సినిమా కళాకారులు విడాకుల బాట పట్టినట్లున్నారు... తాజాగా ప్రముఖ సంగీతకారుడు నటుడు హిమేష్ రేషమియా భార్య కోమల్ తో విడాకులు తీసుకొనున్నారు. వీరిద్దరూ... తమ 22 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు. హిమేష్ గత కొంత కాలంగా వేరే యువతితో సన్నిహితంగా ఉంటున్నాడనే కారణంతో వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మనస్పర్ధలు చోటు చేసుకొన్నాయి. దీంతో గత కొన్ని నెలలుగా ఇద్దరూ వేరుగా జీవిస్తున్నారు.. ఈ నేపద్యంలో బుధవారం బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేశారు. ఈ విషయంపై కోమల్ మాట్లాడుతూ... నేను హిమేష్ ఒకరినొకరం గౌరవించుకొంటాం. మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం.. కానీ మాకు ఒకరి మీద ఒకరికి ఉన్న గౌరవం ఎప్పటికీ మారదు అని తెలిపింది......... కాగా హిమేష్ 21 ఏళ్ల వయసులో కోమల్ చేతిని అందుకొన్నాడు.. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. - See more at: http://www.tv5news.in/NewsDetails.aspx?ID=62515&SID=73&Title=Himesh-Reshammiya-and-wife-file-for-divorce-after-22-years-of-marriage#sthash.1Z0Jw3TA.dpuf
కోల్కతా: రూ.50కోట్లు ఇవ్వండి లేదంటే పశ్చిమ్బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని చంపేస్తాం, హౌరా రైల్వే స్టేషన్ను బాంబులతో పేల్చేస్తాం.. అంటూ జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యుడినని చెప్పుకొంటూ ఓ వ్యక్తి తూర్పు రైల్వే అధికారులకు బెదిరింపు లేఖ రాశాడు. డబ్బు ఏర్పాటు చేయకపోతే హౌరా రైల్వే స్టేషన్ని పేల్చేసి లక్షలాది ప్రజల ప్రాణాలు తీస్తామని బెదిరించారు. ఆ లేఖలో దూరదర్శన్ మాజీ ఉద్యోగి ఎస్సి దాస్ పేరు సంతకం స్థానంలో ఉండటం గమనార్హం. జేఈఎం ఉగ్రవాదులు తలదాచుకునేందుకు తన(దాస్) ఇంట్లో ఆశ్రయం కల్పించినట్లు అందులో రాసి ఉంది. ఆ లేఖను రైల్వే సిబ్బంది పోలీసులకు అందజేశారు. బెదిరింపు లేఖలో ఫోన్ నెంబరు, అడ్రస్ రాసి ఉండటంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కానీ ఆ ఫోన్ నంబరు, చిరునామా తప్పుడువని తేలినట్లు తూర్పు రైల్వే సీపీఆర్వో ఆర్యన్ మహాపాత్ర వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా హౌరా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.