cricket ad

Sunday 11 December 2016

శేఖర్‌రెడ్డి ఇళ్లలో 631కోట్ల నగదు లభ్యం.. దేశ చరిత్రలోనే ఇదే ప్రధమం

631కోట్లు. అవును, అక్షరాలా 631 కోట్ల నగదు. శేఖర్‌రెడ్డి ఇళ్లలో ఇప్పటి వరకూ లభించిన మొత్తం నగదు. అంతా.. కరెన్సీ నోట్లే. అందులో వందల కోట్లు కొత్త 2 వేల నోట్లే. ఇంత భారీ మొత్తంలో సొమ్ము లభించడం దేశ చరిత్రలోనే ఇదే ప్రధమం. అందులోనూ.. మొత్తానికి మొత్తం కరెన్సీ నోట్ల రూపంలో దొరకడం విచిత్రం. కనీసం బ్యాంకుల్లో కూడా ఒకేసారి ఇంత పెద్ద నగదు డబ్బుల రూపంలో ఉండదు. అలాంటిది, ఓ కాంట్రాక్టర్‌ ఏకంగా 631 కోట్లు.. నోట్ల రూపంలో దాచడం ఇప్పడి వరకూ కనీవినీ ఎరుగని విషయం. కానీ.. ఇది నిజం
చెన్నై, వేలూరులోని శేఖర్‌రెడ్డితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శేఖర్‌రెడ్డి అడిటర్‌ ప్రేమ్‌ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరపగా.. తాజాగా మరో 500కోట్ల నగదు లభ్యమైంది. దీంతో.. ఇప్పటి వరకు దొరికిన మొత్తం నగదు విలువ.. 631కోట్లకు చేరింది. అటు, ఇప్పటి వరకూ మొత్తం.. 178కిలోల బంగారం లభ్యమైంది. నగదు, బంగారం కాక, వెయ్యి కోట్ల విలువైన ఆస్థి పత్రాలు గుర్తించారు. భారీగా డాక్యుమెంట్లు ఉండటంతో.. 30మంది అధికారులు ప్రత్యేకంగా ఈ ఆస్థి పత్రాలను పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయిలో పత్రాల లెక్క పూర్తయితే.. సంపద విలువ మరింత పెరిగే అవకాశం ఉంది. అటు, శేఖర్‌రెడ్డి భార్య జయశ్రీని ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బినామీ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే, శేఖర్‌రెడ్డికి సంబంధించిన 17బ్యాంక్‌ అకౌంట్లను గుర్తించారు. ప్రస్తుతం.. ఆ బ్యాంక్‌ అకౌంట్ల లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ పని పూర్తైతే.. నల్లత్రాచు కాస్తా అనకొండగా మారడం ఖాయం. అదే జరిగితే.. దేశంలోనే శేఖర్‌రెడ్డి కేసు మరింత సంచలనంగా మారుతుంది. నల్ల కుభేరుడు శేఖర్‌రెడ్డి కేసులో కీలక పరిణామం. ఐటీ దాడుల్లో కోట్లకు కోట్లు నగదు.. కిలోలకు కిలోలు బంగారం.. వేల కోట్ల ఆస్థులు వెలుగు చూస్తుండటంతో కేసు విచారణ ఐటీ పరిధి దాటిపోయింది. దీంతో.. శేఖర్‌రెడ్డి ఆస్తుల కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు జరిగిన ఐటీ సోదాల వివరాలను సీబీఐ పరిశీలిస్తోంది. దేశంలో ఇప్పటి వరకూ ఎప్పుడూ వెలుగు చూడనంత నల్ల ధనం బయటపడటంతో.. సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తుకు సిద్ధమవుతోంది. ఐటీ అధికారుల నుంచి సమగ్ర సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తోంది. బహుషా.. ఈ సాయంత్రం నుంచి కేసు సీబీఐ చేతిలోకి వెళ్లిపోనుంది.

అమ్మ వైద్య ఖర్చులు ఎంతో తెలుసా!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత వైద్యానికి ఎంత ఖర్చయ్యిందో తెలుసా…తెలిస్తే ఆశ్చర్య పోతారు. అమ్మకు 75 రోజుల పాటు వైద్యం అందించిన చైన్నై అపోలో ఆస్పత్రి యాజమాన్యం వేసిన మెడికల్ బిల్లు రూ.80 కోట్లు. మిగతా ఖర్చులు కలిపితే ఇది మరికాస్త పెరిగే అవకాశం ఉంది. సమాచార హక్కు చట్టం ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌తో ఈ విషయం బయటపడింది.
తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ బిల్లులో ఇప్పటికే రూ.6 కోట్లు చెల్లించింది. ప్రజా ప్రతినిధులు అనారోగ్యానికి గురైనపుడు వైద్య ఖర్చులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయి. జయ వైద్యానికి అయిన ఖర్చులను కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత జయ ఉన్న రెండో అంతస్తు మొత్తం ఖాళీ చేయించారు. దీంతో ఈ అంతస్తులోని 30 గదుల అద్దెను జయ వైద్య ఖర్చుల్లోనే కలిపారు. వీటి ఒక రోజు అద్దె రూ.కోటి. ఎక్మో…ఇతర లైఫ్‌ సపోర్టు యంత్రాల చార్జీలు వీటికి అదనం. అలాగే, 39 మంది అపోలో డాక్టర్లకు కన్సల్టేషన్‌ చార్జీలు, మందులు, నర్సింగ్‌ చార్జీలు, లండన్‌ వైద్య నిపుణుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే, అతని బృందం, సింగపూర్‌ ఫిజియోథెరిపిస్టు చార్జీలు అదనం. అలాగే జయ భద్రతా సిబ్బందికి చెల్లించాల్సిన బేటా ఖర్చుల బిల్లును పోలీసుశాఖ భారీగానే పంపినట్టు సమాచారం.
సౌత్ ఇండియ‌న్ సీనియ‌ర్ హీరోయిన్ న‌య‌న‌తార, యంగ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ ప్రేమ వ్య‌వ‌హారం గురించి గ‌త కొద్ది రోజులుగా ఎన్నో సంచ‌ల‌న వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. వీరిపై ఎన్ని రూమ‌ర్లు ఉన్నా అవి క‌న్‌ఫార్మ్ మాత్రం కావ‌డం లేదు. ఇక‌పై వీటికి ఫుల్ స్టాప్ పెట్టే సంఘ‌ట‌న ఒక‌టి జ‌రిగింది. న‌య‌న జ‌య‌ల‌లితకు నివాళులు అర్పించేందుకు వ‌చ్చి వేలాది మంది స‌మ‌క్షంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.
దివంగత జయలలిత పార్ధివ దేహాన్ని దర్శించుకోవడానికి ఈరోజు అనేకమంది సినిమా సెలబ్రిటీలు క్యూలు కట్టిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూరులో షూటింగ్‌లో ఉన్న నయనతార కూడా అర్ధంతరంగా షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ చెన్నై వ‌చ్చింది. జయలలిత మృత‌దేహాన్ని తన ప్రియుడు.. దర్శకుడు విఘ్నేష్ శివన్ తో కలసి దర్శించుకుంది. ఇద్దరూ కూడా తెల్ల బట్టల్లో నార్త్ ఇండియన్ స్టయిల్లో విచ్చేశారులే.


 ఇలాంటి కార్య‌క్ర‌మానికి ఎవ్వ‌రూ ల‌వ‌ర్స్‌తో రారు. వారి మ‌ధ్య అంత‌కు మించి బ‌ల‌మైన రిలేష‌న్ ఉంటేనే ఇలా జ‌రుగుతుంది. సో న‌య‌న‌తార వేలాది మంది స‌మ‌క్షంలోనే విఘ్నేష్‌తో రావ‌డంతో ఇక వీరి మ‌ధ్య ఉన్న రిలేషన్ స్ట్రాంగేన‌ని, విఘ్నేష్ ను నయన్ పెళ్ళిచేసుకుందని అంద‌రూ అనుకుంటున్నారు.

కూతురు పెళ్లి కోసం గాలి బ్లాక్ మ‌నీ ఎలా మార్చాడో తెలుసా..!

గ‌నుల ఘ‌నుడు, మైనింగ్ మాఫియా సామ్రాజ్యాధినేత, క‌ర్నాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్థ‌న్‌రెడ్డి ఇప్పుడు మ‌రో కేసులో చిక్కుకున్నారు. గాలి మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. గాలి త‌న కూతురు బ్రాహ్మ‌ణి పెళ్లి కోసం ఏకంగా రూ.100 కోట్ల న‌ల్ల‌ధ‌నాన్ని మార్చిన‌ట్టు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.
ఈ మేర‌కు అక్క‌డ ఓ రెవెన్యూ అధికారి డ్రైవర్ రమేశ్ గౌడ సూసైడ్ కలకలం సృష్టిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి 100 కోట్ల రూపాయల్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నాక కూడా గాలి త‌న కుమార్తె పెళ్లిని కోట్లు కుమ్మ‌రించి అంగ‌రంగ వైభ‌వంగా చేశారు.
ఈ క్ర‌మంలోనే బళ్లారికి చెందిన ఓ రెవెన్యూ అధికారి దగ్గర డ్రైవర్ గా పని చేస్తున్నాడు రమేష్ గౌడ్. గాలి ముఠా సభ్యులు.. వంద కోట్ల రూపాయల పాత నోట్లను.. రమేష్ గౌడ మధ్య వర్తిత్వంగా మార్పిడి చేశారు. 20 శాతం కమీషన్ తీసుకున్న‌ ర‌మేష్ గౌడ్ గాలి గ్యాంగ్‌కు కొత్త నోట్లు ఇచ్చాడు. అయితే కొత్త నోట్లు త‌క్కువ రావ‌డంతో గాలి అనుచరులు మిగతా డబ్బు కోసం డ్రైవర్ రమేష్ గౌడ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. వేధింపులకు దిగారు.
గాలి అనుచ‌రుల వేధింపులు ఎక్కువ‌వ్వ‌డంతో ర‌మేష్ గౌడ్ సూసైడ్ చేసుకున్నాడు. చనిపోయే ముందు మొత్తం వ్యవహారాన్ని నోట్ గా రాశాడు. వేధింపులు తట్టుకోలేక.. బెదింపులకు భయపడి చనిపోతున్నట్లు చెప్పాడు. గాలి జనార్థన్ రెడ్డి రూ.100 కోట్ల విలువైన పాత నోట్లు మార్చినట్లు నోట్ లో రాశాడు. రమేష్ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

సెక్స్‌లో భ‌ర్త రెచ్చిపోవాలంటే భార్య చేయాల్సిన‌వి ఇవి !

శృంగార స‌మ‌స్య‌లు అన్ని కూడా మ‌గ‌వాడిపై ఎక్కువ‌గా నెట్టేస్తారు. అయితే సుఖ‌మ‌య శృంగార జీవితానికి ఇద్ద‌రూ క‌లిసి కొన్ని బాధ్య‌త‌లు పాటించాలి. అంతేకాకుండా భార్య కూడా అద‌నంగా కొన్ని బాధ్య‌త‌ల‌ను తీసుకోవాలి.. భ‌ర్త ఎదుర్కొనే ఇబ్బందుల‌నుకొన్ని దూరం చేయాలి. సెక్స్ మీద ఆస‌క్తి త‌గ్గినా.. రెగ్యుల‌ర్‌గా శృంగారంలో పాల్గొన‌క‌పోయినా, మ‌ళ్లీ అత‌డిని మామూలుగా చేయ‌డానికి కొన్ని సూచ‌న‌లు పాటించాలి. అవేంటో మ‌నం ఓ సారి చూద్దామా..
1. ఆఫీసులో భ‌ర్త అల‌సిపోయి ఇంటికి రావొచ్చు. ఆ రోజు మూడ్ ఉండ‌క‌పోవ‌చ్చు. అటువంటి స‌మ‌యాల్లో లేక ఇంకేదైనా ఒత్తిడి వ‌ల్ల‌, శృంగారం చేయ‌లేక పోవ‌చ్చు. సెక్స్ మొద‌లు పెట్టినా సంతృప్తిక‌రంగా పాల్గొన‌క‌పోవ‌డం జ‌రుగుతూనే ఉంటుంది. అటువంట‌ప్పుడు భార్య అత‌నిని ఏమీ అన‌కూడ‌దు. ఇంకా విసిగించ‌కూడ‌దు. అత‌డినిఅర్దం చేసుకుని ప్రేమ‌గా మాట్లాడండి.
2. పాత జ్ఞాప‌కాల్ని గుర్తు చేయాలి, మొద‌టి రాత్రి విశేషాలు కావ‌చ్చు, తొలి ముద్దు తీపిగుర్తులు కావ‌చ్చు. ఇంకేదైనా రొమాంటిక్ సంగ‌త‌లుంటే గుర్తు చేయాలి.
3. భావిప్రాప్తి స‌రిగా క‌ల‌గ‌క‌పోయినా, అది కేవ‌లం భ‌ర్త ఓట‌మిగా చూపించ‌కూడ‌దు. అలా చేస్తే అత‌డు ఆత్మ‌విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోతాడు. అస‌లు సెక్స్ ఎందుకు సంతృప్తిక‌రంగా చేయ‌లేక‌పోతున్నాడో, ఎందుకు ఇబ్బందిప‌డుతున్నాడో తెలుసుకుని ప‌రిష్కారం గురించి దంప‌తులిద్ద‌రూ మాట్లాడుకోవాలి.
4. త‌న మీదు మీకున్న ప్రేమ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గుర్త చేయాలి. దీంతో అన్ని స‌మ‌స్య‌లు స‌ర్దుకుంటాయి. మిమ్మ‌ల్ని పూర్తిస్థాయిలో అర్ధం చేసుకుని ప‌డ‌క గ‌దిలో రెచ్చిపోవ‌డానికి ఇవ‌న్నీ దోహ‌ద‌ప‌డ‌తాయి.

కొత్త రూ.1000 నోటు రిలీజ్ డేట్ వ‌చ్చేసింది






ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు ఒకవైపు హర్షిస్తూనే, మరోవైపు అమలులో విఫలమైందని మండిపడుతున్నారు. ఈ క్ర‌మంలోనే మోడీ రూ.1000, రూ.500 నోట్ల‌ను ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నోట్ల స్థానంలో ప్ర‌భుత్వం కొత్త 2వేల నోటును ప్రవేశపెట్టింది. 2వేల నోటుతో పాటు 5వందలు, వెయ్యి రూపాయల నోటు కూడా విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొత్త 5వందల నోటు అక్కడక్కడా కనిపిస్తోంది కానీ వెయ్యి నోటు జాడే లేదు.
రూ.500 నోటు త‌ర్వాత ఒకేసారి మ‌ళ్లీ రూ.2000 పెద్ద నోట్లు మాత్ర‌మే ఉండ‌డంతో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ చాలా వ‌ర‌కు అత‌లాకుత‌ల‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే జ‌నాలంద‌రూ కొత్త రూ.1000 నోటు కోసం ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.
అయితే ఈ కొత్త రూ.1000 నోటు బ్యాంకుల్లోకి, అక్కడి నుంచి జనం జేబుల్లోకి రావాలంటే కొత్త సంవత్సరం వచ్చే దాకా ఆగక తప్పదని సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ కొత్త వెయ్యి రూపాయల నోటును ప్రవేశపెడుతున్నట్లు డిసెంబర్ 30న అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.
అంతేకాదు, కొత్తగా 20రూపాయలు, 50 రూపాయల నోటును కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్బీఐయే తెలిపింది. పాత 20, 50 నోట్లు యథాతథంగా ఉంటాయని, వాటికి తోడు కొత్త నోట్లు చలామణీలోకి తేవాలని భావిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

జ‌య‌ల‌లిత‌కు స్లో పాయిజిన్ ఇచ్చింది ఎవ‌రు..!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జయలలిత మరణించి నాలుగు రోజులు అవుతున్నా దేశమంతా ఆమె మరణం గురించే మాట్లాడుకుంటున్నారు. జ‌య మృతికి చాలా కార‌ణాలు ఉన్నాయ‌ని, వాటిని త్వ‌ర‌లోనే భ‌య‌ట‌పెడ‌తాన‌ని జయలలిత సోదరుడి కుమార్తె దీప అన్నారు. సినీ నటి గౌతమీ కూడా జయలలిత మరణంపై ప‌లు సందేహాలు వ్య‌క్తం చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి మోడీకే లేఖ రాసి సంచ‌ల‌నం సృష్టించారు.
ఇపుడు తాజాగా ఒక సంచలన వార్త బయటకొచ్చింది. 2012లో తెహెల్కా ప్రచురించిన ఒక కథనం ఆమె మరణంపై అనుమానాలు రేకెత్తిస్తుంది. అప్పట్లో శశికళ “మన్నార్ గుడి మాఫియా” అనే గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని తెహ‌ల్కా ప‌త్రిక‌లో నాలుగు సంవ‌త్స‌రాల క్రిత‌మే క‌థ‌నం వ‌చ్చింది. వీరు తెర వెన‌క చేస్తోన్న కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన జ‌య‌ల‌లిత వీరంద‌రిని పోయెస్ గార్డెన్ నుండి వెళ్లగొట్టారు.అయితే శశికళ మాత్రం తాను నియమించిన నర్స్ ద్వారా ఆమెకు స్లో పాయిజన్ ఎక్కించినట్లు ఆ క‌థ‌నం పేర్కొంది. ఆమెకు నిద్రమాత్రలు, మరియు ఆమె తాగే పానీయాలు, మరియు ఆమె తినే పళ్ళు, ఇతర ఆహార పదార్థాలలో విషం ఎక్కించారని వైద్యులు చెప్పారని పేర్కొంది. జయలలిత తాను తీసుకుంటున్న మందులపై ఆమె వ్యక్తిగత వైద్యులు చేసిన పరీక్షలలో ఈ విషయం బయటపడిందని తెలిసింది.శ‌శిక‌ళ కుటుంబ స‌భ్యుల తెర‌వెన‌క దందాలు తెలుసుకున్న జ‌య‌ల‌లిత శశికళతో సహా ఆమె కుటుంబ సభ్యులందరినీ తన ఇంటి నుండి బయటకు పంపేశారు. దీంతో జయలలితను ఎలాగైనా అంతమొందించాలని శశికళ భావించారు. దాంతో మళ్ళీ శశికళ జయలలితను మంచి చేసుకుని ఆమె ఇంట్లోకి వచ్చారు. జయలలిత కూడా శశికళని తప్ప ఆమె కుటుంబ సభ్యులు ఎవరినీ తన ఇంట్లోకి రానీయలేదు. ఇపుడు ఆమె మరణం తర్వాత శశికళ కుటుంబ సభ్యులు అంతా మళ్ళీ జయ ఇంట్లో అడుగు పెట్టడం తో ఈ విషయం మళ్ళీ చర్చనీయాంశమయింది.