cricket ad

Sunday 11 December 2016

కూతురు పెళ్లి కోసం గాలి బ్లాక్ మ‌నీ ఎలా మార్చాడో తెలుసా..!

గ‌నుల ఘ‌నుడు, మైనింగ్ మాఫియా సామ్రాజ్యాధినేత, క‌ర్నాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి ఇప్పుడు మ‌రో కేసులో చిక్కుకున్నారు. గాలి మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. గాలి త‌న కూతురు బ్రాహ్మ‌ణి పెళ్లి కోసం ఏకంగా రూ.100 కోట్ల న‌ల్ల‌ధ‌నాన్ని మార్చిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.
ఈ మేర‌కు అక్క‌డ ఓ రెవెన్యూ అధికారి డ్రైవర్ రమేశ్ గౌడ సూసైడ్ కలకలం సృష్టిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి 100 కోట్ల రూపాయల్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నాక కూడా గాలి త‌న కుమార్తె పెళ్లిని కోట్లు కుమ్మ‌రించి అంగ‌రంగ వైభ‌వంగా చేశారు.
ఈ క్ర‌మంలోనే బళ్లారికి చెందిన ఓ రెవెన్యూ అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నాడు రమేష్ గౌడ్. గాలి ముఠా సభ్యులు.. వంద కోట్ల రూపాయల పాత నోట్లను.. రమేష్ గౌడ మధ్య వర్తిత్వంగా మార్పిడి చేశారు. 20 శాతం కమీషన్ తీసుకున్న‌ ర‌మేష్ గౌడ్ గాలి గ్యాంగ్‌కు కొత్త నోట్లు ఇచ్చాడు. అయితే కొత్త నోట్లు త‌క్కువ రావ‌డంతో గాలి అనుచరులు మిగతా డబ్బు కోసం డ్రైవర్ రమేష్ గౌడ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. వేధింపులకు దిగారు.
గాలి అనుచ‌రుల వేధింపులు ఎక్కువ‌వ్వ‌డంతో ర‌మేష్ గౌడ్ సూసైడ్ చేసుకున్నాడు. చనిపోయే ముందు మొత్తం వ్యవహారాన్ని నోట్ గా రాశాడు. వేధింపులు తట్టుకోలేక.. బెదింపులకు భయపడి చనిపోతున్నట్లు చెప్పాడు. గాలి జనార్థన్ రెడ్డి రూ.100 కోట్ల విలువైన పాత నోట్లు మార్చినట్లు నోట్ లో రాశాడు. రమేష్ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

సెక్స్‌లో భ‌ర్త రెచ్చిపోవాలంటే భార్య చేయాల్సిన‌వి ఇవి !

శృంగార స‌మ‌స్య‌లు అన్ని కూడా మ‌గ‌వాడిపై ఎక్కువ‌గా నెట్టేస్తారు. అయితే సుఖ‌మ‌య శృంగార జీవితానికి ఇద్ద‌రూ క‌లిసి కొన్ని బాధ్య‌త‌లు పాటించాలి. అంతేకాకుండా భార్య కూడా అద‌నంగా కొన్ని బాధ్య‌త‌ల‌ను తీసుకోవాలి.. భ‌ర్త ఎదుర్కొనే ఇబ్బందుల‌నుకొన్ని దూరం చేయాలి. సెక్స్ మీద ఆస‌క్తి త‌గ్గినా.. రెగ్యుల‌ర్‌గా శృంగారంలో పాల్గొన‌క‌పోయినా, మ‌ళ్లీ అత‌డిని మామూలుగా చేయ‌డానికి కొన్ని సూచ‌న‌లు పాటించాలి. అవేంటో మ‌నం ఓ సారి చూద్దామా..
1. ఆఫీసులో భ‌ర్త అల‌సిపోయి ఇంటికి రావొచ్చు. ఆ రోజు మూడ్ ఉండ‌క‌పోవ‌చ్చు. అటువంటి స‌మ‌యాల్లో లేక ఇంకేదైనా ఒత్తిడి వ‌ల్ల‌, శృంగారం చేయ‌లేక పోవ‌చ్చు. సెక్స్ మొద‌లు పెట్టినా సంతృప్తిక‌రంగా పాల్గొన‌క‌పోవ‌డం జ‌రుగుతూనే ఉంటుంది. అటువంట‌ప్పుడు భార్య అత‌నిని ఏమీ అన‌కూడ‌దు. ఇంకా విసిగించ‌కూడ‌దు. అత‌డినిఅర్దం చేసుకుని ప్రేమ‌గా మాట్లాడండి.
2. పాత జ్ఞాప‌కాల్ని గుర్తు చేయాలి, మొద‌టి రాత్రి విశేషాలు కావ‌చ్చు, తొలి ముద్దు తీపిగుర్తులు కావ‌చ్చు. ఇంకేదైనా రొమాంటిక్ సంగ‌త‌లుంటే గుర్తు చేయాలి.
3. భావిప్రాప్తి స‌రిగా క‌ల‌గ‌క‌పోయినా, అది కేవ‌లం భ‌ర్త ఓట‌మిగా చూపించ‌కూడ‌దు. అలా చేస్తే అత‌డు ఆత్మ‌విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతాడు. అస‌లు సెక్స్ ఎందుకు సంతృప్తిక‌రంగా చేయ‌లేక‌పోతున్నాడో, ఎందుకు ఇబ్బందిప‌డుతున్నాడో తెలుసుకుని ప‌రిష్కారం గురించి దంప‌తులిద్ద‌రూ మాట్లాడుకోవాలి.
4. త‌న మీదు మీకున్న ప్రేమ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గుర్త చేయాలి. దీంతో అన్ని స‌మ‌స్య‌లు స‌ర్దుకుంటాయి. మిమ్మ‌ల్ని పూర్తిస్థాయిలో అర్ధం చేసుకుని ప‌డ‌క గ‌దిలో రెచ్చిపోవ‌డానికి ఇవ‌న్నీ దోహ‌ద‌ప‌డ‌తాయి.

కొత్త రూ.1000 నోటు రిలీజ్ డేట్ వ‌చ్చేసింది






ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఒకవైపు హర్షిస్తూనే, మరోవైపు అమలులో విఫలమైందని మండిపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీ రూ.1000, రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నోట్ల స్థానంలో ప్ర‌భుత్వం కొత్త 2వేల నోటును ప్రవేశపెట్టింది. 2వేల నోటుతో పాటు 5వందలు, వెయ్యి రూపాయల నోటు కూడా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త 5వందల నోటు అక్కడక్కడా కనిపిస్తోంది కానీ వెయ్యి నోటు జాడే లేదు.
రూ.500 నోటు త‌ర్వాత ఒకేసారి మ‌ళ్లీ రూ.2000 పెద్ద నోట్లు మాత్ర‌మే ఉండ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వ‌ర‌కు అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే జ‌నాలంద‌రూ కొత్త రూ.1000 నోటు కోసం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ కొత్త రూ.1000 నోటు బ్యాంకుల్లోకి, అక్కడి నుంచి జనం జేబుల్లోకి రావాలంటే కొత్త సంవత్సరం వచ్చే దాకా ఆగక తప్పదని సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ కొత్త వెయ్యి రూపాయల నోటును ప్రవేశపెడుతున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
అంతేకాదు, కొత్తగా 20రూపాయలు, 50 రూపాయల నోటును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐయే తెలిపింది. పాత 20, 50 నోట్లు యథాతథంగా ఉంటాయని, వాటికి తోడు కొత్త నోట్లు చలామణీలోకి తేవాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

జ‌య‌ల‌లిత‌కు స్లో పాయిజిన్ ఇచ్చింది ఎవ‌రు..!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జయలలిత మరణించి నాలుగు రోజులు అవుతున్నా దేశమంతా ఆమె మరణం గురించే మాట్లాడుకుంటున్నారు. జ‌య మృతికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని, వాటిని త్వ‌ర‌లోనే భ‌య‌ట‌పెడ‌తాన‌ని జయలలిత సోదరుడి కుమార్తె దీప అన్నారు. సినీ నటి గౌతమీ కూడా జయలలిత మరణంపై ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోడీకే లేఖ రాసి సంచ‌ల‌నం సృష్టించారు.
ఇపుడు తాజాగా ఒక సంచలన వార్త బయటకొచ్చింది. 2012లో తెహెల్కా ప్రచురించిన ఒక కథనం ఆమె మరణంపై అనుమానాలు రేకెత్తిస్తుంది. అప్పట్లో శశికళ “మన్నార్ గుడి మాఫియా” అనే గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని తెహ‌ల్కా ప‌త్రిక‌లో నాలుగు సంవ‌త్స‌రాల క్రిత‌మే క‌థ‌నం వ‌చ్చింది. వీరు తెర వెన‌క చేస్తోన్న కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన జ‌య‌ల‌లిత వీరంద‌రిని పోయెస్ గార్డెన్ నుండి వెళ్లగొట్టారు.అయితే శశికళ మాత్రం తాను నియమించిన నర్స్ ద్వారా ఆమెకు స్లో పాయిజన్ ఎక్కించినట్లు ఆ క‌థ‌నం పేర్కొంది. ఆమెకు నిద్రమాత్రలు, మరియు ఆమె తాగే పానీయాలు, మరియు ఆమె తినే పళ్ళు, ఇతర ఆహార పదార్థాలలో విషం ఎక్కించారని వైద్యులు చెప్పారని పేర్కొంది. జయలలిత తాను తీసుకుంటున్న మందులపై ఆమె వ్యక్తిగత వైద్యులు చేసిన పరీక్షలలో ఈ విషయం బయటపడిందని తెలిసింది.శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యుల తెర‌వెన‌క దందాలు తెలుసుకున్న జ‌య‌ల‌లిత శశికళతో సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ తన ఇంటి నుండి బయటకు పంపేశారు. దీంతో జయలలితను ఎలాగైనా అంతమొందించాలని శశికళ భావించారు. దాంతో మళ్ళీ శశికళ జయలలితను మంచి చేసుకుని ఆమె ఇంట్లోకి వచ్చారు. జయలలిత కూడా శశికళని తప్ప ఆమె కుటుంబ సభ్యులు ఎవరినీ తన ఇంట్లోకి రానీయలేదు. ఇపుడు ఆమె మరణం తర్వాత శశికళ కుటుంబ సభ్యులు అంతా మళ్ళీ జయ ఇంట్లో అడుగు పెట్టడం తో ఈ విషయం మళ్ళీ చర్చనీయాంశమయింది.

జ‌య‌ను ఫ్యామిలీకి దూరం చేసిన కుట్ర సీక్రెట్ ఇదే

భ‌విష్య‌త్తులో తాను త‌మిళ రాజకీయాల్లోకి వస్తానని జయలలిత అన్న కుమార్తె , జ‌య మేన‌కోడ‌లు దీప వెల్లడించారు. జ‌య మృతిచెందాక జ‌య రూపాన్నే పోలిఉన్న ఆమె గురించి మీడియాలో ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన దీప ప‌లు సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించారు.
శశికళ పన్నిన కుట్ర వల్లే తమ కుటుంబం అత్తకు దూరమైందని శనివారం ఆమె ఆరోపించారు. తన తల్లిదండ్రులు అత్తతో కలిసి పోయెస్‌ గార్డెన్‌లోనే ఉండేవారని, తాను అక్కడే పుట్టానని తెలిపారు. శశికళ ప్రవేశంతో పోయెస్‌ గార్డెన్‌ నుంచి బయటకు రాక తప్పలేదని పేర్కొన్నారు. అత్త అనారోగ్య సమయంలో సరైన వైద్య చికిత్సలు, సపర్యలు అందలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.


 ఇక అత్త అనారోగ్యంతో అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ప్పుడు అపోలోకు వెళ్లినప్పుడు, అత్త సమాధి వద్ద అంజలి ఘటించేందుకు వెళ్లినప్పుడు కూడా శశికళ అవమానించారని చెప్పారు. శశికళను పార్టీ పగ్గాలు చేపట్టాలని అ‍న్నాడీఎంకే నేతలు కోరడంపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి విషయాలను ప్రజల నిర్ణయానికే వ‌దిలి వేయాల‌ని కూడా ఆమె చెప్పారు. ఇక జ‌య‌ల‌లితే శ‌శికళ కుటుంబ స‌భ్యుల‌ను పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని వ‌స్తోన్న వార్త‌ల‌ను ఆమె ఖండించారు.

నోట్లరద్దు.. హెరిటేజ్-బిగ్ బజార్.. ఓ భారీ కుంభకోణం .. సాక్ష్యాధారాలతో సహా..

సంక్షోభం ఉన్నప్పుడే అవకాశాలు అందిపుచుకోవాలి అనేది చంద్రబాబు ఫిలాసఫీ . ఎందుకంటే ప్రజలందరూ ఒక సంక్షోభంలో ఉంటే ఆసమయంలో మిగతా విషయాలు ఏవీ కూడా పట్టించుకోరు , అదే అదునుగా ప్రజల కన్నుగప్పి ఎవరికీ అనుమానం రాకుండా మిగతా రంగాలలో దోచుకోవటం అనేది చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య . దీనిలో చిన్నప్పటి నుండీ ఆరితేరి ఉన్నాడు.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కేంద్రప్రభుత్వం తీసుకొన్న అతిపెద్ద సాహసోపేత నిర్ణయం ఏదయినా ఉందంటే అది నోట్ల రద్దు వ్యవహారమే . మొదట్లో మోడీ చెప్పినట్లు ఇది అంత్యంత రహస్యమైన నిర్ణయం ఎంతమాత్రం కాదు , ఈరోజు బయటకి వస్తున్న కొత్త సంగతులు ప్రకారం ఇలాంటి నిర్ణయం మోడీ తీసుకోబోతున్నట్లు బీజేపీకి , పారిశ్రామికవేత్తలకి , nda మిత్రపక్షాలందరికి తెలుసు , అందుకే వాళ్ళ పార్టీ మనుషులు అందరూ ముందే జాగ్రత్తపడ్డారు .
పెద్దనోట్లు రద్దుచేయమని సరిగ్గా నెలరోజులు ముందు చంద్రబాబు చెప్పుకొంటున్నట్లు మోడీకి ఉత్తరం వ్రాసినమాట నిజమే . ఎందుకంటే చంద్రబాబుకి ఈ విషయం చాలా రోజులు ముందే తెలుసు , అప్పటినుండి జాగ్రత్తగా పావులు కదిపి తన మనుషులుతో రాజధాని చుట్టూ ఎడాపెడా భూములు కొనిపించాడు ( ఈ విధయాలన్ని మరో పోస్టులో వివరంగా వ్రాస్తాను ) .
భూములు విషయాలు పక్కనపెడితే , నోట్లరద్దు వలన హెరిటేజ్ కి , బిగ్ బజార్ కి తద్వారా చంద్రబాబుకి కలిగిన లబ్ది ఏమిటో ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి .
చంద్రబాబు ముఖ్యమంత్రి కాకమునుపు హెరిటేజ్ విలువ ఎంత ఉంది , ఇప్పుడు హెరిటేజ్ విలువ ఎంత ఉందో చుస్తే దేశంమొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున లాభాలు గడించిన సంస్థ ఇంకోటి లేదని తెలుస్తుంది .
ఒక్కసారి గత రెండు సవత్సరాలలోనే హెరిటేజ్ విలువ ఆకాశంలోకి ఎలా దూసుకెళ్లిందో చూడండి .
1995 లో ప్రారంభమైన హెరిటేజ్ 2011 నవంబర్ వరకు కూడా దాని మొత్తం విలువ 189 కోట్లు .మొన్న ముఖ్యమంత్రి కావటానికి ముందు దానివిలువ 411 కోట్లు . ముఖ్యమంత్రి అయిన ఒక్క సంవత్సరంలోనే దానివిలువ 1341 కోట్లకు పెరిగింది . మరొక్క సంవత్సరంలోనే అనగా మొన్న అక్టోబర్ నాటికి దానివిలువ అక్షరాలా 2109 కోట్లు . అనగా దగ్గరదగ్గర ఈ రెండు సవత్సరాలలోనే హెరిటేజ్ విలువ 600 రేట్లు పెరిగింది .
2012 నుండి ఇప్పటివరకు కంపెనీలో వచ్చిన పెద్ద మార్పేమిలేదు . అవే పాలు ,పెరుగు , మజ్జిగ , కూరగాయలు కాకపొతే లాభాలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి .ఇది ఎలా సాధ్యం అయింది ?
ఎలాంటి దోపిడీని అయినా ఏ చట్టాలకు దొరకకుండా చేయటంలో చంద్రబాబుది అందెవేసిన చేయి . ఈ రెండు సంవత్సరాలలో దోచుకొన్న డబ్బునంతటిని వైట్ మనీగా మార్చుకోవటానికి వీళ్ళ మనుషులతోనే ఇన్సైడ్ ట్రేడింగ్ ద్వారా వీళ్ళ షేర్లు వీళ్ళే కొన్నట్లు లెక్కలు తారుమారు చేసి 189 కోట్లు విలువఉన్న కంపెనీని 2109 కోట్లకు వీళ్ళే పెంచుకున్నారు . ఆ విధంగా దోచుకొన్న డబ్బునంతా హెరిటేజ్ లాభాయాలరూపంలోకి మార్చుకున్నారు .
హెరిటేజ్ షేర్లు ఎలా పెరిగాయో తేదీల వారిగా ఈ క్రింద ఫోటోలు గమనించండి .
-- ఫోటో 1 - నవంబర్ 25, 2011 లో హెరిటేజ్ విలువ 81.52 రూపాయలు ( మొత్తం షేర్లు 23,199,000 ) , అనగా అప్పటి విలువ 189 కోట్ల 11 లక్షలు .
-- ఫోటో 2 - డిసెంబర్ 6,2013 నాటికి హెరిటేజ్ షేరు విలువ 177.45 రూపాయలు , అనగా కంపెనీ మొత్తం విలువ 411 కోట్ల 66 లక్షలు .
-- ఫోటో 3 - జూలై 10,2015 నాటికి షేరు విలువ 400.50 రూపాయలకు కి పెరిగి మొత్తం కంపెనీ విలువ 929 కోట్ల 11 లక్షలకు పెరిగింది .
-- ఫోటో 4 - డిసెంబర్ 18,2015 అనగా మరో నాలుగు నెలల్లోనే షేరు విలువ 578.15 రూపాయలకి పెరిగి మొత్తం కంపెనీ విలువ 1342 కోట్ల కి చేరుకొంది .
-- ఫోటో 5 - అక్టోబర్ 28 , 2016 నాటికి షేరు విలువ ఏకంగా 909.20 రూపాయలకి చేరుకొని కంపెనీ మొత్తం విలువ 2110 కోట్లకు చేరుకొంది .
ఇప్పటివరకు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దోచుకొన్న డబ్బునంతా సొంత కంపెనీలో షేర్లు రూపంలోకి మార్చుకొని వైట్ మనీగా మార్చారు . మీరు పరిశీలించండి చూడండి , ముఖ్యమంత్రి కాకముందు 200 కోట్ల ఉన్న హెరిటేజ్ విలువ ఈరోజుకి 2110 కోట్లు అయ్యింది . అనగా గోదావరి పుష్కరాల అవ్వగానే 1000 వెయ్యి కోట్లు పెరిగింది , మొన్న కృష్ణ పుష్కరాలు అవ్వగానే మరో వెయ్యికోట్ల పెరిగింది .
ఇక్కడవరకు బాగానే ఉంది దోచుకొన్న డబ్బుని హెరిటేజ్ షేర్లలోకి మార్చారు , కాకపొతే దీనివలన పెద్దగా లాభంలేదు , ఎందుకంటే ఈ షేర్లు బయట వాళ్ళకి ఈ పెరిగిన ధరకు అమ్ముకొంటేనే వీళ్లకి తిరిగి ఆ డబ్బులు వచ్చేది ,మరి కంపెనీ అసలు విలువ చుస్తే అంత లేదు , షేరు ధరలేమో ఆకాశంలో ఉన్నాయి . కంపెనీ విలువకి షేరు ధరకి అసలు పొంతనే లేదు , అందుకే షేర్లు కొనటానికి ఎవ్వరూ ముందుకి రాలేదు .
సరిగ్గా ఇక్కడే చంద్రబాబుకి నోట్ల రద్దు వ్యవహారం కలిసొచ్చింది . చాలా రోజులు క్రితమే నోట్లు రద్దు కాబోతున్నాయి తద్వారా సంక్షోభం రాబోతున్నదని ముందే ఉప్పందుకొన్న చంద్రబాబు తన మనుషులతో తన బినామిలతో కనపడ్డ భూములను కొనిపించాడు . ఒక అంచనా ప్రకారం దగ్గరదగ్గర 40 వేళా ఎకరాలు బాబు బినామీలు భూములు కొన్నారు . అందుకే ఎవ్వరూ IDS స్కీమ్ లో కూడా దొరకలేదు . ఎదో ఒకరిద్దరు సొంత mla లు తప్ప ( ఆదికేశవులు భార్య ) .
ఇకపోతే ఇదే అదునుగా మిగిలిన నల్లధనాన్ని , హేరిటేజ్ షేర్ల రూపంలోకి మార్చిన డబ్బుని కూడా ఎలాగయినా మార్చుకోవాలని అంత్యత పకడ్బందీగా వెంకయ్య నాయుడు అండతో అరుణ్ జైట్లీ సహకారంతో హేరిటేజ్ కి ఫ్యూచర్ ఇండియా ( బిగ్ బజార్ ) కి లింక్ కలిపాడు . ఈ డీల్ చూస్తే ఎవరికయినా దిమ్మ దిరాగాల్సిందే .
సరిగ్గా మోడీ నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించటానికి ముందుగా అనగా నవంబర్ 7 తేదీన హేరిటేజ్ కంపెనీని ఫ్యూచర్ ఇండియా ( బిగ్ బజార్ ) కి అమ్మేశారు . ఆ వివరాలు చూస్తే మనకి దిమ్మతిరగాల్సిందే . పైన హెరిటేజ్ ప్రస్తుత విలువ ఎంతో చూసాము కదా , అక్టోబర్ 2016 నాటికి 2110 కోట్ల విలువకి చేరుకొంది .
2110 కోట్ల కంపెనీని కేవలం 270 కోట్ల విలువ చేసే ఫ్యూచర్ ఇండియా కంపెనీ షేర్లు తీసుకొని అమ్మేశారు .
2110 కోట్లు ఎక్కడ 270 కోట్లు ఎక్కడ ? అంత తక్కువకి ఎందుకు అమ్మారు ? ఎందుకంటే కంపెనీ విలువ అంతకన్నా ఎక్కువ చేయదు కనుక , మరి అలా చేయటం వలన చంద్రబాబుకి ఫ్యూచర్ ఇండియా కంపెనీ వలన కలిగే లాభం ఏమిటి ?
--- 6,7,8 ఫోటోలు చూడండి - హెరిటేజ్ కి ఫ్యూచర్ ఇండియా కి జరిగిన డీల్ వివరాలు చూడండి .
బిగ్ బజార్ ద్వారా వేలకోట్లు ఎలా మారుస్తున్నారో చూద్దాం..
మొదట్లోనే చెప్పుకున్నాం కదా సంక్షోభంలో అవకాశాలు వెతుకుతాడాని , ఇప్పుడు కూడా అలాంటి అవకాశం సృష్టించాడు . హెరిటేజ్ కంపెనీని అమ్మేసిన ఫ్యూచర్ ఇండియా ద్వారా ఈసారి అటునుండి నరుక్కోచ్చాడు . నోట్లరద్దు తర్వాత ప్రజలందరూ బ్యాంకులలో పాత నోట్లు మార్చుకొంటుంన్నారు . అలాంటి పాత నోట్లు మార్చుకొనే అవకాశం ఫ్యూచర్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో నడిచే బిగ్ బజార్ ని కూడా చేర్చారు . దీనికి వెంకయ్య అండతో అరుణ్ జైట్లీని , RBI ని కూడా ఒప్పించారు . పాత నోట్లు మార్చుకొనే అవకాశం బ్యాంకులు కాకుండా ప్రైవేట్ కంపెనీలలో ఒక్క బిగ్ బజార్ కి మాత్రమే ఇచ్చారు , అదీ చంద్రబాబు పవర్ .
గత నెల 24 నుండి దేశవ్యాప్తంగా ఉన్న 260 బిగ్ బజార్ షాప్ లలో పాత నోట్లు మార్పిడి మొదలు పెట్టారు . రోజుకి దగ్గర దగ్గర 250 కోట్లు ఈ బిగ్ బజార్ షాప్లలలో మారుస్తున్నారు . ఒక అంచనా ప్రకారం 10000 ( 10 వేల కోట్లు ) కోట్లు డిసెంబర్ ఆఖరి లోపు మార్చే అవకాశం ఉంది .
ఈ షాప్ లలో సామాన్యులకు ఇచ్చేది 1 శాతం మిగతా 99 శాతం చంద్రబాబు మరియు బీజేపీ పెద్దల డబ్బుని మారుస్తున్నారు . ఇలాంటి స్కెచ్ ముందే వేసిన చంద్రబాబు తక్కువ ధరకు హెరిటేజ్ ని అమ్ముకొని బిగ్ బజార్లో భాగస్వామిగా చేరాడు . ఇప్పుడు ఆ బిగ్ బజార్ ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు నల్లధనాన్ని తెల్ల ధనం గా మారుస్తున్నారు .
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటి రోజు బిగ్ బజార్ SBI తో టైఅప్ అయి ఈ నోట్ల మార్పిడి చేస్తుంది అని ప్రకటించారు . అదే రోజు అరవింద్ కేజ్రీవాల్ , SBI నే డబ్బులు ఇవ్వలేక ప్రతొరోజు ప్రజలని వెనక్కి పంపుతుంది , అలాంటిది ఒక ప్రైవేట్ కంపెనీకి ప్రతొరోజు అంత పెద్ద మొత్తంలో ఎలా ఇస్తది ? అసలు బిగ్ బజార్ కంపెనీకె ఈ అవకాశం ఎందుకు ఇచ్చారు అని విమర్చించాడు .
ఆవిమర్శలకు స్పందించిన బిగ్ బజార్ అధినేత కిషోర్ బియాని మేము SBI దగ్గర మేము కొత్త నోట్లు తీసుకోవటం లేదు , మా కంపెనీ రోజు వారీ అమ్మకాల ద్వారా వచ్చే డబ్బులతో పాత నోట్లు మారుస్తాం అని ప్రకటించాడు . అనగా వాళ్ళు రోజుకి దగ్గర దగ్గర 250 కోట్ల రూపాయల క్యాష్ లావాదేవీలు చేయాలి , ఇది అసలు జరిగే పనేనా ?
--- 13,14 ఫోటోలు చూడండి అరవిందు కేజ్రీవాల్ ట్వీట్ కి కిషోర్ ఇచ్చిన సమాధానం చూడొచ్చు .
మొన్న చంద్రబాబు RBI కి ఫోన్ చేసి మూడు వేల కోట్లు తెప్పించాడు , నిన్న 2 వేల కోట్లు తెప్పించాడు అని వార్తలు చదివే ఉంటారు , ఇవి కూడా నిజమే . కాకపొతే ఆ డబ్బులన్నీ బిగ్ బజార్ లకి చేర్చి అక్కడ వీళ్ల నల్లధనాన్ని మార్చి కొన్ని వేల కోట్లు కొత్త నోట్లలోకి మారుస్తున్నారు . మొన్న శేఖర్ ( టీటీడీ మెంబెర్ ) దొరికిన 100కోట్లు కూడా బిగ్ బజార్ ల ద్వారా మార్చిన డబ్బే . దేశంలో దొరుకుతున్న 100 ల కోట్లు కొత్త నోట్లు అన్నీ బిగ్ బజార్ ద్వారా బయట ప్రపంచంలోకి వచ్చినవే .
---- 8,9,10,11,12 ఫోటోలు చూడండి , ఈ ఫ్యూచర్ ఇండియాకి బీజేపీ భక్తుడు రాందేవ్ బాబాకి ఉన్న లింక్ లు కూడా తెలుస్తాయి , అదే రాందేవ్ బాబా చంద్రబాబుని కలవటం చూడోచ్చు . దేశంలో ఇలాంటి అక్రామార్కులు అందరూ ఈ ఫ్యూచర్ ఇండియా ( బిగ్ బజార్ ) ద్వారానే వ్యవహారం నడుపుతున్నారు .
ఇలాంటి వేల కోట్లు మార్చుకోవడం కోసమే హేరిటేజ్ కంపెనీని బిగ్ బజార్ కి అమ్మేసి దానిలో చంద్రబాబు భాగస్వామి అయ్యాడు .
Source From: Mani Annapureddy

సంబంధిత వార్తలు

శ‌శిక‌ళ అంతఃపుర కుట్ర‌...తెహ‌ల్కా సంచ‌ల‌న క‌థ‌నం

అన్నాడీఎంకే అధ్య‌క్షురాలు జ‌య‌ల‌లిత‌కు, ఆమె ఆప్తురాలు శ‌శిక‌ళ స్లో పాయిజ‌న్ ఇచ్చారా ?జ‌య‌ల‌లిత‌ను చంపేందుకు శ‌శిక‌ళ, మ‌న్నార్ గుడి మాఫియాను ఏర్పాటు చేసుకున్నారా? అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ శ‌శిక‌ళ కుట్ర‌ల గురించి అమ్మ‌కు ముందుగానే హెచ్ర‌రించారా? అంటే అవున‌ని స‌మాధానమిస్తోంది తెహ‌ల్కా ప‌త్రిక‌.

శ‌శిక‌ళ స్వ‌స్థ‌లం మ‌న్నార్ గుడి, ఆమె వ‌ర్గీయులను త‌మిళ‌నాడులో మ‌న్నార్ గుడి మాఫియా అంటారు. మ‌న్నార్ గుడి మాఫియా తో క‌లిసి అమ్మ‌ను చంపేందుకు శ‌శిక‌ళ‌ కుట్ర చేసింద‌ని తెహ‌ల్కా ప‌త్రిక సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది.

జ‌య‌ల‌లిత‌కు శ‌శిక‌ళ నియ‌మించిన న‌ర్సు నిద్ర‌మాత్ర‌లు, కొద్ది మెతాదులో విషం క‌లిపిన ర‌సాయ‌నాల‌ను ఇచ్చింద‌ని క‌థ‌నం వెల్ల‌డించింది... చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌ను గ‌ద్దె నెక్కించేందుకు మ‌న్నార్ గుడి మాఫియా కుట్ర‌లు ప‌న్నింద‌ని, అంతఃపుర కుట్ర‌ల‌కు శ‌శిక‌ళ సూత్ర‌దారి అని క‌థ‌నంలో తెలిపింది.

అంతేకాకుండా మ‌న్నార్ గుడి మాఫియా కుట్ర‌ల గురించి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి న‌రేంద్ర‌మోదీ అమ్మ‌ను ముంద‌స్తుగా హెచ్చ‌రించార‌ని తెహ‌ల్కా క‌థ‌నాన్ని రాసిన జీమెణ్ జాక‌బ్ వెల్ల‌డించారు. ఆ త‌ర్వాత జ‌య‌ల‌లిత‌కు శ‌శిక‌ళ కుట్ర గురించి తెలిసి ప‌క్క‌న పెట్టింద‌ని తెలిపింది.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణించ‌డంతో ఆమె మృతి ఓ మిస్ట‌రీగా మారిపోయింది. అమ్మ మృతి పై గ‌త కొద్ది రోజులుగా అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. జ‌య మృతి గురించి నిజ‌నిజాలు బ‌య‌ట‌పెట్టాల‌ని అభిమానులు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.