cricket ad

Saturday 10 December 2016


ఆడదాని శరీరంలో ఈ స్పాట్ ని తాకినా నెమ్మదిగా రుద్దినా ఇక ఆ ఆడది స్వర్గం చూసినట్టే

షేర్ చేయండి
యోని మార్గంలో ఒకటిన్నర అంగుళం లోపల మూత్రనాళం వైపు అదిమితే సుఖానుభూతులు స్త్రీకి ఎక్కువగా కలుగుతాయి. ఈ భాగాన్నే 'జీ స్పాట్' అంటారు. ఇలాంటి కామోద్రేక కేంద్రం స్త్రీలలో ఉందని గ్రాఫెన్ బెర్గ్ అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. అందుకే తన పేరులోని మొదటి అక్షరం "జీ" ని తీసుకోని దీనికి జీ-స్పాట్ అనే పేరు పెట్టారు.

శృంగారంలో స్త్రీలు వివిధ భంగిమల్లో సుఖానుభూతులు పొందుతుంటారు. కాని యోని మార్గంలో అంగ ప్రవేశం వలన, ప్రేరణ వలన, మరింత సుఖంగా అనిపిస్తుంది. సెక్స్ జరుగుతున్నప్పుడు జీ స్పాట్ కి ఎలాంటి స్పర్శ తగిలినా, స్వర్గం చూసినట్టే స్త్రీలు. అందుకే శృంగారంలో మహిళను ఎలా సుఖపెట్టాలో కేవలం నేర్పరులకే తెలుసని అంటారు.

అమ్మాయిలు హస్తప్రయోగం చేసుకునేది ఈ జీ స్పాట్ ని స్పర్శించడానికే. ఇది ఆకారంలో అలసంద గింజను పోలివుంటుంది అని గుర్తించారు పరిశోధకులు. జీ స్పాట్ యొక్క ముఖ్యత తెలిసాక యోని మీద ఎన్నోరకాల పరిశోధనలు జరిగాయి. ఎందరో మహిళలు పరిశోధనలకి సహాయం చేసి, జీ స్పాట్ ని స్పర్శించినప్పుడు కలిగిన మధురానుభావలను వ్యక్తపరిచారు.
షేర్ చేయండి

షాకింగ్ : బాత్రూం గోడల్లో రూ.5.7కోట్ల కొత్త నోట్లు

నోట్ల రద్దు తర్వాత ఐటీ అధికారులు దూకుడు పెంచారు. అక్రమంగా నగదు మారుస్తున్న హవాలా ఆపరేటర్ల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గ, హుబ్లీలోని ఓ హవాలా ఆపరేటర్ ఇంటిపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు చేశారు. బాత్రూం గోడల్లో ఏర్పాటు చేసుకున్న సీక్రెట్ లాకర్లలో 5కోట్ల 7 లక్షల రూపాయల 2వేల నోట్లు బయటపడ్డాయి. మరో 90 లక్షల రూపాయల విలువైన పాత 500, వెయ్యి రూపాయల నోట్లు కూడా ఉన్నాయి. నగదుతోపాటు 32 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 2వేల నోట్లు కోట్లలో బయటపడటంతో షాక్ అయ్యారు ఆఫీసర్స్. వాటిని ఏయే బ్యాంకుల నుంచి తీసుకొచ్చారు.. ఎవరెవరు సహకరించారు అనే దానిపై తీగ లాగుతున్నారు. బెంగళూరు కేంద్రంగా హవాలా లావాదేవీలు నడిపే వ్యాపారులపైనా కన్నేసి ఉంచారు.

అమ్మ మృతికి శశికళ కుట్ర? వెలుగులోకొచ్చిన ‘తెహల్కా’

తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలిత మరణం, తదనంతర పరిణా మాలపై వెలుగుచూస్తున్న విషయాలు ఆమె అభిమానులను కలవరానికి గురిచేస్తున్నాయి. 2012లో తెహెల్కా ప్రచురించిన సంచలన కథనం జయలలిత మృతి వెనుక కుట్ర జరిగిందన్న వాదనలకు బలం చేకూర్చుతోంది. దీంతో ప్రజల్లో జయ సన్నిహితురాలు శశికళపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మన్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకుని శశికళ అనేక అక్రమాలకు పాల్పడ్డారనీ, సీఎం జయలలితను చంపేందుకు సైతం కుట్రపన్నారనీ తెహెల్కా నాలుగేళ్ల ముందే కథనం రాసింది. జయ నివాసం పోయెస్ గార్డెన్స్ నుంచి శశికళను వెళ్లగొట్టిన తర్వాత... శశికళ తాను నియమించిన నర్సు ద్వారా సీఎంకు స్లోపాయిజన్ ఎక్కించినట్టు పేర్కొంది. జయలలిత తాను తీసుకుంటున్న మందులపై చేయించుకున్న వ్యక్తిగత వైద్య పరీక్షల్లో ఈ విషయం వెల్లడయినట్టు తెహెల్కా తెలిపింది. ఆమెకు నిద్రమాత్రలు, రసాయనాల రూపంలో కొద్ది కొద్దిగా విషం ఎక్కిస్తున్నట్టు వైద్యపరీక్షల ద్వారా బయటికి వచ్చినట్టు పేర్కొంది. శశికళ నియమించిన నర్సు సీఎంకి ఇచ్చే మందులు, పళ్లు వగైరా ఆహార పదార్థాల్లో వాటిని కలిపి ఇచ్చినట్టు తెలిపింది. కాగా జయలలిత నుంచి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు... శశికళను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు మన్నార్‌గుడి మాఫియా (శశికళ కుటుంబం) చేసిన పలు ప్రయత్నాలను కూడా ఉటంకించింది. శశికళ భర్త నటరాజన్, ఆమె సోదరుడు దివాహారన్, మరదలు ఇళవరసి, కుమారుడు వివేక్, సోదరి ప్రియ, మేనల్లుళ్లు వెంకటేష్, మహదేవన్, మేనకోడలి భర్త శివకుమార్ తదితరులు ఒకప్పుడు జయ నివాసంలోనే ఉండేవారు. జయతో శశికళకున్న స్నేహాన్ని అడ్డం పెట్టుకుని వారు అనేక అక్రమాలకు పాల్పడినట్టు వెలుగుచూడడంతో సీఎం వారిని తన ఇంట్లో నుంచి గెంటేశారు. దీంతో ఎలాగైనా జయలలితను అంతమొందించాలనే ఉద్దేశంతో ఆమెను మళ్లీ మచ్చిక చేసుకుని ఇంట్లోనే జయపై శశికళ కుట్ర సాగించినట్టు తెహెల్కా పేర్కొంది. సీఎం మరణానంతరం తాజాగా శశికళ కుటుంబం మళ్లీ జయ ఇంట్లో పాగా వేయడంతో... మళ్లీ చక్రం తిప్పేందుకే రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 22 జయ అపోలో ఆస్పత్రిలో చేరింది మొదలు... ఆమె చికిత్స గురించి కాదుగదా, కనీసం ఆమెను కలిసేందుకు కూడా ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఆస్పత్రిలో చేర్పించిన నాటి నుంచి అంతిమ సంస్కారాల వరకు శశికళ అన్నీ తానై వ్యవహరించడం కూడా గమనార్హం
స్నానాల గదిలో ఏముంటాయి? సబ్బులు, పేస్టు, బ్రష్షు... వగైరా వగైరా! కానీ, కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరెలో ప్రముఖ నటుడు, జేడీఎస్‌ పార్టీ ముఖ్య నాయకుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్ర అలియాస్‌ పప్పి తన బాతరూమ్‌లో ఒక భోషాణమే ఏర్పాటు చేసుకున్నారు. అదికూడా... మూడోకంటికి ఏమాత్రం అనుమానం రానంత, పరులెవరూ గుర్తించలేనంత పకడ్బందీగా! విశాలమైన స్నానాల గది గోడలకు సిమెంటు రంగు టైల్స్‌ అతికించారు. బాతరూమ్‌లోకి అడుగు పెట్టగానీ అటూ ఇటూ ఈ టైల్స్‌ కనిపిస్తాయి. కాసింత లోపలికి వెళ్లాక... సబ్బులు, పేస్టులు, బాతటబ్‌, టాయ్‌లెట్‌ బేసిన్‌ వంటివి కనిపిస్తాయి. కానీ... అసలు ‘విషయం’ ఆరంభంలోనే ఉంది. బాతరూమ్‌ ఎంట్రన్స్‌లో కుడివైపున ఉన్న టైల్స్‌ వెనుక ఒక రహస్య అల్మరాను ఏర్పాటు చేశారు. దీని తలుపు మిగిలిన టైల్స్‌లో అత్యంత సహజంగా కలిసిపోయి ఉంటుంది. అత్యంత పరిశీలనగా చూస రెండుమూడు టైల్స్‌ అవతల చీపురు పుల్ల పట్టేంత చిన్న రంధ్రం ఒకటి కనిపిస్తుంది. అల్మరాకు పుల్లే ‘తాళం చెవి’. అలా పుల్లను పెట్టేసి... అల్మరాకు కుడివైపున తడితే తలుపు తెరుచుకుంటుంది. భారీ భోషాణం బయటపడుతుంది

జయ'లేని అన్నాడీఎంకేకు చెక్... డీఎంకే వ్యూహం ఇదే...?

అన్నాడీఎంకేలో అన్నీ తానే అయి ఏళ్ల తరబడి చక్రం తిప్పిన 'అమ్మ' జయలలిత మరణంతో ఆ పార్టీ చుక్కాని లేని నావలా మారనుందా? అమ్మ మాటే శిరోధార్యంగా నడిచిన రోజులు ఇక గతించినట్టేనా? పార్టీ పగ్గాలు ఒకరు, ప్రభుత్వం పగ్గాలు మరొకరి చేతిలో ఉండే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండే అవకాశాలున్నాయి? ఇవే ఇప్పుడు ఆ పార్టీ నేతలనే కాకుండా క్యాడర్‌నూ వేధిస్తున్న ప్రశ్నలు. ఇంతవరకూ.... అన్నాడీఎంకే, లేకుంటే డీఎంకే అన్న తరహాలోనే తమిళనాడు రాజకీయాలు సాగుతూ వచ్చేవి. ద్రవిడ పార్టీలకే తమిళ ఓటర్లు పట్టం కడుతూ వచ్చేవారు. జయ శకం ముగియడంతో అన్నాడీఎంకేకు ప్రధాన ప్రత్యామ్నాయమైన డీఎంకే....అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకుని...కొద్దికాలంగా కోల్పోయిన అధికార పగ్గాలు తిరిగి చేజిక్కించుకునేందుకు ఎలాంటి వ్యూహం అనుసరించనుందనేది రాజకీయంగానూ ఆసక్తి రేపుతోంది.
 
అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలించి, ఆ పార్టీలో అధికార సంక్షోభం లేదా నేతల్లో అసంతృప్తులు బహిర్గతమయ్యేంతవరకూ వేచిచూడాలన్నది కరుణానిధి సారథ్యంలోని డీఎంకే పార్టీ తాజా వ్యూహంగా తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ఇప్పటికే లుకలుకలు తలెత్తాయా అనేది ఇంకా బయటపడకున్నా కొద్దిపాటి అసంతృప్తులు మొదలైనట్టేనని గత నాలుగైదు రోజుల పరిణామాలను బట్టి కొందరు అంచనా వేస్తున్నారు. ఉదాహరణకు జయలలిత మృతిని వైద్యులు ధ్రువీకరించడానికి కొద్ది గంటల ముందు జరిగిన కసరత్తు, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు వీలుగా జరిగిన లోపాయికారిగా హంగామా పట్ల, కీలకమైన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడం పట్ల కొందరు పార్టీ సభ్యులు అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీలో వేగంగా చోటుచేసుకునేందుకు అవకాశమున్న పరిణామాలను నిశితంగా గమనించి తర్వాతే కార్యాచరణకు దిగాలని డీఎంకే పెద్దల వ్యూహంగా ఉంది. 'వేచిచూచే ధోరణే' ప్రస్తుతానికి పార్టీ వ్యూహమని డీఎంకే అధిష్ఠానం నుంచి ఆయా జిల్లాల కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో పరిణామాలపై ఎవరై నా అసంతృప్తులు ఉంటే వారు సహజంగానే డీఎంకే వైపు మళ్లుతారని, ఇప్పుడే హంగామా చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అన్నాడీఏంకేకు దగ్గరకావడం ద్వారా తమిళనాట బలంగా వేళ్లూనుకునే ప్రమాదం పొంచి ఉందని డీఎంకే అధిష్ఠానం భావనగా తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎలాగూ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున అప్పటిలోగా 'అమ్మ' లేని అన్నాడీఎంకే మనుగడపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధిష్ఠానం ఆలోచనగా చెబుతున్నారు. ఇక అసెంబ్లీలో బలాబలాల పరంగా చూస్తే... 234 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలతో కలిస్తే 98 మంది సభ్యులున్నారు. అంటే ప్రభుత్వాన్ని దెబ్బతీయాలంటే మరో 19 మంది సభ్యుల్ని తమవైపు తిప్పుకుంటే చాలన్నమాట.

హాట్ టాపిక్ : శంషాబాద్ లో నోట్ల కట్టల లారీ?

పాత నోట్ల మార్పిడికి డెడ్ లైన్ దగ్గర పడే కొద్దీ.. కట్టల పాములు ఒక్కొక్కటికీ బయటపడుతున్నాయి. నిన్నటికి నిన్న చెన్నైలో అతిపెద్ద స్కామ్ బయటపడగా.. ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయటం లేదు. వివరాల్లోకి వెళితే.. నాకాబందీలో భాగంగా హైదరాబాద్ – బెంగళూరు హైవేపై శంషాబాద్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ఓ లారీ వచ్చింది. వెహికల్ మొత్తం కవర్లతో కట్టేసి ఉంది. లారీ సరుకు ఏంటీ అని డ్రైవర్ ను ప్రశ్నించారు. తడబడిన డ్రైవర్… రెండు, మూడు సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు లారీని తనిఖీ చేశారు. అందులో పాత నోట్ల కట్టలు బయటపడ్డాయి. కోట్లలో ఈ డబ్బు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. లారీని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ లారీ ఎవరిది.. లారీలో ఉన్న డబ్బు ఎవరిది.. లారీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుంది.. ఐదు గంటలుగా హైదరాబాద్ లో ఈ వార్త హల్ చల్ చేస్తుంటే.. పోలీసులు ఎందుకు క్లారిటీ ఇవ్వటం లేదు.. ఉన్నతాధికారులు సైతం నోరు మెదపటం లేదు.. హైదరాబాద్ హాట్ టాపిక్ గా మారిన ఈ టాపిక్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

నమ్మినబంటే ‘అమ్మ’ను మరిచారా!

టీస్టాల్ ఓనర్‌గా జీవితం ప్రారంభించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం అయ్యారు. పన్నీర్ సెల్వం ఇప్పుడు అమ్మకు వారసుడయ్యారు. తనకు అవసరమైనప్పుడు సీఎం సీట్లో సెల్వాన్ని జయ కూర్చోబెట్టారు. సెల్వమే ఇప్పుడు ఆమె ఖాళీ చేసిన వెళ్లిన సీట్లో కూర్చున్నారు. అక్రమాస్తుల కేసులో జయ జైలుకెళ్లినప్పుడు, అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో వున్నప్పుడు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్‌సెల్వం తన టేబుల్‌పై ముందు భాగంలో ఆమె ఫోటో వుండేలా జాగ్రత్త తీసుకునేవారు. అదే విధంగా మంత్రివర్గానికి నేతృత్వం వహించినా అధ్యక్ష స్థానంలో మాత్రం కూర్చునేవారు కాదు. అయితే శనివారం జరిగిన భేటీలో జయ ఫోటో తన వెనుక వుండేలా కూర్చున్నారు. అంతేగాక ఆయన తొలిసారిగా మంత్రివర్గ అధ్యక్షుడి స్థానంలో కూర్చున్నారు.