cricket ad

Saturday 10 December 2016

అన్నీ తెలిసినా ‘అమ్మ’ ఎందుకు ఊరుకుందంటే..

తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆస్తుల కేసు విచారణ సందర్భంగా బెంగళూరులో మన్నార్‌గుడి మాఫియా రహస్య సమావేశం నిర్వహించినట్టు 2012లో తెహల్కా రిపోర్టర్ జీమన్ జాకబ్ బయట పెట్టారు. కుట్రలపై పోలీసులు సమగ్ర నివేదిక ఇచ్చినప్పటికీ శశికళ కుటుంబంపై జయలలిత చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలనూ వివరించారు. జీమన్ కథనం ప్రకారం... శశికళ, ఆమె భర్త నటరాజన్, రావణన్ (శశికళ పినతండ్రి అల్లుడు) సహా ‘మన్నార్‌గుడి మాఫియా’లో మరో నలుగురు బెంగళూరులో రహస్యంగా సమావేశమైనట్టు నాటి డీజీపీ రామానుజం దృష్టికి వచ్చింది. అక్రమాస్తుల కేసులో జయలలితకు ఎదురయ్యే సమస్యలు, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలి అనే దానిపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చ జరిగింది. దీనిపై కర్నాటక డీజీపీ అప్పటి తమిళనాడు డీజీపీకి టేపులతో సహా సమాచారం ఇచ్చారు. ఈ టేపులను మొత్తం విన్న తర్వాత సీఎం జయలలిత వెంటనే స్పందించకుండా కొన్నిరోజులు అలాగే గడవనిచ్చారు. మరోవైపు డీజీపీ రామానుజం దీనిపై పకడ్బందీ ఆపరేషన్‌తో పక్కా ఆధారాలు సేకరించారు. ‘మన్నార్గుడి మాఫియా’పై పూర్తి నిఘావేయడంతో పాటు ఓ ప్రయివేటు డిటెక్టివ్ ఏజెన్సీనికి కూడా బాధ్యతలు అప్పగించారు. శశికళ కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఫోన్ సంభాషణలు  సేకరించి నేరుగా ముఖ్యమంత్రి జయలలితకు చేరవేశారు. ఈ వ్యవహారం మొత్తం తన దృష్టికి వచ్చినప్పటికీ... వారిపై చర్యలు తీసుకుంటే పార్టీపైనా, ప్రభుత్వంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని జయలలిత భావించారు. దీంతో శశికళతో సన్నిహితంగా మెలుగుతున్న అధికారులను, మన్నార్గుడి మాఫియాకి సహకరిస్తున్న వారిని నెమ్మదిగా పక్కకు తొలిగించారు. తనకు పదేళ్లుగా వ్యక్తిగత భద్రతాధికారిగా పనిచేస్తున్న తిరుమలై స్వామిని సైతం సాగనంపారు. క్రమంగా మంత్రివర్గాన్ని శశికళ వ్యవహారంపై అప్రమత్తం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ జయను ఏదోవిధంగా మచ్చిక చేసుకుని శశికళ తన వ్యవహారం చక్కబెట్టుకున్నట్టు జీమన్ వివరించారు.

భారతీయుల వీసా ఆశలపై ట్రంప్ నీళ్ళు

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ లోపునే ఆయన మాటలు భారతీయులకు దడపుట్టిస్తున్నాయి. ప్రతిభావంతులైన భారతీయులు అమెరికాలో గొప్ప అవకాశాల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటివారి ఆశలపై ట్రంప్ నీళ్ళు జల్లుతున్నారు. అయోవాలో తన మద్దతుదార్లతో ట్రంప్ మాట్లాడుతూ అమెరికన్లకు బదులుగా విదేశీ వర్కర్లను తీసుకోవడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.


 డిస్నీ వరల్డ్, తదితర అమెరికా కంపెనీల్లో పరిస్థితులను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అమెరికా ప్రజల్లో చిట్టచివరి వ్యక్తి జీవితాన్ని కూడా కాపాడేందుకు పోరాడాలని ట్రంప్ అన్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో తాను ఉద్యోగాలు కోల్పోయిన అనేకమంది అమెరికన్ వర్కర్లతో మాట్లాడానని చెప్పారు. వారికి బదులుగా తీసుకొచ్చిన విదేశీ వర్కర్లకు ఉద్యోగాలు కోల్పోయినవారిచేత బలవంతంగా శిక్షణ ఇప్పిస్తున్నారని చెప్పారు. 




‘‘మీకు బదులుగా వచ్చినవాళ్ళకు శిక్షణ ఇవ్వకపోతే మీ జీతం బాకీలు మీకు చెల్లించడం లేదు’’ అన్నారు. ఇటువంటి సంఘటనలను ఇకపై జరగనిచ్చేది లేదన్నారు. ట్రంప్ మాటలకు వేలాది మంది హర్షం వ్యక్తం చేశారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తానని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అమెరికాలోకి వచ్చిపడుతున్న మాదక ద్రవ్యాలు అమెరికా యువతను పాడుచేస్తున్నాయని, వాటిని అరికడతానని శపథం చేశారు.

సోషల్ మీడియా వేదికగా శశికళ మేనల్లుడు పెడుతున్న పోస్టులివి!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన నేటికి ఐదురోజులైంది. ఈ ఐదు రోజుల నుంచి ఆమె మృతిపై అనేక సందేహాలు, ఊహాగానాలు. ఆమెను ఉద్దేశపూరితంగా హత్య చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది. కొందరు ప్రజలు ఒకడుగు ముందుకేసి సోషల్ మీడియా వేదికగా శశికళను జయ మృతికి ప్రధాన కుట్రధారిగా పేర్కొంటున్నారు. అయితే అన్నాడీఎంకే మాత్రం శశికళ చాలా ముఖ్యమైన వ్యక్తి అని, జయ విషయంలో అలా చేయదని సమర్థిస్తోంది. శశికళ పాత్రపై అనుమానాలున్నాయన్న వాదనల నేపథ్యంలో ఆమె మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా సరికొత్త ప్రచారానికి తెరలేపారు.
 
శశికళ మేనల్లుడు జియానంద్ దివాకరన్ తన ఫేస్‌బుక్ పేజ్ వేదికగా శశికళ గురించి ప్రచారం చేస్తున్నాడు. శశికళ కుటుంబం జయ కోసం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అండగా నిలిచిందని జియానంద్ పోస్ట్ చేశాడు. జయలలితను మూడు సార్లు ప్రాణాపాయం నుంచి శశికళ సోదరుడు కాపాడాడని ఓ ఫోటో పోస్ట్ చేశాడు. జయలలిత ప్రతిపక్షంలో ఉండగా ఆమెపై లాఠీ చార్జి జరగకుండా ఉండేందకు శశికళ సోదరుడు దివాకరన్ లాఠీ దెబ్బలకు ఎదురునిలిచాడని పోస్ట్ చేశాడు. ఆ లాఠీచార్జ్‌లో దివాకరన్‌కు 14 చోట్ల గాయాలయ్యాయని పోస్ట్ చేశాడు.

వారసత్వ పోరాటం!


  • జయ ఆస్తుల కోసం మోహరింపు
  • ఒక వర్గం శశికళ వైపు, మరోవర్గం వ్యతిరేకం
చెన్నై, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం! పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కోసం పోరాటం! జయలలిత ఆస్తుల కోసం పోరాటం! ఈ మూడూ తనకే దక్కాలంటూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ చక్రం తిప్పుతున్నారు. ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి పదవులకు సంబంధించి ఇప్పటికే భిన్నాభిప్రాయాలు, వ్యతిరేకతలు వ్యక్తమయ్యాయి. తాజాగా, జయలలిత ఆస్తుల వారసత్వం కూడా తమిళనాట రచ్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. చట్ట ప్రకారం, రక్త సంబంధీకులెవరైనా ఉంటే జయ ఆస్తులు వారికే చెందుతాయి. అయితే, ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. జయ ఆస్తులపై పట్టు సాధించిన శశికళ.. ఆమె బంధువుల మధ్య చీలికలు తెచ్చేందుకు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది.
జయ రక్త సంబంధీకులెవరు?
జయలలిత పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళితే, ఎన.రాగచార్‌ కుమారుడు జయరాం. బెంగళూరులో ఆయన న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆయన మొదటి భార్య జయమ్మ. ఈ దంపతులకు కలిగిన సంతానం వాసుదేవన. ప్రస్తుతం ఆయన తన భార్యాబిడ్డలతో మైసూరులోనే ఉంటున్నారు. జయమ్మ కన్నుమూయడంతో జయరాం వేదవల్లి అలియాస్‌ సంధ్యను వివాహం చేసుకున్నారు. అప్పటికి జయలలిత వయసు రెండేళ్లు. అనంతరం, జయరాం, వేదవల్లి దంపతులకు జయకుమార్‌ జన్మించాడు. ఈ జయకుమార్‌ 1995లో ఓ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జయకుమార్‌కు దీపక్‌, దీప అనే ఇద్దరు సంతానం. దీపక్‌ శశికళతో కలిసి జయ అంతిమ సంస్కారాల్లో పాల్గొనగా, దీపను మాత్రం దరి చేరనీయలేదు. ఇలా చూస్తే జయ రక్త సంబంధీకులు దీపక్‌, దీప మాత్రమే. కాగా, దీపక్‌ శశికళ బృందంవైపు చేరినట్లు తెలుస్తోంది. దీప తన మేనత్త వద్దకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పోయెస్‌ గార్డెనలో జయ మృతదేహానికి స్నానాదులు చేయించేటప్పుడు దీపను కూడా పిలవాలని కొందరు సీనియర్లు చెప్పినా, శశికళ బృందం నిరాకరించింది. రాజాజీ హాలు వద్ద జయ మృతదేహం ఉన్నప్పుడు అక్కడికొచ్చిన దీపను క్షణాల్లోనే పంపేశారు. జయ మృతదేహాన్ని తీసుకెళ్లే సైనిక శకటం ఎక్కేందుకు దీప చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. అయితే, దీపక్‌ను మాత్రం శశికళ భర్త నటరాజన తన వెంటే ఉంచుకున్నారు. ఉదయం నుంచీ తన వెంటే ఉంచుకున్న నటరాజన.. కనీసం బయటకు కూడా వెళ్లనీయలేదని సమాచారం. అలాగే, ఆయనకు అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకూ అవకాశం ఇచ్చారు. దీంతో, దీపక్‌తో శశికళ బృందం టచలో ఉందని, అతన్ని దరి చేర్చుకునేందుకు సిద్ధంగా ఉందని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. దీపను మాత్రం దరి చేరనిచ్చేది లేదని శశికళ కరాఖండీగా చెప్పినట్లు తెలిసింది. రక్త సంబంధీకులకే ఆస్తిపాస్తులు దక్కే అవకాశం ఉన్నందున, ఒకవేళ అలాంటిదేదైనా జరిగితే దీపక్‌ను ప్రయోగించవచ్చన్నది ఆమె వ్యూహంగా కనిపిస్తోంది. పోయెస్‌ గార్డెన ఆదిలో జయ మాతృమూర్తి సంధ్య పేరుపై ఉండేది. అనంతర కాలంలో జయకు వారసత్వంగా వచ్చింది. అంటే ఆ ఇల్లు దీపక్‌ నాయనమ్మది అవుతుంది. చట్ట ప్రకారం ఆ భవనానికి పూర్తి వారసుడు అతనే అవుతాడు. గతంలో ఎంజీఆర్‌ రాసిన వీలునామా వల్ల ఆయన ఆస్తులన్నీ తొలిగా న్యాయవాది ఎనసీ రాఘవాచారి పర్యవేక్షించారు. అనంతరం ఎంజీఆర్‌ బంధువైన రాజేంద్రన ఆధీనంలోకి వెళ్లాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో ప్రస్తుతం అవి మద్రాస్‌ హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి పర్యవేక్షణలో ఉన్నాయి. అయితే, ఇలాంటివేవీ జరగకుండా దీపక్‌ను ప్రయోగించేందుకు శశికళ బృందం వ్యూహం రచిస్తోంది.

ఈ-పేమెంట్స్ పై ఆఫర్స్ ప్రకటించిన కేంద్రం!

డిజిటల్ పేమెంట్స్ చేసేవాళ్లకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది కేంద్రం. డిజిటల్  చెల్లింపులు చేసేవాళ్లకు వరాలు ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ రాయితీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు 20 నుంచి 40 శాతం పెరిగిందన్నారాయన. నగదు రహిత దేశంగా భారత్ ను నడిపించాలన్న సంకల్పంతో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు జైట్లీ.
అరుణ్ జైట్లీ ప్రకటించిన ఆఫర్స్..
… 10 వేలలోపు జనాభా ఉన్న.. ఒక లక్ష గ్రామాలకు రెండు పీవోఎస్ లు  ఉచితం
… ఆన్ లైన్ ద్వారా రైల్వే టికెట్లు కొనుగోలు చేసే వాళ్లకు 10 లక్షల భీమా
… డిజిటల్ మోడ్ లొ పెట్రోల్, డీజిల్ కొనేవాళ్లకు 0.75 శాతం తగ్గుతుంది
… కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు 4.32 కోట్ల జనాభాకు నాబార్డ్ ద్వారా రూపే కార్డులు జారీ
… రెండువేల(రూ. 2000) వరకు డిజిటల్ చెల్లింపులు చేసేవాళ్లకు సర్వీస్ ట్యాక్స్ రద్దు
… టోల్ ప్లాజాలలో రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్
… ఆన్ లైన్ లో రైల్వే టికెట్లు కొన్నవాళ్లకు అకామిడేషన్, క్యాటరింగ్, రిటైరింగ్ రూమ్స్ ల ఛార్జీలో 5 శాతం రాయితీ
… సబర్బన్ రైళ్లలో మంత్లీ  సీజనల్ టికెట్లు కొనుగోలు చేసే వారికి 0.5 శాతం రాయితీ  
… ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఆన్ లైన్ లో చెల్లింపులు చేస్తే 10 శాతం రాయితీ
… జాతీయ బ్యాంకులు పీవోఎస్ లను రెంటుకు ఇచ్చిన వ్యాపారుల నుంచి నెలకు రూ. 100 కంటే ఎక్కువ అద్దె తీసుకోవద్దు

జయలలిత సమాధి నుండి శబ్ధాలు.! ఇదిగో కారణాలు.!!

జయలలిత సమాధిని దర్శించుకోడానికి వచ్చిన అమె అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అమ్మ సమాధి మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్న సమయంలో…..సమాధి లోపలి నుండి శబ్ధాలు వినిపిస్తున్నాయని తెలియడంతో…అమ్మ అభిమానులు ఆ శబ్దాలు వినడానికి  మెరినా బీచ్ సమీపం లో ఉన్న  అమ్మ సమాధిని దర్శించుకోడానికి క్యూలు కడుతున్నారు. అయితే ఇవి జయలలిత చేతికున్న గడియారం నుండి వచ్చే టుక్ ,టుక్ అనే శబ్దాలు. జయలలితన పార్థీవ దేహాన్ని పూడ్చే సమయంలో ఆమె చేతికున్న గడియారాన్ని అలాగే ఉంచి పూడ్చారు. అందుకే సమాధి నుండి ఆ శబ్దాలు వస్తున్నాయి.

 జయకు రిస్ట్ వాచ్ లంటే చాలా ఇష్టం… ఇమె దగ్గర దాదాపు అన్ని బ్రాండ్ లకు చెందిన రిస్ట్ వాచ్ లు ఉన్నాయి. అంత ఇష్టంగా చేతికి పెట్టుకున్న గడియారాన్ని అలాగే జయ చేతికి ఉంచే సమాధి చేయడంతో…ఇప్పుడు సమాధి నుండి ఆ శబ్దాలు వస్తున్నాయి. ఇక మెరీన బీచ్ లో జయ సమాధికి 20 అడుగుల దూరంలోనే ఉన్న తమిళనాడు మాజీ CM, జయ రాజకీయ గురువు MJR సమాధి నుండి కూడా ఇదే తరహాలో గడియారం చప్పుడు రావడం విశేషం.

Friday 9 December 2016

నమో... వేంకటేశాయ

నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం కోసం దాదాపుగా 25 సెట్లను నిర్మించారు. రామోజీ ఫిలింసిటీలో తీర్చిదిద్దిన తిరుమల సెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. నాగార్జున హాథీరామ్‌ బాబాగా కనిపిస్తారు. వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌ జైన్‌, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటించారు. విమలారామన్‌, రావురమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి