cricket ad

Friday 9 December 2016

నమో... వేంకటేశాయ

నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రం కోసం దాదాపుగా 25 సెట్లను నిర్మించారు. రామోజీ ఫిలింసిటీలో తీర్చిదిద్దిన తిరుమల సెట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం చెబుతోంది. నాగార్జున హాథీరామ్‌ బాబాగా కనిపిస్తారు. వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌ జైన్‌, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటించారు. విమలారామన్‌, రావురమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: ఎస్‌.గోపాల్‌రెడ్డి

No comments:

Post a Comment