులకు డబుల్ జోష్ ఇచ్చాడు. వచ్చే ఏడాది జరగబోయే అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో మరోసారి ఆస్కార్ అందుకునేందుకు  పోటీపడుతున్నాడు. బ్రెజిల్ ఫుట్ బాల్ ఆటగాడు పీలే బయోపిక్ పీలే.. బర్త్ ఆఫ్ ఎ లెజెండ్ మూవీకి  ఒరిజినల్ స్కోర్ విభాగంలో పోటీపడుతున్నాడు. ఫిబ్రవరి 26న జరిగే 89వ ఆకాడమీ అవార్డులకు ఒరిజనల్ స్కోర్ విభాగంలో ఈసారీ 145 మంది పోటీ పడుతున్నారు. వీటిలో ఒకటిగా నిలిచింది పీలేలోని రెహమాన్‌ కంపోజ్‌ చేసిన గింగా. జెఫ్‌ జింబాలిస్ట్‌, మైకెల్‌ జింబాలిస్ట్‌ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఆస్కార్ అవార్డుల నామినేషన్ల తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేయనున్నారు. 2009లో రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న రహమాన్ కు 2011లో 127 అవర్స్ ఒరిజినల్  స్కోర్, ఇఫ్‌ ఐ రైజ్' అనే పాటకు నామినేట్ అయ్యారు. 2014లో కూడా మిలియన్‌ డాలర్‌ ఆమ్‌, ద హండ్రెడ్‌ ఫుట్‌ జర్నీ, ఇండియన్ మూవీ కొచ్చాడయాన్‌కు ఆస్కార్ బరిలో నిలిచారు. కానీ అవార్డు అందుకోలేకపోయారు. కానీ ఈసారీ మాత్రం రహమాన్ కు మరో ఆస్కార్ గ్యారంటీ అని నమ్మకంగా ఉన్నారు అభిమానులు.

యుఎస్‌లో సైబర్ నేరానికి పాల్పడిన భారతీయ విద్యార్ధి అరెస్ట్

కృష్ణమకుటో శర్మ అనే తెలుగు విద్యార్ధి లాస్ శాన్ ఫ్రాన్సిస్కోలోని చాటాంగో అనే కంపెనీకి చెందిన కంప్యూటర్లను హ్యాక్ చేశాడు.  ఆ సంస్ధ ఇతర కంపెనీలకు చాట్ సర్వీసులు అందిస్తుంది.  2014 నవంబరు నుంచి 2015 జనవరి వరకు ఆ సంస్ధ కంప్యూటర్లు పనిచేయలేదు.  డిడాస్ అనే పద్దతిలో సైబర్ దాడులు చేస్తే ఒక్కసారిగా బోగస్ రిక్వెస్టులు వెల్లువెత్తి చివరకు ఆ వ్యవస్థ పనిచేయకుండా పోతుంది.  ఎక్స్‌ట్రీమ్ ఫైర్ అనే తరహా బోట్‌నెట్‌ను శర్మ ఉపయోగించినట్లు కోర్టుకు సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.  కాలిఫోర్నియా రాష్ట్రంలోని లా కెనడా అనే ప్రాంతంలో ఎఫ్‌బీఐ అధికారులు శర్మను అరెస్టు చేశారు.  అతడు లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చదువుతున్నట్లు తెలిసింది.  ఐదు రోజులపాటు నిర్వహించిన ఆపరేషన్‌లో 34 మందిని అరెస్టు చేశారు. కంప్యూటర్ పరిజ్ఞానం రాగానే తర్వాత ఏమవుతుందో తెలియక సైబర్ నేరాలకు పాల్పడుతుంటారు.