cricket ad

Tuesday 13 December 2016

మెరీనా బీచ్ లో అమ్మ ‘ఆత్మ’..! సమాధి వద్దే తిరుగుతోందా?

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఆమెది సహజమరణం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో కుట్రకోణం ఉందని అంతా అనుకుంటున్నారు. ఈ క్రమంలో జయలలితకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆత్మ రూపంలో కనిపిస్తున్నారట.! చెన్నైలోని మెరీనా బీచ్ లో జయ సమాధి వద్దే ఆమె ఆత్మ తిరుగుతోందని తమిళ వెబ్ సైట్లు వార్తలు రాస్తున్నాయి. అమ్మ ఆకారాన్ని పోలి ఉన్న ఆత్మ జయలలిత సమాధి సమీపంలోనే సంచరిస్తోందని తమిళ ప్రసారమాధ్యమాల్లో కథనాలు కూడా వస్తున్నాయి. 
జయలలితది సహజ మరణం కాదని, ఆమెపై విష ప్రయోగం జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే, ఆమె ఆత్మగా మారిందని ఆత్మలున్నాయని నమ్మే వారు వాదిస్తున్నారు. మరికొందరైతే, జయలలితకు ప్రధాని కావాలనే కోరిక ఉండేదని, అది తీరకపోవడంతోనే ఆత్మగా మారి ఉంటుందని చెబుతున్నారు. 
మరోవైపు ఈ ఆధునిక కాలంలోనూ ఇవేం మూఢనమ్మకాలంటూ మండిపడే వాళ్లూ లేకపోలేదు. ఇది కచ్చితంగా ఫోటో షాప్ మాయాజాలమే అని వాదిస్తున్నారు. 
ఎవరి వాదనల సంగతి ఎలా ఉన్నా… ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అమ్మ ఆత్మ’ అంటూ ఆ ఫోటో ఇప్పుడు తమిళనాట బాగా సర్క్యులేట్ అవుతోంది. జయ అభిమానులతో పాటు, అన్నాడీఎంకే కార్యకర్తలు తెగ షేర్ చేస్తున్నారు

No comments:

Post a Comment