cricket ad

Monday 12 December 2016

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే..?

ఒత్తిడికి చెక్ పెట్టాలంటే.. రోజంతా పనిచేయాల్సిన అవసరం లేదు. పక్కా ప్లాన్ ప్రకారం వేసుకుంటే సరిపోతుంది. కార్యాలయాలు వెళ్ళే మహిళలు రోజూ హడావుడిగా కదలడం ద్వారా వారికి అనారోగ్య సమస్యలు తప్పవని.. అందుచేత చేసే పనిని సమయాన్ని వృధా చేసుకోకుండా చేసుకుంటే.. ఎలాంటి తలనొప్పులు ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోకుండా త్వరగా నిద్రపోవాలని తెలుపుతున్నారు. రాత్రి ఎంత త్వరగా పనులన్నీ పూర్తి చేసుకుని నిద్రిస్తారో ఆరోగ్యానికి అంత మేలు చేసినట్లవుతుంది. దీని ద్వారా ప్రతి మనిషిలో ఆందోళన తగ్గుతుంది. ప్రతి రోజూ ఒక సమయానికి నిద్ర లేవడం ద్వారా జీవక్రియల రేటు మెరుగవుతుంది. ఈ ప్రక్రియను కొనసాగించాలంటే.. సెలవు రోజూ ఉదయాన్నే లేవాలి.  
 
నిద్రలేవగానే బద్ధకం, మత్తుగా అనిపిస్తే దాన్ని వెంటనే వదిలించుకోవాలి. లేదంటే ఆ ప్రభావం రోజంతా ఉంటుంది. ఉదయం పూట సూర్మరశ్మి తగిలితే శరీరానికి నూతనోత్తేజం అందుతుంది, అసౌకర్యం దూరమవుతుంది. ఎండలో ఉండే 'డి' విటమిన్ ఒత్తిళ్లనూ దూరం చేస్తుంది.
 

No comments:

Post a Comment