cricket ad

Saturday 10 December 2016

నమ్మినబంటే ‘అమ్మ’ను మరిచారా!

టీస్టాల్ ఓనర్‌గా జీవితం ప్రారంభించిన పన్నీర్ సెల్వం ఇప్పుడు తమిళనాడు కొత్త సీఎం అయ్యారు. పన్నీర్ సెల్వం ఇప్పుడు అమ్మకు వారసుడయ్యారు. తనకు అవసరమైనప్పుడు సీఎం సీట్లో సెల్వాన్ని జయ కూర్చోబెట్టారు. సెల్వమే ఇప్పుడు ఆమె ఖాళీ చేసిన వెళ్లిన సీట్లో కూర్చున్నారు. అక్రమాస్తుల కేసులో జయ జైలుకెళ్లినప్పుడు, అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో వున్నప్పుడు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పన్నీర్‌సెల్వం తన టేబుల్‌పై ముందు భాగంలో ఆమె ఫోటో వుండేలా జాగ్రత్త తీసుకునేవారు. అదే విధంగా మంత్రివర్గానికి నేతృత్వం వహించినా అధ్యక్ష స్థానంలో మాత్రం కూర్చునేవారు కాదు. అయితే శనివారం జరిగిన భేటీలో జయ ఫోటో తన వెనుక వుండేలా కూర్చున్నారు. అంతేగాక ఆయన తొలిసారిగా మంత్రివర్గ అధ్యక్షుడి స్థానంలో కూర్చున్నారు.

No comments:

Post a Comment