cricket ad

Thursday 15 December 2016

కట్టలకొద్దీ నోట్లు ఎక్కడివి?: సుప్రీం

దేశంలో పెద్దనోట్ల రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి లక్షల కొద్దీ కొత్తనోట్లు ఎలా చేరుతున్నాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కొత్తనోటు కోసం సామాన్యులు పడిగాపులు కాస్తున్నారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దేశంలో కొందరికి కట్టలకొద్దీ నోట్లు ఎలా వెళ్తున్నాయని నిలదీసింది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల ప్రజలు ఉన్నారనీ.. కట్టలకొద్దీ కొత్తనోట్లు ఉన్నవారు ఒకరైతే.. చేతిలో చిల్లిగవ్వలేని వారు మరొకరని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కొందరు బ్యాంకు అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా అటార్నీ జనరల్‌ న్యాయస్థానానికి తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

No comments:

Post a Comment