cricket ad

Wednesday 30 November 2016

కుచేలోపాక్యనం: భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని.

కుచేలోపాక్యనం:
భాగవతములో శ్రీ కృష్ణుని దర్శనాన్ని అపెక్షించనటువంటి వారు ఎవరు ఉండరు . పరిపూర్నావతారం కృష్ణావతారం ,అటువంటి కృష్ణుని యొక్క పాదములు పట్టుకొన్నవాళ్ళు కృష్ణనుగ్రహాన్ని కోరుకున్నవాల్లే తప్ప కృష్ణుడే వచ్చి ఒక పేద బ్రాహ్మణుడి యొక్క పాదాలు పట్టుకుని ఆ పాదాలు కడిగి ఆయనికి నమస్కరించి ఆ పాదాలు కడిగిన నీళ్ళు తాను తలమీద చల్లుకుని తన పట్టమహిషి రుక్మిణి దేవి యొక్క తల మీద చల్లడం అసాదరమైనటువంటి ఘట్టం ,ప్రమాణ వాక్కు అని లోకములో ఒకటి ఉంటుంది అంటే ఏది పట్టుకుంటే తరిస్తామో అటువంటి ప్రమాణాన్ని నిర్ణయం చేస్తారు . వేదాన్ని విభాగము చేసి 18 పురాణములను ,మహాభారతాన్ని ,బ్రహ్మాసూత్రాలని ఇచ్చిన మహాపురుషుడు వేద వ్యాసుడు . అందుకే వేద వ్యాసుడు చెప్పిన మాటలు మాత్రమే చెప్పడానికి ఇష్టపడతారు గురువులందరు ఎందుకంటే అవి అటువంటి పరమ పవిత్రమైనటువంటి గంగా నది వంటివి తప్ప ,అసలు వ్యాసుడు చెప్పిన మాటలు ఎవరికీ చెప్పవలిసిన అవసరము ఎవరికీ ఉండదు . వ్యాసుడు చెప్పినదే చెప్తుంటారు కారణం ఏమిటంటే వ్యాసుడు అంత గొప్పగా మహాసముద్రాలంత వాంగ్మయం ఇచ్చేసాడు . అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడు రచించిన భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారు కుచేలుడు ఎంత గొప్పవాడో చెప్పారు ,కుచేలుడు గొప్ప బ్రాహ్మణుడు, సిగ్గు విడిచిపెట్టి అందరి దగ్గరికి వెళ్లి చెయ్యిచాపి నాకు సహాయం చెయ్యండి అని అయన జీవితములో లేదు ,ఆయనకి రాగ ద్వేషాలు లేవు ధర్మమే ఆయన ,ఆయనే ధర్మం ,ధర్మవస్తలుడు ,చాలా గొప్పవాడు ,ఇంద్రియములును గెలిచాడు ,సామాన్యమైన విషయము కాదు ,బ్రహ్మవేత్త ,దారిద్రియం ఆయన్ని బాధించింది కానీ ఆయనికి దారిద్రియం యొక్క స్పృహ లేదు అంటే మనకనిపిస్తుంది కుచేలుడు దరిద్రుడని కానీ ఆయనికి మాత్రం దరిద్రము ఉన్నదన్న విషయం అసలు జ్ఞాపకములో ఉండదు ,ఎందుకుండదు ,ఎప్పుడు పరబ్రహ్మ్మములో రమిస్తూ ఆనందపడిపోతాడు . అటువంటి బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని కుచేలుడు . అంతటి బ్రహ్మ్మజ్ఞాని అయినటువంటి కుచేలుడికి ఒక రూపాయి దొరికితే అదే పదివేల రూపాయిలు అనుకుంటాడు ,నాకిది లేదన్న భావన లేదు ,ఈశ్వరుడు ఏమివ్వలేదు అంటాడు , అంత సంతోషముతో ఉంటాడు ,ఒక బ్రాహ్మణుని కి ఉండవలిసిన మొట్ట మొదటి లక్షణం ,పరమ సంతోషముతో ఉండాలి నాకేమ్లేదు ,ఈశ్వరుడు నాకేమివ్వలేదన్న ఆనందుముగా ఉండాలి అది ఉన్నటువంటి వాడు కుచేలుడు . అసలు అయన పేరేమిటి షుబాముడు అని ప్రతీతి . కుచేలుడు అనే పేరెందుకు వచ్చింది అంటే చేలము అంటే బట్ట కుచేలము అంటే చిరిగిపోయినటువంటి బట్ట ,చిరిగిపోయిన బట్ట కట్టకూడదు ,వేదములో నియమము ఉంది ,కాలిన బట్ట గాని ,చిరిగిపోయిన బట్ట గాని కట్టుకుని ఉండకూడదు అలక్షణం ,మరి కుచేలుడు ఎందుకు కట్టుకుంటాడు అది ఆయన చిరిగిపోయిన బట్ట అన్న విషయము ఆయనకి జ్ఞాపకము ఉండదు అసలు ఆయన బట్ట చూస్తాడు అబ్బా పీతాంబరము అని కట్టుకుంటాడు ,ఇది చిరిగిపోయింది రా అన్న భావన ఆయనికి ఉండదు . బ్రహ్మ వేత్తలని అర్దము చేసుకోవడం అంత తేలిక కాదు . రమణ మహర్షి గోచి అంతా కన్నాలు పడిపోయాయి ,అప్పుడప్పుడు ఆ గోచి తడిపి ఆరేసేవారు ,తువాలు అలానే ఉండేది ఆయనికి అన్ని కన్నాలే ఒకసారి కొంతమంది అయిశ్వర్యవంతులు ,అంతేవాసులు చూసి అన్నారు అయ్యో అయ్యో అయ్యో ఇన్ని కన్నాల అందులో దారపుపోగులు కన్నా కన్నాలే ఉన్నాయి చెప్తే రెండు తువాళ్ళు తేమండి అన్నారు . అయన అన్నారు కన్నాల ఇంద్రుడు నా గోచి సహస్రాక్షుడు ,తృప్తి ఉన్నవాడికి దరిద్రము ఏమిటి ,అయన గోచి చిరిగిపొతే గిరి ప్రదక్షిణం చేస్తూ ఆయనకేమి శరీర బ్రాంతి లేదు , చుట్టూ ఉండేవాళ్ళు అనేవారు భగవాన్ మీకు శరీర స్పృహ లేదు కానీ లోకము ఉందిగా ఒక గోచి పెట్టుకోండి అన్నారు అంటే పెట్టుకునేవారయిన ,అది చిరిగిపోతే నా గోచి చిరిగి పోయింది ఒక తువాలు పట్రండి అని అనలేదు ,ఆ రక్కసి పొదల్లోకి వెళ్లి ఒక రక్కసి ముళ్ళు తెంపి ఆ ముళ్ళు తోటే ఇంకొక ముల్లుకి కన్నం పెట్టి గోచి ఊడదీసి అందులో దారాలు తీసి దారము రక్కస ముళ్ళు సూదిలోకి ఎక్కించి చిరిగి పోయిన చోట కుట్టేసుకుని గోచి పెట్టుకుని ప్రదక్షిణ చేసేవారు ,ఇది లేదన్న మాట బ్రహ్మ వేత్తకు ఉండదు అందుకే అటువంటి వారి పేరు స్మరిస్తే పుణ్యం ,అటువంటి వారు పేరు తలవడం అంటే మాటలండీ ,అటువంటి వారిని తలుచుకుంటే చాలు పుణ్యం వచ్చేస్తుంది ,కుచేలుడు అంటే శరీర బ్రాంతి లేనివాడు . కుచేలుడి భార్య ఆవిడ అంతకన్నా గొప్ప ఇల్లాలు ,ఆవిడ చెప్పిన మాట భాగవతం లో అమృత బాండం . భగవంతుడు అంటే ఎంత కారుణ్య మూర్తి అండి ,అసలు ఎప్పుడు తలచుకోనివాడు కూడా కష్టం వచ్చినపుడు తలచుకుంటే రక్షిస్తాడే ,పిల్లలికి అన్నం లేదు ఒక సారి మీ స్నేహితున్ని అడగండి , వెళతాను గాని స్నేహితుని దగ్గరకు వెళ్ళేటపుడు ఎమన్నా పట్టికేల్లాలి ఎమన్నా ఉందా అన్నాడు ,అప్పుడు అడిగాడు ఎమన్నా ఉందా ఇంట్లో అని ,అప్పటి వరకు నే తినాలి ఎమన్నా ఉందా అని ఆయన జీవితములో అడగలేదు ,అటుకులు మూట కట్టింది ఆ ఉత్తరీయానికి ,పిచ్చి బ్రాహ్మణుడు ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళాడు ద్వారకా నగరానికి ఎందుకు కృష్ణ దర్శనం అవుతుంది అది ఆయన సంతోషం ,తీరా ద్వారకా నగరానికి వెళ్ళాక గుర్తు వచ్చింది ,నేను ఇలా ఉన్నాను కదా ,నన్ను పంపిస్తార కృష్ణునికి స్నేహితున్ని అంటే నమ్ముతార అని ,ఎలాగోలా వెళ్తున్నాడు , ఉత్తరీయం లేదు ఆయనికి ఓ ముక్క వేసుకున్నాడు ఎందుకని ,ఉత్తరీయం లేకుండా ఉండకూడదు కాబట్టి ,పెద్దలు దగ్గరికి వెళ్ళేటపుడు ఎడం బుజం మీద ఉత్తరీయం లేకుండా ఉండకూడదు ,అందుకేసుకున్నాడు ఓ గుడ్డముక్క దానికి అటుకుల మూట కట్టుకున్నాడు ,ఏమి తిన్నాడు ,ఎప్పుడు తిన్నాడు ,ఏమి తాగాడు ,శరీరానికి బడలిక ఉండదా ?సంతోషంలో మరిచిపోయడాయన ,ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు ,మిగిలిన వాళ్ళందరూ ,అందరూ నవ్వుతున్నారు ,పీనుగు నడిచి వెళితే ఎలా ఉంటుందో అలా ఉన్నాడురా , ఉరఃపంజరం అంత కనపడుతుంది ,ఎముకలన్నీ కనపడుతున్నాయి ,దవడలన్ని పోడుచుకోచ్చేసాయి ,పైన శరీరం కుచేలము ,లోపల ఉన్నవాడు బ్రహ్మవేత్త ,బ్రహ్మజ్ఞాని ఉన్నాడు లోపల ,మహానుభావుడు ఉన్నాడు ,పరమేశ్వరుడు పాదాక్రాన్తుడు అవుతాడు ఆయనికి ,ఆయన వస్తుంటే కృష్ణుడు కూర్చున్నాడు ,రుక్మిణి దేవితో కలిసి ఉన్నాడు తల్పం మీద ,కూర్చిలో కూర్చోలేదు ,హంస తూలికా తల్పం మీద నుంచి దూకేసాడు ,పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు ,ఒరేయ్ ఎపుదోచావ్ రా ,ఎన్నాలైన్దోయ్ ,ఎక్కడ కూర్చోపెత్తారో అని రాసారో తెలుసా పోతన గారు ,కూర్చీలో కూర్చో పెట్టలే ,తాను రుక్మిణి దేవితో కలిసి శయనించేటటువంటి ,కూర్చునేటటువంటి హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టారు ,చూసి చెలికత్తెలు అన్నారు ,ఉన్నవాళ్లు , మేము ఋషులు దర్శనం చేస్తే చూసాం కృష్ణున్ని ,మహర్షులు ,మునులు ఈయనతో సరిపోతారా ,అరెరె కృష్ణుడు ఎదురు వచ్చి తీసుకెళ్లాడయ ,రుక్మిణి దేవితో కలిసి కూర్చునే తల్పం మీద కూర్చోబెట్టాడు ,రుక్మిణి చూస్తావే వెళ్లి పట్రా బంగారు చెంబు పళ్ళెం అన్నాడు ,పళ్ళెం కాళ్ళ కింద పెట్టి పొయ్ నీళ్ళు అన్నాడు ,ఎవరికి చేసాడు భాగవతం లో ఇలా ,కూర్చోపెట్టి సాక్షాత్తు ఆది లక్ష్మీ ,ఆవిడ తీగంటి చూపు పడితే చాలు మహాదైస్వర్యం అందుతుంది ,ఆవిడ విష్ణు పాదములు కడగడం కాదు ,కుచేలుడు పాదాలు కృష్ణుడు కడుగుతుంటే నీళ్ళు పోసింది ,ఆవిడ పోస్తుంటే కృష్ణుడు కింద కూర్చుని కడిగాడు ఆయన పాదాలు ,ఏదో అలవోకగా కదగలె స్నేహితుడు అని ,పరమ భక్తితో కడిగాడు ,ఎందుకో తెలుసా నీవంటి బ్రహ్మవేత్త లేడు ,ఆయన కాళ్ళు కడిగి తలమీద జల్లుకున్నాడు ,రా రుక్మిణి దేవికి జల్లాడు ,అంతఃపుర పరివారానికి జల్లాడు ,చందనం తీసి పట్టుకొచ్చి ,అయన వొళ్ళంతా చందనం రాసాడు ,ఎంత అలసిపోయవో ,నీకు తెలియదు ,నీకు భార్య ,బిడ్డలు ,భూములు ,ధనం ఏమి అవసరం లేదు,ఎప్పడు సంతోషం లో ఉంటావు ,కుచేల ఎక్కడుంటాడు నీలాంటి వాడు అని ,ఆయన శ్రమ పోయేటట్టు తనే విసిరి కర్ర పట్టుకుని ,తాటాకు విసినికర్రతో విసిరాడు ,ఆయనికి దూపం తీసుకుని వచ్చి చూపించాడు ,సువాసన పీల్చవోయి ,దీపాలతో హారతులు ఇచ్చాడు ,ఎవరు ఎవరికీ పరిపూర్నావతారం అయిన కృష్ణ భగవానుడు ,అంతటి బ్రహ్మ వేత్త అయినటువంటి కుచేలుడికి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నాడు అంటే మీరొకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి ,ఎవరి పేరు చెప్పినంత మాత్రం చేత పరమేశ్వరుడు కూడా పరవశం అయిపోతాడో ,కుచేల ,మీ స్నేహితుడు కుచేలుడికి ఒక నమస్కారం అన్నారు అనుకోండి పొంగిపోతాడు ,అంతటి బ్రహ్మవేత్త . కుచేలుడి గొప్పతనం ఎక్కడుంది అంటే ఆయన తీసుకువచ్చిన అటుకులు పెట్టడానికి సిగ్గుపడ్డాడు ,ఇద్దరు కలిసి చదువుకున్నారు కదూ ,ఏవోయ్ నీకు మన గురువు గారు గుర్తు ఉన్నారా శందీపని మహర్షి అని గురువు గారిని పొగిడాడు ,స్నేహితుడివి నాకేదో తేకుండా ఉండవు ,ఏదో తెచ్చావ్ అని వొళ్ళంతా తడిమేసి ఆ ఉత్తరీయానికి కట్టుకున్న అటుకులు ,గట్టిగా లాగితే చిరిగి పోతుంది బట్ట అవి తీసుకుని గుటుక్కున నోటిలో పోసుకుని పర పర పర నమిలి మింగుతున్నాడు ,ఎవరు లక్ష్మీనాధుడు ,ఇంకొక పిడికిడి తీసాడు ,భాగవతం మొత్తం మీద ఇలా లేదు ,రుక్మిణి దేవి ఆదిలక్ష్మి వచ్చి కృష్ణుని చేయి పట్టుకుంది ఎందుకని ,,లక్ష్మీ దేవి పట్టేసుకుంది చేయి ఇంక తినొద్దు అని ,ఇలా అన్నాడు కృష్ణుడు ఏ ,ఒక్క పిడికిడి తింటే మీరేమిచ్చేసారో నాకు తెలుసు ,ఇంకొక్క పిడికిడి తింటే ఆ భక్తుడికి నన్ను ,నిన్ను కలిపిచ్చేస్తారు ,ఆయన అడిగాడ ఐశ్వర్యం కావాలని ,అడగలే ,చాలా విచిత్రం తెలుసా కుచేలోపాక్యనము లో అంతా అయిపొయింది భోజనం పెట్టేసాడు ,మర్నాడు సాగనంపెసాడు ,వెళ్ళిపోతున్నాడు కుచేలుడు ,అయ్యా దరిద్రం లో ఉన్నాను ఒక్క రూపాయి ఇప్పించండి అని అనలేదు కుచేలుడు ,వెళ్ళిపోతున్నాడు ,ఆ కృష్ణుడు ఎందుకివ్వలేదో నాకర్ధమైంది ,ఈ దరిద్రం లో ఉంటె హాయిగా సంతోషముగా నేను భగవంతుడిని స్మరించొచ్చు ,రేపోద్దిట బోలెడంత డబ్బు వచ్చి పడిపోతే అదంతా రాసుకుంటూ కూర్చుంటే ఈశ్వరుడు ని మరిచిపోతానని ఇవ్వకుండా నన్ను రక్షించాడు ,కృష్ణా నీకో నమస్కారమయ ,పెద్ద భవనం కనపడింది ఎవరో ఒకావిడ ఆబరనాలన్నీ పెట్టుకుని వచ్చి దాన్నం పెట్టింది అమ్మా అమ్మా ఎవరమ్మ నీవు అన్నాడు ,మీ అవిడనండి అంది ,అయ్యో ఎక్కడిదే ఈ ఐశ్వర్యం అన్నాడు ,ఇదిగో ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి పాక అంతఃపురం అయిపొయింది అంది ,అప్పుడే అటుకులు తిన్నాడు ,కుచేలోపాక్యనం మీరు చదవండి ,కుచేలోపాక్యనానికి చిట్ట చివర ఒక మాట చెప్తారు ,అన్ని అంతఃపురాలలో ఉన్న కుచేలుడికి ఐశ్వర్య భావం లేదు ,ఎప్పడు బ్రహ్మ్మముతో రమించి ,బ్రహ్మ్మము నందు ఐక్యం అయిపోయాడు ,కుచేలోపాక్యనం ఒక్క దానికే పల శృతి కూడా చెప్తారు ,గజేంద్ర మోక్షానం వాటికి చెప్పినట్టు ,కుచేలోపాక్యనానికి పల శృతి ఉంది ,అది చదివితే ,అది వింటే భగవంతుని యొక్క విశేషనమైనటువంటి అనుగ్రహం చేత దీర్గాయువు ,కీర్తి ,సంపద కలుగుతాయి ,అంత గొప్పది కుచేలోపాక్యనం ,ఒక బ్రాహ్మణుడు ఇంత దరిద్రములో ఉండి కూడా ,దరిద్రంతో సంబంధం లేకుండా ,ఆయన్ని భాదిన్చిది ,శరీరాన్ని భాదిన్చకపోలేదు కానసలు ఆయనికి ఆ భాద యొక్క స్పృహ తెలీదు ,మత్తు ఇచ్చి శరీరాన్ని కోస్తారు ,శరీరాన్ని కోయడం తెలుస్తుందా ,తెలీదు ,అలా ఆయనికి భగవంతుని యొక్క అనుబవానన్దమునన్దు భాహ్యము నందు ఉన్న దారిద్ర్యం తెలియనేలేదు అంతటి బ్రహ్మవేత్త ,అంతటి మహానుభావుడు కుచేలుడు అంటే అందుకే అంతటి పరమ భాగవతోత్తముడు వచ్చినపుడు మీకేంకావాలి అని అడగలేదు ,అంతటి పరిపూర్నవతారమే మహర్షులకి కూడా చెయ్యనటువంటి పూజ కుచేలుడికి చేసాడు అంటే అయన అంతటి బ్రహ్మ్మవేత్త ,అంతటి జితేంద్రియుడు ,అంతటి భక్తి తత్పరుడు ,ఎంతటి జ్ఞాని మనకర్దమవుతున్ది అటువంటి కుచేలోపాక్యనాన్ని ఇంట్లో పెద్దవాళ్లందరూ కూడా పిల్లలకి చెప్పాలి ,అందరు పోతనగారి భాగవతము లోనుంచి చదువుకోవాలి ,కుచేలోపాక్యనం భాగవతం దశమ స్కందం ఉత్తర భాగం లో ఉంది ,ఉత్తర భాగములో ఉన్నటువంటి కుచేలోపాక్యనాన్ని యదతదముగా చదువుకోవాలి ,ప్రతిరోజూ కుచేలోపాక్యనాన్ని చదువుకుని కుచేలుడి యొక్క గొప్పతనానికి పరవసించిపోతే అదే భగవంతుని యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది ,కుచేలుడు ఏవేవో కారణానికి దరిద్రుడు భాగవతములో లేదు ,కుచేలుడు బ్రహ్మవేత్త ,లేనితనమే తెలీకుండా పోలేదు ,ఉన్నతనం కూడా ఆయనకు తెలిదు . ఇది బ్రహ్మవేత్త అంటే ,ఐశ్వర్యం వచ్చిన తర్వాత స్పృహ ఉందేమిటి ,అదీలేదు .లెకపొతె స్పృహ ఉందేమిటి అది లేదు . రెండిటి లోను స్పృహ లేదు ,ఉన్న స్పృహ ఈశ్వర స్పృహ ఒక్కటే అటువంటి బ్రహ్మజ్ఞాని ,అంతటి మహానుబావుడు ,అటువంటి కుచేలుడికి ప్రతిరోజూ ఒక నమస్కారం చెయ్యాలి ,కృష్ణ భగవానుడు అంతటివాడు చేత పూజలందుకున్నాడు ,అటువంటి కుచేలోపాక్యనాన్ని స్మరించడం ,ఆయనికి నమస్కారం చెయ్యడం ,కృష్ణ భగవానుడి దగ్గర ,గురువుల దగ్గర కుచేలోపక్యనాన్ని ఒక్కసారి చెప్పుకుంటే చాలు పరవసించిపోతారు అందుకని కుచేలుడు పూజలందుకుంటున్నాడు

No comments:

Post a Comment