cricket ad

Tuesday 13 December 2016

నోట్ల మార్పిడిలో RBI అధికారి అరెస్ట్

తీగ లాగితే ట్రంక్ పెట్టెలు కదులుతున్నాయి. దాడులు చేసే కొద్దీ కోట్లకు కోట్ల కొత్త నోట్లు బయట పడుతున్నాయి. బెంగళూరులో CBI, ED అధికారుల వరస దాడులు కలకలం రేపుతోంది. బడాబాబులకు నోట్ల మార్పిడికి సహకరిస్తున్న RBI అధికారి మైఖేల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎవరెవరికి ఎంతెంత డబ్బు.. ఎంత కమీషన్ కింద మార్చింది ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. ఇప్పటి వరకు కోటిన్నర వరకు మార్చినట్టు గుర్తించారు. మైఖేల్ పై చాలా ఆరోపణలు రావటం.. కోట్లలో పాతనోట్లకు కొత్త 2వేల నోట్లు ఇచ్చినట్లు.. సీబీఐకి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపడుతున్నారు.

మరో కేసులో రూ.92 లక్షలు పట్టివేత

మరో కేసులో.. బెంగళూరులో భారీగా కొత్త నోట్లు పట్టుబడ్డాయి. 92 లక్షల 2 వేల రూపాయల నోట్లు తరలిస్తుండగా ఏడుగురిని పట్టుకున్నారు కర్ణాటక ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు. 15 నుంచి 35 శాతం కమీషన్ తీసుకుంటుండగా అధికారులు అరెస్ట్ చేశారు. ఈ మార్పిడి ముఠాలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగుల బంధువులు ఉన్నారు. బ్యాంక్ సిబ్బందే ఇలా పక్కదారిలో కోట్లకు కోట్లు తరలిస్తుండటంపై కేంద్రం సీరియస్ గా ఉంది. ఇప్పుడు దొరికిన డబ్బుతోపాటు.. ఈ 30 రోజుల్లో ఇంకెంత డబ్బును అక్రమంగా మార్చారు.. తరలించారు అనే విషయంపైనా ఆరా తీస్తున్నారు ED అధికారులు.

No comments:

Post a Comment