cricket ad

Sunday 11 December 2016

శృంగారం చేసే మగవారు ఇవి తింటే......టాప్ లేపుతారంటా

ప్రతి మగాడు శృంగారం లో రెచ్చిపోవాలని కోరుకుంటాడు.అలాగే స్త్రీని తన అదుపులో పెట్టుకోవాలని చూసుకుంటాడు. అలాగే ఆడవారు కూడా తమకు అధిక సుఖాన్నిచ్చిన మగవాడిని మాట అస్సలు జవదాటరు.వారి మాటనే తమ మాటగా మార్చుకుంటారు. అందుకే ఆడవారిని ఇక్కడ గెలిస్తే చాలు ఇక అన్నింట్లో మగవారిదే పై చెయ్యి.ఇకపోతే సెక్స్ లో మగాడిని టాప్ లో వుంచే కొన్ని ఆహారపదార్దాలు వున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
1.పుచ్చకాయ, ఇది నేచురల్ వయగ్రాలా పని చేస్తుంది. అందుకే ప్రతి మగాడు దీనిని కంపల్సరీగా తింటూ వుండాలి.
2.. మునగ, దీనిలోని స్పెషల్ గుణాలు మగాడిలోని సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయి.
3. వెల్లుల్లి, ఇందులోని బి 6 ఎక్కువగా వుండటం వల్ల సంతనా సాఫల్యత పెరగడమే కాకుండా మిమ్మల్ని సెక్స్ రాజ్యానికి రారాజు ను చేస్తుంది.
4.దానిమ్మ, దీని రసం మగాడి వీర్యంలోని కణాలను పెంచడమే కాకుండా వీర్య నాణ్యతను పెంచుతుంది.
5. మిరపకాయ, పురుషుల సంతనా సాఫల్యత శక్తిని పెంచుతుంది.
6. చేపలు,దానిమ్మ రసం, ఒమేగా 3, ఒమేగా 6 అధికంగా వున్న పదార్దాలు ఎక్కువగా తీసుకుంటే వీర్యవృద్ది అధికంగా వుంటుంది.
7. ప్రతి రోజు ఒక అరటి పండు, మీ స్మెర్మ్ కౌంట్ ను పెంచుతుంది.
8. నారింజ తొనలు, పుచ్చకాయ కూడా సెక్స్ కెపాటిని పెంచుతాయి. పచ్చిగా చెప్పాలంటే పుచ్చకాయ సహజ సిద్దమైన వయగ్రా గా పని చేస్తుంది.

రేపు ‘‘మిలాద్‌ - ఉన్‌ - నబీ’’ అంటే ఏంటో తెలుసా?

అనంత కరుణామయు డు అల్లాహ్‌ సర్వమానవాళి శ్రేయస్సు కోసం,శాంతిని నెలకొల్పేందుకు ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ను ఎన్నుకున్న అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్‌ షరీఫ్‌ ద్వారా తెలపబడింది. విశ్వ ప్రవక్త మహమ్మద్‌ (సఅస) కేవలం ముస్లిం కోసం కాదని సర్వ కోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్‌ నియమించారని తెలపబడింది. విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్‌ ద్వారా ఏది వినునో అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేకదైవ గ్రంథాల్లో ముందుగానే తెలపబడిఉన్నది. మరో సాక్ష్యం ఏమిటంటే మహమ్మద్‌ ప్రవక్త (ఉమ్మి) అక్షరాస్యత తెలియని వారు. ఇది అల్లాహ్‌ తహ లా మహిమ పవిత్ర ఖురాన్‌ను దైవవాణి రూపంలో ప్రవక్తపై అవతరింప జేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు అయ్యాయి.
 
అల్లాహ్‌కు అతి ప్రీతి పాత్రులైన మహమ్మద్‌ (సఅస) ఇస్లాం క్యాలెండర్‌లోని మూడో నెల రబీవుల్‌ అవ్వల్‌ 12వ తేదీ సోమవారం హిం దువుల క్యాలెండర్‌ విక్రమాదిత్య శకం 628 జ్వేష్టశుద్ధ 9వ తేదీ సోమవారం, 570 సంవత్సరం ఏప్రిల్‌ 20వ తేదీ గ్రీగోరియన్‌ క్యాలెండర్‌ (క్రిస్టియన్‌) ప్రకారం జన్మించారని తెలపబడి ఉంది మక్కాపురం పెద్ద అయిన అబ్దు ల్‌ మత్తలబు కుమారుడు అబుద్దాలా అమీనాలకు జన్మించారు. మహమ్మద్‌ (ప్రవక్త) సోమవారం సూర్యోదయానికి వేకువజామున మధ్య జన్మించినట్లు తెలపబడింది. మహమ్మద్‌(సఅస)కు 40వ ఏట ప్రవక్త పదవి వరిం చిందని తెలపబడింది. వారు ఏకదైవారాధన, మానవులంతా ఒక్కటే, తారతమ్యాలు అనేవి లేవని అంతా అల్లాహ్‌ దాసులేననిప్రబోధించే వారు. శాంతి సహజీవనం, దానం, దైవ భీతి తో మెలగాలని బోధించేవారు. ప్రపంచ మంతటా ఆయనపుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు. ఆయన జయంతి వేడుకలను ‘‘మిలాద్‌ - ఉన్‌ - నబీ’’ అని అరబ్బీలో అంటారు.
 
భారత దేశంలో...
భారత దేశంలో మిలాద్‌ - ఉన్‌ - నబీ 12వ తేదీ సోమవారం రానుంది. ఈ సందర్భంగా దేశమంతటా ఆధ్యాత్మిక సభలు నిర్వహించి ప్రవక్త జీవిత విశేషాలను, ఆయన బోధనల ను మత గురువులు ప్రజలకు వివరిస్తారు.
 
కడప జిల్లాలో ....
మిలాద్‌ - ఉన్‌ - నబీ కడప జిల్లాలో బార్మినెలగా బహుప్రసిద్ధి, ప్రవక్త జన్మదిన వేడుక ల సందర్భంగా రాత్రిళ్ళు ఆధ్యాత్మిక సభలు, నాతియాకలామ్‌ (ప్రవక్త కీర్తనలు) నిర్వహిస్తారు. వేకువ జామున నమాజ్‌ తర్వాత బార్మి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన జిల్లాలో ముస్లింలతో పాటు హిందూ సోదరులు కూడా ఎంతో పవిత్రంగా బార్మి అన్నదానాలు నిర్వహించడం ప్రత్యేకత. ఇది మత సామరస్యానికి నిదర్శనం. ఐకమత్యానికి జిల్లా అందరికీ ఆదర్శం అనడం అతిశయోక్తి కాదు.

సెహ్వాగ్ ప్రతిపాదించిన కొత్త రూ.200 నోటు ఇదే..

ఇంగ్లాండ్‌‌తో టీమిండియా ముంబైలో ఆడుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ నాలుగో రోజున విరాట్ కోహ్లీ వీరవిజృంభణ చూసి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఏడాదిలో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోహ్లీని ఆయన అభినందనలతో ముంచెత్తారు. అంతేకాదు...కోహ్లీ ట్రిపుల్ డబుల్ సెంచరీ నేపథ్యంలో ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. కొత్త రూ.200 నోట్లు ముద్రించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆయన ఓ ప్రతిపాదన చేశారు. ప్రతిపాదిత కరెన్సీ నోట్‌ ఫోటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ నోటుపై కోహ్లీ డబుల్ సెంచరీ అనంతరం సంతోషంతో బ్యాటు పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంది. కోహ్లీ ఆటతీరును సెహ్వాగ్ మాత్రమే కాదు...శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ సైతం ప్రశంసలతో ముంచెంతారు. 'ది జీనియస్ ఈజ్ ఎట్ వర్క్' అంటూ ట్వీచ్ చేశారు. కోహ్లీ బ్యాటింగ్ తీరు చూసితీరాల్సిందేనని ప్రశంసించారు.

ప్రకంపనలు పుట్టిస్తున్న ఐటి దాడులు...తాజాగా రూ.13 కోట్లు స్వాధీనం

: నల్లధనంపై ఐటీ దాడుల పరంపర కొనసాగుతోంది. దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-1 ఏరియాలోని ఓ న్యాయ సంస్థపై ఆదాయం పన్ను అధికారులు, ఢిల్లీ పోలీసులు జరిపిన సోదాల్లో రూ.13 కోట్ల నగదు పట్టుబడింది. వీటిలో రూ.2.5 కోట్ల కొత్త కరెన్సీ కట్టలు ఉన్నాయి. శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిపామని, కప్‌బోర్డు, సూట్‌కేసులో దాచి ఉంచిన రూ.13.56 కోట్ల రూపాయలు బయటపడ్డాయని పోలీసులు తెలిపారు. క్రైం బ్రాంచ్ పోలీసులు టి అండ్ టి సంస్థపై ఈ దాడులు నిర్వహించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాగా, ఐటి దాడుల్లో పట్టుబడిన మొత్తంలో 7 కోట్లు విలువచేసే పాత రూ.1000 నోట్లు, 3 కోట్లు విలువచేసే రూ.100 నోట్లు, తక్కినవి పాత, కొత్త నోట్లుగా వివిధ డినామినేషన్లలో ఉన్నాయని చెప్పారు. పోలీసు బృందం రైడ్స్ జరిపిన సమయంలో టి అండ్ టి సంస్థ గదులు చాలామటుకు తాళం వేసి ఉండగా, ఒక కేర్‌టేకర్ మాత్రం అక్కడ ఉన్నాడు. రోహిత్ టాండన్ అనే వ్యక్తి టి అండ్ టి న్యాయసంస్థ ప్రమోటర్‌‌గా ఉన్నారు.

Sponsored by Revcontent Trending Now jayalaitha-video షాకింగ్; జయలలిత ఆత్మ ఇంకా అక్కడక్కడే తిరుగుతుందంట!

అమ్మ ఆత్మగా మారి ఆమెకు అన్యాయం చేసిన వారి అంతు చూస్తుందని కూడా అంటున్నారు. జయది వైష్ణవ బ్రాహ్మణ కుటుంబం కాగా… ఆమె అంత్యక్రియలు ఆ పద్దతులలో చెయ్యకపోవడం అనేది ఆమెను అవమానించినట్టే అని అంటున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంత వైష్ణవ బ్రాహ్మణులు తమ మనోభావాలను దెబ్బ తీసారని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. సాంప్రదాయ ప్రకారం చితి పేర్చి నిప్పు అంటించాలి…అలా చేయకపోతే ప్రేతాత్మ గా మారుతుంది ఆత్మ అని అంటున్నారు. ఇంకా మరిన్ని వివరాలతో వీడియో…

జయలలిత 5కాదు 4వతేదినే చనిపోయారు… ఇవిగో తిరుగులేని సాక్షాలు




జయలలిత మరణం తరవాత రోజుకో ట్విస్ట్ బయటకు వస్తుంది. అపోలో హాస్పిటల్ ప్రకటన ప్రకారం జయలలిత డిసెంబర్ 5   సోమవారం రాత్రి 11.30కి జయ మృతి చెందారు. డిసెంబర్ 4న గుండెపోటు వచ్చినట్టు వైద్యులు చెప్పిన విషయం మనకు తెలిసినదే. కాని అప్పటికే ఆమె చనిపోయిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అమ్మ మరణం లో మిస్టరీ తెలియాలంటే ఆ దేవుడే దిగి వచ్చి చెప్పాలేమో అనేంతగా రోజుకో అనుమానాలు తలెత్తుతున్నాయి.


 తాజాగా ఇప్పుడు వచ్చిన అనుమానం ఏమిటంటే… ఆదివారం సాయంత్రానికే జయ అంత్యక్రియలకు అన్నాడీఎంకే నేతలు ఏర్పాట్లు మొదలు పెట్టారట. జయ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచిన రాజాజీ హాలును శుభ్రం చేయాలని ఆదివారమే ఆదేశాలు అందాయట. దీనితో, ముందు రోజే జయ చనిపోయిన విషయం పార్టీలోని కీలక నేతలకు తెలిసి ఉంటుందనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అధికార అన్నాడీఎంకే నేతలు అన్నీరకాలుగా సద్దుకున్న తరవాత నిమ్మదిగా ఈ విషయాన్ని బయట పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

భారతీయిలకి అమెరికాలో ఇంక ఉద్యోగం దొరకదు… ట్రంప్ చేసిన ప్రకటన ఇదే…

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్… అమెరికన్ ఉద్యోగుల స్థానంలో హెచ్1బి వీసాలతో వచ్చిన విదేశీయులు పనిచేయడానికి తాను ఏమాత్రం అనుమతించేది లేదని చెప్పారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో విధానాలను స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తాను కొంతమంది అమెరికన్లను కలిసినప్పుడు… తమ ఉద్యోగాలు పీకేశారని, తమ స్థానంలో విదేశీయులను నియమించుకుంటున్నారని వాళ్లు చెప్పారని ట్రంప్ అన్నారు. ప్రతి ఒక్క అమెరికన్ జీవితాన్ని కాపాడేందుకు తాను పోరాడతానని వేలాది మంది మద్దతుదారుల మధ్య జరిగిన సభలో ట్రంప్ చెప్పారు.