cricket ad

Monday 12 December 2016

అన్ని వ్యాధులకు చికిత్స


 250 గ్రాముల మెంతులు .
* 100 గ్రాముల వాము .
* 50 గ్రాముల నల్ల జీలకర్ర . 

తయారు చేయు విధానము:

* పై మూడు పదార్థాలను శుభ్రం చేసుకోవాలి. 
* వేరు వేరుగా పెన్నం పైన వేసి కొద్దిగా వేడి చేయండి.
* మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి . 
* గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి . 

వాడే విధానము : 

> ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం (పొడి) ని కలిపి తాగవలెను . 
> వేడి నీళ్ళ లో మాత్రమే తాగ వలెను . 
> ఈ చూర్ణం తాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు . 
> అన్ని వయసుల వారు స్త్రీలు , పురుషులు , వృద్దులు ఈ చూర్ణంని సేవించ వచ్చును . 
> ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడము వల్ల శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర , చెమటల ద్వార బయటకు నెట్టి వేయబడును . 
> 80 - 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావాడాన్ని మీరు గమనించగలరు. 
> అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి పోతుంది . 
> రక్తం శుభ్రపడుతుంది . మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది . 
> శరీరంలో ఉన్న ముడతలు తగ్గుతాయి . 
> శరీరం బలంగా, చురుకుగా మరియు ప్రకాశవంతముగా ఉండును.

ప్రయోజనాలు :

1. కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పులన్నీ పోతాయి. 
2 . ఎముకలు బలంగా తయారవుతాయి . 
3. కంటి చూపు మెరుగవుతుంది . 
4 . జుట్టు పెరుగుదలని మెరుగు పరుస్తుంది . 
5 . మల బద్దకం శాశ్వతంగా నివారించబడుతుంది.
6 . రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది . 
7 . దీర్ఘ కాలిక దగ్గు నివారించ బడును . 
8 . గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది . 
9 . మీరు చలాకిగా ఉంటారు . 
10 . జ్ఞాపక శక్తి పెరుగుతుంది . 
11 . వినికిడి శక్తి పెరుగుతుంది . 
12 . గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల సైడ్ ఎఫెక్ట్ క్లియర్ చేస్తుంది . 
13 . రక్త శుద్ది జరుగుతుంది . 
14 . అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి . 
15 . పళ్ళు చిగుళ్ళు బలముగా తయారవుతాయి . 
16 . మధు మేహ వ్యాధిని నియంత్రిస్తుంది . 
17 . 2 లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను గుర్తించగలరు . 

గమనిక :

నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే 15 -20 రోజులు ఆపి , ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు.

షుగ‌ర్ వ్యాధికి శుభం కార్డు

ప్ర‌పంచ‌ వ్యాప్తంగా షుగర్ వ్యాధి ఎంతో మందిని నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. షుగ‌ర్ వ్యాధి వ‌స్తే చాలు ఎంతోమంది ఆర్థికంగామాన‌సికంగా కుంగిపోతున్నారు. షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల క‌ష్టాల సంగ‌తి వ‌ర్ణ‌నాతీతం. ఇక షుగర్ వ్యాధికి రోజులు చెల్లిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టే రైస్ వ‌చ్చేసింది.

తెలంగాణ‌లోని వరంగల్ రూరల్ జిల్లాలో పూర్తిగా సేంద్రీయ ఎరువులతో షుగర్ ఫ్రీ రైస్ సాగవుతోంది. వివిధ రకాల ఔష గుణాలు కలిగిన ఎరువును ఉపయోగించి ఈ రైస్‌ను సాగు చేస్తున్నారట. ఈ రైస్ వాడితే శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్ తగ్గుతాయట. రైస్‌ని ఉపయోగించిన వారికి షుగర్ నుంచి చాలా మేరకు ఉపశమనం కలగడం ఖాయమని వైద్యులు పేర్కొంటున్నారు. త్వరలోనే ఈ రైస్ అందుబాటులోకి వస్తే పెద్ద సమస్య తీరినట్లేనని అభిప్రాయపడుతున్నారు

గుర‌క‌కు ఇలా చెక్ పెడ‌దాం

మ‌న కుటుంబాల‌లో చాలా మంది వ్య‌క్తులు నిద్ర‌లో గుర‌క పెట్ట‌డం మ‌నం చూస్తూనే ఉంటాం. వీరి వ‌ల్ల చాలా ఇబ్బంది ప‌డుతున్నాం అని చెప్పుకోవ‌డం వింటూనే ఉంటాం. అయినా ఏమి చేస్తాం.. వారికి గుర‌క పెడుతున్న‌ట్టు తెలియ‌దు. మ‌న‌కు చాలా ఇబ్బందిగా చిరాకు వ‌స్తుంది. మ‌న‌కు నిద్ర ప‌ట్ట‌దు. స‌మ‌స్య పెద్ద‌దిగా క‌నిపిస్తుంది. అయితే ఏమి చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి ఎదుర‌వుతుంది. మీ ఇంట్లో మీరు నిద్రలో గురక పెడుతున్నారా మీ గురక వల్ల మీ ఇంట్లో వారికి అసౌకర్యంగా ఉందా… అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి.

గుర‌క రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు ఇలా..

నిద్రలో గురక రావడానికి ప్రధాన కారణం మానసికపరమైన ఒత్తిడికంగారువిపరీతమైన ఆలోచనాధోరణి అని పలువురు పరిశోధకులు చెబుతున్నారు.
సమయానికి తగినట్టుగా ఆహారం తీసుకోకపోవడం కూడా మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కార్పొరేట్‌ ఉద్యోగుల్లో ఎక్కువమంది ఇలా గురక సమస్యతో బాధపడుతుంటారట. దీనికి కార‌ణం ప‌ని ఒత్తిడే అంటున్నారు.

గుర‌క స‌మ‌స్య‌ను అధికమించ‌డానికి చిట్కాలు ఇలా

ప్ర‌తిరోజూ రాత్రి నిద్ర‌పోయేముందు గుప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుంద‌ట‌.
అర టీ స్పోన్‌ తేనెఅర టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఒక గ్లాసు నీటిలో ఒకటి లేదా రెండు పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ చుక్కలు వేసి రాత్రి నిద్రపోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి.
*కొద్దిగా పిప్పర్‌మెంట్‌ ఆయిల్‌ను చేతివేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే గురక తగ్గుతుంది.
ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి నిద్ర‌పోతే మంచి ఫలితం కనిపిస్తుంది.
రాత్రి పడుకునే ముందు మరిగే నీటిలో 4, 5 చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. త‌ద్వారా చాలా కంట్రోల్ అవుతుంద‌ట‌

బరువెక్కారని తిండి తగ్గిస్తే ప్రమాదం...!

అధిక బరువు ఉంటే స్థూలకాయం అంటారు. అలా అని తిండి తగ్గిస్తే సన్నబడిపోతారు. ఐతే ఇటీవలి కాలంలో చాలామంది జంక్ ఫుడ్ తినడంతో విపరీతంగా లావెక్కిపోతున్నారు. అవసరానికి మించిన కొవ్వు చేరిపోవడంతో పొట్టతో లావుగా కనబడుతున్నారు. ఇలా అధిక బరువు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందువల్ల శరీరాన్ని ఎంతమేరకు లావు కావాలో అంతమేరకే ఉండేట్లు చూసుకోవాలి. అలాగని కొందరు ఉన్నట్లుండి తిండి తగ్గించేస్తారు. ఇలాంటి వారు శరీరం బరువు పెరిగిపోతోందనో లేదంటే మధుమేహాన్ని నియంత్రించాలనో అదీ కాదంటే ఇంకా సన్నబడాలనో తినే ఆహారం మోతాదును బాగా తగ్గించివేస్తారు.
 
దీనితో సన్నగా వానపాములా మారిపోతారు. చూసినవారు ఇదేంటి ఇలా అయిపోయారు అంటే బరువు తగ్గడానికి ఇలా చేస్తున్నాను అంటారు. కానీ మరీ అంతగా తిండి తగ్గించేస్తే అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు తెలుపుతున్నారు. శరీరానికి అవసరమైన మోతాదులో ఆహారం జీర్ణాశయంలో సగభాగాన్ని కమ్మేసే పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే జీర్ణక్రియ బాగానే ఉన్నప్పటికీ విసర్జన క్రియ దెబ్బతింటుంది. మెల్లగా అది మిగిలిన క్రియలపైనా ప్రభావం చూపుతుంది. 
 
జీర్ణాశయంలో తగినంత ఆహారం లేకపోవడంతో ఫలితంగా ఒత్తిడి లేకపోవడంతో మలినాలు బయటికి వెళ్లడంలో తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. ఈ కారణంగా కడుపు ఉబ్బరంతో పాటు తరుచూ వాయువులు విడుదల కావడం జరుగుతుంది. ఇంకా తరుచూ తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో శరీరానికి అవసరమైన పదార్థాలను అందించాలి తప్ప సొంతగా నోరు కట్టేసుకుని బరువు తగ్గిపోయామని సంబరపడిపోతే దీర్ఘకాలంలో అది చేటు చేస్తుంది. మరీ జాగ్రత్త.




 

ఎక్మో’ అంటే ఏమిటి? అమ్మకు ఆ చికిత్స ఎందుకు చేస్తున్నారు?

హార్ట్ ఎటాక్, కార్డియాక్ అరెస్ట్... ఇవి వైద్య పరిభాషలో అత్యంత ప్రాణాపాయ స్థితిని తెలిపే పదాలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు వచ్చింది గుండెపోటు కాదని.. గుండె ఆగిందని దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారని వైద్యులు చెబుతున్నారు. అపోలో ఆస్పత్రి ప్రకటనలో కూడా హార్ట్ అటాక్ అని రాయలేదు. కార్డియాక్ అరెస్ట్ అని తెలిపారు. శరీరంలోని వివిధ భాగాలకు రక్తం సరఫరాను గుండె ఆపివేయడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తే పేషెంట్ శ్వాస తీసుకోవడం ఉండదు. స్పందనలు ఉండవు. అప్పుడు ఎక్మో అనే వైద్య యంత్రం సాయంతో రక్తం సరఫరా అయ్యేలా చేస్తారు. 
ఎక్మో(Extracorporeal membrane oxygenation-ECMO) పరికరాన్ని లైఫ్ సపోర్ట్ సిస్టమ్ గా పరిగణిస్తారు. శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్ అందకున్నా, రక్త సరఫరా సక్రమంగా జరగకున్నా, రోగి ఊపిరితిత్తులు, హృదయం చేయాల్సిన పనిచేయని వేళ ఎక్మోను వాడతారు. రోగి ఎప్పుడైతే సంప్రదాయ పద్దుతులైన సీపీఆర్ కు స్పందించరో… అప్పుడు ఎక్మో పరికరాన్ని వినియోగించి, కొంత వరకూ పరిస్థితిని చెయ్యి దాటకుండా నియంత్రించవచ్చు. రక్తనాళాల్లోని రక్త సరఫరాను పర్యవేక్షిస్తూ, రక్తానికి అవసరమైన ఆక్సిజన్ ను ఈ యంత్రం అందిస్తుంది. దీన్ని వాడుతుంటే శరీరంలోని రక్త ప్రసరణ గుండె, ఊపిరితిత్తులతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటుంది. ఇక ఈ యంత్రం వాడుతూ ఒక రోగిని కొన్ని రోజులు, వారాల పాటు ప్రాణాలతో ఉంచవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. 
ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేయని స్థితిలోనే ఈ ఎక్మోను వాడతారు. వైద్యులు చివరిగా చేసే ప్రయత్నమే ఇది. కొంతకాలం పాటు శరీర అవయవాలు చేయలేని పనులను చేసే యంత్రమే ఈ ఎక్మో. రోగిలో కోలుకునే శక్తి ఏమాత్రం ఉన్నా, ఈ ఎక్మో పరికరం తన వంతు సహకారాన్ని అందిస్తుందని సీనియర్ కార్డియాలజిస్టులు చెబుతున్నారు. 
తమిళనాడు సీఎం జయలలిత చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎనిమిది మందితో కూడిన వైద్య బృందం జయలలితకు చికిత్స అందిస్తోంది. లండన్ వైద్యుల సూచనలతో చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఎక్మో సిస్టమ్ ద్వారా అమ్మకు వైద్యం అందిస్తున్నట్లు అపోలో జాయింట్ ఎండీ సంగీతారెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని వైద్యులు కూడా స్పష్టం చేశారు.

బ్రేకింగ్ న్యూస్..! సుప్రీంకోర్టు న్యాయవాది ఇంట్లో రూ.14 కోట్ల నగదు లభ్యం..!

పెద్దనోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా కట్టలకట్టల డబ్బు వెలుగు చూస్తోంది. ఇప్పటికే తమిళనాడుకి చెందిన ఇసుక కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి ఇంట్లో 175కోట్ల రూపాయల కరెన్సీని ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది రోహిత్ టాండన్ ఇంట్లో 14 కోట్ల రూపాయల క్యాష్ లభించడం సంచలనం రేపుతోంది. ఇందులో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. 2.5 కోట్లు విలువ చేసే 2వేల రూపాయల నోట్లు లభించాయి. ఢిల్లీలోని న్యాయవాది ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా, ఈ నగదు బయటపడింది. ఆ డబ్బుని నాలుగు ఇన్నోవా కార్లలో ఐటీ కార్యాలయానికి తరలించారు. అయితే రోహిత్ టాండన్.. ఆ డబ్బుకి లెక్కలు ఉన్నాయని చెబుతున్నారు. కొంత నగదు క్లయింట్లకి చెందినదిగా వివరిస్తున్నారు. ప్రస్తుతం న్యాయవాది రోహిత్ టాండన్ ఐటీ అధికారుల అదుపులో ఉన్నారు.

త్వ‌ర‌లోనే రూ.2వేల నోటును ప్ర‌భుత్వం ర‌ద్దు చేయ‌నుందా..? ఎందుకు ర‌ద్దు చేయాల‌నుకుంటోంది..? ర‌ద్దు చేసిన త‌ర్వాత చిన్న డినానిమినేష‌న్ నోట్ల‌ను ప్ర‌వేశ‌పెడుతుందా..? అంటే అవున‌నే స‌మాధానం చెబుతున్నారు ఆర్ఎస్ఎస్ నేత ప్ర‌ముఖ చార్ట‌ర్డ్ అకౌంటెంట్ గురుమూర్తి.
రానున్న ఐదేళ్ల‌లో రూ.2వేల నోటును ప్ర‌భుత్వం ర‌ద్దు చేస్తుంద‌ని ప‌క్కాగా చెప్పారు గురుమూర్తి. రూ.2వేల నోటును ప్ర‌భుత్వం తాత్కాలికంగా ప్ర‌వేశ‌పెట్టింద‌ని చెప్పిన ఆయ‌న‌… హ‌ఠాత్తుగా పెద్ద నోట్ల ర‌ద్దుతో ఏర్ప‌డే ఇబ్బందుల‌ను రూ.2వేల నోటుతో పూడ్చాల‌నే ఉద్దేశంతోనే కేంద్రం రూ.2వేల నోటును విడుద‌ల చేసింద‌ని చెప్పుకొచ్చారు.
చిన్న నోట్ల‌నే చ‌లామ‌ణిలో ఉంచాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఆలోచ‌న‌గా ఉన్న‌ట్లు గురుమూర్తి వెల్ల‌డించారు. అత్య‌ధిక డినామినేష‌న్‌గా  రూ.500 నోటునే చ‌లామ‌ణిలో ఉంచే దిశ‌గా కేంద్రం అడుగులు వేస్తోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఆ త‌ర్వాత రూ.250,రూ.100 నోట్ల‌ను విడుద‌ల చేస్తుంద‌ని గురుమూర్తి వివ‌రించారు.
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నేదానిపై కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు గురుమూర్తి ద‌గ్గ‌ర నుంచి కొన్ని సూచ‌న‌లు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.