cricket ad

Sunday 18 December 2016

భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. కళ్ళు చెదిరే వాస్తవాలు

అమ్మాయిలను కొనడం, అమ్మడం చేస్తూ వ్యభిచార కలాపాలు నిర్వహిస్తున్న ఓ పెద్ద ముఠా ని దేశ రాజధానిలో పోలీసులు అరెస్ట్ చేశారు. హుస్సేన్, సైరా అనే జంట.. అమ్మాయిలను డబ్బుకు కొని వ్యభిచారం చేయిస్తూ ఉన్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు.. దాడి చేసి పట్టుకున్నారు. కొంతమంది అమ్మాయిల చేత బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న ఈ జంట మరికొందరిని అమ్మేసింది కూడా. కాగా.. పోలీసులు దాడి చేయడంతో కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ సెక్స్ రాకెట్ ద్వారా వీళ్ళు సంపాదించిన మొత్తం సొమ్ము ఎంతో తెలుసా? అక్షరాలా 100 కోట్లు. వీళ్ళు  చేస్తున్న సెక్స్ రాకెట్ ఒక్క ఢిల్లీ కె పరిమితం కాదు. దేశం మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఓడిస్సా, అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్ ల నుండి పెద్ద ఎత్తున అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తూ 100 కోట్లకు పైగా కూడబెట్టారు. దాదాపు 5 వేలమంది అమ్మాయిలను ఈ సెక్స్ రాకెట్ లో ఉపయోగించుకున్నారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తుండటంతో మరింత లోతుగా విచారణ మొదలు పెట్టారు ఢిల్లీ పోలీసులు.

No comments:

Post a Comment