cricket ad

Saturday 10 December 2016

ఈ-పేమెంట్స్ పై ఆఫర్స్ ప్రకటించిన కేంద్రం!

డిజిటల్ పేమెంట్స్ చేసేవాళ్లకు బంపర్ ఆఫర్స్ ప్రకటించింది కేంద్రం. డిజిటల్  చెల్లింపులు చేసేవాళ్లకు వరాలు ప్రకటించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ రాయితీలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు 20 నుంచి 40 శాతం పెరిగిందన్నారాయన. నగదు రహిత దేశంగా భారత్ ను నడిపించాలన్న సంకల్పంతో ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారన్నారు జైట్లీ.
అరుణ్ జైట్లీ ప్రకటించిన ఆఫర్స్..
… 10 వేలలోపు జనాభా ఉన్న.. ఒక లక్ష గ్రామాలకు రెండు పీవోఎస్ లు  ఉచితం
… ఆన్ లైన్ ద్వారా రైల్వే టికెట్లు కొనుగోలు చేసే వాళ్లకు 10 లక్షల భీమా
… డిజిటల్ మోడ్ లొ పెట్రోల్, డీజిల్ కొనేవాళ్లకు 0.75 శాతం తగ్గుతుంది
… కిసాన్ క్రెడిట్ కార్డు హోల్డర్స్ కు 4.32 కోట్ల జనాభాకు నాబార్డ్ ద్వారా రూపే కార్డులు జారీ
… రెండువేల(రూ. 2000) వరకు డిజిటల్ చెల్లింపులు చేసేవాళ్లకు సర్వీస్ ట్యాక్స్ రద్దు
… టోల్ ప్లాజాలలో రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే 10 శాతం డిస్కౌంట్
… ఆన్ లైన్ లో రైల్వే టికెట్లు కొన్నవాళ్లకు అకామిడేషన్, క్యాటరింగ్, రిటైరింగ్ రూమ్స్ ల ఛార్జీలో 5 శాతం రాయితీ
… సబర్బన్ రైళ్లలో మంత్లీ  సీజనల్ టికెట్లు కొనుగోలు చేసే వారికి 0.5 శాతం రాయితీ  
… ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు ఆన్ లైన్ లో చెల్లింపులు చేస్తే 10 శాతం రాయితీ
… జాతీయ బ్యాంకులు పీవోఎస్ లను రెంటుకు ఇచ్చిన వ్యాపారుల నుంచి నెలకు రూ. 100 కంటే ఎక్కువ అద్దె తీసుకోవద్దు

No comments:

Post a Comment