cricket ad

Sunday 11 December 2016

సెహ్వాగ్ ప్రతిపాదించిన కొత్త రూ.200 నోటు ఇదే..

ఇంగ్లాండ్‌‌తో టీమిండియా ముంబైలో ఆడుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌ నాలుగో రోజున విరాట్ కోహ్లీ వీరవిజృంభణ చూసి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ ఏడాదిలో మూడుసార్లు డబుల్ సెంచరీ చేసి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోహ్లీని ఆయన అభినందనలతో ముంచెత్తారు. అంతేకాదు...కోహ్లీ ట్రిపుల్ డబుల్ సెంచరీ నేపథ్యంలో ప్రభుత్వానికి ఓ సూచన చేశారు. కొత్త రూ.200 నోట్లు ముద్రించాల్సిందిగా నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆయన ఓ ప్రతిపాదన చేశారు. ప్రతిపాదిత కరెన్సీ నోట్‌ ఫోటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ నోటుపై కోహ్లీ డబుల్ సెంచరీ అనంతరం సంతోషంతో బ్యాటు పైకెత్తి ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంది. కోహ్లీ ఆటతీరును సెహ్వాగ్ మాత్రమే కాదు...శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ సైతం ప్రశంసలతో ముంచెంతారు. 'ది జీనియస్ ఈజ్ ఎట్ వర్క్' అంటూ ట్వీచ్ చేశారు. కోహ్లీ బ్యాటింగ్ తీరు చూసితీరాల్సిందేనని ప్రశంసించారు.

No comments:

Post a Comment